ఆర్కేనగర్‌ పోలింగ్‌ ప్రశాంతం | RK Nagar records 77.68% voter turnout, polling ends peacefully | Sakshi
Sakshi News home page

ఆర్కేనగర్‌ పోలింగ్‌ ప్రశాంతం

Published Fri, Dec 22 2017 5:28 AM | Last Updated on Fri, Dec 22 2017 5:28 AM

RK Nagar records 77.68% voter turnout, polling ends peacefully  - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ నిమిత్తం ఉప ఎన్నిక నిర్వహించగా గురువారంతో పోలింగ్‌ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయత్రం 5 గంటలకు ముగియగా 77.68 శాతం పోలింగ్‌ నమోదైంది. 2,28,234 మంది ఓటర్లు ఉండగా 51 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 258 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మధుసూదనన్‌ (అన్నాడీఎంకే), మరుదు గణేష్‌ (డీఎంకే), స్వతంత్ర అభ్యర్థి, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన చేపడతారు. అదే రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement