
చల్లా ధర్మారెడ్డి
గీసుకొండ: అధికంగా ఓట్లు వేయించిన కార్యకర్తలు, నాయకులకు రూ.50 వేలు నజరానాలు ఇస్తానని పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలో బుధవారం సంగెం మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికంగా ఓట్లు పడిన గ్రామానికి రూ.లక్ష నగదును నజరానాగా ఇస్తానని ప్రకటించారు.