చెన్నై ఆర్ కేనగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే ప్రాతినిథ్యం వహించారు.