నేటి వార్తా విశేషాలు | today updates | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Published Sat, May 6 2017 8:33 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ బద్రినాథ్‌ ఆలయం ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి పర్యటన
డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ బద్రినాథ్‌ ఆలయంలో ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

లక్నోలో సీఎం యోగి స్వచ్ఛ్‌ భారత్‌
లక్నో: స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో పాల్గొననున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌. లక్నో లోని బాలు అడ్డా మాలిన్‌ బస్తీలో స్వయంగా చీపురు పట్టి ఊడ్చి అవగాహన కల్పించనున్న సీఎం యోగి.

జపాన్‌ పర్యటనకు అరుణ్‌ జైట్లీ
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ. పలు వ్యాపార సంబంధ కార్యక్రమాలలో పాల్గొని జపాన్‌ అధికారులతో భేటీ కానున్న జైట్లీ

నేడు టీఎస్‌ ఈసెట్‌-2017
హైదరాబాద్‌: టీఎస్‌ ఈసెట్‌-2017 పరీక్షకు సర్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,138 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

నేడు పాలీసెట్‌ ఫలితాలు
హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్‌ 2017 పరీక్ష ఫలితాలను 6వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని రూసా సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
 

నేడు ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల
అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదలవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వీఎస్‌ భార్గవ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించారు. కాగా, ఈ ఫలితాలను www.sakshi.com , www.sakshieducation.com వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు.

ఐపీఎల్‌ షెడ్యూలు
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో తలపడనున్న రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తో తలపడనున్న ముంబై ఇండియన్స్‌. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం

అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్‌
టోర్నీలో భాగంగా నేటి మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ తో తలపడనున్న భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement