రాజ్యసభలో కీలక పరిణామం | Rajya Sabha adjourned till 12 pm after uproar over National Herald | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో కీలక పరిణామం

Published Fri, Dec 11 2015 11:38 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాజ్యసభలో కీలక పరిణామం - Sakshi

రాజ్యసభలో కీలక పరిణామం

న్యూఢిల్లీ : రాజ్యసభలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై ఇవాళ కూడా సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు... హెరాల్డ్ వ్యవహారంపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

దీంతో పదే పదే సభను అడ్డుకోవడంతో విపక్షాలపై సస్పెన్షన్ వేటు పడింది. వెల్లోకి దూసుకెళ్లిన 23మంది కాంగ్రెస్, వామపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సస్పెండ్ అయిన కాంగ్రెస్, వామపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభ మరోసారి మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement