- ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న నూతన సంవత్సర వేడుకలు. పలు దేశాల్లో నిన్న రాత్రి నుంచి అంబరాన్నంటిన సంబరాలు
- ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించనున్న పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం నిన్న (డిసెంబర్ 31న) ముగిసింది. ఈ నేపథ్యంలో సమితి 9వ సెక్రటరీ జనరల్గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి గతంలోనే ఆమోదం.
- నేటి నుంచి ఏటీఎంల్లో రూ.4500 తీసుకునే అవకాశం
- ఏపీ, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. గవర్నర్ నరసింహన్
- తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్
- టర్కీ: న్యూ ఇయర్ వేడుకలలో విషాదం. నైట్క్లబ్లో కాల్పులకు పాల్పడ్డ దుండగులు.
- హైదరాబాద్: నేడు రాజ్ భవన్లో ప్రజలను కలుసుకోనున్న గవర్నర్
- ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు. 48 రైళ్ల సర్వీసులు ఆలస్యం, 12 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు
- తిరుమలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఆలయం ముందు గోవింద నామస్వరణతో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన భక్తులు.
టుడే అప్డేట్స్
Published Sun, Jan 1 2017 7:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
Advertisement
Advertisement