న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి డీజీఎంవో,భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణమంత్రి మనోహర్ పారికర్, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరి, అమిత్ షా,రాంవిలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. సరిహద్దుల్లో భారత్ సైన్యం దాడులపై చర్చ జరుపుతున్నారు. అలాగే పాక్ వైఖరి, తాజా పరిణామాలుపై చర్చిస్తున్నారు.
అఖిలపక్ష సమావేశం ప్రారంభం
Published Thu, Sep 29 2016 4:10 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement
Advertisement