జమ్ము: హిందువుల పవిత్ర స్థలం అమర్ నాథ్ కు ప్రారంభమైన యాత్ర మూడో రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మంచులింగాన్ని 24 వేల మంది దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా నాల్గవ బృందాన్ని (1,842 మందిని) ఈ రోజు ఉదయం అనుమతించారు. నిన్న ఆదివారం ఒక్కరోజే 15 వేల మంది దర్శించుకున్నారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 24 వేల మంది భక్తుల మంచులింగాన్ని దర్శించుకున్నారని శ్రీ అమర్ నాథ్ శ్రైన్ బోర్డు(ఎస్ఏఎస్బీ) తెలిపింది. జులై 2 నుంచి ప్రారంభమైన యాత్ర ఆగస్టు 17 వరకు 48 రోజులు సాగనుంది. పటిష్ఠ భద్రత మధ్య అమర్ నాథ్ కొనసాగుతోంది.