సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి | september 17th lesson in text book, says suravaram sudhakar reddy | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి

Published Wed, Sep 17 2014 12:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి - Sakshi

సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి

న్యూఢిల్లీ : సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విలీన దినోత్సవంగా ప్రకటించాలని సూచించారు. బీజేపీ, ఎంఐఎం దీనికి మతం రంగు పులుముతున్నాయని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం లొంగకూడదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement