
హరిద్వార్/సహరాన్పూర్: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ మద్యం కారణంగా చనిపోయిన వారి సంఖ్య శనివారంనాటికి 61కు చేరుకుంది. గురువారం ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా బాలూపూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లాకు చెందిన వారు హాజరయ్యారు. ఆ సందర్భంగా అందరికీ మద్యం సరఫరా చేశారు. అది తాగిన చాలామంది మరుసటి రోజుకల్లా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతోపాటు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment