ఆ భూములపై విచారణ జరిపించండి: చాడ | Chanda Venkat Reddy Demands Govt Lands Issue At Shameerpet | Sakshi
Sakshi News home page

ఆ భూములపై విచారణ జరిపించండి: చాడ

Published Thu, Jun 7 2018 12:53 AM | Last Updated on Thu, Jun 7 2018 12:53 AM

Chanda Venkat Reddy Demands Govt Lands Issue At Shameerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో 29, 108 సర్వే నెంబర్‌లో ఉన్న 185 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని దీనిపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎస్‌ ఎస్‌కే జోషిని చాడ బృందం కలిసి విన్నవించింది. నెంబర్‌ 87లో ఉన్న 52 ఎకరాల భూమిని యజమానుల నుంచి తీసుకుని ప్రభుత్వం కలెక్టర్‌ కార్యాల యం నిర్మిస్తోందని పేర్కొన్నారు. భూ యజమానులకు నష్ట పరిహారం, భూమి ఇవ్వాలని కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement