
'ఓఆర్ఓపీ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాం'
న్యూఢిల్లీ: నలభై ఏళ్లుగా పెండింగులో ఉన్న ఒకే ర్యాంకు - ఒకే పింఛన్ సమస్యను నరేంద్రమోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించిందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే ర్యాంకు - ఒకే పింఛన్ ఆర్థికంగా భారం అవుతుందని చెప్పారు. సైనికులు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
పరిష్కారం కాని బంగ్లాదేశ్ భూబదలాయింపు, జ్యూడీషియల్ కమిషన్ సమస్యలను మోదీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించారన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలు తిరిగి నిర్వహించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా తెలిపారు.