ఆరురోజుల్లో పునరుద్ధరిస్తాం:పీయూష్ | Transmission links in Delhi will be restored by June 22: Goyal | Sakshi
Sakshi News home page

ఆరురోజుల్లో పునరుద్ధరిస్తాం:పీయూష్

Published Tue, Jun 17 2014 12:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఆరురోజుల్లో పునరుద్ధరిస్తాం:పీయూష్ - Sakshi

ఆరురోజుల్లో పునరుద్ధరిస్తాం:పీయూష్

సాక్షి, న్యూఢిల్లీ: నగరానికి అనుసంధానమయ్యే ట్రాన్స్‌మిషన్ లింకులను ఈ నెల 22వ తేదీకల్లా పునరుద్ధరిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. నగరంలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
 
 కేంద్ర మంత్రితో భేటీ
 విద్యుత్ సంక్షోభం నగరానికి శాపంగా పరిణమిం చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో బీజేపీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సమస్యపై చర్చిం చారు. గత నెల 30వ తేదీనాటి గాలిదుమారం త తర్వాత తలెత్తిన విద్యుత్ సంక్షోభం బీజేపీ తలనొప్పిగా పరిణమించింది. ఢిల్లీలో రాష్ట్రపతిపాలన ఉండడంతో ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రెండు వారాల సమయం పడుతుం దని పీయూష్ వారం క్రితం ప్రకటించిన సంగతి విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులు కేంద్ర మంత్రిని కలిసి ఈ సమస్యపై చర్చించారు.
 
 కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
 కాగా విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం సీమాపురి, పట్పర్‌గంజ్ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ దిష్టిబొమ్మలను తగులబెట్టడంతోపాటు 24వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను కాసేపు అడ్డుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement