నిర్భయ కేసు: డెత్‌ వారెంట్లు జారీ చేయలేం ! | Nirbhaya Case Delhi Court Rejects Tihar Jail Request Seeking Fresh Warrant | Sakshi

నిర్భయ కేసు: ఇప్పుడే డెత్‌ వారెంట్లు జారీ చేయలేం !

Feb 7 2020 3:58 PM | Updated on Feb 7 2020 4:10 PM

Nirbhaya Case Delhi Court Rejects Tihar Jail Request Seeking Fresh Warrant - Sakshi

ప్రతిపాదనల ఆధారంగా డెత్‌ వారెంట్లు జారీచేయలేమని స్పష్టంచేసింది.

న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరోసారి డెత్‌ వారెంట్లు జారీ చేయాలన్న తీహార్‌ జైలు అధికారుల అభ్యర్థనను ఢిల్లీలోని పాటియాల హౌజ్‌ కోర్టు తిరస్కరించింది. దోషులు ముఖేష్‌ సింగ్, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌ న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నందుకు డెత్‌ వారెంట్లు జారీ చేయలేమని తెలిపింది. ప్రతిపాదనల ఆధారంగా డెత్‌ వారెంట్లు జారీచేయలేమని స్పష్టంచేసింది.
(చదవండి : నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి)

కాగా, నిర్భయ దోషులు నలుగురూ న్యాయ పరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 5న ఈ మేరకు తీర్పు వెలువరించింది.
(చదవండి : వాళ్లను త్వరలోనే ఉరి తీస్తారు: నిర్భయ తల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement