rk nagar by election
-
దినకరన్కు చుక్కెదురు
-
దినకరన్కు పచ్చ జెండా
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్లో దినకరన్ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు. భారీ ఆధిక్యంతో విజయ కేత నం ఎగురవేసిన దినకరన్కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్కు ఊరట లభించింది. -
ఆ ఫీలింగ్ నాకూ ఉంది- కమల్
సాక్షి, టీ.నగర్: ఆర్కేనగర్ నియోజకవర్గంలో రూ.20 టోకెన్ను అడ్డుకోలేకపోయాననే అపరాధ భావన తనకూ ఉందని నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ఆనంద వికటన్ వారపత్రికలో రాస్తున్న సీరియల్ కథనంలో ఆర్కేనగర్ నియోజకవర్గం ఎన్నిక గురించి మళ్లీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి విమర్శించే మీరు అందులో ఎందుకు పాలుపంచుకోలేదని ప్రశ్నిస్తున్నారని, అందులో పాలుపంచుకోనందుకు చాలా చింతిస్తున్నట్లు తెలిపారు. ఆ అపరాధ భావనతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొందరు దిష్టిబొమ్మలను దహనం చేయడం, కోర్టులో కేసు వేయడాన్ని అభిమాన సంఘాలు ఖండించినప్పటికీ వారిని వారించామని, ఇద్దరు మనుషులు సరిచేసుకోవాల్సిన వ్యవహారంలో తాము ప్రజల్ని భాగస్వాములుగా చేయడం సరికాదని అన్నారు. మయ్యం విజిల్ యాప్ జనవరిలో ప్రారంభించడం జరుగుతుందన్నారే ఎప్పుడు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పొంగల్కు ఇచ్చే చెరకు లాంటిది కాదని, చేదు మందుగా ఉంటుందన్నారు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని తెలిపారు. సరైన రీతిలో తీసుకువస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుందని, అందుకే ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. -
తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గేది లేదు!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే దినకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కేసులు ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆయనను మీడియా సంప్రదించింది. ‘‘నాపై కేసు నమోదైన ఫర్వాలేదు. వెనక్కి తగ్గను. న్యాయపరంగానే నేను వాటిని ఎదుర్కుంటా’’ అని మీడియాకు కమల్ బదులిచ్చారు. కాగా, ఆనంద వికటన్ కోసం రాసిన వ్యాసంలో కమల్ వ్యాసం ద్వారా దినకరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి దినకరన్ గెలిచారని.. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని కమల్ పేర్కొన్నారు. కాగా, ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని కమల్ ఆ వ్యాసంలో రాశారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. దినకరన్తోపాటు ఆర్కే నగర్ ఓటర్లను కమల్ అవమానించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కమల్పై కేసు నమోదు అయ్యింది. జనవరి 12న ఈ కేసు విచారణకు రానుంది. ఇది కూడా చదవండి... తీవ్ర ఆరోపణలు.. కమల్ ఇంటి వద్ద బందోబస్తు -
‘ధనబలంతో గెలిచారు’
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్ గెలిచారని కమల్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్కే నగర్ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి (దినకరన్) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్ ఆరోపణలను దినకరన్ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
రాజకీయ తెరపై రజని
'వస్తానొస్తానంటూ' రెండు దశాబ్దాలుగా తన అభిమాన జనసందోహాన్ని ఊరి స్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ఆది వారం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీని స్థాపించి తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకూ అభ్యర్థుల్ని బరిలో దించుతామని కూడా చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూశాక అక్కడి రాజకీయ యవనికపై వరసబెట్టి కొన సాగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారికి సమర్ధులైన నాయకులొస్తే జనంలో ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ అన్నాడీ ఎంకే పార్టీయే పాలకపక్షంగా ఉన్నా... సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెనకే మెజారిటీ ఎమ్మెల్యేలున్నా ఆ ప్రభుత్వం దినదినగండంగానే బతుకీడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రమే రాష్ట్రంలో బలమైన, పటిష్ట మైన పార్టీ. అన్నా డీఎంకే దుస్థితి చూస్తూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమదే అధికా రమని ధీమాతో ఉన్న ఆ పార్టీ మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పో యింది. దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అది అయోమయంలో పడింది. సినిమా అనేది ఒక బలమైన, ప్రభావవంతమైన మాధ్యమం కనుక ఆ రంగంలో మన్ననలందుకునేవారికి సహజంగానే జనాకర్షణ ఉంటుంది. ఎక్కడి కెళ్లినా వారిని చూసేందుకు జనం విరగబడతారు. కానీ ఇలాంటివన్నీ రాజకీయ రంగంలో ఆ నటుల అఖండ విజయానికి గ్యారెంటీనివ్వలేవు. వారేం చెబు తున్నారో, ఏం చేస్తున్నారో... వారి పార్టీ ఆశయాలేమిటో, సిద్ధాంతాలేమిటో జనం గమనిస్తారు. తమ రాక వెనకున్న అవసరమేమిటో, అందులోని ఔచిత్యమేమిటో... వర్తమాన రాజకీయాలపైనా, పాలనపైనా తమ అభిప్రాయాలేమిటో ఆ నటులు విస్పష్టంగా వివరించగలగాలి. తమవల్ల మెరుగైన మార్పు సాధ్యమేనన్న అభి ప్రాయం కలిగించగలగాలి. అన్నిటికీమించి అప్పటికి పాలకులుగా ఉంటున్నవారిపై జనంలో అసంతృప్తి ఉండాలి. ఒక నిరాశామయ వాతావరణం అప్పటికే అలు ముకుని ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించేనాటికి కాంగ్రెస్ అన్నివిధాలా భ్రష్టుపట్టి ఉంది. ఆ పార్టీ పాలనపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి సమయంలో పార్టీని స్థాపించబట్టే ఎన్టీ రామారావు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి రాగలిగారు. కానీ అనేకానేక సంక్షేమ పథకాలతో, సమర్ధవంతమైన పాలనతో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుగులేని జనాదరణను పొందుతున్న సమయంలో 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి చివరి కెలా వైఫల్యం మూటగట్టుకున్నారో అందరూ చూశారు. తమిళనాడులో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్తగాదు. డీఎంకే స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదిగిన అన్నాదురై, ఆయన తర్వాత అధికారం లోకొచ్చిన కరుణానిధి సినీ రంగానికి చెందినవారే. అన్నా డీఎంకే పార్టీని స్థాపించిన సినీ హీరో ఎంజీ రామచంద్రన్ పదేళ్లపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయా లపై చెరగని ముద్ర వేశారు. ఆయన ఆశీస్సులతో రాజకీయాల్లోకొచ్చిన జయలలిత సైతం రాణించారు. కానీ శివాజీ గణేశన్, విజయ్కాంత్, శరత్కుమార్లాంటివారు విఫలమయ్యారు. పొరుగునున్న కర్ణాటకలో అగ్రశ్రేణి హీరోగా వెలుగొందిన రాజ్ కుమార్పై రాజకీయ రంగప్రవేశం చేయమని ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ఆయన దూరంగానే ఉండిపోయారు. కన్నడ భాషా, సంస్కృతి పరిరక్షణ ఉద్యమాలకే పరి మితమయ్యారు. ఉత్తరాదిలో అమితాబ్బచ్చన్ మొదలుకొని అనేకులు రాజ కీయ రంగ ప్రవేశం చేసినా వారు ఏదో ఒక జాతీయ పార్టీనో, ప్రాంతీయ పార్టీనో ఆశ్రయించి ఎన్నికల్లో గెలుపొందారు తప్ప సొంతంగా పార్టీ పెట్టే సాహసం చేయలేదు. వర్తమాన తమిళనాడులో రాజకీయ శూన్యత అలుముకున్నదని, మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం దీనినే ప్రతిబింబిస్తున్నదని భావిస్తున్నవారు రజనీకాంత్ ఆగమనానికి ఇదే సరైన సమయమని విశ్వసిస్తున్నారు. బహుశా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్కు కూడా అలాంటి అభిప్రాయమే ఉండొచ్చు. అయితే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉండటం నిజమైనా... దానికదే రజనీకాంత్నైనా, మరెవరినైనా అందలం ఎక్కించలేదు. అందులోనూ తమిళనాడు మిగిలిన రాష్ట్రాల్లాంటిది కాదు. స్వాతంత్య్రానికి ముందే అక్కడ వేళ్లూనుకున్న ద్రవిడ ఉద్యమం సామాజిక, సాంస్కృతిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ రంగాల్లో ఆ ఉద్యమం సాధించిన ఘన విజయాలను సుస్థిరం చేసుకునేందుకు తొలుత డీకే, తర్వాత డీఎంకే ఆవిర్భవించాయి. అన్నాదురై, కరుణానిధి చలనచిత్ర రంగ దిగ్గజాలు కావొచ్చుగానీ రాజకీయరంగంలో వారి విజయానికి మూలాలు ద్రవిడ ఉద్యమంలో ఉన్నాయి. అలాంటి గడ్డపై తన రాజకీయ రంగ ప్రవేశం గురించిన ప్రకటనలో రజనీకాంత్ భగవద్గీత శ్లోకాన్ని పఠించారు. నీతి, నిజాయితీలున్న, మతసామరస్యంతో కూడిన ‘ఆధ్యాత్మిక రాజకీయాలను’ ప్రజల వద్దకు తీసుకెళ్తానన్నారు. ఇవి బీజేపీ అనుకూలతను ధ్వని స్తున్నాయని కొందరు భాష్యం చెబుతున్నా... మొత్తం అన్ని సీట్లకూ పోటీ చేస్తా ననడం ద్వారా ఎవరితోనూ పొత్తు ఉండబోదన్న అభిప్రాయం కలిగించేందుకు రజని ప్రయత్నించారు. వాటి సంగతలా ఉంచి మాటల్లోనూ, ఆచరణలోనూ స్పష్టత, నిజాయితీ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. మరో మూడేళ్ల వ్యవధి ఉంది కదా అని మౌనంగా ఉండక అన్ని అంశాల్లోనూ తానేమిటో, తన వైఖరేమిటో తేటతెల్లం చేసినప్పుడే... వాటికి అనుగుణమైన ఆచరణ ఉన్నప్పుడే రజనీకాంత్ ప్రజలకు చేరువ కాగలరు. రాజకీయాల్లో అస్పష్టతకూ, ఊగిసలాటకూ, లాలూచీలకూ, ప్యాకేజీలకూ తావుండదు. అలా చూస్తే రాగల మూడేళ్లకాలం రజనీకాంత్కు పరీక్షా కాలమే. అందులో నెగ్గి రాజకీయరంగంలో సైతం సూపర్స్టార్నని ఆయన నిరూ పించుకోగలరో లేదో వేచిచూడాలి. -
మా స్లీపర్ సెల్ బయటకు వస్తుంది: దినకరన్
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీటీవీ దినకరన్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సచివాలయంలో దినకరన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం దినకరన్ మాట్లాడుతూ మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. తమ స్లీపర్ సెల్ బయటకు వస్తుందని, మార్చిలో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా వెన్నపోటుదారులు, ద్రోహులు ...ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలన్నారు. లేకుంటే తమ విశ్వరూపం చూపిస్తామని దినకరన్ హెచ్చరించారు. త్వరలోనే ఆయన ఆర్కేనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. -
దినకరన్కు నోటీసులు..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్ టీటీవీ దినకరన్కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్సెల్ కార్యదర్శి డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్కు వినతిపత్రాలు సమర్పించారు. అపోలో ఆసపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముందు దినకరన్ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. వీడియోల విడుదల నేరం: విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్ కమిషన్కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్ నుండి నోటీసులకు కారణమైంది. వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్ నిషేధం విధించింది. -
దినకరన్.. ఇలా గెలిచెన్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత ఆకస్మిక మరణానికి శశికళే కారణమంటూ ప్రచారం ఓవైపు.. ఎన్నికల కమిషన్కి లంచం ఇవ్వజూపిన కేసులో జైలుకెళ్లిన అప్రతిష్ట మరోవైపు.. పళనిస్వామి ప్రభుత్వానికి పుష్కలంగా కేంద్రం అండదండలు, డీఎంకేకు సమర్థమైన నాయకత్వం.. ఇవేవీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ (శశికళ సోదరి కుమారుడు) విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దీనికితోడు ‘అమ్మ’ కంటే దినకరన్కే అధిక మెజారిటీని ఆర్కేనగర్ ఓటర్లు కట్టబెట్టడం, నోటాకన్నా బీజేపీకి తక్కువ ఓట్లు రావటం విస్తుపోయేలా చేసింది. ‘ఆర్కేనగర్’కు ఆర్థిక సాయం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాతే దినకరన్ పేరు తెరపైకి వచ్చింది. శశికళకు పాదాభివందనం చేసి పార్టీ పగ్గాలు ఇచ్చిన నేతలు ఆమె జైలుపాలు కాగానే తగిన కారణం చూపకుండానే దినకరన్పై బహిష్కరణ వేటు వేయడం ప్రజల్లో సానుభూతి కలిగించిందని విశ్లేషకులంటున్నారు. అదే సమయంలో తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాలు విలీనం కావడం విమర్శలకు దారితీసింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపి జైలుకు వెళ్లిన దినకరన్.. తిరిగొచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నేతలను, కార్యకర్తలను చేరదీశారు. ఆర్కే నగర్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. దీంతో దినకరన్ తన సొంత డబ్బుతో స్థానిక ప్రజల రుణాలు తీర్చినట్లు తెలుస్తోంది. జయ మరణం తర్వాత ఓసారి ఉపఎన్నిక రద్దవటం, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నా.. దినకరన్ వెనుకంజ వేయలేదు. తన అనుచరుల ద్వారా అక్కడి పేదలకు సాయం చేస్తూ సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఎన్నికకు ముందు రోజు వ్యూహాత్మకంగా ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో ఆస్పత్రిలోని బెడ్పై జయలలిత జ్యూస్ తాగుతున్నట్లు కనిపించారు. ఇది కూడా శశికళపై ఆగ్రహం తగ్గేందుకు కారణమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు, ఎన్నికకు ముందురోజు దినకరన్ భారీగా డబ్బులు పంపిణీ చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ పరోక్ష సాయం ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళ ఓటర్లు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జోక్యాన్ని సహించలేకపోయారు. పళనిస్వామి, పన్నీర్సెల్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనన్ ఓటమికి అసమర్థ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంటున్నారు. అటు, ఆర్కేనగర్లో డీఎంకేకు చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. అయినా కూడా ఆ పార్టీకి డిపాజిట్ రాకపోవడం గమనార్హం. దినకరన్ గెలిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం బలహీనపడుతుందనే వ్యూహంతోనే స్టాలిన్ మిన్నకుండిపోయారనే ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూడా బీజేపీ గూటికి చేరుతుందనే అనుమానాలతో ప్రజలు ఆ పార్టీకి మొండిచేయి చూపారని భావిస్తున్నారు. కరుణానిధిని మోదీ పరామర్శించడం, కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమాలను డీఎంకే విరమించుకోవడం, పోలింగ్ సమయంలోనే కనిమొళి, రాజా 2జీ కేసులో నిర్దోషులుగా తేలడం వంటివి ఆర్కే నగర్ ఓటర్లు డీఎంకేనూ పక్కన పెట్టేందుకు కారణమయ్యాయంటున్నారు. -
ఓటుకు 10 వేలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన దినకరన్ అనుచరులు రూ.10 వేలకు బదులు రూ.20 నోటిచ్చి దానిపై ఉన్న కోడ్ రాసుకున్నారని, ఫలితాలనంతరం ఆ నోటు చూపితే డబ్బిస్తామని హామీ ఇచ్చారని ఓటర్లు వెల్లడించారు. రూ.20 నోట్లు పంచిన వారంతా ఆర్కేనగర్కు చెందిన వ్యక్తులే కావడంతో వ్యవహారం సజావుగా సాగింది. ఇప్పుడు ఫలితం తేలడంతో టోకెన్ ఇచ్చిన వాళ్లను ఓటర్లు నిలదీస్తున్నారు. కొందరు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టోకెన్ అందని కొందరికి సోమవారం వాటిని ఇస్తుండగా.. ఘర్షణ చోటు చేసుకుంది. దినకరన్ అనుచరులు కార్తికేయన్ అనే వ్యక్తిపై దాడిచేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు దినకరన్ అనుచరులను అరెస్టు చేశారు. -
తారల వెలుగులకు తావుందా?
ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మొత్తం రాష్ట్రానికి అంటగట్టనక్కరలేదు. కానీ ప్రస్తుత పాలకపక్షం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న వాస్తవం ఆ ఫలితంతో వెల్లడైంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో డీఎంకే ఘోర పరాజయం కూడా మరొక వాస్తవాన్ని తెలియచేస్తున్నది. డీఎంకే పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తమిళ ప్రజలు భావించడం లేదు. దినకరన్ ఈ ఎన్నికలలో విజయం సాధించారంటే అర్థం, ఈ రాజకీయ శూన్యంలో అంతగా ప్రాముఖ్యం లేని వారు సైతం తమకు ఉన్న అవకాశాలను వెతుక్కోగలరు. ఈ సంవత్సరం నిష్క్రమిస్తున్న వేళ రెండు దశాబ్దాల నుంచి తమిళనాడును అలజడికి గురిచేస్తున్న ఒక ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించబోతోంది. తాను రాజకీయాలలోకి ప్రవేశించ దలిస్తే ఆ సంగతిని ఈ నెల 31న ప్రకటిస్తానని మొత్తానికి తలైవా రజనీకాంత్ ప్రకటించారు. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా మెరీనా బీచ్ ఆందోళన, శశికళ కారాగారానికి తరలడం, ఒ. పన్నీర్సెల్వం ప్రజాస్వామిక తిరుగుబాటు, తాను సైతం రాజకీయాలలోకి వస్తున్నట్టు మరో తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ప్రకటించడం కూడా 2017లో జరిగిన పరిణామాలే. రజనీకాంత్ ఇచ్చిన ప్రకటన ఈ ఏటి ఘటనలకు పరాకాష్ట. సినీ పరిభాషలో చెప్పాలంటే బ్లాక్బస్టరన్నమాట. అయితే రజనీ ప్రకటన ఆరోగ్యం గురించి చేసే చట్టబద్ధమైన హెచ్చరిక పద్ధతిలోనే వెలువడింది. ‘నేను రాజకీయాలలోకి వస్తున్నట్టు చెప్పడం లేదు. దీని గురించి నా నిర్ణయం ఏమిటో 31న ప్రకటిస్తానని మాత్రమే నేను చెప్పాను’ అని వివరణ ఇచ్చారు. బస్సు కండక్టర్ స్థాయి నుంచి సినీ నటుడి స్థాయికి ఎదిగిన రజనీ కనుక రాజకీయాలలోకి రావాలని నిర్ణయిస్తే, ఈ ఏడాదే ఇలాంటి నిర్ణయం తీసుకున్న పెద్ద తారలలో ఆయన రెండోవారు అవుతారు. రజనీ ఆప్తమిత్రుడు కమల్ హాసన్ కొన్ని మాసాల క్రితమే తాను రాజకీయ నేతగా మారుతున్నట్టు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రం గురించి కొంత హడావుడితోనే ప్రకటించారు. ఆ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారిని కలుసుకోవడం, ఇంకా పలు చానళ్లలో అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రవేశం గురించి కొద్దిపాటి సంచలనం రేపారు. కానీ పూర్తి చేయవలసి ఉన్న రెండు సినిమాల కోసం కమల్ దాదాపు రెండు మాసాల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. విశ్వరూపం–2 నిర్మాణం కోసం ఆయన అమెరికాలో ఉన్నారు. అదలా ఉంచితే, నటులు ఇలా ప్రజాజీవి తంలో రాజకీయాలని కాల్షీట్ల మాదిరిగా చూస్తేనే తమిళనాడు ప్రజలకు సుఖంగా ఉంటుందన్న సంగతి నిజమో కాదో తేలవలసి ఉంది. నటులు ఇంకానా...! అసలు తమిళనాడు రాజకీయాలలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నటులకు ఇప్పుడు ప్రవేశించే అవకాశం ఉందా? అయితే తమిళనాడు ఓటర్లు రాజ కీయ నాయకులుగా సినీ నటులనే ఆదరిస్తూ ఉంటారన్న ఒక వాస్తవం. తమిళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎం.జి. రామచంద్రన్, కరుణానిధి, జయలలిత కోలీవుడ్ నేపథ్యం కలిగినవారే. వీరు మంచి ముఖ్యమంత్రులుగానే కాకుండా, మంచి రాజకీయవేత్తలుగా కూడా రాణించారు. కానీ 21వ శతాబ్దం తమిళనాడుకూ, ఆ ముగ్గురు రాజకీయ రంగం మీద ప్రత్యక్షమైన కాలానికీ ఎంతో తేడా ఉంది. సోషల్ మీడియా ప్రభావం చాలా తీక్షణంగా ఉన్న ప్రస్తుత తరుణంలో తారలు ఏం చేస్తున్నారో నిరంతర నిఘా ఉంటున్నది. తెర మీద అద్భుతాలు సృష్టించిన రీతిలో నిజ జీవితంలో వ్యవహరించడం ఇకపై సాధ్యం కాదు. పైగా ప్రస్తుత తమిళ రాజకీయాల దీనస్థితి వేరు. కొత్త ముఖాలను తిరస్కరించడానికి వారు ఏమాత్రం సంకోచించరు. తమిళనాడు రాజకీయ చిత్రం ఎలా ఉందో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితమే చెబుతోంది. ఎన్నికల కమిషన్తో పోరాడి రెండాకుల ఎన్నికల గుర్తును తన సొంతం చేసుకోవడంలో అక్కడ అధికారంలో ఉన్న అన్నా డీఎంకే పెద్ద విజయం సాధించింది. కానీ ఆర్కేనగర్ ఉప ఎన్నికలో మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నది. విపక్ష డీఎంకే పరిస్థితి మరీ దారుణం. అన్నా డీఎంకే వ్యతిరేక ఓట్లన్నీ తమ అభ్యర్థికే జమ అయిపోతాయని ఆ పార్టీ ఆశపడింది. కానీ ఘోరంగా వారి అభ్యర్థి ధరావతు కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే డీఎంకే అభ్యర్థి ఓటమి విషాదాల్లో కెల్లా విషాదం. ఎందుకంటే, ఆ పార్టీకి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకేలు మద్దతు ఇచ్చాయి. అయినా ధరావతు కూడా దక్కలేదు. ఇక బీజేపీ కనీసంగా కూడా తన ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీకి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆర్కే నగర్ ఫలితంతో పెద్ద మలుపు ఆర్కేనగర్ నియోజక వర్గం నుంచి దినకరన్ విజయం సాధించి ఉండవచ్చు. కానీ ఆయన అవినీతి మార్గాలలోనే విజయం సాధించారనే నిందకు గురయ్యారు. ఆయన విజయం అంటే శశికళ, మన్నార్గుడి కుటుంబం పరోక్షంగా పదవిలోకి వచ్చి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొడుతుందని చాలామంది విచారిస్తున్నారు. ఇదంతా ఏం చెబుతుందంటే, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఉంది. అలా అని ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మొత్తం రాష్ట్రానికి అంటగట్టనక్కరలేదు. కానీ ప్రస్తుత పాలకపక్షం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న వాస్తవం మాత్రం ఆ ఫలితంతో వెల్లడైంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో డీఎంకే ఘోర పరాజయం కూడా మరొక వాస్తవాన్ని తెలియచేస్తున్నది. డీఎంకే పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తమిళ ప్రజలు భావిం చడం లేదు. దినకరన్ ఈ ఎన్నికలలో విజయం సాధించారంటే అర్థం, ప్రస్తుత రాజకీయ శూన్యంలో రాజకీయాలలో అంతగా ప్రాముఖ్యం లేని వారు సైతం తమకు ఉన్న అవకాశాలను వెతుక్కోగలరు. ఇలాంటి వాతావరణంలో కమల్ çహాసన్ తాను రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. రజనీ ప్రవేశించే అవకాశం ఉంది. రజనీకాంత్ గతంలో ఇచ్చిన ప్రకటనలకీ, తాజాగా ఇచ్చిన ప్రకటనకీ మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి. అప్పుడు ఆయన రాజకీయాల గురించి చాలా విస్తృతంగానే మాట్లాడారు. ఇప్పుడు అలా కాదు. ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. తాను రాజకీయాలలో ప్రవేశిస్తే ఆ సంగతి ఈనెల 31న ప్రకటిస్తాను అని ఆయన విస్పష్టంగానే వెల్లడించారు. రజనీ స్థాపించబోయే పార్టీ గురించిన విధివిధానాలు సిద్ధమవుతున్నాయనీ, అయితే పార్టీ ప్రారంభం ఎప్పుడనే విషయంలో తమ నాయకుడే అంతిమంగా నిర్ణయం ప్రకటిస్తారనీ రజనీ శిబిరానికి చెందిన వారు గత కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. రజనీతో సన్నిహితంగా ఉన్నవారు ఆయన పార్టీ స్థాపనకు అనుమతిస్తారనే గట్టిగా చెప్పినా, ఇప్పుడు మాత్రం అంత ఉత్సాహంగా ఆ మాట చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే సూపర్స్టార్ వ్యవహారం రెండడుగులు ముందుకీ, ఒక అడుగు వెనక్కీ అన్న చందంగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో తనకంటూ ఓ పాత్ర ఉంటుందని రజనీకాంత్ కనుక ప్రకటిస్తే, తమిళనాడులో అది కమల్ వర్సెస్ రజనీ పోరాటంగా రూపుదాలుస్తుంది. మీడియా వరకు ఇలాంటి సన్నివేశం చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది. సమస్యలు, సిద్ధాంతాల కన్నా, వ్యక్తుల మధ్య పోరాటంగా అది తయారవుతుంది. కాబట్టి చాలామంది ఇలాంటి ఆలోచనను కోరుకోవడం లేదు. కానీ కొద్దిరోజుల క్రితం రజనీతో ఫొటోలు దిగిన ఆయన అభిమానుల వాదన వేరుగా ఉంది. బాక్సాఫీసు దగ్గర ఆ ఇద్దరు తారలకు చిరకాలంగా అలాంటి స్పర్థే ఉన్నదనీ, కానీ ఏనాడూ అది ఘర్షణ స్థాయికి పోలేదనీ వారు చెబుతున్నారు. బయట వినిపించే మాట మరోరకంగా ఉంది. అది – ఆ ఇద్దరు రాజకీయాలలో కలసి నడవాలి. అది సాధ్యం కాని పక్షంలో, ఒకరు వైదొలగి రెండో వారికి మార్గం సుగమం చేయాలి. ఇవేమీ వీలుపడకపోతే జరిగేది, పట్టణ ప్రాంత మేధావి వర్గంతోనే ఎక్కువ మమేకమయ్యే కమల్ కంటే, రజనీయే ముందంజ వేసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు కమల్ హాసన్ అటు వామపక్షాల వైపు, ఇటు వామపక్షేతర పార్టీల వైపు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. లెఫ్ట్ నాయకులతో కనిపిస్తూనే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కూడా కనిపిస్తున్నారు. హిందూ అతివాదం, రాజకీయ అవినీతి, పర్యావరణం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అంశాల గురించి కమల్ మాట్లాడారు. అలాగే ఆయన అన్నా డీఎంకే నాయకులతో తరచూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. కాబట్టి ఆయన అటు అన్నా డీఎంకేతో గానీ, ఇటు బీజేపీతో గానీ చెలిమిని నెరపరని తెలుస్తున్నది. పైగా ఆయన నాస్తికుడు. ఇది కూడా ఆ రెండు పార్టీలకూ, కమల్కూ మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. రజనీకాంత్ ఇందుకు పూర్తి విరుద్ధమైన వ్యక్తి. ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు. ఆయన అభిప్రాయాలు బీజేపీకే సన్నిహితంగా కనిపిస్తాయి. బీజేపీ ఆశ నెరవేరుతుందా? బీజేపీ కూడా గత కొంతకాలంగా రజనీకాంత్ను నాయకుడిగా అవతరింపచేయడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే కూడా. ఇందులో బీజేపీకి కూడా ప్రయోజనాలు ఉన్నాయి. 2019 సాధారణ ఎన్నికలలో హరి యాణా, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో తగ్గే లోక్సభ స్థానాలను భర్తీ చేసుకునే క్రమంలో తమిళనాడులోకి ప్రవేశించాలని బీజేపీ ఆశ. 2014లో ఆ రాష్ట్రాలలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పన్నీర్సెల్వంను కాకుండా ఎడప్పుడి పళనిస్వామి మద్దతు ఇవ్వడం వంటి తమిళనాడు ప్రయోగం నేపథ్యంలోనే కాకుండా, ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలను చూశాక ఇప్పుడు బీజేపీకి మిగిలిన ఏకైక ఆశ రజనీకాంత్ మాత్రమే. ఆ పార్టీ ఆశ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం బీజేపీకి అక్కడ ఎలాంటి పట్టు లేదు. పైగా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్నదని పట్టణ ప్రాంత మేధావులలో ఒక అభిప్రాయాన్ని కూడా సృష్టించింది. గ్రామీణ ప్రాంతాలలో అయితే, కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయించేందుకు కర్ణాటక మీద ఒత్తిడి తేవడంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ విఫలమైం దన్న ఆగ్రహం కూడా ఉంది. కర్ణాటకలో బీజేపీకి బలం ఉంది. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించి, బీజేపీతో కొంత మేర అవగాహనకు వస్తారని అనిపిస్తుంది. రజనీ, మోదీ ద్వయం తమిళనాడు పట్టణ ప్రాంత ప్రజల మీద తమ ప్రభావం చూపగలరనీ, బీజేపీ వల్ల అన్నా డీఎంకేలోని ఒక వర్గం చివరి క్షణంలో అయినా రజనీ వెంట వెళతారనీ కమలం పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయం. అయితే అది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. అయితే ఇద్దరు నటులలో ఎవరు విజయం సాధించినా, వారి సమక్షంలో రాష్ట్రంలో అవినీతి తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. తమిళనాడు ఎన్నికలలో పెరిగిపోయిన ఓట్ల కొనుగోలు సంస్కృతితో ప్రజలు ఎంత తీవ్రంగా కలత చెందుతున్నారో ఇలాంటి భావన వెల్లడిస్తోంది. నిజానికి జయలలిత మరణంతోనే తమిళ రాజకీయాలు దిశా దశ లేకుండా పోయాయి. 2018లో కూడా అలాగే ఉంటుంది. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
దినకరన్ గెలుపు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతో గెలుపొందడం అధికార అన్నాడీఎంకేకు మాత్రమే కాదు... ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు కూడా ఊహించని పరిణామమే. అలాగే తెరవెనక ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసి స్తున్నదని పేరుబడ్డ బీజేపీ అధిష్టానానికి సైతం ఇది షాక్. జయలలిత మరణా నంతరం ఆమె సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కావాలని ఆశించి అప్పటి సీఎం పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించడం... సీఎం పదవి చేతికందేలోపే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు శిక్షపడటం, అనంతరం ఆ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగాయి. కానీ శశికళ మేన ల్లుడు దినకరన్ రంగ ప్రవేశం తర్వాత పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాలు ఏకమై ఆయన్ను ఏకాకిని చేశాయి. ఆ తర్వాత దినకరన్ను కేసులు చుట్టు ముట్టాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్కే నగర్ ఓటర్లు ఆయనకు రాజకీ యంగా ఊపిరిపోశారు. తమిళనాడు రాజకీయం విలక్షణమైనది. నాలుగు దశాబ్దాలుగా అక్కడ రెండు పార్టీల వ్యవస్థే రాజ్యమేలుతోంది. జయలలిత మరణం, శశికళ జైలు కెళ్లడం పర్యవసానంగా అన్నా డీఎంకేకు చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు గనుక అది కనుమరుగవుతుందని డీఎంకే ఆశించింది. దినకరన్ జయలలిత అను గ్రహాన్ని కోల్పోయి పార్టీకి దూరంగా ఉండిపోయిన వ్యక్తి. కనుక జయ వారసు డిగా ఆయన్ను ఓటర్లు పరిగణనలోకి తీసుకోరని డీఎంకే భావించింది. ఇక దినకరన్పై వచ్చిపడిన కేసులు సరేసరి. పైగా ఎవరికీ పరిచయం లేని ప్రెషర్ కుక్కర్ గుర్తుతో ఆయన బరిలో నిలిచారు. వీటన్నిటినీ ఆర్కే నగర్ ఓటర్లు తోసి రాజన్నారు. ఎప్పుడూ జయలలిత కూడా సాధించనంత మెజారిటీ దినకరన్కు ఇచ్చారు. ఆయనకు 40,707 ఓట్ల మెజారిటీ వచ్చింది. పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు ఆయనవే కావడం, డీఎంకే సైతం డిపాజిట్ కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే ఆయన గెలిచారని ప్రత్యర్థులు ఆరోపించవచ్చుగానీ... ఆ పని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు చేసి ఉండవని ఎవరూ అనుకోరు. మొత్తానికి తాము జయలలిత వారసులమని చెప్పుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలకు ఈ ఉప ఎన్నికలో ఆదరణ దొరకలేదు. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని దినకరన్ చెబుతున్నారు. అది జరిగినా, జరగకపో యినా పళని ప్రభుత్వం ఇబ్బందులు పడటమైతే తప్పకపోవచ్చు. ఎందుకంటే మొన్న సెప్టెంబర్లో ఆయన ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనవలసిన తరుణంలో దినకరన్ వర్గంలోని 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధన్పాల్ అన ర్హులుగా ప్రకటించారు. వారి పిటిషన్ స్వీకరించిన మద్రాస్ హైకోర్టు బలపరీక్షను నిలుపుచేసింది. ఇప్పుడా బలపరీక్ష జరిగినా, వారి అనర్హత సబబేనని తీర్పు వెలు వడి ఉప ఎన్నికలొచ్చినా పళని సర్కారుకు సమస్యలు తప్పవు. ఇవిగాక స్థానిక ఎన్నికల బెడద ఒకటి ఉంది. ఈ ఉప ఎన్నిక అనేకమంది ఆశల్ని అడియాసలు చేసింది. పళనిస్వామి– పన్నీర్సెల్వం వర్గాలను ఏకం చేయడంలో విజయం సాధించిన బీజేపీ అధినా యకులు... వీరిద్దరి సాయంతో భవిష్యత్తులో రాష్ట్రంలో కాలు మోపవచ్చునని ఆశపడ్డారు. ఈ నేతలిద్దరి చేతగానితనమూ అడుగడుగునా కనబడుతూనే ఉన్నా జయలలిత వారసులుగా జనం వారినే గుర్తిస్తారని, కేసుల్లో ఇరుక్కున్న దినకర న్కు ఆదరణ ఉండదని వారు భావించారు. ఇదంతా ఇప్పుడు తలకిందులైంది. పైగా బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థికి కేవలం 1,417 ఓట్లు రావడం బీజేపీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే పార్టీలో తన వర్గానికి ప్రాధాన్యం దక్కటం లేదన్న అసంతృప్తితో ఉన్న డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం విఘాతమే. విలీనమై నాలుగు నెలలు కావస్తున్నా పన్నీర్కు డిప్యూటీ సీఎంతోపాటు రాజకీయ సమన్వయకర్త పదవి రావడం మినహా ఆయన వర్గీయులకు దక్కిందేమీ లేదు. తమ వర్గానికి చెందిన మధుసూదన్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే ప్రాబల్యం పెరుగుతుందని, అప్పుడు పదవుల కోసం గట్టిగా ఒత్తిడి తీసుకురావొచ్చునని పన్నీర్ వర్గం ఆశపడింది. ఇందులో కులం కోణం కూడా ఉంది. పన్నీర్ తీవర్ కులస్థుడు. పళనిస్వామి గౌండర్. జయ లలిత వద్ద శశికళ ప్రాబల్యం పెరిగిననాటినుంచీ పార్టీలో తీవర్లదే ఆధిపత్యం. తమ కులస్తుడు గనుక చెప్పుచేతల్లో ఉంటాడన్న భావనతోనే జయ మరణా నంతరం శశికళ పన్నీర్కు మద్దతిచ్చారు. తీరా ఆయన ఎదురు తిరగడంతో గౌండర్ కులస్తుడైన పళనిస్వామిని అందలం ఎక్కించారు. ఇప్పుడు పళని, పన్నీ ర్లు ఏకమైనా పార్టీలో తమ ఆధిపత్యం పోయిందన్న దిగులు తీవర్లను బాధి స్తోంది. మధుసూదన్ గెలుపు ఈ సమస్యను తీరుస్తుందని పన్నీర్ వర్గం ఎంత గానో ఆశపెట్టుకుంది. అటు పళనిస్వామికి సైతం ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. జయలలిత సొంత స్థానంలో, రెండాకుల గుర్తు తమకే వచ్చినా నెగ్గక పోతే అది రాజకీయంగా సమాధి అవుతుందని గ్రహించి ఆయన తన శక్తిమేరకు కష్టపడ్డారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రంలో ఇక ఎదురు లేదని... ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తనదే అని భావిస్తున్న డీఎంకేకు ఇప్పుడు డిపాజిట్ గల్లంతు కావడం మింగుడు పడని విషయం. పైగా దినకరన్ శశికళ పేరు చెప్పుకుని, ఆమె ఫొటో పెట్టుకుని ప్రచారం చేసి గెలిచారు. ఇది ఆర్కే నగర్లో కనబడిన ధోరణా లేక రాష్ట్రంలో గాలి మళ్లిందా అన్న అయోమయం డీఎంకేను చుట్టుముట్టింది. రాగలకాలంలో దినకరన్ గెలుపు తమిళ రాజకీయా లను మరెన్ని మలుపులు తిప్పుతుందో చూడాల్సి ఉంది. -
స్వామి మరో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని, మొత్తం వ్యవహారాలు శశికళ చూసుకునేవారని అన్నారు. ఎక్కడ ? ఎవరు? ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు సాధిస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. అయినా తనకు ముందు నుంచే దినకరన్పై సానుభూతి ఉండేదని అన్నారు. శశికళకు అవకాశం ఇస్తే పరిపాలన కూడా చేయగలదనే దోరణిలో స్వామి వ్యాఖ్యలు చేశారు. -
అది బీజేపీ వ్యతిరేక ఓటు కానేకాదు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్ష అన్నాడీఎంకే తిరుగుబాటు అభ్యర్థి, వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ దాదాపు 40 వేల మెజారిటీతో విజయం సాధించడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. దినకరన్కు నేడు 40,707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు జయలలిత 39 వేల మెజారిటీతోనే విజయం సాధించారు. దానర్థం జయలలితకన్నా దినకరన్ ఎక్కువ ఆదరణ కలిగిన వ్యక్తని అర్థం కాదు. పాలకపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి ఈ. మధుసూదన్కు ఈ ఎన్నికల్లో 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధుగణేశ్ 24,651 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమై దినకరన్ విజయం సాధిస్తున్న సూచనలు కనిపించగానే వివిధ టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు తమ విశ్లేషణలు వినిపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పంటూ పలు పార్టీల నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి నిర్ణయాలే కాకుండా బలవంతంగా హిందీ భాషను రుద్దడం, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ లాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు దినకరన్కు ఓటేశారని తేల్చారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలనుకుంటే డీఎంకే అభ్యర్థిని గెలిపించేవారు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ డీఎంకే. కాగా, డీఎంకే అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. బీజేపీ మతతత్వ వాదాన్ని వ్యతిరేకించే ప్రజలు దినకరన్వైపు మొగ్గుచూపారని కూడా అంటున్నారు. మతతత్వంపై పోరాడాలన్న తపన ప్రజల్లో ఏ కోశాన, ఎక్కడా కనిపించలేదు. డబ్బు ప్రవాహం ప్రభావం వల్లనే దినకరన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. దినకరన్ ఎన్నికల కోసం దాదాపు వంద కోట్ల రూపాయలను కుమ్మరించారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల మొదట్లోనే ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఉప ఎన్నికల్లో డబ్బే ప్రధాన ప్రభావం చూపిస్తుందని తేలడం ఇదే మొదటిసారి కాదు. 2003లో శాంతకులం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయం సాధించడంలో డబ్బు ప్రభావం మొదటిసారి కనిపించింది. అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంతో ఆగ్రహం ఉన్నప్పటికీ పాలక పక్ష అభ్యర్థినే గెలిపించడం, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లడం స్పష్టంగా కనిపించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా మన ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో విఫలం అవుతోంది. -
అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించింది. ఎస్. వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, వీపీ కళైరాజన్, షోలింగుర్ పార్తీబన్ లను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఆర్కే నగర్లో ఊహించనివిధంగా ఓటమి పాలవడంతో అధికార అన్నాడీఎంకే ఉన్నతస్థాయి నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అమ్మ’ కంచుకోటలో పార్టీ పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓటమికి బాధ్యులైన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేలతో ఈ మధ్యాహ్నం దినకరన్ భేటీకానున్నారు. రేపు బెంగళూరు వెళ్లి శశికళను కలిసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. మూడు నెలల్లో ఈపీఎస్, ఓపీఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని దినకరన్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ధనాధన్ దినకరన్
-
అమ్మ కోటలో చిన్నమ్మ తడాఖా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు గట్టి షాక్ తగిలింది. శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్.. ఆ రెండు పార్టీల అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. తమిళనాడుకు భిన్నంగా.. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. మొత్తం 19 రౌండ్లలోనూ దినకరన్ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ప్రతి రౌండులోనూ కనీసం 2 వేల ఆధిక్యంతో ముందంజలో నిలిచారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,28,234 ఓట్లు ఉండగా 1,76,885 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 89,013 (50.32 శాతం) ఓట్లను దినకరన్ గెలుచుకున్నారు. అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదనన్కు 48,306 (27.31శాతం), డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్కు 24,651 (13.94శాతం) ఓట్లు పోలయ్యాయి. నామ్ తమిళర్ కట్చికి 3,860 ఓట్లు, బీజేపీకి 1,417 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు 2,373 ఓట్లు దక్కడం విశేషం. ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండాకుల గుర్తును సీఎం కె.పళని స్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంతో ప్రెషర్ కుక్కర్ గుర్తుపై బరిలోకి దిగారు. ఫలితాల అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. దినకరన్ గెలుపుతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా.. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే సమయంలో దినకరన్కు శశికళ అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయనను పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్లో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దినకరన్ను అరెస్టు చేశారు. అనంతర పరిణామాల్లో దినకరన్, శశికళను పక్కనపెట్టి పళని, పన్నీరు వర్గాలు ఈ ఏడాది ఆగస్టులో ఏకమయ్యారు. దీంతో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో దినకరన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జయలలిత ఉన్న సమయంలో పార్టీ నియామకాలు, ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో చర్చల్లో దినకరన్ కీలక పాత్ర పోషించారు. 1999లో పెరియాకులం నుంచి లోక్సభకు, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలదే గెలుపు పశ్చిమ బెంగాల్లోని సబంగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 64 వేల ఓట్ల మెజార్టీతో తృణమూల్ అభ్యర్థి గీతా రాణి భునియా గెలుపొందారు. ఆమెకు మొత్తం 1,06,179 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి రీతా మండల్కు 41,987 ఓట్లు దక్కాయి. యూపీలో సికందర అసెంబ్లీ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకుంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ పాల్ 11 వేల ఓట్లతో సమాజ్వాదీ అభ్యర్థి సీమా సచన్పై విజయం సాధించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని పాక్కే–కసాంగ్, లికాబలీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను బీజేపీ గెలుపొందింది. ఈ రెండు స్థానాల్ని కాంగ్రెస్ నుంచి అధికార బీజేపీ సొంతం చేసుకుంది. అన్నాడీఎంకేపై పట్టు సాధిస్తారా? తమిళనాడు రాజకీయాలు ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితాలతో మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే ఆగ్రహానికి గురై ఈ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్నారు. «రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సరికొత్త కేంద్రబిందువుగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయలలిత హయాంలో దినకరన్ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఆమె మరణించాక, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తన అక్క కొడుకైన దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించడంతో ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు తమ వర్గానికి రెండాకుల చిహ్నం రావడం కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం (ఈసీ)లోని ముఖ్యులకే రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపారు. తీహార్ జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత శశికళ వర్గం నుంచి సీఎం అయిన పళనిస్వామి కూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం వర్గంతో చేతులు కలిపి శశికళను, దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీచేసి భారీ విజయం సాధించారు. దినకరన్ విజయంతో తమిళ రాజకీయ సమీకరణాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతారా? ఆ పార్టీని శశికళ, దినకరన్లు మళ్లీ తమ చేతుల్లోకి తెచ్చుకుంటారా? దినకరన్ గెలుపుతో మరోసారి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? అన్న విషయం చర్చనీయాంశమైంది. దినకరన్ డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికలో గెలిచారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను స్టాలిన్ ఖండిస్తునప్పటికీ ఒకవేళ అదే నిజమైతే దినకరన్ డీఎంకేలో చేరుతారా? లేదా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే. చెన్నైలో దినకరన్ మద్దతుదారుల సంబరాలు -
ఆర్కే నగర్ తీర్పు: మారుతున్న తమిళ రాజకీయం..!
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో తమిళనాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ అనూహ్యంగా 40వేలకుపైగా మెజారిటీ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత వారసులం తామేనంటున్న అధికార అన్నాడీఎంకే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జయ మృతి తర్వాత నాటకీయ పరిణామాలతో ఇరుకునపడిన శశికళ వర్గం కూడా ఈ ఎన్నికను చావో-రేవో అన్నట్టుగా తీసుకొని బరిలోకి దిగింది. ఈ క్రమంలో శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. రాజకీయ పరిశీలకులు సైతం ఊహించనిరీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకేగానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేగానీ దినకరన్కు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి. ఈ విజయం శశికళ వర్గంలో కొత్త ఉత్తేజం నింపిందని చెప్పవచ్చు. జయ సొంత నియోజకవర్గం ఆర్కే నగర్లో పాగా వేయడంతో శశి వర్గం ఆనంద డొలికల్లో తేలియాడుతోంది. అమ్మ వారసురాలం తామేనని చెప్పుకోవడానికి ఈ విజయం ఉపకరిస్తుందని ఆ వర్గం భావిస్తోంది. ఈ విజయంతో సంబరాలు చేసుకుంటున్న శశి వర్గం కార్యకర్తలు.. అన్నాడీఎంకే అధ్యక్షుడు దినకరనే అంటూ నినాదాలు చేశారు. అటు దినకరన్ కూడా అన్నాడీఎంకే సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. నిజానికి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎప్పుడో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పళనిస్వామి (ఈపీఎస్), పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇంతవరకు అసెంబ్లీలో చేపట్టలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకివచ్చే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విజయం నేపథ్యంలో ఎమ్మెల్యే వట్రివేలు, ఎంపీ సెంగుట్టువన్ దినకరన్ను కలిసి అభినందనలు తెలిపారు. మరింతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్కు అండగా నిలబడితే.. పళనిస్వామి సర్కారు ఇబ్బందులు పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
బ్రేకింగ్: దినకరన్ ప్రభంజనం.. బీజేపీ కన్నా నోటాకే అధికం!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్ కోల్పోయాయి. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ, అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్ గుర్తుతో పోటీచేసిన దినకరన్ మొదటినుంచి లీడ్లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఈ ఎన్నికల్లో దినకరన్కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్ తమిళార్ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి. ఆర్కే నగర్ ప్రజలకు ధన్యవాదాలు తనను గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తనకు ఉన్నాయని, అందుకే ఆర్కే నగర్ తీర్పే నిదర్శమని అన్నారు. మూడు నెలల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మ వారసురాలే చిన్నమ్మేనంటూ శశికళ వర్గం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు
-
భారీ ఆధిక్యం దిశగా దినకరన్
-
గవర్నర్పై పిటిషన్ వేస్తా..!
సాక్షి, చెన్నై: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం ఉండగా, ఆ ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటూ సమీక్షలు, సమాలోచనలు సాగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి వ్యాఖ్యానించారు. అందుకే గవర్నర్పై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు శనివారం ప్రకటించారు. ఓ ప్రైవేటు కళాశాలలో అవినీతి వ్యతిరేక కమిటి సర్వోదయా మరు ముళక్కం నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సదస్సుకు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా విఫలమైందని, కేవలం ఎలాగైనా ఎన్నికలు పూర్తి చేయాలనే ముందుకు సాగారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అధికార పక్షం రూపంలో ఖూనీ చేసినా, ప్రజలు న్యాయమైన తీర్పునే ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. డీఎంకే, లేదా దినకరన్కు విజయావకాశాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. జయలలిత మరణం మిస్టరీ తేల్చేందుకు విచారణ సాగుతున్న సమయంలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న వీడియో బయటకు రావడాన్ని తప్పు బట్ట లేమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వీడియో ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఎప్పుడో విడుదల చేసి ఉండాలని పేర్కొన్నారు. రోడ్డు పక్కన బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధించాలని కోర్టులో తానే కేసు వేశానని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం వాటిలో జీవించి ఉన్న వారి ఫొటోలు పెట్టుకునే విధంగా అనుమతి వచ్చిందని, దీనిపై తగిన వివరాల్ని కోర్టుకు సమర్పిస్తానని, కొన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ అధికారం గవర్నర్కు లేదు.. రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఆయన సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే అధికారం గవర్నర్కు లేదని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో అధికారులతో సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల మీద గవర్నర్ దృష్టి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం పాలనలో ఉందన్న విషయాన్ని మరచి, గవర్నర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ తన ధోరణి మార్చుకోని పక్షంలో త్వరలో ఆయన మీద కోర్టులో పిటిషన్ వేస్తానని ట్రాఫిక్ రామస్వామి హెచ్చరించడం గమనార్హం. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్ కూలిపోతుంది
సాక్షి, చెన్నై : గెలుపు సంకేతాలు అందటంతో టీటీవీ దినకరన్ సీన్లోకి వచ్చేశారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో పళని స్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ తీర్పు.. తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన కోటిన్నర మంది కార్యకర్తలకు, ఆర్కే నగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. అమ్మకి నిజమైన వారసుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని.. అక్కడ నిలుచునే వ్యక్తి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జయ సమాధి వద్దకు చేరుకుని ఆయన నివాళులు అర్పించనున్నారు. -
విజయం దిశగా దూసుకెళ్తున్న దినకరన్
-
ఆర్కేనగర్ ఓట్ల లెక్కింపులో గందరగోళం
-
దినకరన్కు కలిసొచ్చింది ఎలాగంటే...
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఓవైపు కొనసాగుతున్న వేళ.. సర్వేలన్నీ శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్కు అనుకూలంగా రావటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకుగానూ పలు కారణాలను ఆయా సర్వేలు చూపుతున్నాయి. 54 ఏళ్ల దినకరన్ అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. దశాబ్దం క్రితం దాకా జయకు ఆప్తుడిగానే ఉన్నాడు. ఆమె తీసుకున్న కీలక నిర్ణయాల్లో దినకరన్ పాత్ర ఉండేది కూడా. 1999లో పెరియాకులం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు.. తర్వాత 2004-10 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అయితే 2011లో మన్నార్ గుడి మాఫియా(శశికళ మరియు ఆమె బంధువులు)ను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించటంతో ఆయన తెర వెనక్కవెళ్లిపోయారు. చివరకు జయ మరణానంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో వారంతా వెనక్కి వచ్చారు. అయితే వచ్చి రాగానే పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే జయ అసలైన వారసత్వం అన్న ట్యాగ్ లైన్తో పళని స్వామి గ్రూప్ తరపున ఆయన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నిల్చోగా.. ఓటర్లకు యథేచ్ఛగా డబ్బు పంచిన ఆరోపణలతో ఆ ఎన్నిక కాస్త రద్దు అయ్యింది. కానీ, పరిస్థితులు తర్వాత పూర్తి వ్యతిరేకంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. ఆమె వారసుడిగా రంగంలోకి దిగిన దినకరన్కు చిక్కులు ఎదురయ్యాయి. ఓవైపు ఎన్నికల్లో అవినీతి కేసు.. మరోవైపు ఫెరా కేసు ఊపిరి సలపకుండా చేశాయి. పళని-పన్నీర్ వర్గాలు కలిసిపోయి.. శశికళ వర్గాన్ని బహిష్కరించాయి. ఒకదాని వెంట ఒకటి దెబ్బలు తగులుతున్న తరుణంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక వచ్చి పడింది. ఇక రెండాకుల గుర్తు కోల్పోవటంతో టోపీ కోసం యత్నించగా.. అది దక్కలేదు. దానికి తోడు జయ మరణం వెనుక ఆమె హస్తం ఉందన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున్న వినిపించారు. ఒక రకంగా ప్రభుత్వం కావాలనే దినకరన్ పై కుట్ర చేస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇన్ని పరిణామాల మధ్య ఎన్నికకు సరిగ్గా ఒక్క రోజు సంచలనానికి తెరలేపారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేశారు. తనకు తెలీకుండా జరిగిపోయిందని దినకరన్ చెబుతున్నప్పటికీ.. ఈ వీడియో ప్రభావంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయని వారంటున్నారు. ఆర్కే నగర్ ప్రజల్లో దినకరన్ పై సింపథీ బాగా వర్కవుట్ అయ్యిందని.. అందుకే ఓటింగ్ శాతం కూడా ఓ మోస్తరుగా పెరిగిందని వారంటున్నారు. మరి ఈ పరిణామాలన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడా? విశ్లేషకులు భావించింది జరగుతుందా? జయకు అసలైన వారసుడని ఆర్కే నగర్ వాసులు భావించారా? మరికాసేపట్లోనే తేలనుంది. -
తొలిరౌండ్లో దినకరన్ ముందంజ
-
లైవ్ అప్ డేట్స్.. అనూహ్యంగా స్వరం మార్చిన అన్నాడీఎంకే నేతలు
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో అన్నాడీఎంకే స్వతంత్ర్య అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు పోలైన ఓట్లు మొత్తం కలిపినా ఆయన కంటే చాలా తక్కువ నమోదు కావటం విశేషం. దినకరన్ గెలుపు ఖాయమైపోతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఒక్కోక్కరుగా స్వరం మారుస్తున్నారు. ఆ పార్టీ నేత సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ దినకరన్ గెలుపును స్వాగతించటం విశేషం. దినకరన్ తో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అపార్థాల వల్లే రెండుగా విడిపోయింది. త్వరలో రెండూ ఒకటవుతాయని ఆశిస్తున్నా.. ఆ మేర నా వంతు ప్రయత్నం చేస్తా అని ఆయన తెలిపారు. అదే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దినకరన్ ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పగ్గాలు దినకరన్కు అప్పగించే సమయం వచ్చిందంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ రోడ్లపైకి చేరారు. ఫలితాలపై స్పందించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. అయితే బీజేపీ మాత్రం మరో వాదనను వినిపిస్తోంది. ఓటుకు నోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని.. డబ్బు విచ్చలవిడిగా పంచటంతోనే దినకరన్ గెలుస్తున్నాడంటూ తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. సుబ్రమణియన్ స్వామి ట్వీట్... ఇక బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ లో ఆసక్తికర సందేశం ఉంచారు. ఉప ఎన్నికలో దినకరన్ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. Dinakaran seems to have won the R K Nagar election caused by JJ death. I expect to see the two ADMK factions now to unite for 2019 LS poll — Subramanian Swamy (@Swamy39) 24 December 2017 -
నేడు ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు
సాక్షి, చెన్నై: ఆర్కేనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ నెల 21న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే(శశికళ వర్గం) అభ్యర్థి దినకరన్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. చెన్నై థౌజండ్ లైట్స్లోని క్వీన్ మేరిస్ కళాశాలలో ఐదంచెల భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ వెబ్ టెలికాస్టింగ్, వీడియో చిత్రీకరణకు ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు తీసుకొంటోంది. ఈ ఎన్నికలో దినకరన్దే గెలుపని, మధుసూదనన్, గణేషన్లు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తారని కావేరి టీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. దినకరన్కు సుమారు 37 శాతం ఓట్లు దక్కొచ్చని పేర్కొంది. -
గెలుపెవరిదో?
ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఓటింగ్కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్ లైట్స్లోని క్వీన్ మేరిస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్ టెలికాస్టింగ్ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్లోని కంట్రోల్ రూమ్ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 19 రౌండ్లుగా లెక్కింపు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్కు 14 పోలింగ్ బూత్ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్ బూత్లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషన్ కార్తికేయన్ తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది. -
ఆర్కేనగర్ పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ నిమిత్తం ఉప ఎన్నిక నిర్వహించగా గురువారంతో పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయత్రం 5 గంటలకు ముగియగా 77.68 శాతం పోలింగ్ నమోదైంది. 2,28,234 మంది ఓటర్లు ఉండగా 51 పోలింగ్ కేంద్రాల పరిధిలో 258 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మధుసూదనన్ (అన్నాడీఎంకే), మరుదు గణేష్ (డీఎంకే), స్వతంత్ర అభ్యర్థి, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన చేపడతారు. అదే రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. -
ఆర్కే నగర్లో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే?
సాక్షి , చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్ కేనగర్ ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 73.45 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 24న కౌటింగ్ జరగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ జోరుగా సాగింది. ఓటర్లు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ సాగింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం చెన్నై ఆర్కే నగర్. ఆమె మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పట్లో ఈసీ ఉప ఎన్నికను రద్దుచేసింది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. -
2జీ తీర్పు: ఆర్కే నగర్ ఓటరు ఎటు?
చెన్నై: తమిళనాడులో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో కోర్టు వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్కామ్లో నిందితులందరినీ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్పై కోర్టు తీర్పు ఎటువంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 'మోదీ ఇప్పుడు తమిళనాడు వెళ్లి డీఎంకేతో పొత్తు పెట్టుకోండి' అంటూ వాట్సాప్లో వచ్చిన మెసేజ్పై పోలింగ్ కేంద్రాల వద్ద చర్చ ఓటర్లు చర్చించుకోవడం కనిపించింది. దీన్నిబట్టి తమిళనాడు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మాకు ప్లస్ అవుతుంది 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికి ఆర్కే నగర్లో పోలింగ్ ఇంకా 90 శాతం మిగిలేవుంది. కోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా రావడంతో ఉప ఎన్నికలో తమ పార్టీకి లాభించే అవకాశముందని డీఎంకే నాయకులు అభిప్రాయపడుతున్నారు. 'ఆర్కే నగర్లో మేము గెలుస్తామని అనుకున్నాం. ఈరోజు కోర్టు వెలువరించిన తీర్పుతో మా విజయావకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయ'ని డీఎంకే అధికార ప్రతినిధి మాను సుందరం పేర్కొన్నారు. ఈ కేసు ఎన్నికల అంశం కానప్పటికీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తమ పార్టీపై ప్రజల్లో నమ్మకం బలపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ లాభాల కోసమే తమ పార్టీ నాయకులను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. స్వాగతిస్తున్నాం: దినకరన్ 2జీ కుంభకోణం కేసులో డీఎంకే నాయకులను నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తెలిపారు. డీఎంకే ప్రతిపక్షం అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు జైలు వెళ్లాలని తాము కోరుకోబోమన్నారు. ఆర్కే నగర్ వశమయ్యేనా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ చాలా ఏళ్లుగా అన్నాడీఎంకే పార్టీకి కంచుకోటగా ఉంది. ఆమె మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇక్కడ పాగా వేసేందుకు డీఎంకే సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్నాడీఎంకేలో వర్గపోరుతో తమకే విజయావకాశాలుంటాయని డీఎంకే భావిస్తోంది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పుతో డీఎంకేలో కొత్త ఉత్సాహం నింపింది. ఆర్కే నగర్ తమ వశం కావడం ఖాయమని కరుణానిధి పార్టీ దీమాతో ఉంది. దీర్ఘకాలం ప్రభావం ఉంటుందా? తమిళనాడు రాజకీయాల్లో న్యాయస్థానం తీర్పు ప్రభావం ఎంతకాలం ఉంటుందనే దాని గురించి ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం(2021) ఉంది. 2జీ స్కామ్ కారణంగా డీఎంకేతో పొత్తుకు జాతీయ పార్టీలు వెనుకాడుతూ వచ్చాయి. అపవాదు తొలగిపోవడంతో డీఎంకేతో చేతులు కలిపేందుకు నిస్సంకోచంగా ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
20 సెకన్ల వీడియో.. ప్రభావం ఎంత?
సాక్షి, చెన్నై : పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండువారాలు ప్రచారం నిర్వహిస్తే.. సరిగ్గా 24 గంటలకు ముందు జయలలిత వీడియో విడుదల చేసి దినకరన్ వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటిదాకా వార్తల్లో నిలిచిన అంశాలను ముఖ్యంగా డబ్బు పంపిణీ వంటి వాటిని ఈ వార్త ఒక్కసారిగా తెరవెనక్కు నెట్టేసింది. అనర్హత వేటు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే వెట్రివెల్ వీడియోను విడుదల చేస్తూ ఉప ఎన్నికకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అమ్మ మరణం వెనుక శశికళ పాత్ర లేదని నిరూపించేందుకు.. చికిత్స మెరుగ్గా అందించామని చెప్పేందుకే విడుదల చేశామని చెప్పటంతోనే అసలు చర్చ మొదలైంది. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం తనకేం పట్టన్నట్లు ఉండటం.. పైగా నేతలను మౌనంగా ఉండాలంటూ ఆదేశించటం... ఈ ఎపిసోడ్ వెనుక వేరే ఏదో మతలబు ఉందన్న సంకేతాలను ముందుగా అందించింది. ప్రతిపక్షాలు కూడా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో పెద్దగా స్పందించలేదు. కానీ, ఏడాది తర్వాత ఈ సమయంలోనే ఎందుకు రిలీజ్ చేశారన్న ప్రశ్న.. వీడియో అసలుదేన్నా అన్న అనుమానంతో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల దినకరన్ వర్గానికి ఒరిగేదేం లేదని వారంటున్నారు. వీడియో చూసి ఎమోషనల్గా అమ్మ సెంటిమెంట్కు జనాలు కనెక్ట్ అయ్యి ఓట్లు వేయటం కూడా అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘ టిపికల్ పొలిటికల్ స్టంట్’ గా దీనిని అభివర్ణిస్తున్న విశ్లేషకులు.. దాని ప్రభావం తెలియాలంటే మరో మూడు రోజులు(ఫలితాలు వచ్చేదాకా) ఓపిక పట్టాల్సిందేనంటున్నారు. -
ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
2జీ స్పెక్ట్రం కేసులో నేడే తీర్పు
-
ఆర్కే నగర్లో పోలింగ్ ప్రారంభం
సాక్షి , చెన్నై: చెన్నై ఆర్ కేనగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే ప్రాతినిథ్యం వహించారు. ఆమె మరణంతో ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఓటర్లకు నగదు బట్వాడా జరగడంతో ఆ ఎన్నిక రద్దయింది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. -
జైలుకా.. ఇంటికా..!
‘2జీ’. ఈ రెండు అక్షరాలు వింటే డీఎంకే శ్రేణుల గుండెల్లో గత ఆరేళ్లుగా రైళ్లు పరుగెడుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి రూ.1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణం, ఆరేళ్లుగా సాగుతున్న సీబీఐ, ఈడీ కేసుల విచారణే వారి భయానికి కారణం. ఈ కేసులో గురువారం తీర్పు వెలువడనుండగా రాజా, కనిమొళి దోషులుగా జైలుకా, నిర్దోషులుగా ఇంటికా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఓవైపు 2జీ స్పెక్ట్రం కేసులో తీర్పు.. ఇదే రోజు ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. 2జీ కేసులో శిక్ష పడితే ఆర్కే నగర్ పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని డీఎంకే నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి గురువారం ముగింపు కార్డు పడనుంది. డీఎంకే నాయకులు రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం.. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈరెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. కరుణ సహధర్మచారిణిని ప్రశ్నించాలనుకున్న సీబీఐ స్వాన్ టెలికం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా డీఎంకేకి సొంతమైన కలైంజర్ టీవీ, టీపీ గ్రూపు సంస్థలకు రూ.200 కోట్లు లంచం ఇచ్చిన కేసును సైతం అసలు కేసులోనే చేర్చారు. ఈ కేసులను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. రిలయన్స్ టెలికం, స్వాన్ టెలికం, యూనీటెక్ వైర్లెస్ సంస్థలు సైతం కేసు విచారణలను ఎదుర్కొన్నారు. కలైంజర్ టీవీ డైరక్టర్ వ్యవహరిస్తున్న కరుణ సహధర్మచారిణి దయాళుఅమ్మాళ్ను కూడా సీబీఐ ప్రశ్నించాలని భావించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమెకు జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందని, ఏమీ మాట్లాడుతారో ఆమె తెలియదని కరుణ కుటుంబీకులు నిరాకరించారు. సీబీఐ సిఫార్సు మేరకు కేంద్రం నుంచి వైద్యులు బృందం సైతం చెన్నైకి వచ్చి దయాళుఅమ్మాళ్ను పరీక్షించింది. 2జీ కేసులో మిత్రపక్షం డీఎంకే అని కూడా చూడకుండా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహించిన కరుణానిధి యూపీఏ నుంచి వైదొలిగారు. ఆ తరువాత దయాళూఅమ్మాళ్ను విచారించే అంశం మరుగున పడింది. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రూ.30,984 కోట్లు నష్టం సంభవించినట్లు ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆరేళ్లు సాగినకేసు గత ఆరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగియగా, 21వ తేదీన తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ఓపీ సైనీ ఇటీవల ప్రకటించారు. గురువారం చెప్పబోయే తీర్పుతో పదేళ్ల కిత్రం జరిగిన కుంభకోణానికి ముగింపు కార్డు పడనుంది. తీర్పు చెప్పుతున్నందున కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాజా, కనిమొళిలకు ఆదేశాలు అందాయి. పదేళ్ల క్రితం నాటి 2 జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పదేళ్ల క్రితం నాటి కుంభకోణం, ఆరేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. రాజా, కనిమొళిలను కోర్టు దోషులుగా నిర్ధారించి జైలు బాటపట్టిస్తుందా, నిర్దోషులుగా పేర్కొని ఇంటికి పంపుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఒకే రోజు రెండు టెన్షన్లు దురదృష్టమో, కాకతాళీయమో తెలియదు కానీ కరుణానిధి, స్టాలిన్ సహా డీఎంకే శ్రేణులు గురువారం రెండు టెన్షన్లను ఎదుర్కొంటున్నారు. 2 జీ కేసులో శిక్ష పడితే పార్టీకి చెరగని మచ్చగా మారి ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని భయం. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. అన్నాడీఎంకేకి రాబోయే ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మారుతుంది. -
జయ వీడియో.. ఇంత దిగజారుడు రాజకీయమా?
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో తాజాగా వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. జయలలిత సొంత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఈ వీడియోలు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. పలు అనుమానాల నడుమ జయలలిత మృతి మిస్టరీగా మారగా.. ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వీడియో, ఫొటోలు విడుదల కావడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ' ఇప్పటికే జయలలిత మృతి మిస్టరీగా మారింది. ఇప్పుడు ఈ వీడియోలు విడుదల చేసి ఆమె మృతిపై రాజకీయం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారడం ఉండదు. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఈ ఈ వీడియో ప్రభావం ఉండదు' అని ఆయన అన్నారు. అయితే, ఈ వీడియో విడుదలను శశికళ, దినకరన్ వర్గం సమర్థించుకుంటోంది. అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందించిన చికిత్సపై కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి ఆరోపణలను కొట్టిపారేసేందుకే ఈ వీడియోను విడుదల చేశామని దినకరన్ వర్గం నేత టీ సెల్వన్ పేర్కొన్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఎలాంటి కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధమని చెప్పారు. కాగా, సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురువారం జరగనుంది. -
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
-
ఆర్కేనగర్లో అరటి పళ్లలో డబ్బు పంపిణీ
-
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొరుక్కుపేట్లోని ఓ సైకోథెరపీ సెంటర్లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నిక ఓటుకు నోటు నేపథ్యంలోనే రద్దైన విషయం తెలిసిందే. ఆ సమయంలో దినకరన్ పై తీవ్ర ఆరోపణలు రాగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, డిసెంబర్ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. -
'ఈసారి మా అమ్మ, అయ్య లేకుండానే ఎన్నికలు'
సాక్షి, చెన్నై : తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నిక అంటే మిగితా ప్రాంతాలకంటే ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే అది దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడూ బరిలోకి దిగే స్థానం. అంతే కాకుండా అదే స్థానంలో డీఎంకే అధినేత కరుణానిధి కూడా తమ అభ్యర్థి తరుపున పోటాపోటీగా ప్రచారం నిర్వహించే చోటు. అయితే, జయలలిత చనిపోవడంతో ఖాళీగా ఉన్న ఆ స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ప్రచారం జరుగుతుంది. భారీ లౌడ్ స్పీకర్లలో ఎంజీఆర్ పాటలు, ప్రచార నినాదాలతో ఆర్కే నగర్ వీధులన్ని మారుమోగుతున్నాయి. అయితే, ఎక్కడ కూడా ప్రస్తుతం జయలలిత ఫొటోగానీ, కరుణానిధి ఫొటోగానీ కనిపించడం లేదు. ఓ పక్క పెద్ద పెద్ద హోర్డింగ్లకు మద్రాస్ కోర్టు అనుమతించకపోవడంతో అసలు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు బరిలోకి దిగిన అభ్యర్థిని కొనియాడుతున్నారే తప్ప ఆ క్రమంలో ఎవరూ జయనుగానీ, కరుణానిధిని గానీ తలుచుకోవడం లేదు. ఇప్పటికే కరుణానిధి అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో 'ఈసారి ఆర్కే నగర్ ఎన్నికలు, మా అమ్మ(జయలలిత) మా అయ్య(కరుణానిధి) లేకుండానే జరుగుతున్నాయి' అంటూ పలువురు సగటు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
విశాల్ నాకు షాక్ ఇచ్చారు..
సాక్షి, చెన్నై: నటుడు విశాల్ నాకు షాక్ ఇచ్చాడని నటుడు పొన్వన్నన్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం, అది అనేక నాటకీయ పరిణామాల తరువాత తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. విశాల్ అనూహ్య నామినేషన్ చర్య పరిశ్రమలో ఒక వర్గం దిగ్భ్రాంతికి, మరో వర్గం తీవ్ర వ్యతిరేకతకు గురి చేసింది. ఈ వ్యవహరంలో ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరిగింది. అందులో దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి నటుడు పొన్వన్నన్ రాజీనామా నిర్ణయం ఒకటి. ఈ విషయంపై ఆ సంఘంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి పొన్వన్నన్ రాజీనామాను అంగీకరించేది లేదని సంఘం అధ్యక్షుడు నాజర్ వెల్లడించారు. దీంతో బుధవారం పొన్వన్నన్ మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతనటీనటుల సంఘ నిర్వాహం రాజకీయాలకతీతంగా పని చేయాలన్న సిద్ధాంతంతో ఉందన్నారు. అలాంటిది సంఘం కార్యదర్శి విశాల్ అనూహ్యాంగా ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసి తనకు పెద్ద షాక్ ఇచ్చారన్నారు. సంఘం అధ్యక్షుడు నాజర్కు ఫోన్ చేసి సంప్రదించగా ఆయన తనకేమీ తెలియదని చెప్పారన్నారు. సంఘం కోశాధికారి కార్తీని సంప్రదించగా తనకూ ఏమీ తెలియదని,అది విశాల్ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారన్నారు. ఈ వ్యవహారంపై మీడియాతో పాటు పలువురు తనను ప్రశ్నించడంతో బదులు చెప్పలేక తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తన రాజీనామాను సంఘ నిర్వాకం ఆమోదించక పోవడం, విశాల్ ఈ విషయంలో విచారం వ్యక్తం చేసి, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని మాట ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తన రాజీనామాతో సంఘం బలహీన పడుతుందని, సంఘ భవన నిర్మాణం నిధిని సమకూర్చడం కోసం వచ్చే నెల 6వ తేదీన మలేషియాలో నిర్వహించ తలపెట్టిన స్టార్ క్రికెట్ కార్యక్రమం పనులు చేయాల్సిఉండడం లాంటివి దృష్టిలో పెట్టుకుని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానన్నారు. రజనీ,కమల్ పాల్గొననున్నారు.. జనవరి 6వ తేదీన మలేషియాలో జరగనున్న స్టార్ క్రికెట్ పోటీల్లో కమలహాసన్, రజనీకాంత్తో సహా 200 మంది కళాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. నటుడు అజిత్ కూడా పాల్గొనాలని కోరుతున్నామని చెప్పారు. స్టార్ క్రికెట్తో పాటు పలు సంప్రదాయ సినీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని మలేషియా ప్రభుత్వంతో కలిసి నటీనటుల సంఘం నిర్వహించనుందని పొన్వన్నన్ వివరించారు. -
తమిళ నిర్మాతల వార్
తమిళ సినిమా (చెన్నై): తమిళ నిర్మాతల మండ లి సర్వసభ్య సమావేశంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండలి అధ్యక్షు డు విశాల్కు వ్యతిరేకంగా పెద్ద పోరే జరగడం తో సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విశాల్ వర్గం గెలుపొంది నిర్వహణ బాధ్యతల ను చేపట్టింది. ఆదివారం తొలి సర్వసభ్య సమావేశం చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. మొదలైన కొద్ది సేపటికే విశాల్కు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు చేరన్ వర్గం నినాదాలు చేసింది. అందులో కొందరు విశాల్ మాట్లాడు తున్న మైక్ను లాగేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. వాగ్వాదాలు, తోపులాటలతో సమావేశం పోరు వాతావరణాన్ని తలపించింది. అనంతరం చేరన్ వర్గం మీడియాతో మాట్లాడుతూ విశాల్ ఏడు కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని, అప్పుడు తాను తగిన బదులిస్తాని విశాల్ సవాల్ విసిరారు. -
నేనంటే ఎందుకు అంత భయం..?
సాక్షి, చెన్నై: పార్టీ పెట్టాలన్న ఆలోచన తనకు లేదని నటుడు విశాల్ స్పష్టం చేశారు. పార్టీ పెట్టే ప్రసక్తే లేదని, ప్రజాహితం కాంక్షిస్తూ, మంచి పనులు చేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ విశాల్ రాజకీయ పయనానికి ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంగా ఓ మీడియాకు ఆదివారం విశాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఆర్కేనగర్లో పోటీకి సిద్ధపడానే గానీ, మరే కారణాలు లేవని స్పష్టంచేశారు. ఆర్కేనగర్ ప్రజలకు మంచి జరిగి ఉంటే, తాను వచ్చి ఉండే వాడిని కాదని వ్యాఖ్యానించారు. తానంటే కొందరికి ఎందుకు అంత భయమో అంతు చిక్కడం లేదన్నారు. తనను గురిపెట్టి దిగజారుడు, ఇంకా చెప్పాలంటే, నీచ రాజకీయాల్ని ప్రదర్శించారని మండిపడ్డారు. సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు, బెదిరింపులు, కిడ్నాప్ల పర్వాల్ని ప్రత్యక్షంగా ఆర్కేనగర్లో తాను చూశానని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందరో స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో ఉండగా, ఒక్క తనను మాత్రమే టార్గెట్ చేయడం బట్టి చూస్తే, తనకు ప్రజాదరణ ఉందన్న విషయాన్ని ఆ వ్యక్తులు గుర్తించినట్టున్నారని పేర్కొన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఒక్క ప్రజలతో తప్పా అని వ్యాఖ్యానించారు. తన వెనుకు దినకరన్, స్టాలిన్, కమల్ ఉన్నట్టు ప్రచారం చేశారని, అయితే, వీళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన వెనుక వారి హస్తం లేదని స్పష్టం చేశారు. తనను నడింపించేందుకు ఎవరో అవసరం లేదని, ప్రజలు చాలు అని, ప్రజలతో కలిసి మంచి కార్యక్రమాలు, పనులు కొనసాగుతాయని తెలిపారు. రాజకీయ పార్టీల ఆలోచన లేదని, అస్సలు ఆ ప్రసక్తే లేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. ఇక, నామినేషన్ వ్యవహారంలో జరిగిన తంతంగాన్ని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. జయలలిత మరణం తదుపరి అనేక మందికి ధైర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ఇష్టారాజ్యంగా స్పందిస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. -
రిటర్నింగ్ అధికారిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ప్రముఖ నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. విశాల్ నామినేషన్ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన అధికారి వేలుస్వామిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. ఈయన స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పీ నాయర్ని నూతన రిటర్నింగ్ అధికారిగా నియమించింది. హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణపై ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాలక పార్టీతో కుమ్ముక్కయిందని ఆయన ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సమర్పించిన నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం విదితమే. అయితే కొంత సమయం అనంతరం నామినేషన్ అంగీకరిస్తున్నట్టు, మళ్లీ తిరస్కరించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. విశాల్ అభిమానుల మితిమీరిన ఒత్తిడి మూలంగానే నామినేషన్ను ఆమోదించినట్లు అధికారి చెప్పడం మరింత వివాదానికి తెర తీసింది. -
హీరో విశాల్కు ఊహించని సపోర్టు..!
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భాగంగా రాజకీయ వేడి రాసుకుంది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు హీరో విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్ను ఎన్నికల అధికారులు మొదట తిరస్కరించి.. తర్వాత ఆమోదం తెలిపి మరలా తిరస్కరణకు గురి చేశారు. దీనిపై డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్ నామినేషన్పై అన్నాడీఎంకే దురాగతాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్ అన్నారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
చివరకు దినకరన్కు దక్కింది ఇదే!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్కు ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించినట్లు ప్రకటించింది. రెండాకుల గుర్తు పళని-పన్నీర్ గ్రూప్కు చెందుతుందని ఇటీవలె ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తమకు కేటాయించిన టోపీ గుర్తునే కేటాయించాలంటూ దినకరన్ ఈసీని అభ్యర్థించారు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. టోపీ గుర్తును శశికళ-దినకరన్ వర్గానికి ఎలా కేటాయిస్తారంటూ ఈసీపై కోర్టు ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రభావమో లేక మరేయితర కారణమో తెలీదుగానీ ఎన్నికల సంఘం మాత్రం ఆ గుర్తును కొంగునాడు మున్నేట్ర కగజమ్ అభ్యర్థికి రమేష్కు కేటాయించి, దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ ను కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. దీనిపై స్పందించిన దినకరన్ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకే ఈ గుర్తు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొనటం విశేషం. కాగా, డిసెంబర్ 21 న జరగబోయే ఎన్నిక కోసం మొత్తం 145 నామినేషన్లు నమోదుకాగా ఈసీ 72 అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే అంగీకరించింది. గత నలభై ఏళ్లలో 11 సార్లు డాక్టర్ రాధాకృష్ణన్(ఆర్కే నగర్) నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా.. అన్నాడీఎంకే పార్టీ 7 సార్లు ఘన విజయం సాధించింది. -
తెర వెనుక హైడ్రామా
సాక్షి, చెన్నై: సినీ నటుడు విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీచేయకుండా అడ్డుకునేందుకు సినిమా స్టైల్లోనే కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు ప్రజల ఓటు చీలడం ఖాయమన్న సంకేతాలతో అధికార పక్ష అన్నాడీఎంకే వర్గం తెర వెనక రాజకీయం సాగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశాల్ పేరును ప్రతిపాదిస్తూ ఆర్కే నగర్కు చెందిన పదిమంది సంతకాలు చేశారు. పరిశీలన సమయంలో వారిలో సుమతి, దీపన్ల సంతకాలపై అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తొలుత విశాల్ నామినేషన్ పత్రాన్ని పెండింగ్లో పెట్టారు. ఈలోగా సుమతి, దీపన్లకు వచ్చిన బెదిరింపుల ఆడియో టేపుల్ని విశాల్.. రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) దృష్టికి తీసుకెళ్లారు. విచారణ ముగియడంతో నామినేషన్కు ఆమోదం తెలిపారు. చివరకు 11 గంటల సమయంలో సుమతి, దీపన్ల సంతకాలు బోగస్ అని తేల్చి విశాల్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఆర్వో వేలుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పెద్దగా పట్టించుకోని ఆర్వో ఒక్క విశాల్ నామినేషన్పైనే ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని చూస్తే, తెర వెనుక ఏమేరకు రాజకీయం సాగిందో స్పష్టమవుతోంది. అడ్డుకోవడం అక్రమం: విశాల్ తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో విశాల్ ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీల దృష్టికి తీసుకెళ్లారు. సినీ వర్గాలు విశాల్కు బాసటగా నిలిచాయి. -
ఇంత దారుణమా.. నేను షాక్ తిన్నాను!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై ప్రముఖ నటుడు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ‘నిన్న ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారు? నాపట్ల ఈసీ వ్యవహరించిన తీరును చూసి షాక్ తిన్నాను’ అని విశాల్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. తన నామినేషన్ను బలపరుస్తూ సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్ ఆరోపించారు. ఉద్దేశపూరితంగానే తన నామినేషన్ను తిరస్కరించారని అన్నారు. నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, నాయ్యం జరిగేవరకు వదిలిపెట్టబోనని విశాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి విశాల్ లేఖ..! ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్ను తిరస్కరించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నటుడు విశాల్ లేఖ రాశారు. తన నామినేషన్ను ఈసీ తిరస్కరించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపారు ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. -
విశాల్ నామినేషన్పై హైడ్రామా
సాక్షి, చెన్నై : ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఒక్క రోజులో ఎన్ని మలుపులో... చెన్నై తండయార్ పేటలోని మండల కార్యాలయంలో ఎన్నికల అధికారి వేలుస్వామి పర్యవేక్షణలో ఉదయం నుంచి నామినేషన్ల పరిశీలన జరిగింది. విశాల్ పేరును ప్రతిపాదించిన ఆర్కేనగర్కు చెందిన పదిమందిలో ఇద్దరి పేర్లు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు, అనేకచోట్ల అవును, లేదు అన్న సమాధానాలు కూడా ఇవ్వకుండా ఖాళీగా వదలి పెట్టడంతో ఆయన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు వేలుస్వామి ప్రకటించారు. దీంతో ఆందోళనకు దిగిన విశాల్ పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానికి చేసిన ఫిర్యాదులో తన పేరును ప్రతిపాదించిన వారికి బెదిరింపులు వచ్చాయని, వాటిని నిరూపించే వీడియో తన వద్ద ఉందని విశాల్ పోరాటానికి దిగారు. దీంతో రాత్రి 8.30 గంటలకు విశాల్ నామినేషన్ ఆమోదించినట్లు అధికారులు చెప్పారు. చివరకు రాత్రి 11 గంటలకు మళ్లీ ఆయన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 26ఐ పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి. -
అనూహ్యం.. విశాల్ నామినేషన్ అంగీకారం
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విశాల్ నామినేషన్ను స్వీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తొలుత నామినేషన్ను తిరస్కరించినట్లు ప్రకటించగానే విశాల్ తన అభిమానులతో ధర్నాకు దిగగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నాటకీయ పరిణామాల తర్వాత రిటర్నింగ్ అధికారిని కలిసిన విశాల్ వివరణ ఇచ్చుకున్నాడు. దానిపై సంతృప్తి చెందిన అధికారి విశాల్ నామినేషన్ను అంగీకరించారు. అనంతరం బయటకు వచ్చిన విశాల్ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశాడు. ‘‘నా నామినేషన్ను ఈసీ అంగీకరించింది. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా’’ అని విశాల్ ప్రకటించాడు. తన మద్దతుదారులను బెదిరించారని.. అయినా నా పోరాటం గెలిచిందన్నాడు. -
విశాల్,దీప ఇద్దరికీ ఈసీ బిగ్ షాక్!
-
ఆర్కే నగర్ బైపోల్.. విశాల్ నామినేషన్ తిరస్కరణ
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు. విశాల్ అరెస్ట్... నామినేషన్ తిరస్కరణపై విశాల్ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
దీప జయకుమార్కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై : జయలలిత మేనకోడలు దీప జయకుమార్కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె స్వతంత్ర్య అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె పేర్కొన్న అంశాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ తెలిపారు. జయ మృతి తర్వాత ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పేరిట ఓ పార్టీని స్థాపించిన ఆమె.. ఆ సమయంలో జయకు అసలైన వారసురాలిని తానే అని ప్రకటించుకున్నారు. ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపొంది తీరతానని ధీమా వ్యక్తం చేశారు కూడా. కాగా, ఈసీ నిర్ణయంతో ఆమె ఎన్నికకు దూరమైనట్లయ్యింది. ప్రస్తుతం ఆర్కే నగర్ కు పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు నటుడు విశాల్, ముఖ్యంగా బహిష్కృత నేత దినకరన్ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోవటంతో రాజకీయ వర్గాలు పోటీని ఆసక్తిగా తిలకించబోతున్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 21న ఎన్నిక, 24 న కౌంటింగ్ నిర్వహించనుంది. -
విశాల్.. రాజీనామా చెయ్ !
సాక్షి, పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని డిమండ్ చేస్తూ నటుడు, దర్శకుడు చేరన్ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్పై దండెత్తడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది. పోరాటం చేస్తాం: హీరో, దర్శకుడు చేరన్ విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో గొంతు విప్పారు. విశాల్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్ వ్యాపార గర్రంగా మారారని ఆరోపించారు. అప్పుడు కరుణానిధి.. ఇప్పుడు..! దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సోమవారం నామినేషన్ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. విశాల్ చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని పేర్కొన్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదని అరోపించారు. రాజకీయ లబ్ధి: ఆ పదవిని అడ్డు పెట్టుకుని తను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్మాతల శ్రేయస్సు కోరితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కే.నగర్లో నామినేషన్ దాఖలు చేసిన సాయంత్రం నుంచే విశాల్కు వ్యతిరేకంగా నిర్మాతలందరం కలిసి పోరాటం చేస్తామని లేఖలో హెచ్చరించారు. అనంతరం లేఖను నిర్మాతల మండలిలో సమర్పించి మీడియాతో మాట్లాడారు. -
ఆర్కే నగర్లో విశాల్ నామినేషన్
సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం తమిళ హీరో విశాల్, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప, బీజేపీ అభ్యర్థి నాగరాజన్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దాదాపు 40 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుచేయడానికి ముందు హీరో విశాల్ సోమవారం దివంగత ముఖ్యమంత్రులు కామరాజర్, ఎంజీఆర్ స్మారక మందిరాల్లో నివాళులర్పించారు. మెరీనా బీచ్లోని జయ సమాధి వద్ద అంజలి ఘటించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, ప్రజల ప్రతినిధిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నియోజవకర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ఓటర్లు ఉండటంతో, విశాల్ వారి ఓట్లే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాల్కు మద్దతుగా నటుడు ఆర్య, ప్రకాష్రాజ్ కదిలారు. తనకు మద్దతుగా సినీ పరిశ్రమ కదిలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
అమ్మ సమాధి సాక్షిగా విశాల్ నామినేషన్
సాక్షి, చెన్నై : నటుడు విశాల్ సోమవారం తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్ సెంటర్కు వెళ్లిన అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శమని ప్రకటించిన విశాల్.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్ ప్రజలను కోరుతున్నాడు. ఇక విశాల్ రాక నేపథ్యంలో నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అక్కడికి చేరుకోగా.. భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కూడా తమలాగే మాములు వ్యక్తి అని.. అతని కోసం ఎదురు చూడాల్సిన అవసరం తమకు లేదంటూ వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ఫ తోపులాట చోటు చేసుకోగా.. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీ ఎంకే అమ్మ పార్టీ తరపున), బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్ సంపాదించుకున్న మాస్ హీరో విశాల్ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. -
విశాల్కు పోటీగా దర్శకుడు అమీర్
సాక్షి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు సినీ నటులు పోటీకి దిగనున్నారు. సినీ నటుడు విశాల్కు పోటీగా బరిలోకి దిగేందుకు దర్శకుడు, నటుడు అమీర్ సిద్ధమయ్యారు. ఇక 13 ఏళ్ల అనంతరం డీఎంకేకు మద్దతివ్వాలని ఎండీఎంకే నేత వైగో ఆదివారం నిర్ణయించారు. దీనిని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్వాగతించారు. అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీ ఎంకే అమ్మ (రెబల్) గా టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా పోటీ చేయాలని అమీర్ నిర్ణయించారు. ఇక బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్, విశాల్, అమీర్ సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. -
ఆర్కే నగర్ బరిలో తమిళ హీరో విశాల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, సినీ హీరో విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 4వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు, డీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి. -
షాక్.. ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో విశాల్!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో మరో సంచలనం. యువ హీరో విశాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేయటమే కాదు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు తమిళ మీడియా నుంచి వార్తలు అందుతున్నాయి. అంతేకాదు కొత్త పార్టీ నెలకొల్పి 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నాడంట. సోమవారం విశాల్ ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ వేయబోతున్నట్లు దాని సారాంశం. స్వతంత్ర్య అభ్యర్థిగా విశాల్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. కమల్, రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విశాల్ నిర్ణయం పెను చర్చకు దారితీసింది. కాగా, ఇప్పటిదాకా 27 నామినేషన్లు దాఖలు కాగా, విశాల్ ఎంట్రీతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది. -
ఆసక్తికరంగా ఆర్కే నగర్ ఉప ఎన్నిక!
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్ బరిలోకి దిగుతుండగా డీఎంకే నుంచి మరుదు గణేశ్, శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. జయలలిత నియోజకవర్గంలో గెలిచి.. ఆమె వారసులం తామేనని నిరూపించుకోవాలని ఇటు అధికా అన్నాడీఎంకే, అటు శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డీఎంకే కూడా ఈ ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చి.. ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో దినకరన్
చెన్నై: తమిళనాడులోని రాధాకృష్ణ(ఆర్కే)నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ పోటీచేయనున్నారు. డిసెంబర్ 21న జరగనున్న ఎన్నికల్లో దినకరన్ బరిలో నిలుస్తారని ఆయన వర్గంనేత ఎస్ అంబళగన్ చెప్పారు. వీకే శశికళ అంగీకారంతోనే దినకరన్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్కేనగర్ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సిన ఉప ఎన్నికల్లోనూ దినకరన్ పోటీచేశారు. ప్రచారసమయంలో కోట్లాది రూపాయలు ఓటర్లకు పంచారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ను రద్దుచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఆర్కే నగర్ బైపోల్.. అభ్యర్థిని ప్రకటించిన డీఎంకే
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం డీఎంకే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత స్టాలిన్ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. తమ పార్టీ తరపున మరుదు గణేశ్ పోటీ చేయనున్నట్లు స్టాలిన్ తెలిపారు. జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్కే నగర్) బై ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఎన్నిక, 24న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
ఆర్కేనగర్ నుంచి పోటీచేస్తా
సాక్షి, చెన్నై, కొయంబత్తూర్: ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించారు. జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో డిసెంబర్ 21న ఉపఎన్నికలు నిర్వహిస్తామని శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అనంతరం తిరుపూర్లో దినకరన్ మాట్లాడుతూ.. రెండాకుల గుర్తు కోసం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు బీజేపీతో కుమ్మక్కై కుట్ర చేశారని ఆరోపించారు. కాగా డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాల్ని విడుదల చేస్తామని, డిసెంబర్ 26 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి లఖోనీ తెలిపారు. వేలిముద్రల్ని సరిపోల్చాలని నిర్ణయం గతేడాది ఉప ఎన్నికలవేళ బీ–ఫారాలపై జయలలిత వేలిముద్రల్ని.. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో అందుబాటులో ఉన్న జయ వేలిముద్రలతో సరిచూడాలని మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. జయ వేలిముద్రల వివరాల్ని సమర్పించాలని ఆధార్ నియంత్రణ సంస్థ యూఐడీఏఐని కూడా హైకోర్టు కోరింది. మరోవైపు రెండాకుల గుర్తుపై తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ పన్నీర్ సెల్వం సుప్రీం కోర్టులో కెవియట్ దాఖలు చేశారు. -
దినకరన్ శపథం
చెన్నై: రెండాకుల గుర్తును తిరిగి సాధించుకుంటామని అన్నాడిఎంకే బహిష్కృత నాయకుడు టీటీవీ దినకరన్ ప్రతిజ్ఞ చేశారు. తిరుర్పూర్లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శపథం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ అధికార చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని దినకరన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ డిసెంబర్ 21న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. -
ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీ ఖరారు
-
ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీ ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు తేదీ ఖరారైంది. డిసెంబర్ 21న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 21న ఎన్నిక నిర్వహించి.. 24న కౌటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటితోపాటు సికంద్రా(యూపీ), సంబంగ్(పశ్చిమ బెంగాల్), అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే కసంగ్, లికబలి నియోజకవర్గాలకు అదే తేదీలో ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజకవర్గ స్థానం ఖాళీ అయ్యింది. గతంలోనే ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమవగా.. ప్రచార సమయంలో భారీ అవినీతి బయటపడటంతో ఎన్నికను రద్దు చేశారు. చివరకు న్యాయస్థానాల జోక్యంతో డిసెంబర్ 31లోగా ఎన్నిక నిర్వహించాలని ఈసీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. -
దినకరన్ ఎంట్రీ.. సూపర్ ట్విస్ట్
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అదిరిపోయే ట్విస్ట్. ఎన్నికలో తానే స్వయంగా దిగుతున్నట్లు శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్ ప్రకటించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... స్వయంగా నేనే బరిలో దిగబోతున్నా.. పోటీకి ఎవరొచ్చినా గెలుపు నాదే అంటూ ఆయన తెలిపారు. బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా దినకరనే పోటీలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం ద్వారా అమ్మకు అసలైన వారసులం తామేనని (శశికళ వర్గం) నిరూపించుకునే అవకాశం వచ్చిందని దినకరన్ చెబుతున్నారు. జయలలిత మరణంతో దాదాపుగా ఏడాది నుంచి (రాధాకృష్ణన్ నగర్) ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఈ ఏడాది ఏప్రిల్లోనే ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఓటర్లను పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ప్రలోభ పెట్టడం టాక్స్ అధికారుల దృష్టిలో పడటం.. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావటంతో ఎన్నికల సంఘం వాయిదా వేసి విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఉప ఎన్నికపై స్పష్టత ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. డిసెంబర్ 31లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల వేటలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చించాకే అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నాడీఎంకే ప్రకటించగా.. డీఎంకే తరపున దాదాపు అభ్యర్థి ఖరారైనట్లేనని.. మరో వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. -
అక్కడి నుంచి పోటీ చేస్తారా?
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా నటుడు కమల్హాసన్పై అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనుంది. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని కమల్హాసన్ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే రాజకీయాల్లోకి రావడానికి కమల్ వంద రోజుల గడువు విధించుకున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, గత ఏడాది ఏప్రిల్లో రద్దయిన ఈ ఉప ఎన్నికలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన మరుదు గణేష్ శనివారం ఈసీకి లేఖ రాశారు. ఓటర్లకు భారీ ఎత్తున డబ్బు పంపిణీ రుజువు కావడం వల్ల ఉప ఎన్నికను రద్దు చేశారని, అయితే రద్దుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. ఆనాటి ఎన్నికల్లో రూ.5 లక్షలు ఖర్చు చేసిన తనకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీని కోరారు. లేకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. -
డిసెంబర్ 31లోపు ఆర్కేనగర్ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) గురువారం రాత్రి ఢిల్లీలో ప్రకటించింది. జయ మరణం తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నిక జరిగేలా గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆనాటి ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ ఓటర్లకు విచ్చలవిడిగా నగదు, బహుమతులు పంచడం వివాదాస్పదమైంది. ఇవే ఆరోపణలతో మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో ఇందుకు తగిన ఆధారాలు దొరకడంతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 9వ తేదీన ఈసీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఉప ఎన్నిక సమయంలో రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్సెల్వం, దీప వర్గాలు పోటీపడడంతో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించింది. మరలా జరిగే ఉప ఎన్నికల నాటికైనా రెండాకుల చిహ్నాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఈసీకి రూ.50 కోట్ల లంచం ఇచ్చే ప్రయత్నంలో దినకరన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నేడు మరలా ఉప ఎన్నిక సమీపిస్తుండగా అన్నాడీఎంకే వర్గాలు రెండాకుల చిహ్నం దక్కించుకోవడం కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. రద్దయిన ఎన్నిక సమయంలో పన్నీర్ సెల్వం వర్గ అభ్యర్థి మధుసూదనన్, శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ ఈసారి కూడా పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు. -
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై క్లారిటీ
సాక్షి, చెన్నై : జయలలిత మరణానంతరం ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్(ఆర్కే నగర్) ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం ఓ స్పష్టత ఇచ్చేసింది. డిసెంబర్ 31 లోపు ఎన్నిక నిర్వహించి తీరతామని ఈసీ ప్రకటించింది. గురువారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఏకే జ్యోతి ఈ మేరకు వెల్లడించారు. గత నెల మద్రాస్ హైకోర్టు ఆర్కే నగర్ ఉప ఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్నికల సంఘం స్పందించింది. ఈ యేడాది ఏప్రిల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికల్లో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఎన్నికను వాయిదా వేసింది. అంతేకాదు ఆ సమయంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ రెండాకుల గుర్తు పొందడం కోసం ఎన్నికల సంఘం ఉన్నతాధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దినకరన్ను అరెస్ట్ చేసి.. ఆపై బెయిల్ పై విడుదల చేశారు. గుజరాత్ షెడ్యూల్ ఏది? రెండు రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్ను విడుదల చేస్తారని భావించినప్పటికీ.. ఈసీ కేవలం హిమాచల్ ప్రదేశ్ కు మాత్రమే ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గుజరాత్ ఎన్నికలను డిసెంబరు 18లోపు పూర్తి చేస్తామని పేర్కొంది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలకు దిగింది. ఎన్నికల సంఘంపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేయించిందని ఆరోపించింది. తన రాజకీయ స్వప్రయోజనాలు నెరవేరే వరకు ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేసేలా ప్రధాని మోదీ ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు. కానీ, దీని వెనుక ఓ సాంకేతిక కారణం ఉన్నట్లు ప్రెస్ మీట్ లో ఈసీ చీఫ్ ఏకే జ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాల పరిమితి నిబంధన ఉన్నందున గుజరాత్ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆయన వెల్లడించారు. -
విజయ్ భాస్కర్ ఇళ్లపై మళ్లీ ఐటీ దాడులు
చెన్నై: ఆర్కే నగర్ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచినట్టుగా ఐటీ అధికారుల దాడుల్లో దొరికిపోయిన మంత్రి విజయ్భాస్కర్పై నివాసంపై ఐటీశాఖ మరోసారి పంజా విసిరింది. ఇలుప్పుర, పుదుకొట్టైలోని ఆయన నివాసాలతో పాటు పలుచోట్ల ఐటీ శాఖ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. కాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ విజయం కోసం మంత్రి విజయభాస్కర్ నాయకత్వంలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఐటీ అధికారుల దాడుల్లో ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్లర్ గీతాలక్ష్మి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మళ్లీ విజయ్ భాస్కర్ ఇళ్లపై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. -
ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులపై వేటు!
-
ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులపై వేటు!
న్యూఢిల్లీ: తమిళ నాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడంలో సరి కొత్త ఆలోచనలు చూసిన తర్వాత అలా ప్రలోభ పెట్టే అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసే అభ్యర్థులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టినట్లు కోర్టులో చార్జిషీట్ దాఖలైతే సదరు అభ్యర్థులపై ఐదేళ్ల వరకు అనర్హత వేటు వేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనుంది. దీనిపై న్యాయ శాఖకు లేఖ రాస్తున్నామని ఈసీ అధికారవర్గాలు తెలిపాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పాల టోకన్లు, ఫోన్ రీచార్జ్ కూపన్లు, పేపర్ల చందాలు, ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ఫర్, మొబైల్ వాలెట్ పేమెంట్ల రూపంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టినట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం అయితే ఆ ఎన్నికలను రద్దు చేసేలా అధికారాలు ఇవ్వాలని గతంలోనే ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఎన్నికల్లో అంగ బలం ప్రదర్శించిన సమయంలో ఈసీకి నేరుగా ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది. అర్థ బలం విషయంలో రాజ్యాంగ అధికారాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ, వాటితో అవసరం లేకుండానే చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది. -
ఓటుకు నోటుపై పిల్
► ఆర్కేనగర్ ఓటర్లపై నోటు పోటు ► నోట్లు పంచిన దినకరన్పై పోలీసులకు ఫిర్యాదు ► ఆర్కేనగర్ ఉప ఎన్నికల అవకతవకలపై మద్రాసు హైకోర్టులో వ్యాజం ► వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్కు కోర్టు ఆదేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ నియోజకవర్గ ఓటర్లు దినకరన్ నుంచి రూ.89 కోట్ల మేర లబ్ధిపొందినట్లుగా లభించిన ఆధారాలు ఆ ప్రాంత ప్రజలను చిక్కుల్లో పడవేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు ఇచ్చిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పుచ్చుకున్న ప్రజలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజం (పిల్)పై వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్ను మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపు అవకాశాలు లేవని తెలుసుకున్న దినకరన్ ఓటర్లను లోబరుచుకునే ప్రయత్నాలు చేశారు. ఓటుకు రూ.4వేలు లెక్కన పంచినట్లు సమాచారం. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు చిక్కకుండా ‘స్వామి దర్శనం అయిందా(డబ్బు అందిందా)’ అంటూ కోడ్ భాషను ప్రయోగించారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇవిగాక టోకన్ల పంపిణీ చేసి నేరుగా షోరూంల దగ్గరే విలువైన బహుమతులు పంచే పథకాన్ని పన్నారు. ఎంతగోప్యంగా సాగినా ఎన్నికల కమిషన్ కన్ను పడడంతో అధికార పార్టీ నేతలు ఆదాయపు పన్ను దాడులకు గురైనారు. వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 35 చోట్ల చేసిన దాడుల్లో ఓటర్లకు పంచినట్లుగా రూ.89 కోట్ల విలువైన ఆధారాలు లభించాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యాయి. ఇచ్చిపుచ్చుకున్న వారి మాటేమిటి: న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ నగదు బట్వాడా జరిగినట్లు రుజువుకావడంతో ఎన్నికలను రద్దు చేసి సరిపెట్టిన ఎన్నికల కమిషన్ ఓటుకు నోటు ఇచ్చిన , పుచ్చుకున్నవారిని వదిలేసిందని పిల్ వేసిన అరుణ్ నటరాజన్ తరపు న్యాయవాది నళినీ చిదరంబం శుక్రవారం నాటి విచారణలో న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఓటుకు నోటు పంచడం మాత్రమే కాదు, స్వీకరించడం కూడా చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. అయితే ఎన్నికల రద్దుకు అన్నాడీఎంకే అమ్మ అభ్యర్ది దినకరన్, నగదు పంపిణీకి సారధ్యం వహించిన ఐదు మంది మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ చెన్నై పోలీసులను అదేశించలేదని ఆమె తప్పుపట్టారు. ఓటుకు నోటు పంచిన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీసు కమిషనర్కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ న్యాయమూర్తులకు తెలిపారు. ఫిర్యాదు చేసిన పత్రాల నకలును సైతం కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంలో పిల్ తరపు న్యాయవాది నళినీ చిదంబరం మధ్యలో కలుగజేసుకుని...నోటు చెల్లించినవారిపై మాత్రమే ఫిర్యాదు చేశారు, పుచ్చుకున్న ఓటరుపై చేయలేదని, ఓటర్లపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని వాదించారు. పైగా ఓటర్లు నగదు పొందినట్లుగా ఆధారాలు ఫ్లయింగ్ స్వా్కడ్ అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు. ఆర్కేనగర్ పరిధిలోని రెండు లక్షల ఓటర్లలో నగదు పుచ్చుకున్న వారిని గుర్తించడం ఆచరణలో సాద్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు ఎలా వస్తారని నిరంజన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందర్లు స్పందించారు. ఈ పిల్పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్ కమిషనర్ తదితరులు సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. -
తమిళనాట టెన్షన్.. గవర్నర్ రాక!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకేను పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు పట్టుబడడం ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది. గవర్నర్ రాక రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు. శశికళ వద్దకు దినకరన్ పరుగు రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పన్నీర్ గూటికి మంత్రులు అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే రాజీనామా చేయాలని శశికళ, దినకరన్లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుంచి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు. -
అరెస్ట్ చేస్తారా?
♦ మంత్రుల్లో ఆందోళన ♦ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు ♦ విజయభాస్కర్ వైపు సీబీఐ చూపు ♦ 122 మంది ఎమ్మెల్యేలపై గురి సాక్షి,చెన్నై: అధికారులకు బెదిరింపులు, ఐటీ ఉచ్చు వెరసి మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మంత్రులు అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న సమాచారం ఉత్కంఠను రేపుతోంది. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ ప్రయత్నాలకు ముగ్గురు మంత్రులు సిద్ధమయ్యారు. ఇక, ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వైపు సీబీఐ దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన ఐటీ దాడులు మంత్రులకు సంకట పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ పలుమార్లు ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఆయన్ను పదే పదే ఆదాయ పన్ను శాఖ వర్గాలు విచారిస్తూ రాగా, ఇక ఆయనపై సీబీఐ కూడా దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీబీఐ విచారణకు ప్రతి పక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గ పరిశీలనలు సాగుతున్నట్టుంది. విజయ భాస్కర్ను సీబీఐ కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు రావడంతో ఎక్కడ ఆయన అరెస్టు అవుతారోనన్న చర్చ బయలు దేరింది. అలాగే, ఐటీ అధికారుల్ని బెదిరించి ఇరుకున పడ్డ మరో ముగ్గురు మంత్రుల్ని పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న ఉత్కంఠ సాగుతోంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ మంత్రులు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఐటీ అధికారుల్ని బెదిరించిన వ్యవహారంలో మంత్రులు ఉడుమలై కే రాధాకృష్ణన్, కామరాజ్, కడంబూరు రాజాలపై అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసుల్ని నమోదు చేశారు. వీరిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. విచారణానంతరం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆ ముగ్గురు మంత్రులు ముందస్తు జాగ్రత్తల్లో పడ్డారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో దాఖలు చేయడానికి తగ్గ సూచనల్ని తమ న్యాయవాదులకు జారీ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులో దాఖలు చేయడానికి న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు. 122 మంది ఎమ్మెల్యేల్ని విచారించేనా: కువత్తూరు వేదికగా 122 మంది ఎమ్మెల్యేలను బల పరీక్ష సమయంలో బంధించి ఉన్న విషయం తెలిసిందే. విజయభాస్కర్ వద్ద సాగిన ఐటీ విచారణలో కువత్తూరులోని ఎమ్మెల్యేలకు ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అప్పగించిన పనులు, కేటాయింపులు తదితర వివరాలకు సంబంధించిన జాబితా ఐటీ వర్గాలుకు చిక్కినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేల్ని విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది. అంత మంది ఎమ్మెల్యేల్ని విచారణకు పిలిపించడం కన్నా, సమగ్ర సమాచారంతో అడుగులు వేయడానికి తగ్గ కార్యచరణతో ఐటీ వర్గాలు ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
డిష్యూం..డిష్యూం
► రోడ్డెక్కిన దీప, మాధవన్ల పోరు ► దీప డౌన్ డౌన్ అంటూ నినాదాలు ► ఇరువర్గాల ఘర్షణలతో ఉద్రిక్తత సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్ అమ్మ దీప పేరవైలోని విభేదాలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. దీప, ఆమె భర్త మాధవన్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జయలలిత వారసురాలిగా రాజకీయ తెరపైకి వచ్చిన దీప ఆ పార్టీని స్వాధీనం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే తాను సొంతగా పేరవైని స్థాపించి అధ్యక్షురాలిగా తన డ్రైవర్ భార్యను, ప్రధాన కార్యదర్శిగా డ్రైవర్ ఏవీ రాజాను నియమించారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని కోపగించుకున్న దీప భర్త మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పార్టీ పెద్దలు సమాధానపరచడంతో మళ్లీ కలిశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్ను ఖాళీగా పెట్టడం మాధవన్ను మళ్లీ ఆగ్రహానికి గురిచేయడంతో మళ్లీ వెళ్లిపోయారు. ఒక దశలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దంపతుల మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం దీప ఇంటి ముందు అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు జరిగాయి. మాధవన్ అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచెను కట్టుకుని వేడుకల్లో పాల్గొనేందుకు అనుచరులతో హాజరయ్యారు. దీప రాకకోసం మాధవన్ ఇంటి బైటే వేచి చూసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆయన అనుచరులు దీప అనుచరులతో వాగ్విదానికి దిగి గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. వీరిని డ్రైవర్ ఏవీ రాజా, అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు మంచినీళ్ల బాటిళ్లు, రాళ్లు విసురుకున్నారు. ఘర్షణ పడవద్దని దీప కేకలు వేసినా ఎవ్వరూ వినిపించుకోలేదు. పేరవైలో గొడవలన్నింటికీ నీవే కారణమని కొందరు ఏవీ రాజాను దూషించగా, దీప డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించేశారు.