Telangana Liberation Day
-
నగరంపై పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: సాధారణ పరిస్థితుల్లోనే గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక ఊరేగింపు, నిమజ్జనాలను సజావుగా పూర్తి చేయడం నగర పోలీసులకు పెద్ద సవాలు. అలాంటిది ఈసారి మంగళవారం ఒకేరోజు.. హుస్సేన్సాగర్తో పాటు పలు కీలక చెరువుల్లో నిమజ్జనాలు, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం జరగనుండటంతో పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఏడాదీ సామూహిక ఊరేగింపు, నిమజ్జనం నేపథ్యంలో ఉత్తరాది సహా వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు నగరానికి వస్తుంటారు. వీరిలో ఆర్ఎస్ఎస్ సహా వివిధ సంస్థలకు చెందిన వారు ఉంటారు. చార్మినార్, ఎంజే మార్కెట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వీరి ప్రసంగాలు ఉంటాయి. దీంతో పోలీసులు ఆయాచోట్ల అదనంగా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పాతబస్తీ నుంచి హుస్సేన్సాగర్ వరకు ప్రధాన రహదారి కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి. దీనికి తోడు ఈసారి సెపె్టంబర్ 17 పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్స్లో జరిగే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. దీనికి ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగుతాయని భావిస్తున్న పోలీసు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ క్యాడర్ పరేడ్ గ్రౌండ్స్కు తరలిరానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పోలీసు అధికారులు..ఆయా కార్యక్రమాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అధికారులు విధుల్లో ఉండనున్నారు. అవసరమైన స్థాయిలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీజీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సివిల్, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో ప్రత్యేక గస్తీ, నిఘా ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం అర్ధరాత్రి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నిమజ్జనం బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తుండగా, గురువారం నగరంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉండటంతో దానికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. -
ప్రగతి నిరోధక శక్తులకు.. పరాజయమే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ ప్రగతి రథచక్రాలు దూసుకుపోతున్నాయని.. దేశంలో ఎక్కడ, ఎవరినోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని.. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని పేర్కొన్నారు. మన సమైక్యతే మనకు బలమని.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలసిన ‘సెప్టెంబర్ 17’ సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తొలుత అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరికం నుంచి పరిణామం పొంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిందని.. ఈ చారిత్రాక సందర్భాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్గా నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం నంబర్ వన్. రూ.3,12,398 తలసరి ఆదాయంతోనూ నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తోంది. సకల జనులకు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. కొత్త వైద్య కళాశాలలతో ఏటా పది వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆగదు హైదరాబాద్లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇళ్లు రాకపోయినా ఆందోళన చెందవద్దు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది. సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 44 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. ఇక అణగారిన దళితజాతి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంకొత్త చరిత్రను సృష్టించింది. బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు, ఈత, తాటిచెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ, ఆర్థికసాయంతో అండగా నిలుస్తున్నాం. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చాం. రాష్ట్రంలో ఐటీ దూకుడు తెలంగాణ ఏర్పడే నాటికి 3,23,390 మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు 9,05,715 మందికి పెరిగారు. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు వృద్ధిచెందాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు నిర్మించుకున్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67 వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నాం. కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నగరానికి మరింత శోభ చేకూర్చాయి.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో నాలుగేళ్లలో 1.25 కోట్ల మాగాణగా.. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. వీటితోపాటు కాళేశ్వరం, పాలమూరు, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి ప్రధాన ఎత్తిపోతల పథకాల ద్వారా 75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలు సాగవుతాయి. మొత్తంగా మరో నాలుగేళ్లలో కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో వ్యవసాయం పండుగగా మారింది. -
చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్ స్టేట్లో రజాకార్ల అరాచకం సాగింది. వీటి నుంచి విముక్తికి సర్దార్ పటేల్ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారు –అమిత్ షా సాక్షి, హైదరాబాద్: సంతుష్టీకరణ రాజకీయాల కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్రే ఉండదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంటే.. భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి కల్పించేందుకు ‘ఆపరేషన్ పోలో’కు నడుం బిగించారన్నారు. రక్తం చుక్క చిందకుండానే.. నిజాం మెడలు వంచి హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్య్రం ఇప్పించారన్నారు. కేఎం మున్షీ నేతృత్వంలో, పటేల్ ఆదేశాలతో ఈ ఆపరేషన్ జరిగిందని చెబుతూ వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. పటేల్ కృషి లేకపోతే భారత్లో హైదరాబాద్ స్టేట్తో సహా వందలాది సంస్థానాల విలీనం ఆలస్యమై ఉండేదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతోపాటు కల్యాణ కర్ణాటక, మరాఠా మహారాష్ట్ర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాజకీయాల కారణంగా విమోచన దినోత్సవా న్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో 75వ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమిత్షా జాతీయజెండాను ఎగురవేశారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర కేంద్ర బలగాల నుంచి పోలీసు వందనాన్ని స్వీకరించారు. రావి, ఎల్లారెడ్డి పేర్ల ప్రస్తావన హైదరాబాద్ స్టేట్ విమోచన కోసం పోరాడి, ఎన్నో త్యాగాలు చేసిన స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కేశవ్రావు కోరట్కర్, రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, కాళోజి నారాయణరావు, మర్రి చెన్నారెడ్డి, పీవీ నర్సింహారావు వంటి వీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నామని అమిత్ షా చెప్పారు. ఈ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వేలాది మంది అసువులు బాసారన్నారు. ఈ ఉద్యమంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేశాయని.. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అమిత్ షా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్ స్టేట్లో రజాకార్ల అరాచకం సాగిందన్నారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకు పరకాలలో 1,500 మంది జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్పులు జరిపారని, ఇందులో పలువురు అమరులవగా.. మరికొందరు గాయపడ్డారని అమిత్ షా గుర్తుచేశారు. ఇదే తరహాలో మహారాష్ట్రలోని పర్భణిలో, కర్ణాటకలోని బీదర్లోనూ సామాన్యులపై కాల్పులు జరిగాయన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు పటేల్ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారని వివరించారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. యువతకు తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదన్నారు. హైదరాబాద్ విమోచన కోసం పోరాడిన అమరులకు శ్రద్ధాంజలి, యువత, విద్యార్థుల్లో దేశభక్తి పెంపు, రాష్ట్రానికి పునరంకితం కావాలనే మూడు ప్రధాన లక్ష్యాల సాధన కోసం ప్రధాని మోదీ చొరవతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని అమిత్ షా చెప్పారు. దీని ఫలితంగానే నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరిందని, జీ20 ద్వారా భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి మరోసారి చాటామన్నారు. జీ 20ని జీ 21గా చేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుందని వివరించారు. చంద్రయాన్–3 విజయవంతంతో ›ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షిస్తోందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందని చెప్పారు. ఆదివారం మోదీ జన్మదినం సందర్భంగా సభావేదికపై నుంచి అమిత్షా శుభాకాంక్షలు తెలిపారు. -
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాటంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం
-
13 నెలల ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్య్రం
-
అమిత్షాతో పీవీ సింధు భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా శనివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్కు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, సీనియర్ నేతలు డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, విజయశాంతి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమిత్షా సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆ ఫీసర్స్ మెస్కు చేరుకుని బస చేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హై దరాబాద్ విమోచన దినోత్సవాల్లో అమిత్షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. పీవీ సింధుకు అభినందన కేంద్ర మంత్రి అమిత్షాను ఒలింపిక్ పతక విజేత, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం రాత్రి తన తండ్రి, వాలీబాల్ మాజీ క్రీడాకారుడు పీవీ రమణ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలతో కలసి ఆమె సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్కు వెళ్లారు. ఈ సందర్భంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచావంటూ సింధును అమిత్షా అభినందించారు. దేశంలో క్రీడల అభివృద్ధి, అందించాల్సిన ప్రోత్సాహం, ఫిట్నెస్గా ఉండటంపై వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ప్రముఖులపై బీజేపీ ఫోకస్లో.. ఇటీవల సినీ, సంగీత, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపే ప్రముఖులను బీజేపీ జాతీయ నేతలు కలసి అభినందించడం తెలిసిందే. గతంలో రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ను, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్లను అమిత్షా కలుసుకున్నారు. తాజాగా పీవీ సింధును కలిశారు. అలాగే సినీనటుడు నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, ఆర్థిక, రాజకీయరంగాల విశ్లేషకుడు కె.నాగేశ్వర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. రాష్ట్ర నేతలతో కీలక భేటీ.. పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమం అనంతరం సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్షా సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం జాతీయ కార్యవర్గ సభ్యులు, కీలక నేతలకు మాత్రమే పిలుపు అందినట్టు పారీ్టవర్గాలు చెప్తున్నాయి. అయితే ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ బీసీలకోసం ఓ ప్రత్యేక పథకాన్ని వర్చువల్గా ప్రారంభిస్తుండటంతో.. దీనికి సంబంధించి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కార్యక్రమం జరగనుంది. జి.కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్ అందులో పాల్గొంటుండటంతో.. అమిత్షాతో భేటీకి హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. ఆఫీసర్స్ మెస్లో భేటీ తర్వాత అమిత్షా ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. నేడు పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. అమిత్షా, కిషన్రెడ్డి, ఇతర నేతలు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. తొలుత అమర సైనికుల స్తూపం వద్ద నివాళులు అరి్పస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పస్తారు. పారామిలిటరీ దళాల కవాతు స్వీకరించి ప్రసంగిస్తారు. కార్యక్రమం ప్రాంగణంలో 21 వేల మంది సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. -
విమోచన కాదు విద్రోహం!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నాయి. కానీ అసలు చరిత్రలో జరిగింది వేరు. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరీ చేస్తూ, దారుణ దోపిడీకి గురౌ తున్న సమయంలో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడింది. క్రమంగా ‘ఆంధ్ర మహాసభ’ కమ్యూనిస్టుల నాయ కత్వంలోకి వచ్చింది. వెట్టి చాకిరీ రద్దు, కౌలు తగ్గింపు, ‘దున్నే వానికే భూమిపై హక్కు’ వంటి డిమాండ్లను ముందుకు తెచ్చి నిజాం పాలనపై ఉద్యమించింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. ‘ఆంధ్ర మహాసభ’ ప్రతి గ్రామానికీ విస్తరించింది. తన భూమి, పంటల రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూపోరాట ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చింది. జనగామ తాలూకా కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్ముఖ్ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగు చేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్ముఖ్లు, జాగీర్దార్లు పట్టణాలకు పారి పోయారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం నిర్బంధం పెంచి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. అయినా పోరాటం ఆగలేదు. పోరా టాన్ని అడ్డుకునే శక్తి నిజాం ప్రభుత్వం కోల్పోయింది. రైతాంగ సాయుధ పోరాటం నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబ ల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతా యని నెహ్రూ ప్రభుత్వం భయపడింది. అందుకే 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడాయి. రెండు రోజు ల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రూ సైన్యా లకు స్వాగతం పలికాడు. దీన్ని గమనిస్తే ముందుగానే సైనిక చర్య గురించి నెహ్రూ ప్రభుత్వానికి, నైజాం నవాబుకూ మధ్య ఒప్పందం జరిగిందనేది వెల్లడవుతుంది. నిజాం నవాబును గద్దె దింప టానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టు చేసి నిర్బంధించాలి కదా! కానీ అలా జరగలేదు. ‘రాజ్య ప్రముఖ్’గా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రూ ప్రభుత్వం 1950లో సెప్టెంబర్ 17న భారత యూనియన్లో విలీనం చేసింది. ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్ప గించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందార్లను, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలిటరీ దాడి అన్నది స్పష్టమవుతున్నది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్ని దింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడింది. కాన్సట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నెహ్రూ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొన సాగింది. పార్టీలో చోటు చేసుకున్న మితవాద, అతివాద ధోరణులు 1951 అక్టోబర్ 31న మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమయ్యాయి. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే! అందువలన ఆ పోరాట వారసులు కమ్యూ నిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కు లేదు. అలాగే సెప్టెంబర్ 17న జరిగినది విమోచన కాదు, ప్రజలకు విద్రోహమని ప్రజలు గొంతు విప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
మునుగోడు కోసమే ‘విమోచన’
తెలంగాణలో సెప్టెంబర్ 17 అన్నది విలీనమా, విమోచనా, విద్రోహమా లేక విద్వేషమా అనే వాదనను పక్కన పెడితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కనీస చారిత్రక అంశాలు కొన్ని ఉన్నాయి. అసఫ్ జాహీ వంశస్థులు మొఘల్ పాలన నుంచి విడిపోయి, నిజాం పాలకులుగా (1724–1948) పేరొందారు. నిజాంలు మత ప్రాతిపదికన ఏలినవారు కాదు, స్వతంత్రులూ కారు. ‘ట్రియటీ ఆఫ్ సబ్సిడియరీ అలయెన్స్’ పేరిట, 1800లో బ్రిటిష్ వారికి అధీనులుగా ఒప్పందం చేసుకొన్న అనేక మంది హిందూ రాజుల వంటివారే. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా హిందూ ఫ్యూడల్స్ నిజాం మంత్రులుగా పనిచేశారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కూడా పోలీసు చర్య జరిగే వరకూ కాంగ్రెస్ టోపీలు పెట్టు కోలేదు! విలీన చర్చల్లోనూ హిందూ సలహాదారులు నిజాం పక్షానే ఉన్నారు. ఆ చర్చల్లో కేంద్రం పక్షాన, నిజాం తరఫున ఇరు వైపులా బ్రిటిషువారే ఉన్నారు. పటేలుకు 1948 మార్చిలో గుండెపోటు రావడం వల్ల ఎక్కువగా మౌంటుబాటెనే కీలక సమావేశాల్లో పాల్గొ న్నారని విలీన వ్యవహారాల కార్యదర్శి, పటేలు కుడిభుజం అయిన వీపీ మీనన్ తన పుస్తకంలో రాశారు. నిజాం పాలన కానీ, విలీన వ్యతిరేకత కానీ, ఆ మాట కొస్తే నిజాం వ్యతిరేక ప్రతిఘటన కానీ ఏవీ మతం ఆధారంగా లేవు. రజాకార్లు కూడా నిజాం పాలన మొదటి నుంచీ లేరు. తర్వాతి దశలో 1938లో ఏర్పడిన ‘వాలంటీర్ల’ సంస్థకు చెందినవారు. ఆ సంస్థ 1947 తర్వాతే కిరాయి ప్రైవేటు సైన్యంలా దౌర్జన్యకర పాత్ర నిర్వహిం చింది. 1915లోనే ఏర్పడిన హిందూ మహాసభ గానీ, 1925లో ఆవిర్భవించిన ఆరెస్సెస్ గానీ నిర్వహించిన నిజాం వ్యతిరేక పాత్ర అక్షరాలా సున్నా. నిజాం నిరంకు శత్వం నుండి తెలంగాణను పటేల్ విముక్తి చేశారనీ, నెహ్రూ ముస్లిం పాలకుడి పట్ల మెతకగా ఉన్నారనీ అసత్య ప్రచారాలు మాత్రం జరిగాయి. నిజాంని 1947 ఆగస్టు తర్వాత కూడా ఏడాదిపాటు కొనసాగించటానికి యథా తథ స్థితి ఒప్పందం చేసుకొన్నది నెహ్రూ, పటేల్లతో కూడిన నాయకత్వమే. ఆ విషయంలో వారి మధ్య విభేదాల్లేవు. పటేలు మరణించిన 1950 చివర్లో, ఆ తర్వాత 1951 చివరి దాకా మిలిటరీ తెలంగాణలో స్వైర విహారం చేసింది. దానివల్ల నాలుగు వేల మంది రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. లక్షమంది జైళ్ల పాలయ్యారు. అలా చూస్తే ఇది రైతాంగ విప్లవం నుంచి ఫ్యూడల్ రాజు నిజాంకు లభించిన విమోచన తప్ప వేరేమీ కాదు. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు... 75 ఏళ్ల చారిత్రక ఘట్టమే. మరి ఉత్సవాలను నిర్వహించాలని ముందే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మొన్నటి జూలైలో బీజేపీ అఖిలభారత సమావేశం హైదరాబాదులో జరిగినప్పుడు, ఆ తర్వాత ఆగస్టు 15న కానీ తీసుకోలేదు. సెప్టెంబరు 3న హడావుడిగా తీసుకున్నారు. ఆనాడు లేనిదీ, నేడున్నదీ మునుగోడు ఎన్నిక! ఇదంతా బీజేపీ దేశభక్తి కాదు, 2023 తెలంగాణ ఎన్నికల్లో ముక్తి కోసమే. దానికి మునుగోడు అసెంబ్లీ ఎన్నిక రిహార్సల్. ప్రజలు గమనించకుండా ఉంటారా! – సీహెచ్.ఎస్.ఎన్. మూర్తి ఎఫ్ఐటీయూ ప్రధాన కార్యదర్శి -
అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం!
‘చరిత్ర వక్రీకరణ మహానేరం’ పేరిట సెప్టెంబర్ 22 నాటి మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసాన్ని చదివిన తరువాత వక్రీకరణ వాస్తవంగా ఎక్కడ, ఎలా మొదలౌతుందో అర్థమైంది. దేశ విభజనానంతరం సంస్థానాల విలీనం విషయంలో ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్లో కలిసేందుకు, లేదా పాకిస్తాన్లో కలిసేందుకు, లేదా స్వతం త్రంగా ఉండేందుకు బ్రిటిషర్లు అధికారాన్ని కల్పించారనేది అబద్ధం. బ్రిటిష్ ప్రభుత్వం వారికి భారత్ లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. స్వతంత్రంగా ఉండేలా మూడో ఆప్షన్ లేదు. అలా ఉన్నట్టయితే దయతో తదనుగుణమైన బ్రిటిష్ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించాలి (ఏ ఆధారమూ చూపని కొన్ని ఇంగ్లీషు పుస్తకాలను కోట్ చేస్తే సరిపోదని సవినయ మనవి). బ్రిటిషర్లు విలీనానికి మతంతో కూడా ముడిపెట్టలేదు. ప్రిన్సిపుల్ ఆఫ్ కంటిగ్యుటీ (సామీప్యతా సూత్రం) అంటే భారత్ సమీపంగా ఉంటే భారత్లో, పాకిస్తాన్ సమీపంలో ఉంటే పాకిస్తాన్లో ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారం హిందూ జనాభా అధికంగా ఉండి, హిందూ రాజు ఉన్న రాజస్థాన్లోని అమర్ కోట్ సంస్థానం పాకిస్తాన్లో చేరింది. కశ్మీర్ తప్ప మిగతా సంస్థానాధీశులు వారు కోరుకున్నా పాకిస్తాన్లో విలీనం కాలేరు. కాబట్టి భారతదేశం లోపల ఉండే హైదరాబాద్ స్వతంత్రంగా ఉండే ఆప్షన్ లేనే లేదన్నది స్పష్టం. మౌంట్ బాటన్ స్వయంగా ఈ విషయాన్ని నిజాంకి, ఆయన ప్రతినిధులైన వాల్టర్ మాంక్టన్, నవాబ్ ఆఫ్ ఛత్తారీలకు పలుసార్లు స్పష్టం చేశాడన్నది చారిత్రక వాస్తవం. నిజాం చేసుకున్న యథాతథస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఒప్పందం) కూడా స్వతంత్రంగా ఉండేందుకు కాదు. విలీనాన్ని ఒక సంవత్సరం జాప్యం చేసేందుకే. పాకిస్తాన్ అన్న ఆలోచనను బ్రిటిషర్ల సహకారంతో 1930వ దశకంలో సృష్టించిన చౌధురీ రహమత్ అలీ భారత్లో మూడు ముస్లిందేశాలు ఉండాలని ప్రతిపాదించాడన్నది మరిచిపోరాదు. మొదటిది పాకిస్తాన్. రెండవది నేటి బంగ్లాదేశ్. దానిని బంగిస్తాన్ అన్నాడు. మూడవది ఉస్మానిస్తాన్. అంటే హైదరాబాద్. ఉస్మానిస్తాన్ ఆలోచన వెనుక దాగున్న మతోన్మాద సూత్రాన్ని మరిచిపోరాదు. పాశ్చాత్య కూటమిలో చేరకూడదన్న భారత నేతల నిబద్ధతాపూర్వకమైన నిర్ణయం వల్లే బ్రిటిషర్లు భారత్ను దిగ్బంధనం చేసేందుకు పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున తూర్పు పాకిస్తాన్ (తరువాత బంగ్లాదేశ్), ఉత్తరాన ముస్లిం జనాధిక్య జమ్మూ కశ్మీర్ సంస్థానం, దక్షిణాన ఉస్మానిస్తాన్ ఏర్పాటయ్యేలా ప్రయత్నించారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్న నిజాం కుట్రలకు ఫ్రాన్స్, అమె రికా, కొలంబియా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి పాశ్చాత్య కూటమి దేశాలు అందుకే సమర్థించాయి. రష్యా, చైనా, యుక్రేన్ వంటి కమ్యూనిస్టు దేశాలు భారత అలీన విధానాన్ని సమర్థించి, ఈ సామ్రాజ్యవాద యత్నానికి పురిట్లో సంధికొట్టాయి. లక్ష్మయ్య సర్వసాధారణ కమ్యూనిస్టులందరిలాగానే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిలను ప్రస్తావించారు. కానీ జటప్రోలు, రెంటచింతల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పాల్వంచ, సంస్థాన్ నారాయణపూర్ వంటి ఉప సంస్థానాల్లో విస్నూరు, మానుకోటల్లో లాగా ఎందుకు తిరుగుబాటు రాలేదో ప్రస్తావించలేదు. ఆదిలా బాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్ వంటి తెలంగాణ జిల్లాల్లో, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న మరాఠ్వాడా ప్రాంతాలైన బీడ్, పర్భనీ, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్లలో, కళ్యాణ కర్ణాటక లోని బీదర్, రాయచూర్, గుల్బర్గాలలో సంస్థానాధీశులు లేరా? కొంత నల్గొండ, కొంత వరంగల్, కాసింత రంగారెడ్డి జిల్లాకి మాత్రమే ప్రధానంగా పరిమితమైన కమ్యూనిస్టుల పోరాటం ఈ మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదు? మల్లె్లపల్లి లక్ష్మయ్య కన్వీనియంట్గా ప్రస్తావించని మరో విషయం ఉంది. ఘనత వహించిన నిజాం ప్రభువు 1943లో కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారు? దాశరథి రంగాచార్య తన ‘జీవన యానం’లో, వందేమాతరం రామచంద్రరావు తన ‘హైదరాబాద్పై పోలీసు చర్య’లో సెప్టెంబర్ 17 తరువాత రజాకార్ల ఆయుధాలన్నీ కమ్యూనిస్టుల చేతికి చేరాయని రాశారు. కమ్యూనిస్టులు దీనిని ఎందుకు ఖండించరు? సెప్టెంబర్ 17, 1948 తరువాత 1951 వరకూ కమ్యూనిస్టులు ఎవరిపై సాయుధ పోరాటం చేశారు? లేని నిజాంపైనా? ఉన్న భారత ప్రభుత్వం పైనా? భారత సేనలు అన్న పదానికి బదులు ‘యూనియన్ సేనలు’ అనే పదాన్ని ఉపయోగించి భారత వ్యతిరేక పోరాటానికి ఎందుకు రంగులద్దుతున్నారు? రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు. ప్రజలు భారత ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నా దానిపై పోరాటం చేయడం సరైనది కాదని చెప్పారు. సుందరయ్య–బసవపున్నయ్య–చండ్ర రాజేశ్వర త్రయం దానిని తోసిపుచ్చారు. ఈ మొత్తం ఉదంతాన్ని చాపకిందకి తోసి, సగం చరిత్ర చెప్పడానికి కారణమేమిటి? హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. 1948–1951 వరకూ భారత్పై కమ్యూనిస్టులు పోరాడి, భారత ప్రభుత్వం పంపిన రాయబారి ద్వారకానాథ్ కాచ్రూను కలవడానికి నిరాకరించి, ఆ తరువాత 1952లో ఎలాంటి గ్యారంటీలూ పొందకుండానే, ఏమీ సాధించకుండానే మూడేళ్ల రక్తసిక్త పోరాటం ఆపి, ఎన్నికల్లో పాల్గొని తగుదునమ్మా అంటూ ఎంపీలు అయ్యారు. మరో అవాస్తవం సుందర్ లాల్ కమిటీ గురించి. దానిని భారత ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నిజాం ప్రభువు కానీ నియమించలేదు. అది నెహ్రూ వ్యక్తిగతంగా పంపిన సుహృద్భావ ప్రతినిధి బృందం. పండిత్ సుందర్ లాల్, కాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్లతో కూడిన ఈ బృందం ముస్లింలను కలిసి, భారత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టబోదని నమ్మకం కలిగించింది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?) వాస్తవానికి హైదరాబాద్ సంస్థాన చరిత్రను మూడు వేర్వేరు ముక్కలుగా చదువుతున్నాం. కర్ణాటకలోని మూడు జిల్లాలు, మరాఠ్వాడాలోని జిల్లాల చరిత్రను తెలంగాణ చరిత్రతో కలిపి చదివితేనే సమగ్రత వస్తుంది. లేని పక్షంలో గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్టు చదవడం జరుగుతుంది. అలా చేసినంత కాలమూ రెండు మూడు జిల్లాల చరిత్రనే మొత్తం 82 వేల చ.కి.మీ. వైశాల్యమున్న, కోటికి పైగా జనాభా ఉన్న, 17 జిల్లాలున్న సువిస్తృత సంస్థాన చరిత్రగా లక్ష్మయ్య గారు భ్రమించినట్టు భ్రమించడం జరుగుతుంది. (క్లిక్ చేయండి: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) - కస్తూరి రాకా సుధాకర రావు సీనియర్ జర్నలిస్ట్ -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్ముఖ్లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
జునాగఢ్ ఉత్సవాలు ఎందుకు నిర్వహించరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తోపాటు గుజరాత్లోని జునాగఢ్కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, మరి బీజేపీ నేతలు అక్కడ ఎందుకు వజ్రోత్సవాలు నిర్వహించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసం సెప్టెంబర్ 17ను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చిల్లర వేషా లు వేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం ఇక్కడి గాంధీభవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ద్దేశించి ఆయన మాట్లాడుతూ గుజరాత్లో ఉత్సవా లు జరిపిన తర్వాతే హైదరాబాద్లో విమో చన ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మతకల్లోలాలు సృష్టించి పెట్టుబడులను గుజరాత్కు తరలించుకు పోవాలనే కుట్రతోనే ఇక్కడ కొత్త వేషాలు కడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అమలు చేసే ప్రణాళికలేంటో వివరించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ మా వాడు... హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ తమ వాడని, ఆయనది కాంగ్రెస్ కుటుంబమని, తమ నుంచి పటేల్ను ఎవరూ విడదీయలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. పటేల్ తన హయాంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చరిత్రను దొంగిలించి తమ చరిత్రగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టే పరిస్థితులు టీఆర్ఎస్ వల్లే ఏర్పడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, టీఆర్ఎస్ల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని సన్మానించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్బాబు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, అంజన్కుమార్ యాదవ్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్రెడ్డి, ప్రేంసాగర్రావు, సిటీ కాంగ్రెస్ నాయకులు విజయారెడ్డి, రోహిణ్రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులుతోపాటు పలువురిని రేవంత్ శాలువాలతో సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. ఆపై ఇందిరా భవన్లో జరిగిన టీపీసీసీ ఎక్స్ సర్వీస్మెన్ సెల్ చైర్మన్ పి.రాజేంద్రన్ పదవీబాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సైనికులకు నెలలో బెనిఫిట్స్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇదీ చూడండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి..
సాక్షి, మిర్యాలగూడ, కోదాడ: నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన దొరల, రజాకార్ల హత్య కేసులో నంద్యాల శ్రీనివాస్రెడ్డి (నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే), దోమల జనార్ధన్ రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరికి ప్రత్యేక ట్రిబ్యునల్ 1949 ఆగస్టు 13, 14న మరణశిక్ష వేసింది. ఉరిశిక్ష పడిన వెంకులు (14), ఎర్రబోతు రాంరెడ్డి(15), నంద్యాల శ్రీనివాసరెడ్డి (20) తోపాటు నల్లా నర్శింహులు (22) నల్లగొండ జైల్లో ఉండగా టైమ్ పత్రికకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వారిని కలిసి మైనర్ అయిన ఎర్రబోతు రామిరెడ్డి ఫొటోతో వ్యాసం రాసింది. అది పెను సంచలనంగా మారింది. లండన్ న్యాయవాది డీఎన్ ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్బాగ్ వంటి న్యాయవాదులు స్థానిక న్యాయవాది మనోహర్లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపేందుకు ప్రయత్నించారు. అంతర్జాతీయంగా ఉరిశిక్ష లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జెకొస్లోవేకియాలో 10 వేల మందితో భారీ నిర్వహించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారింది. 1956లో కొందరు, దీంతో 1958లో మరికొందరు విడుదలయ్యారు. నిజాంపై గర్జించిన కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయడంలో, రజాకార్లను ఎదుర్కోవడంలో కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1944లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్యను రజాకార్లు కాల్చేయడంతో తీవ్రరూపం దాల్చింది. నల్లగొండ జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమంగా విస్తరించింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది నేతలు ఈ సాయుధ పోరుకు ఊతమిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. సోవియట్ యూనియన్ తరహాలో విజయవాడలో ‘కమ్యూన్’ఏర్పాటు చేశారు. వడిసెలు, రాళ్లు, కత్తులు వంటి ఆయుధాల ప్రయోగం, తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. పగలంతా కలిసికట్టుగా శ్రమ చేసి సంపాదించిన సొమ్ముతో ఒకే చోట వండుకుని భోజనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేవారు. ఇక్కడ శిక్షణ పొంది వెళ్లి నల్గొండ జిల్లాలో దళాలు ఏర్పాటు చేశారు. దళాల నేతృత్వంలోనే సాయుధ దాడులు జరిగాయి. ఈ పోరాటాల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రాణత్యాగాలు చేశారు. ‘దారి’ చూపిన ‘మెతుకుసీమ’ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య చేపట్టాలని నిర్ణయించిన రోజులవి. అప్పటి కేంద్రహోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చొరవతో ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఉత్తరాన ఉన్న ఔరంగాబాద్ వైపు నుంచి సైనికచర్య మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా మీదుగానే హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది. అదెలా జరిగిందంటే.. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు లాతూర్(మహారాష్ట్ర) నుంచి జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)కు రైలులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారత సైన్యం బాంబుల మోత మోగించింది. దీంతో రజాకార్లు రైలు దిగి పరుగెత్తారు. ట్రక్కుల్లో పారిపోయారు. కొన్నిట్రక్కులు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతల్లో కూరుకుపోయాయి. అప్పటికే దౌల్తాబాద్, హుమ్నాబాద్, జాల్న ప్రాంతాలు భారతసైన్యం వశమయ్యాయి. 1948 సెప్టెంబర్ 16 భారత సైన్యం జహీరాబాద్ వైపు రోడ్డుమార్గంలో వస్తుండగా రజాకార్లు ఎక్కెల్లి (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) వంతెనను కూల్చేశారు. అయితే భారత సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించుకుని ముందుకు సాగడంతో నిజాంసేన చెల్లాచెదురైంది. ఇలా జహీరాబాద్ను భారత సేనలు వశపరుచుకున్నాయి. 1948 సెప్టెంబర్ 17 భారతసైన్యం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు ప్రాంతంలో రజాకార్లు రోడ్డుకు ఇరువైపులా పేలుడు పదార్థాలు ఉంచారు. అప్రమత్తమైన భారతసైన్యం రూట్ మార్చి బొల్లారం మీదుగా ముందుకు సాగాయి. 1948 సెప్టెంబర్ 18 (సాయంత్రం 4 గంటలు): భారత సైన్యం బొల్లారం చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడైన ఎల్.ఎద్రూస్ తన ఆయుధాలను వీడి భారత సైన్యం మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఎదుట లొంగిపోయారు. దీంతో ప్రజలు జయజయ ధ్వానాలతో భారత సైనికులకు స్వాగతం పలికారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందామని ఆనందోత్సవాలు చేసుకున్నారు. -
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్లూ వేదికలు కావాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయంగా, సరైన పంథాలో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ఆదివాసీ-బంజారా ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆదివాసీ- బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధులాగే.. త్వరలోనే గిరిజన బంధు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. భూమి లేని గిరిజనులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్ ఇంకా మాట్లాడుతూ.. ‘సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లే వర్తించాయి. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కిందట కేంద్రానికి పంపాం. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నా. విభజన రాజకీయం మొదలు పెట్టిన హోంమంత్రిని అడుగుతున్నా. గిరిజన రిజర్వేషన్లను మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారు. మోదీ పుట్టిన రోజున చేతులు జోడించి అడుగుతున్నా. రిజర్వేషన్లను రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడండి రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోంది. మా న్యాయమైన హక్కునే మేం అడుగుతున్నాం. పోడు రైతలకు ఇచ్చేందుకు భూములు గుర్తించాం. పోడు భూములు రైతులకు ఇచ్చి రైతు బంధు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నా. గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను కల్లోలానికి గురికానివొద్దు. మోదీ మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. చదవండి: అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్.. -
ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఏ మాత్రం గౌరవించడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17 వేడుకలపై కేంద్రం రాష్ట్ర అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. తమకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించారని దుయ్యబట్టారు. ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకai నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. చదవండి: కిషన్రెడ్డి ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్ -
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
hyderabad: రెండు చోట్ల విమోచన వేడుకలు.. ఈ రూట్లలో జర్నీ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం మధ్య మండల పరిధిలో రెండు కీలక, భారీ కార్యక్రమాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ►శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ సభ జరుగనున్నాయి. దీనికి రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుంచి 2300 ప్రత్యేక బస్సు ల్లో లక్ష మంది హాజరుకానున్నారని అంచనా. ►ఇది ప్రారంభంకావడానికి ముందు పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వరకు ఐదు వేల మంది కళాకారులు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు నగర నడిబొడ్డున ఉన్నాయి. వీటి ప్రభావం ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ మూడు కి.మీ. పరిధిలోని ప్రాంతాల్లోని ట్రాఫిక్పై ఉండనుంది. ►ఈ కార్యక్రమాల నేపథ్యంలో సాధారణ ప్రజలకు, వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా మధ్య మండలంలోని 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు వి«ధించారు. ఆయా సమయాల్లో నెక్లెస్ రోడ్ను పూర్తిగా మూసి ఉంచుతారు. ►ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆçహూతులు అక్కడ నుంచి కాలినడకన రావాల్సి ఉండటంతో ప్రతి పార్కింగ్ ప్రాంతం నుంచి వేదికలు గరిష్టంగా 1.5 కి.మీ. మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ►సాధారణ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులకూ ఈ మళ్లింపులు వర్తిస్తాయి. శనివారం సివిల్ సర్వీసెస్కు సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మెయిన్స్ పరీక్ష ఉంది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో జరిగే పరీక్షకు అభ్యర్థులు వీలైనంత త్వరగా బయలుదేరాలి. ట్రాఫిక్ మళ్లింపులు ఉండే ప్రాంతాల్లో: ►కవాడీగూడ, అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, వీఎస్టీ, దోమలగూడ, లిబర్టీ, ట్యాంక్బండ్, ఐమ్యాక్స్. అస్సలు ప్రయాణించకూడని చౌరస్తాలు: అంబేడ్కర్ స్టాట్యూ, కవాడీగూడ, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్బండ్, లోయర్ ట్యాంక్బండ్, లిబర్టీ, నెక్లెస్రోడ్, అశోక్నగర్, ఇందిరాపార్క్ వీలుంటే జంక్షన్ల మీదుగానూ వద్దు: రవీంద్రభారతి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, నారాయణగూడ, బషీర్బాగ్, రాణిగంజ్, ఖైరతాబాద్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, ఎల్బీ స్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్నగర్, హైదర్గూడ, పబ్లిక్గార్డెన్స్, నిజాం కాలేజీ. -
జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న సర్దార్ పటేల్.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. లొంగిపోవాలా.. ఎదిరించాలా? భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్గా ఉన్న మున్షీ హైదరాబాద్కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు. హైదరాబాద్ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. కీసర సరిహద్దులో భీకర దాడితో.. నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్ను కోరాడు. పాకిస్తాన్ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు ఆస్ట్రియా వ్యాపారి కాటన్ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్ ఎయిర్పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్లో ఆయుధాలను అన్లోడ్ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్ బదులు వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్గా!) -
Kandimalla Pratap Reddy: ‘కొరియర్’గా.. వారియర్గా!
హిమాయత్నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం. ‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి. అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని. తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు.. మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను. -
కిషన్రెడ్డి ప్రసంగానికి కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి ప్రజలను ఐక్యం చేసేందుకు.. తెలంగాణను భారత్లో కలిపేందుకు వచ్చారు. ఇవాళ ఒక కేంద్ర మంత్రి (అమిత్ షాను ఉద్దేశించి..) వచ్చి ప్రజలను విభజించేలా వ్యవహరించారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలి కానీ.. విభజన రాజకీయాలు ఉండకూదు అంటూ కేటీఆర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. 74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of Telangana into Indian union Today A Union Home Minister has come to DIVIDE & BULLY The People of Telangana & their state Govt That's why I say, India needs DECISIVE POLICIES Not DIVISIVE POLITICS — KTR (@KTRTRS) September 17, 2022 ఇదిలా ఉంటే.. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న కిషన్రెడ్డి.. అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణను మలినం చేసే కుట్ర జరుగుతోంది -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్ముఖ్లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
1948 .. హైదరాబాద్పై ఆపరేషన్ పోలో (ఫొటోలు)
-
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం) -
వారి త్యాగాలను మర్చిపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లే: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనేకానేక ప్రణామాలు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం రాజ్యంలో అరాచకాలు కొనసాగాయి. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేది. సర్దార్ పోలీస్ యాక్షన్ ద్వారానే తెలంగాణ విమోచనం అయింది. 108 గంటలపాటు పోలీసు చర్యలో ఎంతో మంది అమరులయ్యారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరువలేము. ఇంకా కొంతమంది మనుషుల్లో రజాకార్ల భయం ఉంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటకు రావాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనేది ప్రజల ఆకాంక్ష. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం జరుపలేదు. కొందరు ఇతర పేర్లతో ఉత్సవాలు జరుపుతున్నారు. తెలంగాణ విమోచన పేరుతోనే ఉత్సవాలు జరపాలి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ప్రధాని నిర్ణయం తర్వాతే ఇప్పుడు అందరూ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నారు. ఎవరి త్యాగాల వల్ల మీరు నేడు అధికారంలో ఉన్నారో.. వారికి శ్రద్ధాంజలి కూడా వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని.. సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. -
అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు. అప్పుడు.. హైదరాబాద్లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వా త మళ్లీ అమిత్ షా వచ్చి త్రివర్ణ పతాకం ఎగరేశారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని అభివర్ణించారు కిషన్ రెడ్డి. పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు.. బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం అని కిషన్రెడ్డి ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోందని మండిపడ్డారు. అసలు ఇన్నిరోజులు ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ సర్కార్ను ప్రశ్నించారాయన. సెప్టెంబర్ 17 సందర్భంగా.. కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. జాతీయ జెండా ఎగరేసి, అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఇదీ చదవండి: విలీన విషయంలో వివాదాలు వద్దు-వెంకయ్యనాయుడు -
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా, పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అలాగే, పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర పారామిలటరీ బలగాలు(12 బృందాలతో) పరేడ్ నిర్వహించాయి. ఈ సందర్బంగా అమిత్ షా కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. విమోచన దినోత్సవ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. Union Home Minister #AmitShah hoisted #NationalFlag at Parade ground in #Secunderabad during the celebrations of #BJP Central govt's #HyderabadLiberationDay Vs#TelanganaJateeyaSamaikyataVajrotsavalu#TelanganaNationalIntegrationDay of #TRS govt. #Hyderabad #TelanganaPolitics pic.twitter.com/AxFJ5Big0B — Surya Reddy (@jsuryareddy) September 17, 2022 -
September 17: ‘విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్కు విచ్చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్పార్క్ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బస్సల్, తరుణ్చుగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
Telangana: విలీనం.. విమోచనం.. సమైక్యత!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈసారి మాత్రం పోటాపోటీ కార్యక్రమాలకు దిగాయి. నిజాం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేసింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. నిజాం అరాచకాల నుంచి సర్దార్ వల్లభాయ్పటేల్ విమోచనం కలిగించారని బీజేపీ పేర్కొంటోంది. విలీనం, విమోచనం కాకుండా టీఆర్ఎస్ దీన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది. ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవంగా పరిగణించాలని కోరింది. వామపక్షాలు దీన్ని విలీనంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణలో ఆయా పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు కూడా విమోచనం పొందినందున ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఉదయం పబ్లిక్గార్డెన్స్లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం నెక్లెస్రోడ్డు నుంచి ఎన్టీఆర్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు. వామ పక్ష పార్టీలు ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
వంతెనను పేల్చేయించాడు
1948 సెప్టెంబర్ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ ప్లాన్. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్–విజయవాడ రహదారిపై సూర్యాపేటకు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవాణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు. సైనికాధికారి ఎడ్రూస్ ప్లాన్.. అయితే 1948 సెప్టెంబర్లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«దిపతి జనరల్ ఎడ్రూస్ వెంటనే కార్యరంగంలోకి దిగాడు. నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమయం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్కు చేరకుండా అడ్డుకోవాలనుకున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహారాష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు. ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రాప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగలమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సెప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చేశారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళాలు అనుకున్న సమయానికే హైదరాబాద్కు చేరుకోగలిగాయి. మళ్లీ నిర్మాణం.. సైనిక చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్ప్రముఖ్గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన.. నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది. -
నలువైపులా ముట్టడి.. హైదరాబాద్పై ఐదు రోజుల ‘ఆపరేషన్’
సాక్షి, హైదరాబాద్: స్ట్రైక్.. స్మాష్.. కిల్.. వీర్.. ఇవి కేవలం నాలుగు పదాలు కాదు.. భారత సైన్యాన్ని హైదరాబాద్ సంస్థానంపైకి నడిపించిన నాలుగు సైనిక దళాల పేర్లు అవి.. సంస్థానాన్ని నలువైపుల నుంచీ ముట్టడించి నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళాలు అవి.. నాటి భారత సైన్యం దక్షిణ మండల ప్రధానాధికారి గొడాల్ట్ వ్యూహ రచన మేరకు ‘ఆపరేషన్ పోలో’పేరిట జరిగిన సైనిక చర్యలో.. హైదరాబాద్ సంస్థానంపై నలుదిక్కుల నుంచీ దాడులు జరిగాయి. నల్దుర్గ్ నుంచి నార్కట్పల్లి.. ఔరంగాబాద్ నుంచి హోమ్నాబాద్ వరకు జరిగిన ఈ దాడుల వివరాలన్నీ భారత సైన్యానికి చెందిన అధికార పత్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ పోలో గురించి ఒక్కొక్కరు ఒక్కో కథనం వినిపిస్తుండగా.. కొందరు చరిత్రకారులు భారత సైన్యం అధికారిక పత్రాల్లో పేర్కొన్న అంశాలను వివరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న మొదలు.. మద్రాసు, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని 1948 సెపె్టంబర్ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెపె్టంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. తొలుత సైనిక చర్యకు ‘ఆపరేషన్ కాటర్ పిల్లర్’అనే పేరు పెట్టినా.. తర్వాత ‘ఆపరేషన్ పోలో’పేరుతో కొనసాగించారు. నాలుగు వైపుల నుంచీ.. హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం దాడి నలువైపులా ఒకేసారి ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. షోలాపూర్–హైదరాబాద్ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్ జనరల్ జయంత్నాథ్ చౌదరి నాయకత్వంలోని దళం.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచాయి. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతోపాటు నిజాం సైన్యం, రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. ఈ నాలుగు దళాలకు స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్ ఫోర్స్లుగా నామకరణం చేశారు. 9వ డొగ్రా బెటాలియన్, 1వ ఆర్మర్డ్ బ్రిగేడ్, 7వ, 9వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఐదు రోజుల పాటు సాగి.. సైన్యం ప్రకటన మేరకు 1948 సెపె్టంబర్ 13న ఉదయం ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ ఐదు రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిందో సైనిక పత్రాల్లో రాసి ఉంది. నల్దుర్గ్ కోట పతనం, బోరీ నది మీద వంతెన కూలగొట్టడం వంటి విధ్వంసాలనూ పత్రాల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటను జల్లెడ పట్టాం, సూర్యాపేట పతనమైంది, నార్కట్పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాం, కాప్చరింగ్ జాల్నా, ఔరాంగాబాద్, హోమ్నాబాద్ అంటూ.. యుద్ధంలో ప్రాంతాలను, స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరహాలో భాషనే ఇందులో ఉపయోగించారు. నాటి పత్రికల్లో కూడా.. అధికారిక సైన్య పత్రాలతోపాటు నాటి పత్రికలు కూడా అప్పట్లో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, ఎండ్ ఆఫ్ అసఫ్జాహీ రూల్, హైదరాబాద్ పతనం, విలీనం, ఆక్రమణ అనే పదాలు తప్ప సమకాలీనంగా ఇతర మాటలు అప్పట్లో వాడలేదు. నాటి సమకాలీన పత్రికలన్నీ ఈ దాడిని ‘ఇండియా ఇన్వేడ్స్’ అని రాశాయి. స్వయంగా భారత ప్రభుత్వం దీనిని సైనిక చర్యగానే పేర్కొంది. రూ.3.5 కోట్ల ఖర్చుతో.. ‘ఆపరేషన్ పోలో’దాడికి రూ.3.5 కోట్లు ఖర్చయిందని సైనిక పత్రాల్లో పేర్కొన్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తం 66 మంది ఇండియన్ యూనియన్ సైనికులు చనిపోగా, 97 మంది గాయపడ్డారని, 490 మంది నిజాం సైన్యం చనిపోగా, 122 మంది గాయపడ్డారని వివరిస్తున్నారు. సైనిక చర్యలో జరిగిన నష్టాలపైనా అప్పటి పత్రికలు కథనాలు రాశాయి. హైదరాబాద్పై విజయం సాధించడంపై నాటి సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ రాజేంద్ర సింహ్జీకి బంగారు ఖడ్గంతోపాటు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాలని తూర్పు పంజాబ్ విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు తీర్మానించారు. వారు దక్షిణ భారత మిలటరీ శాఖను అభినందించారని నాటి పత్రికల్లో రాశారు. ఇదీ చదవండి: Operation Polo: నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్ -
విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ.. కొంగు నడుముకు చుట్టి..
చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. ఈ చరిత్రలో ఓభాగం జనగామ జిల్లా పాలకుర్తి మండంలోని విస్నూర్ గడి.శత్రు దుర్భేద్యమైన ఈ విస్నూర్ గడిలో నుంచే చుట్టూ 60 గ్రామాలకు విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన దేశ్ముఖ్ రాపాక వెంకటరాంచంద్రారెడ్డి పాలన సాగించాడు. ఆయన, ఆయన కుమారుడు బాబుదొర అనేక అరాచకాలు సృష్టించారు. వీరి పాలనపై కడివెండినుంచే తొలి తిరుగుబాటు మొదలైంది. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే. ఈయనతో పాటు పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్రెడ్డి, నల్లా నర్సింహులు పల్లెపల్లెనా సంఘాలు ఏర్పాటు చేశాయి. దేశ్ముఖ్ రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసిపెంచుకుంది. దొరసాని ఆదేశంతో వారి అనుచరులు 1946 జులై 4న కాల్పులు జరపడంతో, దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్ గాయమైంది. రజాకార్లకు, విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓరకంగా ఉద్యమానికి ఊపిరులూదింది అని చెప్పవచ్చు. విస్నూర్ గడి దొర రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైద్రాబాద్ పారిపోతుండగా, జనగామ రైల్వేస్టేషన్లో కాల్చిచంపారు. ప్రజల ప్రతిఘటన 400గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. రజాకార్ల దాడులు, అరాచకాలు మరింతగా పెరిగాయి. తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది. దేశ్ముఖ్లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. చివరకు నైజాం సర్కార్ 1948 సెప్టెంబర్ 17న కేంద్రంలో విలీనమైంది -
నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్
ఒక అంచనా ప్రకారం నిజాం వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటికి 30 వేల మంది సైనికులున్నారు. వీరితో పాటు మూడు ఆర్మర్ రెజిమెంట్లు, అశ్విక దళం, 11 ఇన్ఫాన్ట్రీ బెటాలియన్లు, ఒక ఆర్టిలరీకి తోడుగా ఇంకా పది వరకు సైనిక రెజిమెంట్లు ఉన్నాయి. వీరికి తోడుగా దాదాపు 2 లక్షల మంది రజాకార్లున్నారు. వీరిలో 50వేల మంది దగ్గర తుపాకులు, తల్వార్ల లాంటి ఆయుధాలున్నాయి. దీనికి తోడుగా విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అప్పటికే నిజాం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఆపరేషన్ పోలోకు నెలరోజుల ముందు భారతసైన్యం తమపై దాడిచేస్తే ఎంతకాలం ప్రతిఘటించగలమని నిజాం తన సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ను ప్రశ్నించాడు. ఒక్కరోజు కూడా కష్టమే అని ఇద్రూస్ సమాధానం చెప్పాడు. దీంతో సైన్యానికి తోడుగా రజాకార్ల సంఖ్యను పెంచాలని నిజాం ఆదేశాలు జారీచేశాడు. అయితే నిజాం సైన్యం భారత సైన్యం ముందు ఏమాత్రం నిలుస్తుందన్నదానిపై శతకోటి అనుమానాలు. సెప్టెంబర్ 13 తెల్లవారుజామున భారత్ సైన్యం ఐదు వైపుల నుంచీ హైదరాబాద్ సంస్థానంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది. మరో మార్గంలో అటు షోలాపూర్ నుంచి జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత బలగాలు హైదరాబాద్ వైపు దూసుకు వచ్చాయి. భారత సైన్యంలో స్ట్రైక్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్ పేరుతో నాలుగు రకాల బలగాలున్నాయి. ముందుగా భారత్ యుద్ధ విమానాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్, వరంగల్తో పాటు ఇతర విమానాశ్రయాలపై బాంబులు కురిపించింది. దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ముందుగా యుద్ధ ట్యాంకులతో నిజాం సైనిక పోస్టులపై దాడులు చేసిన భారత బలగాలు ఆ తరువాత వేగంగా నిజాం సంస్థానంలోకి చొచ్చుకు వచ్చాయి. చదవండి: (హైదరాబాద్పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?) ఇక భారత తొలి బుల్లెట్ ఉస్మానాబాద్ జైలు బయట ఉన్న నిజాం సెంట్రీకి తగిలింది దీంతో అతను అక్కడే కుప్ప కూలాడు. ఇదే సమయంలో భారత సైన్యం దాడి గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కోలేక తోక ముడిచింది. అయితే భారత సైన్యం ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా.. నిజాం మాత్రం తప్పుడు వార్తలు ప్రసారం చేయించాడు. నిజాం సైన్యం గెలుస్తుందంటూ వదంతులు వ్యాపింపజేశాడు. చివరికి సెప్టెంబర్-17న జెఎన్ చౌదరి ఆధ్వర్యంలోని భారత బలగాలు హైదరాబాద్ శివారులోని పటాన్చెరువు చేరుకున్నారు. దీంతో నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భారత సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించిందనే వార్త తెలియగానే నిజాం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇక నిజాం ఎవరిని నమ్మే స్థితిలో కనిపించలేదు. వెంటనే భారత రాయబారి మున్షిని పిలిపించి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు. దీంతో నిజాం లొంగుబాటు విషయాన్ని హోంమంత్రి పటేల్కు మున్షి తెలిపారు. నిజాం లొంగుబాటు ప్రక్రియలో పటేల్ చాలా తెలివిగా వ్యవహరించారు. ముఖ్యంగా సెప్టెంబర్-18వ తేదీన ఐక్యరాజ్యసమితిలో నిజాం భారత్కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. ఈ విచారణ జరగడానికి ముందుగానే నిజాం లొంగిపోయాడనే విషయాన్ని అంతార్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేది పటేల్ ఆలోచన. అందుకే హైదరాబాద్లో భారత రాయబారి మున్షి సహాయంతో నిజాం ద్వారా దక్కన్ రేడియోలో లొంగుబాటు ప్రకటన చేయించారు పటేల్. ఈ ప్రకటనలో నిజాం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చదవండి: (తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) నిజాం లొంగుబాటు ప్రకటనతో ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ సంస్థానం వేసిన పిటిషన్కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజాం తన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని దక్కన్ రేడియోలో చేసిన ప్రకటన బీబీసీ రేడియోలోనూ ప్రసారం అయింది. ఆ తరువాత ఈ పిటిషన్పై విచారణను పెండింగ్లో పెట్టారు. 1979వరకు ఈ పిటిషన్ ఐక్యరాజ్యసమితి వద్ద పెండింగ్లోనే ఉంది. ఆ తరువాత ఈ పిటిషన్ను కొట్టివేశారు. ఇక లొంగిపోయిన నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ను భారత సైన్యాలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించాయి. ఇక ఖాసీం రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాతి కాలంలో రిజ్వీ పాకిస్థాన్కు వెళ్లిపోయాడు. ఇక భారత సైన్యాలకు లొంగిపోయిన నిజాం తనకు రజాకార్లకు సంబంధం లేదని ప్రకటించాడు. లొంగిపోయిన నిజాంను ఏంచేయాలనే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది. ప్రస్తుతానికి నిజాం రాజు పేరు పైనే పరిపాలన సాగించాలని.. పౌరప్రభుత్వాన్ని భారత సైన్యం ఏర్పాటు చేస్తుందని పటేల్ నిర్ణయించారు. జనరల్ జెఎన్ చౌదరిని సైనిక గవర్నర్గా నియమించి పాలనను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ పోలో పూర్తయిన సెప్టెంబర్-17 నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా త్రివర్ణ పతాకం సగర్వంగా తెలంగాణా గడ్డపై రెపరెపలాండింది. తరువాతి కాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్ప్రముఖ్గా నిజాంను నియమించింది. ఆయన చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగాడు. -
హైదరాబాద్పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?
హైదరాబాద్లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు. హైదరాబాద్లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్గా మార్చారు. ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు. సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటు హైదరాబాద్పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది. -
తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా? నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది? సాయుధ పోరాటం ఏమేరకు నిజాంను గద్దె దించగలిగింది? హైదరాబాద్పై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి? నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ-పటేల్ పాత్ర ఏంటి? అసలు సెప్టెంబర్-17న ఏంజరిగింది? సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామం. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షర లిఖితం. సెప్టెంబర్ -17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా లేక తెలంగాణా ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం లభించిందా అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలనే తెరమీదికి తీసుకువస్తారు. 1948 సెప్టెంబర్-17న పోలీసు చర్యతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో తెలంగాణా ప్రాంతం భారతదేశంలో విలీనమైనపోయినట్లేనని చాలా మంది వాదన. అందుకే సెప్టెంబర్-17ను విలీన దినోత్సవంగా జరపాలంటారు. అయితే సెప్టెంబర్-17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా నిజాం పాలనలోనే ఉంది. అయితే పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం దుష్టపాలన నుంచి ఖాసీం రజ్వీలాంటి రజాకార్ నాయకుల నుంచి తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు. అందుకే సెప్టెంబర్-17ను విమోచన దినంగా పరిగణించాలని మరికొందరివాదన. సెప్టెంబర్-17న తెలంగాణా విలీనం జరిగిందా లేక విమోచన జరిగిందా అనే చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే 1948 సెప్టెంబర్-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా చరిత్ర గతిని మార్చేసింది. తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ఇంతటి కీలక పరిణామాలకు కేంద్రబిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచింది. అయితే ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే కనిపించాయి. -
నిజాం పునాదులు కదిలించిన ఓరుగల్లు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. రజాకార్లు, దేశ్ముఖ్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఊర్లకు ఊర్లు మర్లబడ్డయి. గ్రామస్తులు బరిసెలు, తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటానికి దిగారు. వీరిని చంపేందుకు రజాకార్లు చేయని ప్రయత్నం లేదు. నిజాం సైన్యం ఊర్లపై పడి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. గ్రామాల్లో మూకుమ్మడి హత్యలు చేశారు. అయినా వెరవలేదు. భయపడలేదు. ఎదురొడ్డి నిలిచి పోరాడారు. సింహంలా దూకిన మొగిలయ్య హన్మకొండ కల్చరల్/వరంగల్ అర్బన్: 1944లో వరంగల్లో సర్వోదయ సంఘం స్థాపించారు. ప్రతివారం వరంగల్ కోటలో, స్తంభంపల్లిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, ఏ.సుదర్శన్, బి. రంగనాయకులు, వి.గోవిందరావు, భూపతి కృష్ణమూర్తి, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్యల ఆధ్వర్యంలో 1944 నుంచి జెండా వందనాలు జరుగుతూ వచ్చాయి. బత్తిని రామస్వామి ఇంటిముందున్న ఆవరణలో 1946, ఆగస్టు 11న జెండావందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న రజాకార్ల గుంపు ఖాసీం షరీఫ్ ఆధ్వర్యంలో వారిపై దాడి జరిపారు. బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. వెంకటయ్య చేయి నరికివేశారు. కూచం మల్లేషం తుపాకీ గుండుతో గాయపడ్డాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటికే కల్లుగీసేందుకు వనానికి వెళ్లిన మొగిలయ్యకు తన సోదరుడు గాయపడిన సంగతి తెలిసింది. వెంటనే సింహంలా వచ్చి వారిపై కలబడ్డాడు. మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టాడని భావించిన రజాకార్లు బరిసెతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖాసీం షరీఫ్, తన అనుచరులు ఖిలా వరంగల్ నుంచి వరంగల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలకు మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ భయం కలిగించేలా ఊరేగింపు చేశారు. మొగిలయ్య స్మారక చిహ్నంగా ఎల్లమ్మ బజారులో ఒక భవనాన్ని నిర్మించారు. అది ఇప్పటికి మొగిలయ్య హాలుగా ప్రసిద్ధి చెందింది. సగర్వంగా జీవిస్తున్నా.. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ, కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులైన మా నాన్న గురించి పదే పదే చెప్పేవారు. రజాకార్లకు ఎదుదొడ్డి నిలిచి వీరమరణం పొందాడని చెబుతుండడం గర్వంగా ఉంటుంది. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ.. బత్తిని మొగిలయ్య గౌడ్ ట్రస్టునుంచి ఎలాంటి గుర్తింపు, ఆర్థికసాయం లేదు. – బత్తిని బాబు గౌడ్, మొగిలయ్య కుమారుడు ఒంటిచేత్తో... జాఫర్గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఒంటిచేత్తో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. తుపాకీ చేతపట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత ఆమె. గాయపడ్డ సహచర ఉద్యమకారులకు వైద్యం అందిస్తూ తనలోని గొప్పదనాన్ని చాటుకున్నారు. నెల్లుట్ల మోహన్రావుకు సహాయకురాలిగా పనిచేస్తూ.. ఆయననే వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మోహన్రావు కమ్యూనిస్టు పార్టీ నుంచి స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోహన్రావు మృతిచెందగా.. వృద్ధాప్యంలో ఉన్న సుశీలాదేవి మాత్రం ప్రస్తుతం వరంగల్లోని శాంతినగర్లో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమరయోధుల పింఛన్ రానప్పటికీ, భర్తకు వచ్చే పింఛన్తో బతుకు బండి లాగిస్తున్నారు. (క్లిక్ చేయండి: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్) గత చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్’ జనగామ: నిజాం నిరంకుశ పాలనపై మొదలైన తిరుగుబాటు.. దొరల పాలనకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబుదొర అరాచకాలు ప్రజలను గోసపెట్టాయి. తనకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను హతమార్చాడు. 1947లో నలుగురు విప్లవకారులకాళ్లు, చేతులు కట్టేసి గూండాల సహాయంతో సవారు కచ్చరంలో లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. తెల్లవారుజామున ఊరి శివారున ఉన్న ఈత చెట్ల వనం సమీపంలో నలుగురిని సజీవ దహనం చేస్తున్న క్రమంలో.. ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అదే మండలం కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు సుమారు పదివేల మందికిపైగా బాబుదొర జనగామ పోలీస్స్టేషన్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. దీంతో అతను పోలీస్ శరణుకోరి తలదాచుకున్నాడు. తమ విముక్తి కోసం పోరాడుతున్న ముగ్గురు విప్లవకారులను చంపేశారనే ఆవేశంలో పోలీస్స్టేషన్ను సైతం బద్దలు కొట్టేందుకు యత్నించారు. దీంతో బాబుదొర గన్తో బెదిరిస్తూ.. రైల్వేస్టేషన్కు సమీపంలోని పాత ఆంధ్రాబ్యాంకు ఏరియాలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న విప్లవయోధుడు గబ్బెట తిరుమల్రెడ్డి నాయకత్వంలో జాటోతు దర్గ్యానాయక్ (ప్రస్తుతం బతికే ఉన్నారు). మరికొందరు విప్లవకారులు జనగామ రైల్వే వ్యాగన్ ఏరియాలో కాపుకాస్తూ.. దొర రాకకోసం ఎదురుచూశారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలుకింద నుంచి దొర దాటుకుంటూ వ్యాగన్ పాయింగ్ రావిచెట్టు కిందకు రాగానే దర్గ్యానాయక్ ఆయన మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. దీంతో ప్రజల జయజయధ్వానాల మధ్య సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. చరిత్రకెక్కని సంకీస పోరు; 21 మందిని సజీవ దహనం చేసిన రజాకార్లు డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రజాకార్ల ఆగడాలకు 21 మంది గ్రామస్తులు బలి కాగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. కానీ.. ఆ పోరాటం చరిత్రకెక్కలేదు. మానుకోట, ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య, ఉయ్యాలవాడకు చెందిన ఏలూరి వీరయ్య, నున్నా పుల్లయ్య వేర్వేరుగా దళాలను ఏర్పాటు చేసి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు. సంకీసకు చెందిన తుమ్మ శేషయ్య దళాలకు ముందుండి నడిపిస్తుండడంతో ఆయన్ను మట్టుబెట్టాలని రజాకార్లు పలుమార్లు ప్రయత్నించారు. శేషయ్యను పట్టుకునేందుకు ప్రయత్నించి మూడుసార్లు గ్రామాన్ని తగులబెట్టారు. నాలుగోసారి 1948, సెప్టెంబర్ 1న రజాకార్లు గ్రామంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు. శేషయ్య ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరినీ బందెలదొడ్డి వద్దకు చేర్చారు. 15 ఏళ్లలోపు వారిని బయటకు పంపి.. మిగతా వారిని చిత్రహింసలకు గురిచేశారు. శేషయ్య జాడ చెప్పకపోవడంతో గ్రామస్తులపై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొందరు చనిపోగా.. కొన ఊపిరితో మరికొందరు కొట్టుకుంటుండగా వరిగడ్డి వారిపై వేసి కాల్చారు. వరి గడ్డి కోసం గడ్డివాము వద్దకు వెళ్లిన రజాకార్లకు గడ్డివాములో దాక్కున్న అన్నాతమ్ములు తేరాల గురవయ్య, రామయ్య, లాలయ్య కనిపించారు. వారు ఎంత బతిమిలాడినా వినకుండా తుపాకులతో కాల్చి చంపి అందరినీ ఒకచోటకు చేర్చి గడ్డితో తగులబెట్టారు. కాల్పుల్లో 16 మంది చనిపోగా.. తరువాత గాయాలతో ఐదుగురు ప్రాణాలు వదిలారు. రజాకార్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తరువాత సగం కాలిన మృతదేహాలకు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దే సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. నాటి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారిలో కొద్దిమంది మాత్రమే గ్రామంలో ఉన్నారు. నెత్తురోడిన తమ్మడపల్లి(జి); ఒకేరోజు 12 మంది వీరమరణం జనగామ/జఫర్గఢ్/స్టేషన్ఘన్పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(జి) ఊరి త్యాగం చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించదు. గ్రామానికి చెందిన 12 మందిని నిజాం సైన్యం కాల్చి చంపేసింది. నిజాం ఏజెంటుగా వ్యవహరించే ఖాదరెల్లి జాఫర్గఢ్ కేంద్రంగా తన అరాచకాలను కొనసాగించాడు. భరించలేని రైతులు ప్రజా రక్షక దళాలుగా ఏర్పడి కర్రలు, వడిశాలలు, బరిసెలు, కత్తులు, కారంపొడితో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టు ప్రతినిధులు నల్ల నర్సింహులు, కృష్ణమూర్తి, యాదగిరిరావు, నెల్లుట్ల మోహన్రావు వీరికి అండగా నిలిచారు. 1947, సెప్టెంబర్ 11న జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానం స్ఫూర్తితో తమ్మడపల్లి(జి), సురారం, షాపల్లి, తిమ్మాపూర్తోపాటు అనేక గ్రామాల ప్రజలు ఖాదరెల్లి ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. విషయం తెలుసుకున్న రజాకార్లు తమ బలగాలతో తమ్మడపల్లి (జి) గ్రామాన్ని చుట్టుముట్టి 20 మందిని బంధించి, గ్రామ శివారులో వరుసగా నిలబెట్టి వారిపై బుల్లెట్ల వర్షం కురించారు. ఈ ఘటనలో చాడ అనంతరెడ్డి, బత్తిని బక్క రాజయ్య, దొంతూరి చిన్న రాజయ్య, ఎరుకల ఇద్దయ్య, గుండెమల్ల పోశాలు, చెదలు నర్సయ్య, ఎండీ.ఖాసీం, గుజ్జరి రామయ్య, దిడ్డి పెరుమయ్య, కోమటి నర్సింహరామయ్య, కుంట పెద్దపురం, మంగలి వెంకటమల్లు, గుండెటి గుండారెడ్డి అసువులు బాయగా.. మరో 8 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) -
Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ ఘటనతో స్పీడ్ పెంచిన సర్దార్
భారత్లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. గంగాపూర్ రైల్వేస్టేషన్లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్ వెంటనే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్.. హైదరాబాద్పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది. -
Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్–ఉల్లా–ఖాన్ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. పోచారం: ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలని షోయబ్ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్ తన సొంత పత్రిక ఇమ్రోజ్లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్ను హత్య చేయించాడు. కుటుంబ నేపథ్యం.. ఉత్తరప్రదేశ్కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్లో 1920 అక్టోబర్ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించారు. తేజ్, రయ్యత్ పత్రికల్లో జర్నలిస్టుగా.. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తేజ్ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్ పత్రికను సర్కార్ నిషేధించడంతో రయ్యత్ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. బూర్గుల సాయంతో ఇమ్రోజ్ పత్రిక స్థాపన నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్లోని కాచిగూడలో ఇమ్రోజ్ అనే పత్రికను షోయబ్ స్థాపించారు. షోయబ్ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 1947 నవంబర్ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) చప్పల్బజార్ రోడ్డులో చంపిన రజాకార్లు ► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్లోని ఇమ్రోజ్ ఆఫీస్ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్ఖాన్తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్బజార్ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్ తుదిశ్వాస విడిచారు. ► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో నివసిస్తున్నారు. మలక్పేట్లో షోయబ్ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు. (క్లిక్: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) -
ఆజాద్ హైదరాబాద్: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి
దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. ఈటెలతో తిరగబడిన మీనవోలు ఎర్రుపాలెం : తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ సార్జంట్ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు. ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రజబ్అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు. మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు. పోరాటాల గడ్డ మేదేపల్లి ఏన్కూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీస్ చర్య తర్వాతా యుద్ధమే.. సత్తుపల్లి : సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. నాకు గర్వంగా ఉంటుంది.. 18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. – చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి -
చరిత్రను కాటేయ జూస్తున్నారు!
తొలిసారి నేను 1999లో నల్లమలను చూశాను. చెంచుల తొలి పరిచయం అప్పుడే. అప్పాపూర్ పెంట పెద్ద మనిషి తోకల గురువయ్య నాకు తొలి చెంచు మిత్రుడు. అప్పటికే 60 ఏళ్లు దాటిన వృద్ధుడు. తెల్లటి ఛాయ, బుర్ర మీసాలు... చెంచు ఆహార్యమే గాని, ఇగురం తెలిసిన మనిషి. ఈడు మీదున్నప్పుడు ఇప్ప సారా గురిగి లేపితే సేరు సారా అవలీలగా పీకేటో డట. 83 ఏళ్ల వయసులో మూడేళ్ల కిందట చనిపోయాడు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ మీద భీమిరెడ్డి ఫైరింగ్. బాలెంల, పాత సూర్యాపేట ఊదరబాంబు దెబ్బ. పాలకుర్తి పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి. దొడ్డి కొమురయ్య, మల్లెపాక మైసయ్య, బందగీ అమరత్వంతో ఊరూరా ప్రజా యుద్ధం సాగింది. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటానికి బీజం పడ్డది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) తొలి తుపాకీని భుజం మీద పెట్టుకున్నడు. సాయుధ రైతాంగ దళాలు ఏర్పడి, పోరాటం చేసి మూడువేల గ్రామాలను విముక్త గ్రామాలుగా ప్రకటించాయి. భూములను పంచాయి. ఖాసీం రజ్వీ సేనల నరమేధానికి కమ్యూ నిస్టు గెరిల్లాలు వెనక్కి తగ్గలేదు. పంచిన భూములను జనం వదల్లేదు. పంట ఇంటికి చేరు తోంది. అప్పుడప్పుడే జనానికి కడుపు నిండా బువ్వ దొరుకు తోంది. అగో.. అప్పుడు దిగింది పటేల్ సైన్యం! నాలుగు రోజుల్లో యుద్ధం ముగిసింది. ఆశ్చర్యకర పరి ణామాల నేపథ్యంలో నిజాం మకుటం లేని మహారాజు అయిండు. నయా జమానా మొదలైంది. పటేల్ సైన్యం నిజాంకు రక్షణ కవచం అయింది. కమ్యూనిస్టుల వేట మొదలు పెట్టింది. అట్లాంటి సంక్లిష్ట సమయంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి పెద్దలు సాయుధ పోరాటం వద్దన్నరు. భీమిరెడ్డి ఎదురు తిరిగిండు. సర్దార్ పటేల్ది విద్రోహం అన్నడు. తుపాకి దించితే జరిగే అనర్థాన్నీ, భవిష్యత్తునూ కళ్లకు గట్టినట్టు వివరించాడు. మనలను నమ్మి దళాల్లోకి వచ్చిన దళిత బహుజన గెరిల్లాలను మనంతట మనమే శత్రువుకు అప్ప గించినట్టేనని వాదిస్తున్నాడు. కానీ మితవాద కమ్యూనిస్టుల చెవికి ఎక్కడం లేదు. బీఎన్ అనుమానమే కాలగమనంలో అప్పాపూర్ చెంచు పెద్ద తోకల గురువయ్య అనుభవంలోకి వచ్చింది. 1999లో నేను నల్లమల వెళ్ళినప్పుడు ఆయన్ను కదిలిస్తే... ‘కమ్యూనిస్టుల దెబ్బకు గడీలను వదిలి పట్నం పారి పోయిన భూస్వాములు తెల్ల బట్టలేసుకొని, మల్లా పల్లెలకు జొచ్చిండ్రు. వీళ్లకు పటేల్ సైన్యాలే కావలి. కమ్యూనిస్టు దళాలల్ల చేరి, దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతిన వాళ్లను దొరక బట్టి, కోదండమేసి నెత్తుర్లు కారంగ కొట్టేటోళ్లు. బట్టలు విప్పించి, ఒంటి మీద బెల్లం నీళ్లు చల్లి, మామిడి చెట్ల మీది కొరివి చీమల గూళ్ళు తెచ్చి దులిపేవాళ్లు. కర్రలతో కొట్టి సంపేవాళ్లు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) దొరతనం ముందు నిలువలేక సోర సోర పొరగాండ్లు మల్లా ఈ అడివికే వచ్చిండ్రు. ఎదురు బొంగులను జబ్బకు కట్టుకొని, దాని మీదంగ గొంగడి కప్పుకునేటోళ్లు. చూసే వాళ్లకు జబ్బకున్నది తుపాకి అనిపించేది. సైన్యం అంత సులువుగా వీళ్ల మీదికి రాకపోయేది. గానీ... ఆకలికి తాళలేక ఎక్కడి వాళ్లు అక్కడ పడి పాణం ఇడిసేటోళ్లు. చెంచులం అడివికి పొలం పోతే సచ్చి పురుగులు పట్టిన పీనిగెలు కనపడేయి. అట్లా సావటానికైనా సిద్ధపడ్డరు కానీ... ఇంటికి పోవటానికి మాత్రం సాహసం చేయక పోయేటోళ్లు. దొరలు పెట్టే చిత్ర హింసల సావు కంటే, ఇదే నయం అనుకునేటోళ్లు’... ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. బీఎన్ ఆనాడు మితవాద కమ్యూనిస్టు నేతలతో చివరి నిమిషం వరకు తుపాకి దించనని చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఓ మత పార్టీ రాజకీయ క్రీడ ఆడబూనింది. కమలం పువ్వు మాటున చరిత్రను కాటేయాలనుకుంటోంది. సాయుధ పోరాట అపూర్వ ఘట్టాలకు గోరీ కట్టి ఖాకీ నిక్కరు తొడగాలని తాపత్రయపడుతోంది. తెలంగాణ పౌరుల్లారా... తస్మాత్ జాగ్రత్త! - వర్ధెల్లి వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, పరిశోధక రచయిత -
సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?
‘తారీఖులూ దస్తావేజులూ ఇవి కావోయ్ చరిత్ర సారం’ అని శ్రీశ్రీ అన్నాడు గానీ అటు సమయం ఇటు సారాంశం కూడా మారిపోతుంటాయి. సెప్టెంబర్ 17 ఇందుకో ఉదాహరణ. ఆ తేదీ ప్రాధాన్యత ఏమిటి? ఏ కోణంలో ఏ పేరుతో జరపాలి అన్నది ఒక కొలిక్కి రావడానికి దాదాపు 75 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కేంద్రం దీన్ని విమోచన దినం అంటే, రాష్ట్రం సమైక్యతా దినోత్సవం అంటున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షి కోత్సవాలు ఇంతకాలంగా జరుపుతూనే ఉన్న కమ్యూనిస్టులు తదితరులకు వేరే అభిప్రాయాలున్నా కూడా ఆ మహత్తర పోరాట వారసత్వం గుర్తుచేసుకోవడానికి ఏదో ఒక సందర్భం ఉందని సంతోషిస్తున్నారు. ముస్లిం రాజు నిజాం నుంచి విమోచన కనుక విమోచన దినోత్సవాన్ని గట్టిగా జరపాలని బీజేపీ వారంటుంటే, సంస్థానం దేశంలో విలీనమైంది గనక సమైక్యతా దినోత్సవమే సరైందని టీఆర్ఎస్ చెబుతున్నది. విమోచన ఎవరి నుంచి అనేది మరో ప్రశ్న. నిరంకుశ పాలకుల అండతో సాగిన వెట్టిచాకిరీ నుంచి, దోపిడీ పీడనల నుంచి విముక్తి అని కమ్యూనిస్టులంటారు. ‘బానిసోన్ని దొరా’ అనే వాడితో బందూకు పట్టించినంతగా మార్పు తెచ్చిన కమ్యూనిస్టుల దగ్గర ఏ ఇంద్రజాలమున్నదో అని సురవరం ప్రతాపరెడ్డి ఆశ్చర్యపోయారు. ‘విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ’ అని గానం చేశారు హరీంద్రనాథ్ ఛటోపా ధ్యాయ. 1947 ఆగస్టు 15 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటం తాకిడికి హడలిపోయిన కేంద్ర కాంగ్రెస్ పాలకులు పోలీసు చర్య పేరుతో సైనిక చర్య జరి పారు. నిరంకుశ పాలకుడిని రాజ్ప్రముఖ్ను చేసి, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుని, పోరాడే ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టారు. విప్లవ పోరాటం ముందు నిజాం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో తిరిగి ఆయనకు ఊపిరి పోశారు. నిజాంకు బ్రిటిషర్లతో సైనిక ఒప్పందం గనక, సొంత సైనిక బలం లేదు గనక అనధికార సైన్యంగా రజాకార్లు ప్రజలపై దాడులు, హత్యాకాండ సాగించారు. వాళ్లను అణచి వేయడానికి వచ్చామంటూనే సైన్యం కమ్యూనిస్టులపై మారణకాండ సాగించింది. ‘మూడువేల మృతవీర సమాధుల పుణ్యక్షేత్రమీ నల్లగొండరా’ అనే పాట చాలు దాని తీవ్రత తెలియడానికి. సర్దార్ పటేల్ హోంమంత్రిగా దీనికి ఆధ్వర్యం వహించారు. మీరు రాజీకి రాకపోతే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చేస్తుందని బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఆ విలీనం వాస్తవంగా జరిగిందే గనక వివాదం లేదు. పోరాటంపై దాడి చేశారు గనక విద్రోహం అని అన్నా ఇప్పటి సందర్భం వేరు. పోరాట విరమణే విద్రోహం అనే వారిది సైద్ధాంతిక చర్చ తప్ప ఉత్సవాలతో నిమిత్తం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సంస్థానాధీశులపైనా పోరాడాలని కమ్యూనిస్టులు తీసుకున్న విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. నాటి ఉమ్మడి మద్రాసులోని కేరళ ప్రాంతం; బెంగాల్, పంజాబ్, త్రిపుర ఇలా గొప్ప పోరాటాలే నడిచాయి. నైజాంలలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. ‘ఆంధ్ర మహాసభ’ మాత్రమే అప్పటికి చెప్పు కోదగిన సంస్థ. నాటి హేమాహేమీలందరూ ఉన్న సంస్థ. మహజర్లు ఇవ్వడం వరకే పరిమితమైన ఆ సంస్థను సమరశీల పథం పట్టించిన కమ్యూనిస్టులు ప్రజలకు నాయకత్వం వహించి నిరంకుశ పాలకుడిపై, గ్రామీణ పెత్తందార్లపై పోరాడారు. భాషా సాంస్కృతిక స్వేచ్ఛ ఈ పోరాటంలో అంతర్భాగం. 3,000 గ్రామాల విముక్తి, పదిలక్షల ఎకరాల పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవాడికి భూమి నినాదం, బానిసలుగా బతుకుతున్న ప్రజల ఆత్మగౌరవం, స్వతంత్ర జీవనం... ప్రధాన విజయాలు. ఇందుకు అర్పించిన ప్రాణాలు నాలుగు వేల పైన. అత్యాచారాలకు, అమానుషాలకు గురైన వారి సంఖ్యలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ పోరాటాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పాలకులకు దాదాపు పాతికేళ్లు పట్టింది. కేసీఆర్కు ఎనిమిదేళ్లుపట్టింది. ఇక బీజేపీ మతతత్వ కోణంలో ముస్లిం రాజుపై హిందువుల తిరుగు బాటుగా వక్రీకరించి 1998 నుంచి విమోచన దినం జరుపుతున్నది. అప్పుడు వారి అభినవ సర్దార్ పటేల్ అద్వానీ. ఇప్పుడు అమిత్షా. పటేల్ మాత్రమే తెలంగాణ విమోచన సాధించినట్టు చెబుతూ ఆయన సైన్యాలు తర్వాత సాగించిన దారుణకాండను దాటేయడం మరో రాజకీయం. తెలంగాణ ఏర్పడింది గనక ఇప్పటి రాజకీయాలు గతానికి పులమడం అనవసరం. (క్లిక్ చేయండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?) తెలంగాణ యోధులతో రెడ్డి హాస్టల్లో ఉండి పోరా టానికి తొలుత రంగం సిద్ధం చేసింది చండ్ర రాజేశ్వరరావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి వంటివారు ముందు నిలవకపోతే పోరాటం సాధ్యమయ్యేది కాదని సుందరయ్య స్పష్టంగా రాశారు. ఈ పోరాటం తెలుగువారం దరిదీ. మహిళలు, అణగారిన వర్గాలది అతి కీలక పాత్ర. వారు ఎగరేసింది ఎర్రజండానే. ఇప్పుడు కమ్యూనిస్టులను ఎవరూ పట్టించుకోరని కంచ ఐలయ్య వంటివారు అనొచ్చు గానీ (సాక్షి, సెప్టెంబరు 12) దాచేస్తే దాగని సత్యం ఎర్రెర్రని సూర్యకాంతిలా పలకరిస్తూనే ఉంటుంది. నాటి రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీ కూడా సమైక్య ఉత్సవాలు జరపాలని కోరడం ఇందుకో నిదర్శనం. స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు సమైక్యతా ఉత్సవంగా జరపడం నేటి పరిస్థితులలో ఆహ్వానించదగింది. తెలంగాణ వారసత్వంలో భాగంగా ఈ పోరాట ఉత్స వాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్తో మొదటి ఎడిటర్స్ మీట్లోనే నేను అడిగాను. గ్లోరిఫై చేయాలి అని ఆయనన్నారు. అంతకు అయిదారేళ్ల ముందు ఒక టీవీ చర్చలో నిజాం పాత్ర గురించి కూడా మా మధ్య వివాదం జరిగింది. ఆ మాట ఆయన ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గోదావరి ప్రజలు పూజించే కాటన్తో నిజాంను ఆయన పోల్చారు. ప్రజలు కాటన్ను తప్ప విక్టోరియా మహారాణిని పూజిం చడంలేదని నేను చెప్పాను. ఏదైనా అది చరిత్ర. నిజాం వ్యక్తిగత దూషణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. వీర తెలంగాణ విప్లవ స్ఫూర్తిని విభజన రాజకీయాలకు వాడుకోవడం తగని పని. - తెలకపల్లి రవి సీనియర్ జర్నలిస్ట్ -
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
17న సభకు లక్షలాదిగా ప్రజలు
కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్ ► సెప్టెంబర్ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు ► సెప్టెంబర్ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ ► హైదరాబాద్లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్లో నెక్లెస్రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ ► సెప్టెంబర్ 18 – జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
విముక్తికి బాట వేసిన బైరాన్పల్లి..!
1947 ఆగస్టు 15.. తెల్లదొరలను తరిమిన భారతావనిలో ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో బిక్కుబిక్కుమంటూనే గడిపింది. ఆ రోజే కాదు.. మరో ఏడాదికిపైగా నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను భరిస్తూ వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలన్న ప్రజల ఆకాంక్షలు, ప్రతిఘటనలు, పోరాటాల రూపంలో తెరపైకి రావడం మొదలైంది. వీటన్నింటికీ పరాకాష్టగా బైరాన్పల్లి నరమేధం కలకలం రేపింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది. 1948 ఆగస్టు 27న బైరాన్పల్లి ఘటన జరిగితే ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. –సాక్షి, సిద్దిపేట ఎన్నో పోరాటాలు జరిగినా.. బ్రిటీష్వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి నిరాకరించారు. దీనికి తోడు నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్పల్లి కేంద్రంగా కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాల యువకులతో బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువుల దాడిని ఎదుర్కొని, ప్రతిదాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. ప్రతీకారేచ్ఛతో వరుస దాడులకు తెగబడి.. 1948లో లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేసి తగులబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరాన్పల్లి సమీపంలోకి రాగానే వారిపై దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నాయి. దాన్ని తిరిగి ప్రజలకు పంచారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన రజాకార్లు బైరాన్పల్లిపై దాడి చేశారు. రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికిపైగా రజాకార్లు చనిపోయారు. ఇలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం ఆదేశాలతో హైదరాబాద్ నుంచి 500 మందికిపైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు. దారుణంగా కాల్చి చంపారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా బైరాన్పల్లిని చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తుడు వడ్లె వెంకటనర్సయ్య గమనించి కేకలు వేయడంతో.. వెంటనే బురుజుపై ఉన్న కాపలాదారులు నగారా మోగించారు. అప్పటికే దూసుకొచ్చిన రజాకార్ల కాల్పుల్లో బురుజుపై ఉన్న గెరిల్లా దళ సభ్యులు మోగుటం రామయ్య, పోచయ్య, భూమయ్య మృతిచెందారు. రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా.. బురుజులోని మధ్య గదిలో ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పులు పడి పేలిపోయింది. తర్వాత రజాకార్లు మరింత విజృంభించారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని కిరాతకంగా కాల్చి చంపారు. మరో 56 మంది యువకులను బంధించి ఊరి బయటికి తీసుకొచ్చి కాల్చిచంపారు. మృతదేహాలను పాత బావిలో పడేశారు. ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది. యువకులను చంపడంతో ఊరుకోని రజాకార్లు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. మహిళలను నగ్నంగా ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు బైరాన్పల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. నాటి కేంద్ర హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్తో కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో వీలినమైంది. బైరాన్పల్లి వాసులు నాటి ఘటనను గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు నాటి ఘటనతో బైరాన్పల్లి.. వీర బైరాన్పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమ గ్రామాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో పాల్గొన్నా 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారని.. నాటి పోరాటంలో పాల్గొని పెన్షన్ రానివారు ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. కూటిగళ్లు గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్తులే ఓ స్తూపాన్ని నిర్మించుకున్నారని వివరిస్తున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బైరాన్పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి బైరాన్పల్లి పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి. నాటి ఘనత నేటి తరానికి తెలిసేలా అమరధామం, ఎత్తయిన స్తూపం, భవనం నిర్మించాలి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్పల్లి గురించి వివరించాం. వస్తానన్నారు. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. –చల్లా చంద్రారెడ్డి నాటి పోరాటంలో కాలికి గాయమైంది నాడు రజాకార్లు చందాల పేరుతో పీడించేవారు. వారి దాడుల్లో నా కాలుకు గాయమైంది. అయినా రక్షణ దళంతో కలిసి రజకార్లపై పోరాడాను. నాటి పోరాటకారుల్లో కొందరికి ఇప్పటికీ పెన్షన్ మంజూరు చేయలేదు. వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామంలో సర్వే చేసి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. –ఇమ్మడి ఆగంరెడ్డి -
చరిత్ర పైనా రాజకీయమేనా?
భారత దేశంలోనే కాక ప్రపంచ విప్లవోద్యమాల్లోనే పేరెన్నికగన్నది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దేశంలో మిగతా చోట్ల బ్రిటిష్వాళ్లకు వ్యతిరేకంగా అహింసా యుత స్వాతంత్య్ర పోరాటం జరిగితే... తెలంగాణలో బ్రిటిష్వారి మిత్రుడైన నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఇంగ్లిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రోద్యమం జరిగిన సమయంలో... ఇక్కడ తెలంగాణలో నిజాం పాలనకు చరమగీతం పాడుతూ విప్లవకారులు అనేక గ్రామాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో భారత ప్రభుత్వం హైదరాబాద్పై ‘సైనిక చర్య’ చేపట్టింది. నిజాం భారత హోంమంత్రికి అధికారికంగా లొంగిపోయి, తన రాజ్యాన్ని భారత్లో కలిపివేశాడు. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వప్రయోజనాలకోసం వాడుకోజూడటమే విషాదం! ఇది దురాక్రమణ దినం తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది ఏమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకార్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. మరి ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి ఇండియా పాలక వర్గం వల్లభాయి పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను దురాక్రమణ చేసింది. చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమనీ, మత కోణంలో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ విమోచననీ, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమనీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజాం నిరంకుశ పాలనలో... దేశ్ముఖ్లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో ఎదురు తిరిగిన హైదారాబాద్ రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేశారు. వేలాదిమంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజాంకూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీన్ని గమనించిన నిజాం ఆనాటి నెహ్రూ ప్రభు త్వంతో కుమ్ముక్కయి ‘ఆపరేషన్ పోలో‘ నిర్వ హించడానికి వచ్చిన భారత సైన్యానికి లొంగిపోయాడు. నిజాం లొంగిపోయినా వెనుదిరిగి వెళ్ళకుండా తెలంగా ణను దురాక్రమణ చేశాయి యూనియన్ సైన్యాలు. ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుపెట్టేందుకు నెహ్రూ సేనలు పూనుకున్నాయి. ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే... 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారనేది ఒక లెక్క. నిజానికి కర్ణాటక, మరాట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున ఊచ కోతకు గురయ్యారు. ముస్లింల నెత్తురు కాల్వలు కట్టింది. మొత్తం సంస్థానంలో 40 వేల వరకు హతులైనట్లు సుందర్లాల్ కమిటీ నివేదిక పేర్కొనగా, ఈ మృతుల సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని ఉద్యమ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఏజెన్సీ గిరిజన గ్రామాలు భస్మీపటల మయ్యాయి. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు. దురాక్రమణ చేసి ప్రజల మాన ప్రాణాలను హరించివేసిన సైనిక చర్యను కాంగ్రెస్ విలీనం అంటోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరిగే ప్రక్రియను విలీనం అనాలి. దీన్నెలా అంటారు? ముస్లిం పాలన పోయి హిందూ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బీజేపీ. ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. అందువల్ల కమ్యూని స్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. సెప్టెంబర్ 17 విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకూ కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17ను ’తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. దీని వెనుక ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనేది సుస్పష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తెలంగాణ గోసను, చరిత్రను రాజకీయాలకు వాడుకోవడం ఆపి తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి. లేకపోతే మరోపోరాటం తలెత్తవచ్చు! సాయిని నరేందర్ (వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు) మొబైల్: 97019 16091 సాయుధ చరిత్రకు ప్రాధాన్యమివ్వాలి భారత్కు స్వాతంత్య్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో నిజాం రాచరికా నికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం జరుపుతున్నారు. అనేక గ్రామాలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్వయంపాలిత విముక్త గ్రామాలుగా ప్రకటితమయ్యాయి. అప్పటివరకూ తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయీకర ణకూ, అవమానాలకూ గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు వంటి వారు 1921లో ‘ఆంధ్ర జన సంఘం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923లో ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’గా, 1930లో ‘నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ’గా మారుతూ తన కార్యకలా పాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టుల చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం, ‘దున్నేవానికి భూమి’ వంటి పోరాటా లను నిర్వహించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి రావి నారాయణ రెడ్డి నాయ కత్వంలో పూర్తి స్థాయిలో విప్లవ సంస్థగా మారి దొరల, రజకార్ల, నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటాలను ప్రారంభించింది. 1940–42ల మధ్య బందగి సాహెబ్ సాహస మరణం, 1944–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946లో దొడ్డి కొమురయ్య వీర మరణం, తదనంతరం భీంరెడ్డి, దేవులపల్లి, షోయ బుల్లాఖాన్, ముఖ్ధూం మోహియుద్దీన్, సర్వదేవ భట్ల రామనాథం, ఆరుట్ల దంపతులు, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, సుద్దాల హన్మంతు, రాజబహుదూర్ గౌర్ల వంటి నాయకులు సాయుధ పోరాటం సాగించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం ముందుకు పోవ టాన్ని చూసి యూనియ న్లో చేరమని బ్రిటిష్ వారు నిజాంకు సలహా ఇచ్చారు. పోరాటకారులు హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం కమ్యూనిస్టుల స్వాధీన మయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్ మౌంట్బాటెన్ నిజాంను యూనియన్లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరవయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగు తున్న మతోన్మాద నాయకుడు ఖాసిం రజ్వీ యూని యన్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ లపై తీవ్ర హింసాకాండకు దిగాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాంకు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు. ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజాకారులు స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నాయి. 1947 సెప్టెంబర్ 29న నిజాం, నెహ్రూ సర్కార్లు ‘యథాతథ ఒడం బడిక’ను చేసుకున్నాయి. సెప్టెంబర్ 13, 1948 వరకు అమలైన ఈ ఒడంబడిక కాలంలో వల్ల భాయ్ పటేల్, రాజగోపాలాచారి సంస్థానంలోని విప్లవ వెల్లువను అణచి వేయడానికి నిజాంకు ఆయుధాలను సరఫరా చేశారు. మద్రాస్, హైదరా బాద్ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న కేంద్ర హోంమంత్రి ఇదే సమయంలో హైదరాబాద్పై ‘సైనిక చర్య’కు ఆదేశించాడు. యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్లో విలీనమైంది. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులనూ, వారి వెంట నడుస్తున్న లక్షలాది మంది ప్రజలనూ యూనియన్ సేనలు నిర్బంధించాయి. ఇప్పుడు ఆ చారిత్రిక ఇతిహాసాన్ని ‘సమైక్యతా ఉత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ముదావహం. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని మతోన్మాద సంస్థల వారసులు చరిత్రను ఇప్పుడు వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం. సాయుధ పోరాటానికి వేదికలైన కడవెండి, బైరాన్పల్లి వంటి చోట్ల స్మారక చిహ్నాలను నిర్మించాలి. అమరుల త్యాగాలు ప్రజల హృదయాలలో ఉండేట్లు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించాలి. అస్నాల శ్రీనివాస్ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు) -
మర్రిచెట్టంత త్యాగం మరవొద్దు
‘సెప్టెంబర్ 17.. విమోచనమా, విముక్తా, విలీనమా.. ఏ దినోత్సమైనా అనుకోండ్రి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజును అందరూ యాది చేసుకుంటుండ్రు. సంబురాలూ జేస్తున్నరు. అవ్గనీ.. అంతకుముందు మేం జేసిన పోరాటాలు యాదికున్నయా? అడవి బిడ్డలమైన మేం ఆఖరి శ్వాస దాకా ఎందుకు పోరాడినమో.. వెయ్యి మందిమి ఒకేపారి ఒకే మర్రిచెట్టు ఉరికొయ్యలకు ఎందుకు ఊగినమో మీకు ఎరుకేనా? కుమురం భీముడు ఏమిటికి తుపాకీ పట్టిండు..? ఎందుకు పానం ఇడిసిండు? ఏండ్ల సంది చరిత్ర పుస్తకాలల్ల మాకు ఒక్క అక్షరమంత జాగియ్యలేదు. జరంత మీరన్న.. ఇప్పటికన్న.. పట్టించుకోండ్రి’అంటూ నిర్మల్ గడ్డపై ఉన్న రాంజీ గోండు విగ్రహం ఘోషిస్తోంది. ఇంతకూ ఎవరీ రాంజీ..? ఆ వెయ్యి మంది ప్రాణాలు ఎందుకు వదిలారు.. ఇదంతా ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే చరిత్రకెక్కని ఈ గాథను చదవాల్సిందే. నిర్మల్: దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపు అన్నట్లుగా అడవుల్లో ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ ప్రాంతం కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. దీనికి గోండు వీరుడు రాంజీ గోండు నేతృత్వం వహించాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంఠ్ షా (క్రీ.శ 1735–49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్వాళ్లు చేజిక్కించుకున్నారు. గోండుల పాలన అంతమై ఆంగ్లేయ, నైజాం పాలన మొదలయ్యాక ఆదివాసులనూ నాటి పాలకులు పీడించారు. అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిర్మల్ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయ కలెక్టర్.. నిజాం సేనలతో కలసి అడవులను, ఆదివాసులను పీడిస్తున్నాడని తెలియడంతో రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. రోహిల్లాల తోడుతో.. ప్రథమ సాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందాక నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే, రావుసాహెబ్లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు తరలివచ్చారు. వారు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. నిర్మల్ ప్రాంతంలో రోహిల్లాల నాయకుడు సర్దార్ హాజీతో కలిసిన రాంజీ... ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ సమీపంలోని సహ్యాద్రి కొండలను, అడవులను కేంద్రంగా చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసి దెబ్బతిన్నాయి. ఈ విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్జల్ ఉద్దౌలా వరకు తెలిసింది. అణచివేత కోసం బళ్లారి దళం.. ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా రాంజీ నేతృత్వంలో నిర్మల్ కేంద్రంగా ప్రారంభమైన పోరును పాలకులు తీవ్రంగా పరిగణించారు. అణచివేత కోసం బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫ్రాంట్రీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి రాబర్ట్ సఫలమయ్యాడు. సోన్–కూచన్పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాంజీసేన పట్టుబడింది. ఒకే మర్రికి వెయ్యి మంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన 1860 ఏప్రిల్ 9న జరిగింది. ఆ తర్వాత కుమురం భీమ్ సహా ఎందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. నేటికీ చరిత్రకెక్కని పోరాటం.. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యి మంది వీరుల త్యాగం ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి నివాళులర్పించినా రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే వెయ్యి ఉరుల మర్రి ఉన్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. జిల్లా కేంద్రంలోని ఓ చిన్నపాటి విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన వెయ్యి ఉరుల మర్రిచెట్టు ప్రాంతంలో అనాథలా అమరవీరుల స్థూపం మినహా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. రాంజీ పేరిట మ్యూజియం పెడతామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. సెప్టెంబర్ 17 ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తమ పూర్వీకులను గుర్తించి చరిత్రలో చోటుకల్పిస్తారేమోనన్న ఆశతో ఆ అమరవీరుల వారసులు ఎదురుచూస్తున్నారు. -
నిజాం రాజు.. తలవంచెన్ చూడు
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు. అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’ – హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్లో రాసుకున్న మనోగతమిది. (శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్ను భారత్లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది. ఐదు రోజుల్లోనే అంతా పూర్తి నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి. ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్దుర్గ్ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి. స్వేచ్ఛా వాయువులతో.. సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్లాయక్ అలీ రేడియో స్టేషన్కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు. దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా.. ‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్ముఖ్లు, దేశ్పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి. నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ 1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి. భారత ఉపప్రధాని వల్లభ్బాయ్పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్అలీఖాన్ ఇదీ హైదరాబాద్ స్టేట్ ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. నిజాం.. ప్రపంచ కుబేరుడు మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్గా వాడేవాడు. ఉస్మాన్అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే చౌమహల్లా, ఫలక్నుమా, చిరాన్పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్విల్లా, హిల్ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది. ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్ ఎవరీ నిజాంలు? 1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్ఖాన్ దక్కన్లో అసఫ్జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్ప్రముఖ్గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ.. భార్య: ఆజం ఉన్నీసాబేగం కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్ -
September 17th: విమోచన కాదు, సమైక్యత!
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఐక్యతా విగ్రహం’ పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది! తెలంగాణలో సెప్టెంబర్ 17... ఆరెస్సెస్/ బీజేపీ చుట్టూ సమీకృతమవుతున్న హిందుత్వ శక్తులకూ, విస్తృతార్థంలో ఉదార ప్రజాస్వామ్య వాదులైన ఇతరులకూ మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజును హైదరాబాద్ విమోచనా దినంగా నిర్ణయించడంతో పాటు, 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పొడువునా సంబరాలు జరుపుతామనడంతో ఈసారి ఆరోజు మరింత స్పర్థాత్మకంగా మారింది. బహుశా ఆ పార్టీ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన దినంగా భావిస్తూం డవచ్చు. అదే సమయంలో ఆరెస్సెస్/బీజేపీ జాతీయ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 16 నుంచి ఏడాదిపాటు జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరెస్సెస్/బీజేపీ తొలినుంచీ నిజాం పాలనను రాచరిక పాలనగా కాకుండా హిందువులపై ముస్లింల పాలనగా చూస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ దూకుడుతో కూడిన ముస్లిం వ్యతిరేక వైఖరి నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజును జాతీయ సమైక్యతా దినంగా అధి కారికంగా జరపాలని నిర్ణయించింది. మోదీకి వ్యతిరేకంగా తనను తాను జాతీయ నేతగా కేసీఆర్ ప్రదర్శించుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పిలుస్తున్న కమ్యూనిస్టులను పట్టించుకునే వారే లేరు. జునాగఢ్ సంస్థానాన్ని అక్కడి ముస్లిం పాలకుడు మూడవ ముహమ్మద్ మహబత్ ఖాన్జీ పాకిస్తాన్లో కలిపేస్తున్నట్లు ప్రకటించి, చివరకు పాకిస్తాన్కు పారిపోయాడు. దీంతో భారతదేశంలో విలీన మైన చిట్టచివరి రాష్ట్రంగా జునాగఢ్ నిలిచింది. కానీ ఆరెస్సెస్/బీజేపీ కూటమి దీని గురించి ఎంతమాత్రమూ మాట్లాడటం లేదు. నాడు దేశ ఉప ప్రధానిగానూ, హోంమంత్రిగానూ ఉన్న సర్దార్ పటేల్ నిర్ణయా త్మకమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనం కావడంపై పూర్తి స్థాయి చర్చ జరగాల్సి ఉంది. కశ్మీర్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన నేపథ్యంలో జాతీయ సమైక్యత అంశంపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవ సరం ఉంది. దేశం నడిబొడ్డున భంగకరమైన సంస్థానాన్ని వదిలేయ కుండా భారతదేశం ప్రస్తుత రూపంలోని రాజ్యాంగబద్ధమైన యూని యన్గా 1948 సెప్టెంబర్ 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. భారత యూనియన్లో కశ్మీర్ 1947 అక్టోబర్ 27న చేరిందని అందరికీ తెలిసిన సత్యమే. వాస్తవానికి కశ్మీర్, హైదరాబాద్ సంస్థా నాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని అనుకోగా, జునాగఢ్ రాజు పాకిస్తాన్తో కలిసిపోవాలని నిశ్చయంగా కోరుకున్నాడు. సర్దార్ పటేల్, ఆనాడు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వీపీ మీనన్ నిర్వహిం చిన దౌత్య చర్చల ఫలితంగా మిగిలిన సంస్థానాలు భారత్లో విలీన మయ్యాయి. సంప్రదింపులు జరిపే సామర్థ్యంలో మీనన్ ప్రసిద్ధుడు. కశ్మీర్ అనేది హిందూ రాజు ఏలుబడిలోని ముస్లింలు మెజా రిటీగా ఉన్న రాజ్యం. అదే హైదరాబాద్లో హిందువులు మెజారిటీగా ఉండగా, ముస్లిం రాజు పాలనలో ఉండేది. దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కశ్మీర్, హైదరాబాద్లను భారత యూనియన్లో కలుపుకోవడంపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేది. దేశం లోపల గానీ, సరిహద్దుల మీద గానీ ఇతర దేశాలు లేకుండా భారత్ ఒక సార్వభౌ మాధికార, స్వతంత్ర దేశంగా ఇలాంటి సమైక్యత ద్వారానే ఉనికిలో ఉండగలుగుతుంది. కశ్మీర్ భారత సరిహద్దులోని సమస్యాత్మక ప్రాంతంగా కనిపించగా, హైదరాబాద్ సంస్థానం కేంద్రానికి మరింత పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్య పట్ల నెహ్రూ, పటేల్ చాలా తీవ్ర దృష్టితో ఉండేవారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కాకపోయి నట్లయితే, భారతదేశానికి అర్థమే మారిపోయి ఉండేది. ఆరెస్సెస్ కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అలాంటి విలీనమే జరగాలని కోరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానాన్ని తన సాయుధ పోరాటానికి ప్రయోగాత్మక స్థావరంగా చేసుకుంది. హైదరాబాద్ ముస్లిం సంస్థానం కాబట్టి ఆరెస్సెస్ దాని మనుగడకే వ్యతిరేకంగా ఉండేది. కానీ ఆరోజుల్లో ఆరెస్సెస్ గుర్తించదగిన శక్తిగా ఉండేది కాదు. ప్రారంభం నుంచీ వారి జాతీయవాదం ముస్లిం వ్యతిరేక ఎజెండా చుట్టూనే తిరుగుతుండేది. భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ! ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఆరెస్సెస్/బీజేపీ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో, చాలాకాలం ఊగిసలాట తర్వాత టీఆర్ఎస్ ఈసారి ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య పెరిగిన విభేదాలతో 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపును ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిపోయింది. సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరిని చేపడితే తెలంగాణలోని 15 శాతం ముస్లిం జనాభాను రెచ్చగొట్టి, వారిని లక్ష్యంగా చేసుకుని వేధించవచ్చు. అయినా 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగిందని? భారత యూనియన్లోకి మరో సంస్థానం విలీన మైంది. అంతే కదా! ‘ఐక్యతా విగ్రహం’ పేరిట గుజరాత్లో భారీ సర్దార్ పటేల్ విగ్ర హాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రతిష్టించారు. జునాగఢ్, హైదరా బాద్, కశ్మీర్లను విశాల భారత్లో ఐక్యం చేయడానికి బాధ్యుడు పటేల్. మరి ఆయన విగ్రహానికి విముక్తి విగ్రహం అని ఎందుకు పేరు పెట్టలేదు? మరే హోంమంత్రి అయినా ఇతర సంస్థానాలను సుల భంగా విలీనం చేసేవారు. కానీ ఈ మూడు సమస్యాత్మక సంస్థానా లను విలీనం చేయడంలోనే పటేల్ గొప్పతనం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే కాంగ్రెస్ శిబిరం నుంచి సర్దార్ పటేల్ను లాగి, ఆయనను ఆరెస్సెస్/బీజేపీ తమ ఘన చిహ్నంగా రూపొందించు కున్నాయి. నెహ్రూ లాగా వంశపారంపర్య సమస్యలు ఏమీ లేని అతి పెద్ద శూద్ర వ్యవసాయ నేపథ్యం కలిగిన వాడు కాబట్టే పటేల్ చుట్టూ రాజకీయ, ఆర్థిక పెట్టుబడిని ఆరెస్సెస్/బీజేపీ ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే. అమృతోత్సవాలుగా పిలుస్తున్న ఈ కాలంలోనూ నిజాంనూ, ముస్లిం సమాజాన్నీ దూషించడం ఎందుకు? పాత గాయాలను మర్చిపోవడంలో రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. జాతీయవాదం అంటే స్వాతంత్య్ర పూర్వ కాలపు గాయాలను మళ్లీ కెలికి, వాటిపై కారం పూయడం కాదు. జాతీయవాదం అంటే ప్రజలు నిత్యం కొట్టుకునేలా చేయడం కాదు. ఈ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకొందాం. సర్దార్ పటేల్కూ, ఆనాటి సమరంలో అన్ని వైపులా మరణించిన అమరులకు నివాళులు అర్పిద్దాం. - ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త) -
స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా.. ఈ మేరకు శనివారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున అధికారికంగా మళ్లీ తెలంగాణ విలీన దినం నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. ఇప్పటివరకు కేవలం పార్టీ కార్యాలయంలో మాత్రమే టీఆర్ఎస్ జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు హాజరయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పరేడ్ గ్రౌండ్స్లో ఆ రోజు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వేడెక్కిన రాజకీయం.. ఈ నెల 17న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోటా పోటీ ఉత్సవాలతో మరింత వేడెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం
-
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం: అమిత్ షా
సాక్షి, నిర్మల్: తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్ షా అన్నారు. చదవండి: తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం: బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవం: స్ఫూర్తిదాయక పోరాటం -
నిర్మల్ లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ
-
TS: పోరాట చరిత్రను గుర్తించాలి
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి ఆగస్టు 15, 1947న దేశానికంతటికి స్వాతంత్య్రం లభించినా, తెలంగాణ నవాబు హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. ఆనాడు తెలంగాణలోని కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాల నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఎగురవేయడంతో నిజాం పోలీసులు వారిపై కేసులు పెట్టారు. 1947 సెప్టెంబర్ 11న నిజాంను గద్దె దించాలని, సాయుధులై గెరిల్లా పోరాటాలు చేయాలని సీపీఐ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో తరతరాలుగా వెట్టి చేసిన చేతులు బందూకులు పట్టాయి. ఊరూరు ఒక విప్లవ కేంద్రమయ్యింది. హైదరాబాద్ అంటే 16 జిల్లాల పరగణ. ఇప్పుడున్న మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలుగా ఇవి వున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు 17 సెప్టెంబర్ 1948ని స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ గానీ, తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలు గానీ తెలంగాణ విలీన దినం నిర్వహించడానికి నిరాకరించాయి. కానీ తెలంగాణ పోరాటంలో ఉనికి లేని బీజేపీవాళ్లు విమోచన దినం అధికారికంగా జరపాలని అంటున్నారు. అగ్రనాయకుడు అమిత్ షాను తెచ్చి జెండాలను ఎగురవేసే ముందు ఆనాటి సాయుధ పోరాట చరిత్రను గుర్తించి, చిరస్మరణీయం చేయాలి. సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లిముల తగాదాగా చిత్రీకరించి మత రాజకీయాలు చేయ పూనుకోవడం తగనిది. అనేక మంది ముస్లింలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. గతంలో బీజేపీ నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను వక్రీకరించేందుకు చాలా ప్రయ త్నించింది. రజాకార్లు, కమ్యూనిస్టులు చేతులు కలిపి భారత యూనియన్కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారంది. ప్రజలు నమ్మకపోవడంతో కొత్తగా నిర్మల్లో వెయ్యి ఊడల మర్రిచెట్టుకు నిజాం పాలకులు వెయ్యి మందిని ఉరి తీశారనీ, అక్కడ సెప్టెంబర్ 17 విమోచనోత్సవాలు చేస్తున్నామనీ ప్రకటించారు. నిజానికి ఇది 1948 సెప్టెంబర్ 17తో సంబంధం లేని అంశం. అలనాడు రాంజీ గోండు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా 1860లో చేసిన వీరోచిత తిరుగుబాటుతో నిర్మల్ వెయ్యి ఊడల మర్రికి సంబంధం ఉన్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియిద్దీన్, చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య త్యాగాల వలన భారత యూనియన్లో తెలంగాణ విలీనమైందని, వారు లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్లాగా వుండేదని చిలుక పలుకులు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ చేస్తూ విలీన దినంగా గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు. సెప్టెంబర్ 17ను అధికరంగా గుర్తిస్తే ప్రజలలో ఒక చర్చ జరుగుతంది. గతం లేనిది వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్ వుండదని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. సాయుధ పోరాట త్యాగాల చరిత్ర లేకుండా తెలంగాణ లేదని గ్రహించుకోవాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
‘సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణం’
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు. -
ఓట్ల కోసమే ‘విమోచనాన్ని’ విస్మరించారు
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్బజార్: టీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. గురువారం కోఠిలోని అమరవీరుల అశోక స్తూపం వద్ద, గాంధీ భవన్లోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజల హక్కు అని, ప్రభుత్వం ఓట్ల రాజకీయం కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. భారతదేశంలో తెలంగాణ విలీనం కావడంలో బీజేపీ, ఎంఐఎంలకు ఏం సంబంధం ఉందని ఉత్తమ్ ప్రశ్నించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంలో కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాత్ర మాత్రమే ఉందని, ఇందులో ఈ రెండు మతతత్వ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇచ్చినమాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీతోనే నాడు దేశంలో తెలంగాణ విలీనమైందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క కుటుంబానిదే పెత్తనం అయిందని విమర్శించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొని ఏకస్వామ్య విధానానికి చరమగీతం పాడేందుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమాల్లో భట్టి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, కుసుమకుమార్, జీవన్రెడ్డి పాల్గొన్నారు -
ఆజాద్ హైదరాబాద్
చరిత్రను మలుపు తిప్పిన వేళ అది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన సమయం అది. అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిన నిజాం రాచరిక పాలన శాశ్వత నిద్రలోకి జారుకున్న సందర్భం అది. రజాకార్ల అకృత్యాలతో,అరాచకాలతో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించిన ప్రజలు ఆ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. హైదరాబాద్ ఆనందంతో ఉప్పొంగింది. అడుగడుగునా త్రివర్ణ పతాకలు రెపరెలాడాయి. బొల్లారం నుంచి హైదరాబాద్ వైపు సాగిన భారత సైనిక బలగాలకు నగర ప్రజలు జయజయధ్వానాలు పలికారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఆ రోజు జనసంద్రమైంది. అప్పట్లో మూసీనది 1911 నుంచి 1948 వరకు 37 సంవత్సరాల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన ఓటమిని అంగీకరిస్తూ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమైంది.ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సైతం ఆ మూడున్నర దశాబ్దాల నిజాం పరిపాలనే పునాదులు వేసింది. ఆధునిక హైదరాబాద్ నిర్మాణానికి బాటలు పరిచింది. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా వంటి అనేక రంగాల్లో నిజాం నవాబు సరికొత్త శకానికి నాంది పలికారు. రైళ్లు,రోడ్డు రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ఆ పునాదులపైన మహానగరం విస్తరించుకుంది. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.‘ సెప్టెంబర్ 17’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. మీర్ ఆలం చెరువు హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనరల్ జేఏ చౌదరి దీనికి సారధ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్న్ కమాండర్ మేజర్ జనరల్ ఏఏ రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. లోయర్ ట్యాంక్ బండ్ భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్ధకమైంది.1948 సెప్టెంబర్ 14వ తేదీన దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాలలో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 16వ తేదీన రాంసింగ్ నేతత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్న్ సైనికులపాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. కాసీం రజ్వీ, ఆజాం జా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... నిజామ్ ప్రభువుల కాలంలో ఉన్నత వర్గాల వారి కోసం, నవాబులు, జాగీర్దార్లు, బ్రిటీష్ అధికారుల పిల్లల చదువుకోసం 1923లో ‘జాగీర్దార్ స్కూల్’ పేరుతో ప్రస్తుత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటైంది. లండ¯Œన్ లోని ఎల్టన్ కళాశాల భవనం తరహాలో దీన్ని నిర్మించారు. అద్భుతమైన డిజైన్లతో పూర్తిగా డెక్కన్ తరహా నిర్మాణ శైలితో పాఠశాల భవనాలను నిర్మించారు. బ్రిటీష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపల్గా 1924లో 5 గురు విద్యార్థులు, ఆరుగురు అధ్యాపకులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది.1950లో ప్రభుత్వం జమీందారి వ్యవస్థను రద్దు చేయడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉనికిలోకి వచ్చింది. మొదట్లో బాలురకు మాత్రమే పరిమితమైన పాఠశాలలో 1988 అమ్మాయిలకు ప్రవేశం కల్పించారు. పికెట్ట్యాంక్( నాడు) జూబ్లిబస్టాండ్ (నేడు) సిటీ కళాశాల.. ఆకుపచ్చ వనంలో వెలసిన రాజభవనంలా ఉంటుందా అరుణసౌధం. మూడంతలస్తుల భవనం.అరవై నాలుగు గదులు, విశాలమైన ఆవరణ.దారులకు ఇరువైపులా నిలువెత్తు వృక్షరాజాలు.. ఇదీ హైదరాబాద్ సిటీ కాలేజ్ అద్భుత దృశ్యం. అనేక సంవత్సరాలుగా, అనేక తరాలుగా విద్యనందజేస్తోంది. 1865లోనే మొట్టమొదటి ‘దారుల్ –ఉల్–ఉలుమ్’పాఠశాలగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ప్రారంభమై 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1920 నాటికి గొప్ప కళాశాలగా అభివృద్ధి చెందింది. ఇండో–సార్సెనిక్ శైలిలో మూసి నది తీరాన ముస్లిం జంగ్ బ్రిడ్జ్కు సమీపంలో కట్టించిన సిటీ కళాశాల ఒక రాజమందిరాన్ని తలపిస్తూంటుంది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ మహబూబియా బాలికల కళాశాల న్యూ జనానా అంటే హైదరాబాద్లో చాలామందికి తెలియకపోవచ్చు. ఒకప్పటి ‘పరదా స్కూల్’ కూడా అంతే. చదువులకు దూరంగా ఉన్న బాలికలను బడిబాట పట్టించేందుకు ప్రారంభమైన పాఠశాలే పరదా స్కూల్. అదే న్యూ జనాన. ఆ తరువాత ఆ స్కూలే మహబూబియా బాలికల పాఠశాలగా, కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆబిడ్స్ రోడ్డులో కనిపించే నిలువెత్తు రాతికట్టడం. ఏ రాణివాసమో అనిపించేలా అద్భుతమైన నిర్మాణశైలి. ఆరో నిజాం హయాంలో నిర్మించిన ఈ విద్యా మందిరానికి ఆయన పేరే పెట్టారు. ఆర్ట్స్ కళాశాల ప్రారంభోత్సవం ఉస్మానియా విశ్వవిద్యాలయం దార్–ఉల్–ఉలూం పేరిట 1913లో ఆనాటి విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి నగరంలో విశ్వ విద్యాలయం తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం 1917లో ఒక ‘ఫర్మానా’ జారీ చేసింది. మీర్ ఉస్మాన్ఆలీఖాన్ పేరిట 1918లో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రొఫెసర్ పాట్రిక్ గెడ్డెస్ నేతృతత్వంలో రామంతాపూర్, జమిస్థాన్పూర్, హబ్సిగూడ, అంబర్పేట్, లాలాగూడ గ్రామాల్లో 2400 ఎకరాల భూమిని వర్సిటీ కోసం సేకరించారు. బీదర్, గోల్కొండ, అజంతా, ఎల్లోరా, ఢిల్లీ తదితర ప్రదేశాల్లోని భారతీయ శిల్పకళా సంపదను, సంస్కతులను మేళవించి ఆర్ట్స్ కళాశాల భవనం నమూనాను రూపొందించారు. నయాపూల్ 1934 జులై 24న పునాది పడింది.110 మీటర్ల వెడల్పు, 119 ఎత్తున రెండంతస్తుల్లో 164 విశాలగదులతో ఆర్ట్స్ కళాశాల రూపుదిద్దుకుంది. కాలేజీలోని ప్రధాన హాలు 24/ 24 మీటర్ల పొడవు, వెడల్పుతో, 12 మీటర్ల ఎత్తున సున్నంతో చేసిన ఫిలిగ్రీ పనితనం కనిపిస్తుంది. 1939 డిసెంబర్ 5న మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ విశ్వవిద్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆపరేషన్ పోలో లో భాగంగా.. వారసులంతా విదేశాల్లోనే ఇదీనిజాం..‘ఖాన్’దాన్ కుతుబ్షాహీల తర్వాత హైదరాబాద్ రాజధానిగా పాలించిన అసఫ్జాహీల ఆనవాళ్లు నగరంలో వీధివీధికీ కనిపిస్తాయి. 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ స్టేట్ను మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్, నిజాంఅలీ ఖాన్, అక్బర్అలీ ఖాన్, ఫరూకుద్దీన్ అలీఖాన్, తినాయత్ అలీఖాన్, మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్లు పాలించారు. మహబూబ్ లీఖాన్, ఉస్మాన్ అలీఖాన్ల పాలనా సమయంలో నగరం అనేక మైలు రాళ్లను దాటేసింది. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం అంతరించి దేశంలో కలిసిపోయింది. అయినా ఉస్మాన్ అలీఖాన్ 1956 వరకు రాజ్ప్రముఖ్గా పదవులు నిర్వహించారు. ఎంజే మార్కెట్కు శంకుస్థాపన ఆస్ట్రేలియాలో ఎనిమిదవ నిజాం : నిజాం వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముఖర్రం ఝా ఆస్ట్రేలియాలో, ముఫకం జా లండన్లో స్థిరపడ్డారు. అడడపాదడపా హైదరాబాద్ వచ్చి వెళుతున్నారు. వీరిలో ముఖరం జా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎనిమిదవ నిజాంగా ప్రకటించుకున్న ముఖర్రం జా ఆధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్లో అత్యధిక ఆస్తులున్నాయి. ఫలక్నామా, చౌమహల్లా, చిరాన్ ప్యాలెస్లున్నాయి.లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టాలు అందుకున్న ముకర్రం జా జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నాడు. అక్టోబర్ 6, 1933లో పుట్టిన ముఖరం జా తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్ను(1959–75), అనంతరం ఎయిర్హోస్టెస్ హెలెన్(1980–90).. ఆపై అప్పటి మిస్ టర్కీ మనోలియా ఒనోర్ను(1990–96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాఖ్’ చెప్పేశాడు. ముఖర్రం ఝా , ముఫకం ఝా ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్లను కలిసి ఉంటున్నాడు. మొత్తంగా చూస్తే మొదటి భార్య ద్వారా ఇద్దరు(కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడవ భార్య కూతురు(నీలోఫర్), నాల్గవ భార్య ద్వారా ఓ కుమార్తెలు ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో స్థిరపడ్డారు. ముఫకం జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండవ మనవడు. ఇతను ప్రస్తుతం లండన్లో నివాసముంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు. నిజాం..ది రిచెస్ట్మ్యాన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉస్మాన్ అలీఖాన్ది ప్రముఖమైన పేరు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న 23వేల ఎకరాల(సర్ఫెఖాస్) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్కతా,మహేబలేశ్వరం, తదితర ప్రాంతాల్లో ఉన్న 630 భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ వెంకటాచారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఒక్క హైదరాబాద్ నగరంలోనే చౌమహల్లా, ఫలక్నామ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్విల్లా, ఫెర్న్విల్లా, హిల్ఫోర్ట్, మౌంట్ప్లజెంట్ తదితర ప్యాలెస్లతో పాటు విలువైన వజ్ర ,వైఢూర్యాలు నిజాం ఫ్యామిలీ సొంతమైయ్యాయి. అయితే ఈస్తుల పరిరక్షణకు ట్రస్ట్లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సైతం సభ్యులుగా చేర్చింది. దీంతో ‘ది నిజామ్స్ ట్రస్ట్ డీడ్స్(వాలిడేషన్) యాక్ట్ 1950’. మేరకు 28 రకాల ట్రస్ట్లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్గా, సభ్యులుగా నిజాం కుటుంబసభ్యులతో పాటు మాజీ సివిల్ సర్వీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. 1947 ఆగస్టు15 దేశమంతా స్వతంత్ర జెండాలెగిరితే..హైదరాబాద్లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో పావులు కదిపిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడాది కాలం పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెల్లువెత్తిన సాయుధ రైతాంగ గెరిల్లాలను, మరో వైపు సత్యాగ్రహంతో రోడ్డెక్కిన కాంగ్రెస్ సమూహాల్ని ఏడాది పాటు నిలువరించగలిగాడు. చివరకు భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు మూడువైపులా చుట్టుముట్టిన సమయంలో నిస్సహాయంగా మిగిలిన నిజాం అప్పటి హోంమంత్రి పటేల్ ముందు మోకరిల్లటంతో..ఆజాద్ హైదరాబాద్ అవతరించింది..లొంగుబాటు అనంతరం హైదరా బాద్ సంస్థానధీశులు ఎవరెక్కడ ఉన్నారు.. వారేం చేస్తున్నారు..వివరాలివీ నిజాముల పరివారం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారులు : ఆజంజా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా జా పరివారం : భార్య, దుర్రేషెవార్(టర్కీ),కుమారులు : ముకర్రం, ముఫకం జా మౌజం జా పరివారం : భార్యలు నీలోఫర్(టర్కీ), రజియాబేగం,అన్వరీబేగం సంతానం : ఫౌతిమా,ఫాజియఅమీనా,ఓలియా,శ్యామత్అలీఖాన్ -
ఇది ఓ తిరుగుబాటు ఆత్మకథ
తెలంగాణ సాయుధపోరాటం నుంచి తనను విడదీసి చూడలేనంతగా మమేకమైనవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. భూమి భుక్తి విముక్తికోసం తెలంగాణ ఎర్రసెలకల్లో పుట్టిన మహత్తర పోరాటమది. ‘దున్నేవానికే భూమి’ అన్న నినాదంతో 4000 మంది వీరులు నెత్తురు ధారవోసిన మహాజ్వల సాయుధ పోరాట ఘట్టమది. వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం ఎగిసిపడి దొరగడీలను నేలకూల్చిన పోరు అది. భూస్వామ్య జాగీర్ధారీ వ్యవస్థలను అల్లకల్లోలంచేసిన చీమలదండులు సాగించిన మహత్తర తెలంగాణ సాయుధపోరాటమది. రైతాంగ తిరుగుబాటును ఒక మలుపు తిప్పి ఆయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి వీర గాధకు ప్రాణంపోస్తూ 2007 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ వెలువడింది. వీర తెలంగాణ సాయుధపోరాట యదార్థగాథను, ఈ నేలమీద సాగిన సాహసపోరాటగాథను భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో వ్యక్తంచేశారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఆయన సంభాషణను 45 నిమిషాలకు ఎడిటింగ్చేసి శ్రోతల ముందుకు తెచ్చారు. సామాన్యులే చేసిన అసమాన్య పోరాటం ఎట్లా కొనసాగిందో యుద్ధవీరుడైన భీమిరెడ్డి నర్సింహారెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు. పాత నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని కరివిరాల కొత్తగూడెం మట్టిలో పురుడు పోసుకున్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆర్యసమాజ కార్యకర్తనుంచి కమ్యూనిస్టుగా మారిన తీరు సింహంలా తుపాకి పట్టుకుని పోరాడిన తీరు మొత్తంగా డాక్యుమెంటరీలో కనిపిస్తుంది. నంగినంగి వొంగివొంగి బాంచన్ దొరా నీకాల్మోక్తా అన్న మూగజీవాలు ఎట్లా ఎదురుతిరిగి పోరాడారో అందులో చూస్తాం. సూర్యాపేట నుంచి జనగామదాకా, జనగామ నుంచి జగిత్యాల దాకా ఈ విప్లవాగ్నులు ఎలా ప్రజ్వరిల్లాయో ఈ డాక్యుమెంటరీ ద్వారా చూడవచ్చును. చాకలి ఐలమ్మ బువ్వగింజలు పోరాటానికి శ్రీకారం చుడితే కడివెండి దొరగడీని, ఆ దొర అనుయాయులను తరిమికొట్టిన సాహసి భీమిరెడ్డి ఆనాటి అనుభవాలు ఇందులో చూడవచ్చు. వీర తెలంగాణ సాయుధపోరాటం 1944–1951 కాలంలోని సమగ్రపోరు రూపంకు ప్రాణంపోసిన తీరు ఈ డాక్యుమెంటరీలో ఉంది. ఈ భూపోరాటమే దేశంలో భూసంస్కరణలకు ప్రాణంపోసింది. ఈ డాక్యుమెంటరీ బీఎన్ జీవిత విశేషాలను కూడా కళ్లకుకట్టింది. ఆయన తెలంగాణ భూపోరాటానికి తొలికేక. గెరిల్లా సైన్యం దళపతి. ఆయనే కామ్రేడ్ బి.ఎన్.గా పిలువబడే భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఆయనను యాది చేసుకోవడమంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మననం చేసుకోవడమే. 1922లో నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం, కరివిరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించారు బీఎన్. బాల్యం నుంచే గొంతెత్తి కమ్మగా పాడేవాడు. అప్పుడు 8వ తరగతిలో వున్నాడు. ఓ పక్క వందేమాతరం ఉద్యమం, మరోపక్క ప్రపంచ యుద్ధం ఆయనలోని విప్లవకారుడ్ని తట్టి లేపాయి. ఆంధ్రమహాసభతో అనుబంధం పెంచుకున్నాడు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా గళమెత్తాడు. లెవీ పేరుతో రైతుల తిండిగింజలు దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులకు నిరసనగా జరిగిన 70 కిలోమీటర్ల రైతుల పాదయాత్రలో పాల్గొన్నాడు. దేశ్ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తొలిసారిగా దెబ్బలు రుచి చూశాడు. 1946 జూలై 4వ తేదీన జనగాం తాలూకా కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య ఆహుతయ్యాడు. దీంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనివార్యమైంది. చాకలి అయిలమ్మ తిరుగుబాటు, విసునూరి గడికి నిప్పంటుకునేలా చేసింది. 1947 ప్రారంభంలో కళాశాల విద్యార్థులు ‘క్విట్ కాలేజి’ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించింది. దీంతో గెరిల్లా పోరాటం అనివార్యమైంది. బీఎన్ గెరిల్లా దళపతి అయ్యాడు. పాత సూర్యాపేట, దేవరుప్పుల, ఆలేరు, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మిలిటరీకి చెమటలు పట్టించాడు. రావులపెంట, కోటపాడు, దివ్వెల గ్రామాల్లో జరిపిన దాడుల ద్వారా సేకరించిన ఆయుధాలతో సాయుధ పోరాటం కొనసాగించాడు. 1945–46లో మొండ్రాయి ప్రాంతంలో కడారు రాంచందర్రావు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అలాగే 1946 దేవరుప్పల పోరాటం, బాలెం గ్రామంలో జరిగిన బాహాబాహీ పోరాటం బీఎన్ సమర్థ నాయకత్వానికి మెచ్చుతునకగా చెప్పొచ్చు. 1947 నవంబర్లో భారత్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రైతాంగ పోరాట అణచివేతకు మిలిటరీ బలాన్ని అందించేది. దీంతో దున్నేవాడిదే భూమి పేరుతో రైతాంగ సాయుధ పోరాటం ముమ్మరమైంది. సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోవడంతో పోరాటం కొనసాగించాలా, లేక ఆపాలా? అన్నదానిపై కమ్యూనిస్టు పార్టీలో భేదాలు తలెత్తాయి. బీఎన్ మాత్రం పోరాటం వైపుకే మొగ్గు చూపాడు. ‘బండెనక బండి గట్టి, పదహారు బండ్లుగట్టి, ఏ బండ్లే పోతివి కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి’ అంటూ పాట రాసిన యాదగిరి ఆయన దళం సభ్యులే. పాలకుర్తి అయిలమ్మ ఘటనకూ నాయకుడు బీఎన్. అయిలమ్మ పంటకు రక్షణగా నిలబడి, విసునూరు దేశ్ముఖ్ గూండాలతో తలపడి, ఆరెకరాల పంటను ఆమె ఇంటికి చేర్చిన యోధుడు ఆయన. తెలంగాణలో యూనియన్ సైన్యాలు ప్రవేశించిన నేపథ్యంలో పోరాటాన్ని ఎలా కొనసాగించాలో చర్చించేందుకు సూర్యాపేట తాలూకా పాతర్లపాడు సమీపంలోని చిట్టడవిలోని కొండలమధ్య ఏరియా కమిటీ సమావేశం జరుగుతోంది. సుందరయ్య మాట్లాడుతున్నారు. ఇంతలో సెంట్రీ నుంచి ‘పోలీస్’ అన్న కేక. దాని వెనుకే తుపాకీ శబ్దం. ఆ శబ్దాన్ని బట్టే గ్రహించాడు బీఎన్. వచ్చింది పోలీసులు కాదు, అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన యూనియన్ సైన్యాలనీ. వ్యూహాత్మకంగా కాల్పులకు దిగకుండా తన రక్షణ వ్యవస్థకు ఆదేశాలిస్తూనే ఒక్కుదుటున గుహలోకి దూకి, నిద్రలో ఉన్న తన పసిబిడ్డను తీసుకొని చాకచక్యంగా నాయకులతో సహా అందరినీ శత్రువలయం నుంచి సురక్షితంగా తప్పించాడు. తెలంగాణలో సాయుధపోరాటానికి మొట్టమొదట ఆయుధ మెత్తిందీ, చిట్టచివర ఆయుధం దించిందీ బిఎనే. సీపీఐ(ఎం) నల్ల గొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, అఖిల భారత ఉపాధ్యక్షునిగా సుదీర్ఘకాలం పని చేసిన బీఎన్ మొదట పీడీఎఫ్, ఆ పైన సీపీఐ(ఎం) తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. బీబీనగర్–నల్లగొండ రైల్వే లైన్, శ్రీరాంసాగర్ రెండవదశ కాల్వల నిర్మాణాలు ఆయన పోరాట ఫలితంగా వచ్చినవే. కమ్యూనిస్టు నేతగా, సీనియర్ పార్లమెంటేరియన్గా పేరొంది, 2008లో కన్ను మూసేనాటికి తనకంటూ ఒక్క పైసా కూడా మిగుల్చుకోని ఓ నిరుపేద, నిస్వార్థ నాయకుడు బీఎన్! నాగలిపట్టిన రైతుచేతికి రైఫిల్ ఎలా వచ్చిందో బీఎన్ డాక్యుమెంటరీ చూస్తే అర్థం అవుతుంది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఈ డాక్యుమెంటరీలో అనేక అనుభవాలను చెప్పారు. కడివెండి, ముండ్రాయి, కోటపాడు, పాతసూర్యాపేట బాలెంల అనుభవాలు, ఆనాటి మిగిలివున్న తన సహచరులను గుర్తుచేస్తున్న దృశ్యాలు ఇందులో చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే భీమిరెడ్డి సైద్ధాంతికతను చెప్పే తాత్వికుడు కాదు. యుద్ధ భూమిమీద నిలిచిన యోధుడు. వ్యాసకర్త: ఎ. రజాహుస్సేన్, రచయిత, సాహిత్య విమర్శకుడు 90631 67117 -
విమోచన మీద కమ్ముకున్న మబ్బులు
‘‘మన అన్నల చంపిన మన చెల్లెళ్ల చెరిచిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండగ గుర్తుంచుకోవాలె కాలంబురాగానె కాటేసి తీరాలె పట్టిన చేతులను పొట్టులో బెట్టాలె తన్నిన కాళ్లను దాగలిగ వాడాలె...’’ ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి కాళోజీ కలాన్ని కదిలించింది! ఏ భావం కాళోజీ కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది! అదే 1948లో జరిగిన రజాకార్ల స్వైరవిహారం. ఒక్క కాళోజీనే కాదు; యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన దుశ్చర్య! రజాకార్ మూకల దాడులనెదుర్కోవడానికి సమాయత్తమైన ఈ పోతుగడ్డ ప్రజల ధైర్యసాహసాలు వేనోళ్లా్ల పొగడవచ్చు. విధి వక్రించినా, చరిత్ర తమను గుర్తించకున్నా ఉక్కుమనిషి పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది. అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కినరోజు. అదే సెప్టెంబర్ 17, 1948. క్రీ.శ.1656లో బతుకుదెరువు కోసం ఖులీజ్ ఖాన్ టర్కీలోని బోఖరా నుండి భారత్కు వచ్చాడు. నాటి మెుఘల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరాడు. అతని మనుమడే ఖుమ్రుద్దీన్. ‘నిజాముల్ ముల్కు’ అనే బిరుదు పొందాడు. వీళ్ళ వంశం ఆసఫ్జాహి. ఆ తర్వాత ఔరంగజేబు పాలనలోకి వచ్చాక దక్కన్ ప్రాంతానికి సుబేదార్లుగా, ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ నవాబులయ్యారు. ఈ నవాబుల్లో చివరివాడు, ఏడవవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. కొందరు పేర్కొన్నట్లు నవాబు అభివృద్ధి కారకుడైతే, పరమత సహనం కలవాడైతే భాగ్య (భాగ్) నగరం హైదరాబాద్గా, భాగీరథి మహ్మద్బీగా, భాగమతి హైదర్బీగా ఎందుకు మారాయో చరిత్రలో ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. 1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏర్పడింది. 1937లో మతపరివర్తన ఉద్యమం ‘తబ్లీగ్’ ప్రారంభించింది. సంస్థానంలోని హరిజనులకు భూములు, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని మత మార్పిడి చేశారు. బహదూర్ యార్ జంగ్ మరణం తర్వాత మజ్లిస్ అధ్యక్ష పదవి ఖాసీంరజ్వీకి లభిం చింది. రజాకార్ అనే మాటకు వాలంటీర్ అని అర్థం. సేవా దృక్పథం ఉండాల్సిన రజాకార్లు, వారి అధ్యక్షుడు పరమత సహనం కోల్పోయారు. 1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకొంటుంటే ఈ నైజాం ప్రాంతంలో బతుకమ్మ పండుగ మెుదలైంది. వాడీ స్టే్టషన్ దాటిన రైలును ఆపి అందులో స్త్రీలను దించి, ట్రక్కుల్లో ఎక్కించారు. గాండ్లాపూర్ సమీపంలోని ఠాణాకు తీసుకెళ్ళి వాళ్ళను వివస్త్రల్ని చేసి లాఠీలతో కొడుతూ బతుకమ్మ ఆడించారు. ఈ దురాగతాల్ని నెహ్రూ 1947 సెప్టెంబర్ 7న నిరసించారు. హైదరాబాద్ సమీపంలో అమీర్పేట గ్రామంలోకి మహమ్మద్ అస్లం, మహ్మద్ కరీం అనే రజాకార్లు ప్రవేశించారు. స్త్రీల ముక్కుపుడకలను లాగి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించారు. సైదాబాద్లో 15 మంది స్త్రీలను మానభంగం చేశారు. ఆనాటి పంజగుట్ట గ్రామంలో భర్తల ఎదుట తల్లీ కూతుళ్ళపై ఖాదర్జిలాని, సికిందర్ఖాన్, అబ్దుల్ జబ్బార్ అనే నాయకుల నేతృత్వంలో క్రూరమైన అత్యాచారం జరిగింది. ఈ దుస్సంఘటల్ని ఖండిస్తూ ఇమ్రోజ్ పత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. వాటిని రాసిన షోయబుల్లాఖాన్ను కిరాతకంగా రజాకార్లు హత్య చేశారు. ఈ హత్య తర్వాత నెహ్రూ మేల్కొన్నారు. విద్యార్థులు, రైతులు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్కు తరలించారు వల్లభ్భాయ్ పటేల్. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన అనంతరం నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఎలాంటి రక్తపాతం జరక్కుండానే సెప్టెంబర్ 17న నిజాం తలవంచాడు. ఏ జాతి తమ చరిత్ర లోతుపాతులను విస్మరించి కరదీపిక లేకుండా ప్రయాణం చేస్తుందో, ఆ జాతి త్వరలోనే ధ్వంసం అవడం ఖాయం అంటాడో చరిత్రకారుడు. మసిపూసి మారేడు కాయ చేసి కొందరి పట్ల ‘రాగం’, మరికొందరి పట్ల ‘ద్వేషం’ కల్గించే పక్షపాతుల చేతుల్లో చరిత్ర పడితే? సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంపై కూడా అలాంటి ఎర్రమబ్బులు కమ్ముకొన్నాయి. నరకుణ్ణి చంపిన రోజును దీపావళిగా జరుపుకొనే సంస్కృతిని ఏమార్చి, ‘నరకాసురుడు’ నాయకుడు అనడానికి అలవాటుపడ్డ చారిత్రకులకు ఈ దేశంలో కొదవలేదు. ‘‘నా సిద్ధాంతాన్ని అగ్నిలో వేసి పరీక్షించుకోవచ్చు’’ అని గౌతమబుద్ధుడు చెప్పినట్లే మనమూ సరైన చరిత్రను సమాజం ముందు పెట్టి క్షీరనీర న్యాయం కోరుకుందాం! (రేపు తెలంగాణ విమోచన దినం) వ్యాసకర్త: డా.పి. భాస్కరయోగి, ప్రముఖ రచయిత, కాలమిస్టు మొబైల్ : 99120 70125 -
కుక్కకున్న విలువ లేదా?: ప్రహ్లాద్ జోషి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్య మంత్రి ఇంటి కుక్కకు ఉన్న విలువ తెలంగాణ కోసం బలిదానం చేసిన వారికి లేదా? అని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. అంత విలువ ఇచ్చేవారైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కారులో మజ్లిస్ సవారీ చేస్తోందన్నారు. కారు రిమోట్ మజ్లిస్ చేతుల్లో ఉందని స్టీరింగ్ మాత్రం కేసీఆర్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని 20 ఏళ్లుగా బీజేపీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రంలో మరో నిజాం పాలన నడుస్తోందని, రాచరిక వ్యవస్థను తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అధికారికంగా నిర్వహించాల్సిందే..
సాక్షి, సంగారెడ్డి: ఎంతోమంది త్యాగధనుల ఫలితంగా నిజాం నవాబు నిరంకుశ పాలన నుంచి విమోచనం పొందిన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలల్సిందేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 13 నెలల తర్వాత నిజాం నుంచి తెలంగాణకు విముక్తి లభించినా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మజ్లిస్కు భయపడి కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదని విమర్శించారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారిని, ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ సంస్కారం కూడా లేదా.. రాష్ట్ర హోం మంత్రికే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే.. ప్రజలను ఏం కలుస్తావని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్ను సస్పెండ్ చేస్తారు కానీ.. విమోచనం కోసం పోరాడిన వారిని స్మరించుకునే సంస్కారం కూడా ఆయనకు లేదని నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన్మంత్రి ఆవాస్యోజన, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, కిసాన్ యోజన, కిసాన్ పింఛన్ యోజన, తదితర పథకాలు రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలకు కేసీఆర్ కీడు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెంచిన అంచనా వ్యయాలను బట్టే కేసీఆర్ అవినీతి అర్థమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పారు. మజ్లిస్ కనుసన్నల్లో పాలన: జి.కిషన్రెడ్డి మజ్లిస్ పార్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్కు భయపడి విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదని నిజాం పాలన తనకు ఆదర్శమని కేసీఆర్ చెప్పడం తెలంగాణ ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై హత్యలు, అరాచకాలు, మానభంగాలు, అకృత్యాలు జరిగాయన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రజాకార్ల వారసత్వ పార్టీ మజ్లిస్ అని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఊరూరా విజయవంతమైందని, ఇదే ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలి: లక్ష్మణ్ కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. విమోచన దినాన్ని జరపాలని బీజేపీ సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తోందని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కుమ్రం భీం వంటి త్యాగధనులున్న ఈ తెలంగాణలో విమోచన దినాన్ని జరపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రాన్ని కోరి విమోచన దినాన్ని అధికారికంగా జరిపించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, ఎంపీలు సోయం బాబురావు, ధర్మపురి అరవింద్, గరికపాటి రాంమోహన్రావు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, డీకే అరుణ, బాబూమోహన్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, పి.శశిధర్రెడ్డి, విజయపాల్రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. -
'బైరాన్పల్లి అమరవీరుల ఆశయాలు పూర్తి కాలేదు'
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దూరు మండలం బైరాన్పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, స్వామి పరిపూర్ణానందలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ... బైరాన్పల్లి పోరాట చరిత్ర మరిచి పోలేనిదని, అక్కడి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. వారి త్యాగాలను, ఆశయాలను వృధా పోనివ్వకుండా చూస్తామని తెలిపారు. అప్పటి నిజాం సేనలు బైరాన్పల్లిలో వందలమందిని కాల్చి చంపితే ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గు లేకుండా నిజాంను పొగుడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాల సాధన కోసం బీజేపీ ఎప్పటికి పాటు పడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో కాషాయజెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉందని స్వామి పరిపూర్ణానంద వెల్లడించారు. ఒకేరోజులో 118మంది బైరాన్పల్లి వాసులను నిజాం రజాకార్లు బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నేను యదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తానంటే తనను రాష్ట్రం నుంచి బహిష్కరించిన కేసీఆర్ను సంవత్సరం తిరగకముందే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమంత్రి బొమ్మలను బహిష్కరించారని పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'విమోచన దినోత్సవం రోజు కేసీఆర్ గురించి వద్దు'
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విమోచన దినోత్సవం రోజు అమరుల గురించి మాట్లాడుకోవాలి తప్ప కేసీఆర్ గూర్చి మాట్లాడితే మన నోరే పాడైతది’ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న జరపుకునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించవద్దని కొందరు మేధావులు తనకు చెప్పారని కేసీఆర్ మాటలు మాట్లాడుతున్నారు. మీది అసలు నోరేనా? అంటూ... ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా జరపాలని డిమాండ్ చేసిన విషయాన్ని మరిచారా? అని మండిపడ్డారు. కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన మాటలలపై స్పందిస్తూ.. పదేళ్లు ఉంటామా? ఇరవై ఏళ్లు బతుకుతామా? అన్నది ముఖ్యం కాదు ప్రజల గుండెల్లో బతకాలని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి అని, అతడి త్యాగాన్ని కళ్లారా చూసి తట్టుకోలేక తన మంత్రి పదవిని సైతం వదిలేశానని కోమటిరెడ్డి... ఆగస్టు 27న ఒకే రోజు 118 మందిని రజాకార్లు పొట్టన పెట్టుకున్నారని చరిత్రను గుర్తు చేశారు. నిజాం, రజాకార్లపై వీరోచిత పోరాటం చేసిన బైరాన్పల్లి వీరులు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైరాన్పల్లికి ప్రతి ఏటా 20 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు. -
ఖమ్మంలో ఘనంగా మోదీ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి స్పెషల్ ఆఫీసర్లు నియమించి, ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగే దోపిడీని అరికట్టాలని పొంగులేటి అన్నారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి పొంగులేటి సంతాపం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరపి, ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. -
‘ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం’
సాక్షి, నిజామాబాద్: ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరయిన ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన సీఎం కేసీఆర్ ఎంఐఎంతో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో పదేళ్లు తానే సీఎం అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏడాదిలోపే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధులను మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారని.. కాంగ్రెస్ నేత చిదంబరానికి పట్టిన గతే సీఎం కేసీఆర్కు పడుతుందని జోస్యం చెప్పారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
విముక్తి పోరులో ఇందూరు వీరులు..
ఆ రోజు 1947 ఆగస్టు 15.. ఆంగ్లేయుల పీడ విరగడంతో భారతావని వెలుగు దివ్వెలతో పండుగ జరుపుకుంటోంది. కానీ హైదరాబాద్ స్టేట్ మాత్రం నిరంకుశ నిజాం నీడలో.. చిమ్మచీకట్లు కప్పుకుని ఉంది. ఓ వైపు దేశమంతా సంబురాలు జరుపుకుంటుంటే.. మన తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకార్ల ఆగడాలతో కన్నీళ్లు కారుస్తోంది. కానీ.. ఏడిచిన ఆ కళ్లే.. రానురాను ఎరుపెక్కాయి. ఆనాటి ప్రభుత్వ దాష్టీకాలు, రజాకార్ల దౌర్జన్యాలపై నిప్పులు కురిపించాయి. తరతరాలుగా పట్టిపీడిస్తున్న నిజాం సర్కారును కూలదోసేందుకు.. స్వతంత్ర భారతంలో స్వేచ్ఛావాయువులను పీల్చేందుకు పదమూడు నెలల పాటు తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. ఈ పోరులో మన ఇందూరు కీలకమైన పాత్ర పోషించింది. ఆనాడు జరిగిన పోరాటంలో ఎంతోమంది జిల్లావాసులు రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి పోరాడారు. ఎంతోమంది తమ ప్రాణాలనూ అర్పించి.. అమరులయ్యారు. ఎట్టకేలకు 1948 సెప్టెంబర్ 17వరకు హైదరాబాద్ స్టేట్ భారతావనిలో కలిసింది. చీకటిపాలనకు చరమగీతం నిజామాబాద్ కల్చరల్: నా తెలంగాణ కోటి రతనాల వీణ.. తెలంగాణలోని సబ్బండ వర్ణాలకు నినాదంగా మారింది. అంత గొప్ప పేరొందిన కవితను దాశరథి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఖిల్లా జైలు గోడలపై బొగ్గుతో రాశారంటే జిల్లా జైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 రోజున నిజాం పాలన అంతమైంది. భారత సైన్యం పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ స్టేట్ను హస్తగతం చేసుకోవడంతో రజాకారుల మారణహోమం ఆగింది. నిజాం నిరంకుశ పాలన హైదరాబాద్ సంస్థానానికి మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆనాటి నవాబుగా కొనసాగిన నిరంకుశుడు. బ్రిటీష్వారి అండదండలతో ఇక్కడి ప్రజలను అణచివేయడానికి కుట్రలు పన్నారు. ముస్లిం రజాకార్లు అమాయక ప్రజలను హింసించేవారు. హైదరాబాద్ స్టేట్లో ఆనాడు తెలంగాణ, మరఠ్వాడ, కర్ణాటక అనే మూడు భాషల ప్రాంతాలున్నాయి. జాగిర్దారులు, నవాబులు, దొరలు, దేశ్ముఖ్లు, వతందారులు, పట్నెలు తదితరులు నిజాంకు సహకరించారు. ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు ప్రజలను హింసించేవారు. ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడేవారు. హైదరాబాద్కు విముక్తి నిజాం ఉస్మాన్అలీఖాన్ చేస్తున్న దురాగతాలను భారత ప్రభుత్వం ఆగ్రహానికి లోను చేసింది. ఇందులో భాగంగానే ఆలీంఖాన్ను లొంగదీయడం ఒకటే మార్గమని భావించి సర్దార్ వల్లబాయ్ పటేల్ నేతృత్వంలోని భారత సైనిక బలగాలు హైదరాబాద్ను ముట్టడించాయి. దీంతో సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోయాడు. తెలంగాణ స్వతంత్ర భారతావణిలో అంతర్భాగమైంది. ‘బానిస’వాడకు విముక్తి భారత సైన్యం రజాకార్లను బంధించిన డాక్బంగ్లా ఇదే..(నేటి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్) నిజాం హయాంలో రజాకార్ల హింసకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత బాన్సువాడవాసులది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి విముక్తి పొందారు. పల్లెల్లో రజాకర్లను ఎదురించలేక కొంతమంది గ్రామీణులు వారి ఇళ్ళలో బానిసలుగా పనులు చేస్తూ జీవించారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని బానిసవాడ అని పిలిచేవారు. రజాకార్ల దౌర్జన్యాలు భరించలేక ప్రజలు పోరుబాట పట్టారు. చివరకు ఆపరేషన్ పోలో పేరుతో 1948 సెప్టెంబర్ 14న భారత సైన్యం బాన్సువాడ తాలుకాకేంద్రాన్ని చుట్టుముట్టింది. రజాకర్ల కోసం సైనికులు అడుగడుగునా వేట కొనసాగించారు. ప్రజల్లో నూతనోత్సాహంతో సైన్యానికి సహకరించారు. భారత సైన్యం ఐదువందల మంది రజాకర్లను అరెస్ట్ చేసి డాక్బంగ్లా(ఆర్అండ్బీ అతిథిగృహం)లో నిర్భందించింది. చేతికి చిక్కిన రజాకార్లను ప్రజలు చితకబాదారు. కొందర్ని హత్యచేసి మంజీరనదిలో పడేశారు. అనంతరం బానిసవాడగా ఉన్న ప్రాంతం బాన్సువాడగా మారింది. రజాకర్లపై రణం కట్టి.. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లపై తూటాలు పేల్చిన ఫిరంగి మోర్తాడ్(బాల్కొండ): అవి అఖండ భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజులు.. దేశమంతటా మువ్వన్నెల జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం నిజాం రజాకార్లు నిరంకుశంగా పాలన సాగిస్తున్నారు. రజాకార్ల ఆగడాలు శృతి మించడంతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఉద్యమకారులు పిలుపునిచ్చారు. కొందరు హింసా మార్గంలో మరి కొందరు బాపూజీ చూపిన అహింసా మార్గంలో తెలంగాణ విముక్తి కోసం ఉద్యమాన్ని కొనసాగించారు. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లపై రణం కట్టి, కత్తిపట్టి విరోచితంగా పోరాటం సాగించిన ఖిల్లాగా నిజామాబాద్కు ఘనమైన చరిత్రను మన ఉద్యమకారులు సొంతం చేశారు. తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో జైలు పాలయ్యారు. వారి పోరాట ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం లభించింది. అఖండ భారతావనిలో తెలంగాణ ఒక భాగమైంది. ఆర్య సమాజ్ కీలక పాత్ర తెలంగాణ విముక్తి కోసం సాగించిన ఉద్యమంలో ఆర్య సమాజ్ కీలక ప్రాత పోషించింది. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చౌట్పల్లి నారాయణరెడ్డి ఆర్య, చౌట్పల్లి శ్రీనివాస్రెడ్డి, పడిగెల హన్మాండ్లు, నారాయణ లింగారెడ్డి, నీలకంఠ నారాయణ, పడకల్ శ్రీనివాస్రెడ్డి, శంభులింగం, లక్ష్మాగౌడ్, బ్రహ్మయ్య, వెంకటస్వామి, బొంబాయి నర్సింహారెడ్డి, నర్సింహారావు, నరసింహశాస్త్రి, కొండా నారాయణ, ఉప్పు లక్ష్మయ్య, జె.హన్మంత్రెడ్డి, టి.రంగారెడ్డిలు రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రభావితులయ్యారు. ఉద్యమాన్ని ఉవెత్తుకు తీసుకువెళ్లడానికి మన వారు రామానంద తీర్థకు ఎంతో సహకరించారు. 1947 ఆగస్టు 15న దేశమంతటా త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతుంటే నిజాం పాలనలో ఉన్న మనకు ఆ స్వేచ్ఛను రజాకర్లు హరించారు. కానీ మన సమరయోధులు మాత్రం రజాకర్ల ఆజ్ఞలను లెక్క చేయకుండా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ప్రజాసేవలో తరించిన తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన పలువురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పదవులను పొందారు. ప్రజాసేవలో తరించిన వారిలో ఎం. నారాయణరెడ్డి, అర్గుల్ రాజారాం, చౌట్పల్లి హన్మంత్రెడ్డి తదితరులు ఉన్నారు. సుంకెట్కు చెందిన ఎం. నారాయణరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. బడుగుల నేతగా గుర్తింపు పొందిన అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గానికి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు చేనేత, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. ఇప్పటికి అర్గుల్ రాజారాం అంటే తెలియనివారు లేక పోవడం విశేషం. చౌట్పల్లి హన్మంత్రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపికయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఆవాసం ఇచ్చిన మోర్తాడ్ బురుజు రజాకార్ల హింసలు ఆనాటి రజాకారుల దుచ్చార్యలు ప్రత్యక్షంగా చూశాను. ప్రజలను గోరాతిగోరంగా హింసించేవారు. నిజాంకు వ్యతిరేకంగా ఏ పని చేసినా జైలుకు పంపేవారు. మా వారిని 13 నెలలు ఖిల్లా జైలులో బంధించారు. రజాకారులు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. – విజయలక్ష్మి, స్వాతంత్య్ర సమరయోధుడి భార్య, సుభాష్నగర్ విమోచన దినం స్వాతంత్య్రం వచ్చే నాటికి దాదాపు 500 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వీటన్నింటిని భారత్దేశంలో విలీనం చేయాల్సిన గురుతర బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వీకరించారు. నిజాంపాలనలో ప్రజల బాధలను తెలుసుకొని నిజాం ఉస్మాన్ అలీఖాన్ను భారత్ సైనిక బలగాలతో హైదరాబాద్ను చుట్టుముట్టి లొబర్చుకున్నాడు. తెలంగాణ స్వాతంత్య్రం వచ్చిన రోజు ఇది. – ఏనుగు బాల్రెడ్డి, ఎల్లమ్మగుట్ట ఖిల్లా జైలులో కవులు చరిత్రకు నిదర్శనం ఇందూరు ఖిల్లా జైలు. తెలంగాణ విమోచన సమయంలో అనేక మందిని ఈ జైల్లో బంధించారు. అందులో దాశరథి రంగాచార్యులు, విఠల్దాస్, నల్లనర్సింహారెడ్డి, అళ్వారులు, రాధాకృష్ణమోదాని, ఆకుల పెద్దచిన్నయ్య తదితరులను జైల్లో ఉంచారు. రజాకారులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఖిల్లా జైల్లో వేసి హింసించారు. – నారాయణరెడ్డి, గాందేయవాది విమోచనంలో ఆర్యసమాజ్ కీలక పాత్ర నిత్యం హోమంతో పాటు దేశభక్తిని ప్రబోధించడమే కాకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో కార్యకర్తకు ప్రేరణ ఇచ్చింది ఆర్యసమాజం. 1939 జనవరి 30న ఇందూరు జిల్లాలో నిజాం నిరసన దినాన్ని నిర్వహించారు. 1943లో కాశీనాథశాస్త్రి అధ్యక్షతన ఆర్య సమావేశాన్ని నిర్వహించారు. 1946లో దార్గల్లిలో 50 మంది రజాకారుల సైన్యంపై ఆర్యసమాజం కార్యకర్తలు దాడి చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం మూడేండ్లు సంస్థ ప్రతినిధులను ఖిల్లా జైల్లో బంధించారు. - తులసీదాస్ ఆర్య, గౌతంనగర్ -
‘నిజాం ఆగడాలు విన్నాం...ఇప్పుడు చూస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్ : చరిత్రను తవ్వితే లాభం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ విమెచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తేనే విమోచన దినోత్సవం అధికారకంగా నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. సెప్టెంబర్ 17న తిరంగా యాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ క్రమంలో ఊరి నిండా జాతీయ జెండా నినాదంతో.. పల్లె పల్లెలో జాతీయ పతాకాలు ఎగురవేస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ‘యాదాద్రిపై కేసీఆర్ బొమ్మ చెక్కించుకున్నారు. నిజాం ఆగడాలు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.(చదవండి : తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు) మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు సర్దార్ వల్లభబాయ్ పటేల్ దూరదృష్టితో తెలంగాణ కు విమోచనం లభించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్ విలీన అంశాన్ని పటేల్ డీల్ చేసి విముక్తి కల్పించారు. కశ్మీర్ను అంశాన్ని డీల్ చేసిన నెహ్రూ 370 ఆర్టికల్ పేరుతో ఆ ప్రాంతాన్ని సమస్యాత్మకంగా మార్చారు. నేడు ప్రధాని మోదీ, అమిత్ షా చొరవతో కశ్మీర్ సమస్య పరిష్కారమైంది. 370 ఆర్టికల్ రద్దు అయ్యింది అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోకేసీఆర్ కారుపై మజ్లీస్ సవారీ చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ‘కారు రిమోట్ మజ్లీస్ చేతిలో ఉంది. రాజు గారి కుక్క చనిపోతే డాక్టరును సస్పెండ్ చేస్తారు. మనుషుల ప్రాణాలంటే కేసీఆర్కు లెక్కలేదు’ అని ఘాటుగా విమర్శించారు. -
తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నేటికీ జరుపుకోలేకపోవడంతో నాటి తెలంగాణ పోరాట యోధుల ఆత్మలు ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. నాటి భారత హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తోనే ప్రజలకు స్వతంత్రం లభించింది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గడం, మైనార్టీల ఓట్ల కోసం పాట్లు కారణం కావచ్చు.. హిందూ మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం పాలనను ఎంతో గొప్ప పరిపాలనగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ నిర్వహించకపోవటం బాధాకరం. తెలంగాణ సాయుధ పోరాట విరమణకు సంబంధించి నాటి కమ్యూనిస్టు ఉద్యమ నేతల మధ్య విభేదాలు ఉండటం కూడా గమనార్హం. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి గోల్కొండ కోట కింద నీ గోరి కడతాం నైజాం సర్కరోడా’ అంటూ నినదించిన నాటి తెలంగాణ పోరాట యోధుల ఆత్మలు ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. కారణం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేకపోవడమే. ఉద్యమాల గడ్డ తెలంగాణ ఆది నుంచి తన విశిష్టతలను చాటుకుంటోంది. భారతదేశానికి ఆగస్టు 15 1947న స్వాతం త్య్రం వస్తే తర్వాత 13 నెలల 2 రోజులకు అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ స్వేచ్ఛ పొందింది. నిరంకుశ నిజాం నవాబు పాలన నుంచి పూర్తిగా విముక్తమైంది. నాటి భారత హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తోనే ప్రజలకు స్వతంత్రం లభిం చింది. అయితే ఉమ్మడి రాష్ట్ర పాలకులే దుర్బుద్ధితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు. కారణం నిజాం రజాకార్ల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గడమే. హైదరాబాద్ సంస్థానంలో హిందువులను, హిందూ మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం పాలనను ఎంతో గొప్ప పరిపాలనగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారంటే మైనార్టీల ఓట్ల కోసమేనని విడమరిచి చెప్పనవసరం లేదు. రజాకార్ల హింస అమానుషం నిజాం పాలన నుంచి విముక్తి కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు ఎంతోమంది బలిదానాలు చేయవలసి వచ్చింది. రాక్షసత్వానికి మారు పేరు అయిన రజాకార్లు, నిజాం అధికారులు హిందూ మహిళల చేత నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. పన్నులు కట్టలేని నిరుపేద రైతులను మండుటెండలలో వంగోపెట్టి గుండెలపై బండలు ఎత్తిం చారు. సలసల కాగే నూనెలో చేతులు పెట్టించారు. బహిరంగంగా ఉరి తీసేవారు. ఆడపిల్లలను ఎత్తుకు పోయి అత్యాచారాలు చేసేవారు. ఇంకా ఎన్నో దురాగతాలకు పాల్పడేవారు. జైళ్లలో ఉద్య మకారులకు విషం ఇచ్చి చంపేవారు. వీరి దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పరకాలలో వంద మందిని చెట్టుకఅు కట్టేసి కాల్చి చంపేశారు. బీబీ నగర్లో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు చిన్న పిల్లలను సైతం కర్కశత్వంగా నరికేసి ఆ ఊరిపై పడి బీభత్సాన్ని సృష్టించారు. ‘ఉరులమర్రి’ చెబుతున్న సాక్ష్యం రజాకార్లను మూడుసార్లు పారిపోయేలా చేసిన జైరాంపల్లి వాసులు 92 మందిని, కూటిగాట్లలో 25 మంది ఉద్యమకారులను, ఏరుపాలెంలో 70 మందిని, పెరుమాండ్ల సంకేసలో 21 మంది రైతులను, ఈ విధంగా రజాకార్ల ఆకృత్యాలను ఎదురించిన నల్గొండ జిల్లాలో మొత్తం 2,000 మందికి పైగా రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. షోలాపూర్ సమీపంలోని మంగోలు గ్రామంలో 43 మందిని స్త్రీ పురుషులను చెట్లకు కట్టేసి తుపాకీ మడమలతో చచ్చేంతవరకు కొడుతూ పైశాచికానందాన్ని పొందారంటే నిజాం పాలన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్లో స్త్రీలను వాళ్ళ భర్తలు, పిల్లలు చూస్తుం డగానే చెరిచారు. పంజాగుట్టలో తల్లి కూతుళ్లను కూడా బలాత్కరించారు. నిర్మల్లో వందలాది మందిని మర్రి చెట్టు కొమ్మలకు బహిరంగంగా ఉరి తీశారు. దీనితో ఆ మర్రి చెట్టుకు ‘ఉరుల మర్రి’గా పేరొచ్చింది. కొడకండ్లలో బ్రాహ్మణులను చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడ దీసి కింద మంటపెట్టి సజీవ దహనం చేయటం కేసీఆర్ మెచ్చుకున్న నిజాం పాలనలో రాక్షసత్వానికి కొన్ని మచ్చు తునకలు. దాదాపుగా తెలంగాణ పల్లెల్లో ఇదే దుస్థితి. బలవంతపు మత మార్పిడులు హైదరాబాద్ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణలో మత మార్పిడుల కోసం స్థాపించిన అంజుమన్–2 –తిజ్లిక్–ఎ–ఇస్లాం కాలక్రమంలో మజ్లిస్ ఇథెహాదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) అయింది. ముస్లిం ఎక్తేదార్ అంటే ముస్లిం ఆధిక్యత అని సంస్థ నినాదం. ఎంతో మంది హిందువులపై హత్యాచారాలు చేసి, ప్రలోభాలకు గురిచేసి, మరికొంతమందిని బలవంతంగా ముస్లింలుగా మార్చింది ఈ రాక్షస మూక. ఈ దౌర్జన్యాలను రాష్రీ్టయ స్వయం సేవక్ సంఘ్ (ఆరె స్సెస్), ఆర్య సమాజ్తో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ప్రతిఘటించాయి. రజాకార్ల దౌర్జన్యాలను అడ్డుకునేందుకు దొడ్డి కొమురయ్య, కొమరం బీం, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మలాంటి ఉద్యమకారులు ఎందరో ప్రయత్నించి అసువులు బాశారు. కమ్యూనిస్టుల ‘తప్పు’టడుగులు! భారతదేశంలో మొదటినుంచి కమ్యూనిస్టులు చిత్ర విచిత్రమైన విధానాలనే అనుసరిస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగడానికి వారు కూడా కారణమే. బ్రిటిష్ పాలకులు దేశం నుంచి వెళ్లిపోతూ నెహ్రు నేతృత్వంలోని ప్రభుత్వానికి అధికారాలు అప్పగించారు. దీనితో బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించాలంటూ భారత కమ్యూనిస్టులను కోరడంతో ఒక్కసారిగా వారికి నెహ్రూ గొప్ప కమ్యూనిస్టుగా కనిపించారు. అయితే 1947లో ఉక్రెయి¯Œ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం నిరాకరించేసరికి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ పాలసీ మారి పోయింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నిటిని వ్యతిరేకించాలని తీర్మానించారు. అప్పటినుంచి మిలిటెంట్ కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. నెహ్రూ కూడా వారికి సామ్రాజ్యవాద శక్తుల తొత్తుగా కన్పించారు. దీనితో నెహ్రు ప్రభుత్వాన్ని కూలదోయాలని భారత కమ్యూనిస్టులు తీర్మానించారు. భారత సైన్యంపై గుడ్డి వ్యతిరేకత నిజాం రాజ్యంలో కూడా కమ్యూనిస్టులు నిజాంకు అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు హైదరాబాద్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘భారత ప్రభుత్వం బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వం. అది బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో లంకె వేసుకుంది. కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో భారత సైన్యాల ప్రవేశాన్ని వ్యతిరేకించాలి. హైదరాబాద్ను భారతదేశంలో కలిపి వేసుకునే అన్ని ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలి’ ఇది ఆ ప్రకటన సారాంశం. అంతేకాదు స్వతంత్ర హైదరాబాద్ ఏర్పడాలి అని కూడా నినదిం చారు. దీనితో నిజాంకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. స్వతంత్ర హైదరాబాద్కు మద్దతిచ్చేవారు లేక చతికిలపడ్డ నిజాంకు కమ్యూనిస్టులు మిత్రులుగా మారారు. అంతకుముందు ఇదే నిజాం చేతిలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కమ్యూనిస్టుల వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. భారత ప్రభుత్వంతో పోరాడేందుకు నిజాం నుంచి వారికి ఆయుధాలు కూడా అందాయి అంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. నేతల విభేదాల్లో దాగిన చరిత్ర హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం విజయం సాధించినా కమ్యూనిస్టుల అరాచకాలు ఆగలేదు. భారత దేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు’ అనే పుస్తకంలో పుచ్చలపల్లి సుందరయ్య కేవలం తెలంగాణ రైతాంగం సాధించుకున్న భూముల పరిరక్షణ కోసమే.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన తరువాత కూడా, సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అనుకున్నారని పేర్కొన్నారు. అయితే పార్టీకి చెందిన రావి నారాయణరెడ్డి ‘పోలీస్ చర్యకు కొంతమేరకు భూస్వామ్య వ్యతిరేక స్వభావం కూడా ఉంది. తర్వాత ఏర్పడిన సైనిక పాలకులు రాష్ట్రంలోని జాగీర్దార్ విధానాన్ని రద్దు చేశారు. అభ్యుదయకరమైన ఒక కౌలుదారీ చట్టాన్ని రూపొం దించటం వలన పై అంశం రుజువు అవుతుంది’ అని ‘వీర తెలంగాణ –నా అనుభవాలు, జ్ఞాపకాలు’ పుట 70లో విశ్లేషించారు. ఆయన తన ‘తెలంగాణ నగ్నస్వరూపం’ అనే డాక్యుమెంట్లో నిర్మొహమాటంగా ‘చారిత్రక నేరం.. ఆంధ్ర నాయకత్వం బాధ్యులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ.. పోలీస్ చర్య తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికీ, మిలటరీకీ వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగిం చడం పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతం లాంటిదని అంటే తప్పేం కాదు’ అని పేర్కొన్నారు అంటే ఆనాడు భారత కమ్యూని స్టులు చేసిన తప్పుడు నిర్ణయాలు ఎలా ఉండేవో తెలుస్తుంది. హైదరాబాద్ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ నిర్వహించకపోవటం బాధాకరం. జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోం శాఖ సహాయమంత్రి -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కోరింది. ఈ మేరకు గవర్నర్కు వినతి పత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా బీజేపీ నేత విద్యాసాగర్రావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఇందుకోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు విమోచన దినోత్సవాన్ని అధికారికం గా నిర్వహించాలని కోరుతున్నారని చెప్పారు. రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్కు కేసీఆర్ భయపడుతు న్నారన్నారు. సాయుధ పోరాటంలో ప్రాణాల రి్పంచిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో త్యాగధనుల చరిత్రను తొక్కి పెడుతున్నారన్నారు. సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి, బైక్ ర్యాలీ చేపడతామన్నారు. గవర్నర్ను కలసిన వారిలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్, బీజేపీ నేతలు డీకే అరుణ, పెద్దిరెడ్డి, జితేందర్రెడ్డి, వివేక్, రవీంద్రనాయక్, ఇంద్రసేనారెడ్డి, ఆకుల విజయ, తెలం గాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్రెడ్డి ఉన్నారు. -
కేసీఆర్ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. విపక్షంలో ఉన్నపుడు విమోచన దినోత్సవాన్ని జరుపుతామంటూ అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటల తీరుతో ఊసరవెల్లి సైతం తలదించుకుంటుందని విమర్శించారు. మాటమార్చిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ కారులను విస్మరిస్తున్నారని, వారి చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్ , డీకే అరుణ , జితేందర్ రెడ్డి, ఆకుల విజయ, ఇంద్రసేనా రెడ్డి, పెద్దిరెడ్డి, వివేక్లు శనివారం గవర్నర్ తమిళిసైను కలిశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల చరిత్ర వెలుగులోకి రావాలనే ఉద్యమ కారుల చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. సెప్టెంబర్ 17న ఊరు నిండా జాతీయ జెండా.. తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పటాన్ చెరువులో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తీరుకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా తమతో కలిసి రావాలని కోరారు. 20 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. -
విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. విమోచన దినోత్సవాన్ని నిర్వహించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్ఎస్ పార్టీ.. ఎంఐఎం అడుగులకు మడుగులొత్తుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించి భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలో, ఉద్యమ పోరాటాన్ని వివరిస్తూ తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలసి ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ప్రారంభించారు. బైరాం పల్లి కాల్పుల ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్ని, ఆ ఉదంతం ప్రత్యక్ష సాక్షులను ఈ సందర్భంగా సన్మానించారు. నాడొక మాట.. నేడొక మాట అధికారంలోకి కాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పటి సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు మిన్నకుండిపోతున్నారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏంఐఎంకు తాకట్టుపెడుతోందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ చరిత్రను మాత్రమే చెప్పుకొనేలా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. విమోచన ఉద్యమ పోరాటాన్ని ప్రతిఒక్కరికీ తెలిసేలా కృషి చేస్తామని మనోజ్ తివారీ అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు డి.అరవింద్, మోహన్రావు, సీనియర్ నేతలు శ్రీరాం వెదిరే, సత్యకుమార్, పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమర వీరులను కేసీఆర్ అవమానిస్తున్నారు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మతం కోణంలో చూడకూడదని.. నిజాంకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా అందరూ పోరాటం చేశారని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్రెడ్డి అన్నారు. ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్లో రేపు (మంగళవారం) జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ చారిత్రక ఘట్టాల ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 17 సెప్టెంబర్ 1948 సంబంధించి పోరాట తెలంగాణ విమోచన పోరాట వీరుల చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్,మురళీధర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య పోరాట యోధులకు ఘన నివాళర్పించి స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు..? సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటకలలో నిర్వహిస్తుంటే తెలంగాణలో చేసేందుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ కి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదా అని ప్రశ్నించారు. దేశం మొత్తానికి తెలంగాణ విమోచన దినోత్సవ చారిత్రక ఆవశ్యకత చెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలి.. విమోచన దినోత్సవాన్ని జరపకుండా..తెలంగాణ పోరాట అమరవీరులను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో పల్లె పల్లెలో జలియన్ వాలాబాగ్ లాంటి ఘటనలు ఎన్నో జరిగాయని..వేల మంది ఈ పోరాటంలో నేలకొరిగారని వివరించారు. ఈ బలిదానాలను శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన రాజకీయాల కోసం దేవాలయాలపైన తన ఫొటోలను వేయించుకోవడం శోచనీయం అన్నారు. ఇది హిందూ సంస్కృతిని అవమానించడమేనన్నారు. -
కేసీఆర్ మజ్లిస్కు తొత్తుగా మారాడు: లక్ష్మణ్
సాక్షి, జనగామ: ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మొహం చాటేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం జిల్లాకు విచ్చేసిన లక్ష్మణ్కు ఆర్టీసీ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి నిజాం నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన త్యాగధనుల కీర్తిని నలుదిశలా చాటుతానని చెప్పిన కేసీఆర్ మజ్లిస్కు తొత్తుగా మారాడని విమర్శించారు. యాదాద్రి దేవస్థానంలో దేవుడి కన్నా ఎక్కువగా కేసీఆర్ బొమ్మలు చెక్కించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని లక్ష్మణ్ మండిపడ్డారు. హిందువులు చేసిన పోరాటంతో కేసీఆర్ బొమ్మలు తొలగించారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, గుండె విజయరామారావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
'కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి'
-
'కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లో భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 11,12,13 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విమోచన దినోత్సవంపై కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. రైతు సమితుల ఏర్పాటుపై జారీ చేసిన జీవో 39 అప్రజాస్వామికమని.. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం చాలని.. కొత్తది అవసరం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో బీజేపీ మంత్రులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనేది మోదీ విధానం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమోచన యాత్ర ముగించుకొని బీజేపీ ఆఫీస్కు చేరుకున్న లక్ష్మణ్కు ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం తెలిపారు -
‘విమోచన’కు విలువ ఇవ్వరా?
విశ్లేషణ ‘సెప్టెంబర్ 17’ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని సబ్బండ తెలంగాణ ప్రజలందరి బలమైన కోరిక. ప్రభుత్వం జరపకపోతే బీజేపీ నేతృత్వంలో ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారు. రాష్ట్ర ‘‘బీజేపీ నాయకులకు కేంద్రంలో పలుకుబడి లేక, ఉనికి చాటుకోవడం కోసం విమోచన యాత్రలు చేస్తున్నారు.’’ ఇది, ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ చేసిన వ్యాఖ్య. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్రను టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకున్న తీరిది. అధికార దర్పం, మత్తు తలకెక్కడంతో వారు ప్రజల మనోభావాలను పూర్తిగా మరచిపోయారని ఇది స్పష్టం చేస్తోంది. అందువల్లనే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్ర దినంగా సెప్టెంబర్ 17ను గుర్తించి, అధికారికంగా ఆ ఉత్సవాన్ని జరపమనే డిమాండ్ వారికి ఉత్త హడావుడిగా కనిపిస్తోంది. నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి విషయంలో జాతీయ స్థాయిలో సైతం తీవ్ర విమర్శలకు గురైనాక, నెల రోజులకు తీరుబడిగా... అది దురదృష్టకరం అని, ఒక ఎస్సైని సస్పెండ్ చేసి, ఎస్పీని విహారయాత్రలకు పంపిన ప్రభుత్వాధీశులు విమోచన దినంపై స్పందిస్తారనుకోవడం అత్యాశేనేమో! విమోచన దినానికి రాజకీయ ప్రా«ధాన్యం లేనే లేదు, ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ అంటూ మరో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి సుదీర్ఘంగా విశ్లేషించారు. తెలంగాణ ప్రజల పట్ల వారికున్న అభిప్రాయం ఏ పాటిదో, ఎవరు ఏమన్నా ప్రజల గోడు వినం అనే వారి మంకు పట్టు ఎలాంటిదో అందరికీ అర్థమయ్యింది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన పోలీసు చర్య ద్వారా నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు విమోచనం కలి గింది. హైదరాబాద్ ప్రాంతం (నేటి పూర్తి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాలు) భారతదేశంలో భాగమైంది. కావున సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినమే. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమవ్వాలని తెలంగాణ ప్రజలు పోరాడారు, బలిదానాలు, త్యాగాలు చేశారు. స్వాతంత్య్రం కోసం మిగతా దేశమంతా చేసిన పోరాటానికి అవి ఏ మాత్రం తీసిపోవు. హైదరాబాద్ రాష్ట్రంలాంటి కొన్ని ప్రాంతాలు మినహా, దేశమంతా మువ్వన్నెల జెండా ఎగిరిన ఆగస్టు 15ను భారత స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోడానికి ఏ అభ్యంతరాలూ కనపడని పాలకులకు... తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్య్రం వచ్చిన రోజును ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవడానికి ఎందుకంత కినుక. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో ఆంధ్ర పాలకులారా! విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించరు? అన్న వారే, నేడు ప్రభుత్వాధినేతలుగా మారాక అందుకు పూర్తి భిన్నంగా అదసలు ముఖ్య విషయమే కాదన్నట్టు ప్రవర్తిస్తున్న తీరును చూసి తెలం గాణం విస్తుపోతున్నది. నాడు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ’ అనే పదాన్ని వినడానికి కూడా ఇష్టపడని ఆంధ్రా వలస పాలకులకు, నేటి పాలకులకు తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నది. పార్టీ కార్యాలయంలో జెండా లెగరేస్తాం, ప్రభుత్వపరంగా చేయమన్న వైనాన్ని చూసి తెలం గాణ తల్లి తెలతెలబోతున్నది. రజాకార్ల వారసులున్న పార్టీలకు భయపడి తెలంగాణ చరిత్రను గౌరవించకుండా, ఆత్మ గౌరవాన్ని మంటగలుపుతున్న పాలకుల తీరును చూసి దిగ్భ్రాంతి చెందుతున్నది. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరులందరినీ మననం చేసుకోవటానికి, నివాళులర్పించటానికి లేని భయం, ఒక చాకలి ఐలమ్మను స్మరించుకోవటానికి, ఒక రేణిగుంట రామిరెడ్డికి నివాళులు అర్పించుకోవటానికి, ఒక షోయబుల్లాఖాన్ బలిదానాన్ని గౌరవించటానికి వచ్చేసరికి ఎందుకు మటుమాయమైంది, ఎవరికి భయపడి వెనుకంజ వేయాలి? రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల భావదారి ద్య్రానికి ఇది నిదర్శనం కాదా? మత ఛాందసుల ఓట్ల పిడికిలికి భయపడి వెన్నుచూపడం కాదా? టీఆర్ఎస్ నేతల ఈ మాట మార్చుడు రాజకీయాలను తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నది. ఇది ‘ఔట్ డేటెడ్ సబ్జెక్టు’ అంటున్న వాళ్లని ఔట్ డేటెడ్ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నది. ఆత్మగౌరవానికి, స్వాతంత్య్ర భావాలకు కూడా ఎక్స్పైరీ తేదీని నిర్ణయించే నయా నియంతృత్వ ధోరణికి మంగళం పాడే తేదీ కోసం కాచుకొని ఉన్నది. తెలంగాణ ప్రజానీకం స్వాతంత్య్రం కోసం నిజాంపై జరిపిన మహత్తర పోరాట స్ఫూర్తిని... బీజేపీ చేపట్టిన విమోచన యాత్ర పల్లెపల్లెకు గుర్తు చేస్తున్నది. ఆత్మగౌరవ యాత్రను అమోఘంగా నిర్వహిస్తూ ఆనాటి పోరాట చారి త్రక స్థలాలను చుట్టివస్తూ, స్వాతంత్య్ర సేనానులకు నివాళులర్పిస్తూ... స్వేచ్ఛా పరిమళాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలం గాణ సిద్ధించిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలను గౌరవించని నేటి పెత్తందార్ల వ్యవస్థను ప్రజాగళమై ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వం ‘సెప్టెంబర్ 17’ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని సబ్బండ తెలంగాణ ప్రజలందరి బలమైన కోరిక. అదే డిమాండ్తో ప్రజలతో మమేకమై తెలంగాణ యావత్తూ పర్యటిస్తూ బీజేపీ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర నేడు పాలమూరు జిల్లా అప్పంపల్లిలో ముగుస్తున్నది. అదే స్ఫూర్తితో సెప్టెంబర్ 17 వరకు ప్రభుత్వాన్ని నిలదీసే కార్యాచరణ కొనసాగుతుంది. ప్రభుత్వం జరపకపోతే బీజేపీ నేతృత్వంలో ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారు. నేడు ముగుస్తున్నది విమోచన యాత్ర మాత్రమే. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆర్. శ్రీధర్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు, తెలంగాణ విమోచన కమిటీ ఉపాధ్యక్షులు ‘ 99855 75757 -
'కుర్చీ ఎక్కాక మాట మారుస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతుందని.. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. 'రజాకార్ల ఆగడాలకు సాక్షాలుగా నిలిచిన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని సందర్శించి తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిబడిన దినోత్సవాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చి తప్పించుకుంటున్నారు. నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన కేసిఆర్ ఇప్పుడు తనేందుకు విస్మరిస్తున్నాడు? తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చాలని నాడు కేసీఆర్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ కుర్చి ఎక్కాక మాట మారుస్తున్నారు' అని విమర్శించారు. -
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
-
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.