Chada Venkat Reddy
-
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్రెడ్డి. ప్రజాకవి గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలన్నదే తమ ఆకాంక్ష అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో చాడ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేందుకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనమని ఆరోపించారు. ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిన రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార పార్టీకి ప్రజాతిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగూడెం స్థానంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ప్రజలు గెలిపిస్తారని చాడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ మాట తప్పారు.. గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటామంటూ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ముందు తమతో చె ప్పారని చాడ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఆయన మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని, భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలని చాడ ఆకాంక్షించారు. వై.ఎస్. హయాం నాటి ఎల్లంపల్లి చెక్కుచెదరలేదు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేళ్లకే దెబ్బతిన్నదని చాడ విమర్శించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మేడిగడ్డకు సమీపంలో శ్రీకారం చుట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని చాడ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్తో ముందుకు... సీట్ల విషయంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలసి పోటీ చేయలేకపోతున్నామని చాడ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తామేమీ వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని.. 2018లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. తమతో అవగాహనలో భాగంగా కాంగ్రెస్ ఒక్క సీటే కేటాయించడంపట్ల సంతృప్తి లేకున్నా అప్రజాస్వామిక, నియంతృత్వ బీఆర్ఎస్ను ఓడించేందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ పార్టీతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యమయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్డీఏ పేరుతో 36 పార్టీలతో పొత్తు పెట్టుకుందని చాడ గుర్తుచేశారు. -
పొత్తుల కోసం వెంపర్లాడం
హుస్నాబాద్: బీఆర్ఎస్ పార్టీతో పొత్తులపై ముఖాముఖి చర్చలు జరగలేదని, పొత్తులకోసం వెంపర్లాడబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా.. లేకున్నా వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయ న తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో సీపీఐ వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. సీఎం కేసీఆర్ ఆనాడు తమను పిలి చి పొత్తుపెట్టుకున్నారని, వ చ్చే ఎన్నికల్లోనూ ఆయన పిలిస్తేనే పొత్తులపై చర్చిస్తామని చెప్పారు. బీఆర్ఎస్తో తమ స్నేహబంధం ముగియలేదన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసే పయనిస్తాయని తేల్చిచెప్పారు. తెలంగాణలో 15 సీట్లలో సీపీఐ బలంగా ఉందని, 5 సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కొత్తగూడెం, వైరా, పెద్దపల్లి, మునుగోడు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో తప్పకుండా పోటీ చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ డిపోల ఎదుట రౌండ్ టేబుల్ సమావేశాలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను నేరవేర్చాలని ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డిపోల ఎదుట తమ పార్టీ ఆ«ధ్వర్యంలో సేవ్ ఆర్టీసీ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచుతామని మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు ఇచ్చి న హామీని నేరవేర్చలేదని చాడ విమర్శించారు. వచ్చే నెల 7న ప్రజాసమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీసీ, దళితబంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం సరికాదన్నా రు. గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపి క చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మణిపూర్ సంఘటనపై ఈనెల 25న దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. -
కలసి నడుద్దాం
సాక్షి, హైదరాబాద్: కామ్రేడ్లు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన అయిదారు వేలమంది క్రియాశీలక కార్యకర్తలతో వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్లో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఉభయ పార్టీల నేతలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఎంబీ భవన్లో సమావేశమయ్యారు. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలను ఆహ్వానిస్తారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి బీజేపీయేతర పార్టీలతో పొత్తులుంటాయి. పొత్తులతో సంబంధం లేకుండా 10 వేలకు పైగా ఓట్లున్న.. దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఆ స్థానాలను కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకూడదనేది ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటికీ గందరగోళమే.. రాష్ట్రంలో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని బీఆర్ఎస్ అంటున్న ట్టు జరుగుతున్న ప్రచారంపై కామ్రేడ్లు ఇంకా గరంగరంగానే ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్తోనైనా పొత్తుకు వెనుకాడబోమని వామపక్షాలు భావిస్తు న్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
గవర్నర్ వ్యవస్థతో అణచివేతకు పాల్పడుతున్న కేంద్రం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రం గవర్నర్ వ్యవçస్థతో అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సిగ్గుచేటని, గవర్నర్ బిల్లులు పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. మహబూబ్నగర్లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అధికారం ఉందని కేంద్రం అడ్డదారులు తొక్కడం సమంజసం కాదన్నారు. బీజేపీకి చెక్ పెట్టడమే ధ్యేయంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు సీపీఐ పేరుతో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో సీపీఐ సమరశంఖం పూరిస్తుందని చాడ హెచ్చరించారు. -
బీజేపీ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి: చాడ
కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలు మానుకుని రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హితవు పలికారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీలు ఒక్కటి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, రేషన్కార్డులివ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 21న అన్ని తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. -
దివంగత సీఎం వైఎస్ది గోల్డెన్ పీరియడ్: చాడ
హుస్నాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం గోల్డెన్ పీరియడ్ అని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. వైఎస్ కాలంలో తాను సీపీఐ శాసన సభాపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ఎక్కువ అవకాశం కలిగిందని, స్ఫూర్తిదాయక చర్చ జరిగేదని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం చాడ వెంకట్రెడ్డి రచించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం.. శాసనసభ ప్రసంగాలు’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హుస్నాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించానన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్లో జరిగిన లాకప్డెత్పై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. వైఎస్ మానవత్వం ఉన్న నాయకుడని, ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు పార్టీ వేరైనా పరిష్కరించేవారన్నారు. నాటి ప్రతిపక్షాలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారని నేడు అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనే పరిస్ధితి వచ్చిందని, ఇప్పుడు ప్రజాస్వామ్యం అమ్ముడుపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్చైర్మన్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ భగ్నం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతత నెలకొంది. ఎస్వీకే వద్దకు చేరుకున్న వందలాది మంది కార్మికులతో సభ జరిగింది. అనంతరం కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ర్యాలీగా బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ర్యాలీని భగ్నం చేయటంతోపాటు పలువురిని అరెస్టు చేసి మలక్పేట, అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ సింగరేణి లాభాలకు కార్మికులే కారణమని, అలాంటి కార్మికుల శ్రమ దోపిడీ చేయటం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు సింగరేణి కార్మికులను పొగుడుతూనే, వారి సంక్షేమం విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఎస్.ఎల్.పద్మ, జి.అనురాధ, ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం, బీఎంఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు పేస్కేల్ను వర్తింపజేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. -
బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉంది: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మునుగోడుకే పరిమితం కాబోదని, భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ముఖంగా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్లో కూడా టీఆర్ఎస్తో పని చేస్తాం అని చాడ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని, అందుకే సీపీఐ నేతలు వెళ్తున్నారని తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్న విషయాన్ని చాడ గుర్తు చేశారు. కాంగ్రెస్పై విమర్శ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సమయంలోనే.. కాంగ్రెస్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐని ఇబ్బంది పెట్టింది. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్ పోటీ చేసింది. ఉత్తమ్ కుమార్ ఇబ్బంది పెట్టారు అని చాడ వెంకట్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రెస్మీట్లో సీపీఐ నారాయణ సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: మునుగోడులో కాంగ్రెస్.. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం -
Munugode: సీఎం కేసీఆర్ కారులో సీపీఐ చాడ వెంకట్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మునుగోడు సమరం తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) బహిరంగ సభ నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం. ఇక మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున్న కసరత్తులు చేస్తోంది. రెండు వేల మందితో హైదరాబాద్ నుంచి ర్యాలీ తీయాలని చూస్తోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు-ఐదు గంటల వరకు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: కారు వైపే కామ్రేడ్లు! -
‘చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం చేనేత వస్త్రాలపై వేసిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడినవారిలో ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారన్నారు. జీఎస్టీ వల్ల చేనేత వస్త్రాలు అందుబాటుధరల్లో లేకపోవడంతో చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోతుందని అన్నారు. -
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు శనివారం చాడ లేఖ రాశారు. ధరణిలో దొర్లిన తప్పులను సరిచేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏల అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యను ప్రత్యేక దృష్టితో చూసి సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం పేస్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేఖలో చాడ కోరారు. -
ఎనిమిదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందని, విభజన చట్టంలోని హామీలను నేరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న విభజన చట్టంలోని హామీల సాధనకై కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామన్నారు. ప్రతి జిల్లా, మండల/పట్టణ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగుర వేసి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీగా సీపీఐ మొట్ట మొదటగా తీర్మానించి, అనేక పద్ధతుల్లో ఉద్యమ కార్యాచరణను రూపొందించి రాష్ట్ర సాధన కోసం పోరాడిందని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్షతతో, రాజకీయ సంకుచిత ఆలోచనలతో కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని, 1,800 మంది అమరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ అమరుల ఆశయాలను నేరవేర్చాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉందని చాడ పేర్కొన్నారు. -
భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?
తెలంగాణతో భూమి అంశం తరతరాలుగా మమేకమైంది. వ్యవస్థ మార్పునకు, భౌగోళిక మార్పునకు ఇక్కడ భూమి కూడా కీలక కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భూ సమస్య పరిష్కారమవుతుందేమోనని ఎనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్నా, అది ఇప్పటికీ సాకారం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విషయంలో సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం, ‘ధరణి’ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ వాటిల్లో లొసుగుల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు జటిలమవుతున్నాయి. ముఖ్యంగా ‘ధరణి పోర్టల్’లో చేతులు మారిన భూములకు సంబంధించిన పట్టాదారుల పేర్లు మారకపోవడం, మోకాపై ఉన్న వారి పేరు లేక పోవడం సమస్యలకు కారణమవుతోంది. అన్నిటికీ మించి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియకు మూలమైన భూ సర్వే ఇంకా చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ఏడాదిలో డిజిటల్ భూ సర్వే చేసి, అక్షాంశాలు, రేఖాంశాల వారీగా వివాదాలకు తావు లేకుండా భూముల గుర్తింపు చేస్తామని సీఎం ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా, అది ముందుకు సాగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ విడివిడిగానే రెవెన్యూ చట్టాలు, భూ కార్డులున్నప్పటికీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. రికార్డులను సరిచేయడానికి ఉపశమన చర్యలు చేపట్టారు. భూ సమగ్ర సర్వే చేస్తే, భూముల అన్యాక్రాంతం, రికార్డులలో నెలకొన్న లొసుగులు బహిర్గతమయ్యేవి. కానీ అందుకు భిన్నంగా, ఆర్వోఆర్, అసైన్మెంట్ చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములకు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఎన్ని వచ్చినా అవి ప్రచారానికే పరిమితమైనాయి. కానీ క్షేత్రస్థాయిలో మార్పేమీ రాలేదు. 2004 సంవత్సరంలో అసెంబ్లీలో చర్చ జరిపి ఆనాటి మంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అనుభవపూర్వకంగా 104 సిఫారసులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలైనాయి. ఈ రకంగా తెలంగాణ భూములు ప్రయోగశాలకు నిలయమైనాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేధావులు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు భూ అంశంపైన అనేక అర్జీలిచ్చినా ప్రభుత్వం పట్టించు కోలేదు. రెవెన్యూ చట్టం అస్తవ్యస్తంగా ఉన్నదని 2020 సెప్టెంబర్ 11న కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించారు. మాన్యువల్ రికార్డుల స్థానే ‘ధరణి పోర్టల్’ తేవడం ఇందులోని ముఖ్యమైన అంశం. దాని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ‘ధరణి పోర్టల్’ సాఫ్ట్వేర్ మాత్రమే అమలుకు తెచ్చారు. దానిని పూర్తిగా నమ్ముకుంటే రైతుల భూ రికార్డులు తారుమారై బజారులో పడతారని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ధరణి పోర్టల్లో నెలకొన్న లొసుగులతో రైతులు తీవ్రమానసిక వ్యధకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో 100 నుండి 200 మంది రైతుల పైబడి భూ రికార్డులు, సర్వే నంబర్ హద్దులు అన్యాక్రాంతమై దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే... జిల్లా కలెక్టర్ దగ్గరకి వెళ్లమంటారు. వారికి సమయముండదు. రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రభుత్వం... సర్వే నెంబర్ వారీగా సమగ్ర భూ సర్వే (డిజిటల్) విధిగా చేపట్టాలి. సాదా బైనామాలకు ‘ధరణి పోర్టల్’లో ఆప్షన్ పెట్టాలి. అపరిష్కృతంగా ‘మీ సేవ’లో పెండింగ్ వున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గతంలో ‘ధరణి’ వచ్చిన తరువాత తప్పుగా నమోదైన పేర్ల స్థానంలో ఒరిజినల్ పట్టాదారుల పేర్లు నమోదు చేయాలి. (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?) పై అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, సవరణలు చేస్తూ చర్యలు చేపట్టగలిగితే సమస్యలు పరిష్కారమవుతాయి. భూ రికార్డులు సరి అవుతాయి. అయితే దీనికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుంది. (చదవండి: ‘రెవెన్యూ’కు 250 ఏళ్లు) - చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్/ సుల్తాన్బజార్: కార్మికుల రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో మొదటిరోజు సోమవారం పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. బ్యాంకుల్లోనూ కొంతమేరకు పని స్తంభించడంతో.. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. సింగరేణిలో సమ్మె ప్రభావం బలంగా కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సమ్మెలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, ఎంసీపీఐ (యు) తదితర పార్టీలు పాల్గొన్నాయి. సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహించారు. నారాయణగూడ చౌరస్తా నుంచి కాచిగూడ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్మికులతో పెట్టుకుంటే మోదీ ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు అంతే లేకుండా పోయిందని, శిశుపాలుడి వంద తప్పుల మాదిరిగా ప్రజలు ఓపిక పడుతున్నారని, సహనం నశిస్తే కేంద్రాన్ని కూలదోస్తారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నర్సింహారావు చెప్పారు. అధికార టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల కేంద్రం అవలంబిస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెలో సంఘీభావంగా పాల్గొన్నారు. రైతు సంఘాలు, మహిళా సమాఖ్య, విద్యార్థి, యువజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు. కోఠిలో ధర్నా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఇఏ), అఖిలభారత బ్యాంక్ అధికారుల అసోసియేషన్ (ఏఐబీఓఏ) సంయుక్త ఆధ్వర్యంలో కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఇండియా ప్రాంగణంలో ధర్నా జరిగింది. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బీసీ కులాల లెక్క తేల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశంలోని బీసీ కులాల లెక్క తేల్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు బీసీలకు కాకికి ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తున్నారని విమర్శించారు. బీసీల జనగనణ చేపట్టేలా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. సోమవారం ‘బీసీల హక్కుల సాధన సమితి’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగాచారి అధ్యక్షత వహించ గా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామేశ్వర్ రావు, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పూలే–అంబేడ్కర్ సమితి నాయకుడు కోలా జనార్దన్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు దుర్గయ్య గౌడ్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్ హాజరయ్యారు. చాడ మాట్లాడుతూ.. బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను సీఎం కేసీఆర్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సగానికిపైగా జనాభా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ. 1,400 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఓబీసీ రిజర్వేషన్లు నాలుగో తరగతి, కింది స్థాయి పోస్టులకే అమలవు తున్నాయని.. తక్కువ జనాభా ఉన్న అగ్రవర్గాలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారని అన్నారు. -
భూదాన్ భూములను పంచకుంటే ఆక్రమిస్తాం
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మౌనం వీడి భూదాన్ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ భూములను ప్రభుత్వం పంపిణీ చేయకపోతే తామే వాటిని ఆక్రమించి నిరుపేదలకు పంచుతామని ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మార్చి 17 వరకు డెడ్లైన్ విధిస్తున్నామని హెచ్చరించారు. సోమవారం అఖిల భారత సర్వసేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో భూదాన్ భూములను భూములు లేని నిరుపేదలకు పంచాలని, భూదాన్ యజ్ఞ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్వద్ద నిరుపేదలతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న చాడ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ఆచార్య వినోబాభావే భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, భూస్వాముల నుంచి లక్షలాది ఎకరాలను విరాళంగా సేకరించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూదాన్ భూములను పరిరక్షించకుండా, పేదలకు పంపిణీ చేయకుండా, భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఎన్ని భూదాన్ భూములు కబ్జాకు గురయ్యాయో పూర్తి ఆధారాలతో ఇస్తామన్నారు. అనంతరం అఖిల భారత సర్వసేవా సంఘం జాతీయ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ పేద ప్రజలు భూమి విముక్తి కోసం పోరాడుతుంటే వారికి అండగా ఉండకుండా సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వినోబా భావే, మొద టి భూదాత రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎంపీ అజీజ్పాషా, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అ«ధ్యక్షుడు శంకర్నాయక్, ట్రస్టీ షేక్హుస్సేన్, సంఘ సేవకులు కృష్ణప్రసాద్, సీపీఐ నగర కార్యదర్శి నర్సింహ తదితరులతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
దూసుకుపో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా గళం విప్పారని.. ఈ దూకుడు ఇంకా పెంచాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి.రాజా అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు డి.రాజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించి పోరాడిన ధర్మభిక్షం గొప్ప కమ్యూనిస్టు అని కొనియా డారు. ధర్మభిక్షం ఉద్యమ అనుభవాల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోంది ‘భారతదేశం రాష్ట్రాల కూటమి అనే విషయాన్ని గుర్తించేందుకు మోదీ సిద్ధంగా లేరు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. ఇది ప్రమాదకర మైన చర్య. మోదీని నిలదీస్తూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ సీఎంలు స్టాలిన్, మమతా బెనర్జీ, కేసీఆర్ ముందుకు వస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. దేశ సంపదను అంబానీ, అదానీ, టాటాలకు మోదీ కట్టబెడుతున్నారు. ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నీ కలిసి పోరాడాలి..’ అని రాజా పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ధర్మభిక్షం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రభుత్వ పథకానికి ధర్మభిక్షం పేరు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకానికి ధర్మభిక్షం నామకరణం చేస్తామని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచిం చకుండా నిజమైన కమ్యూనిస్టుగా జీవించిన నాయకుల్లో ధర్మభిక్షం ఒకరని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్రను మోడల్ సైన్స్ పాఠ్యాంశంలో పొందుపర్చాల్సిందిగా ప్రణాళిక సంఘం తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి లేఖ రాస్తానని తెలిపారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ధర్మభిక్షం పేరుతో ప్రతిఏటా అవార్డులు ఇవ్వాలన్నారు. సమరయోధులకు సన్మానం అలనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ధర్మభిక్షం సహచరులుగా ఉన్న గుంటకండ్ల పిచ్చి రెడ్డి, దొడ్డా నారాయణ, తోడేటి కొమురయ్య, కందిమళ్ల ప్రతాప్లను డి.రాజా శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ సంయుక్తంగా రచించిన బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్ర ‘ప్రజల మనిషి’ పుస్తకాన్ని బోయినపల్లి వినోద్ ఆవిష్కరించారు. ధర్మభిక్షం జీవితంపై ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ రచించిన పాటల ఆడియో సీడీని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. బొమ్మగాని నాగభూషణం రచించిన ‘ఉద్యమ సంతకం’ కవితా సంపుటిని సురవరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ధర్మభిక్షం శతజయంతి నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) నేత కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గుండె చప్పుడు
పరిచయం అక్కర్లేని పేరు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం. కమ్యూనిస్టు పార్టీకే కాకుండా, అన్ని పార్టీలు వర్గాలు, ప్రాంతాలకు అతీ తంగా మూడు నాలుగు తరాలకు నాయకత్వం వహించి, నాయకులను అందించిన మహోన్నతుడు. ఆయన జీవి తంలో అనేక కోణాలు ప్రస్ఫుటమవుతాయి. విద్యార్థి నాయకునిగా, స్పోర్ట్స్మన్గా, జర్నలిస్టుగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యునిగా, లోక్సభ సభ్యునిగా, కార్మికోద్యమ నాయకునిగా అమోఘమైన పాత్రను నిర్వర్తరించారు. బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం జన్మించారు. పిన్నవయస్సులోనే జాతీయ భావాలను పునికిపుచ్చుకున్న గొప్ప యోధుడు ఆయన. విద్యా ర్థిగా ఉంటూనే సూర్యాపేట పాఠశాలలో నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పరేడ్ నిర్వహించకుండా విద్యార్థుల చేత బహిష్కరింపజేసిన సంఘటన ఆ రోజుల్లో నైజాం సంస్థానంలో సంచలనం సృష్టిం చింది. చదువే గగనమైన ఆ రోజుల్లో విద్యార్థులకు విద్యనందించాలని గొప్ప సంకల్పంతో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ గురించి తెలుసుకొని... ఆయన విద్యార్థిగా ఉంటూనే ప్రజా విరాళాలు సేక రించి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతితోపాటు విద్యను అందించారు. సూర్యాపేటలో నడుస్తున్న రెడ్డి హాస్టల్ వార్షికోత్సవ సభకు వచ్చిన డాక్టర్ రాజబహదూర్ వెంకటరామి రెడ్డి... ఒంటి చేత్తో ధర్మభిక్షం విరాళాలు సేకరించి హాస్టల్ నిర్వహిస్తున్న తీరును తెలుసుకొని అబ్బుర పడ్డారు. ‘‘ఒక చేతితో విరాళాల సేకరణ చేసి, మరొక చేతితో విద్యార్థులకు విద్యను అందించడానికి ధర్మం చేసిన వ్యక్తి పేరు కేవలం భిక్షం కాదు, నేటి నుండి ఆయన ధర్మభిక్షం’’ అని కొనియాడారు. ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్ అనేక మంది యోధులను తెలం గాణ సాయుధ పోరాటానికి అందించిన కార్ఖానాగా నిలిచింది. అందులో ఒకరైన పసునూరు వెంకట్రెడ్డి వీరమరణం కూడా పొందారు. మాజీ మంత్రి ఉప్పు నూతల పురుషోత్తంరెడ్డి, అలనాటి సినీనటుడు ప్రభా కర్రెడ్డి కూడా ఆయన హాస్టల్ విద్యార్థులే. వీరు ఆయనను గురుతుల్యులుగా భావించేవారు. ధర్మభిక్షం ఆంధ్రమహాసభ పట్ల ఆకర్షితుడై ఆ తరువాత పరిణామ క్రమంలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందారు. యువకునిగా ఉన్న సమ యంలోనే ధర్మభిక్షంను ప్రమాదకరమైన వ్యక్తిగా నాటి నిజాం ప్రభుత్వం ప్రకటించడంతో, ఆయన 40వ దశకంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే నిజాం వ్యతిరేక పోరాటానికి యువకులను, కార్యకర్తలను సమీకరించి సాయుధ పోరాటానికి భూమికను సిద్ధం చేశారు. ధర్మభిక్షం బైట ఉంటే ప్రమాదమనే ఉద్దేశ్యంతో అనేక కుట్రలతో ఆయనను అరెస్టు చేసి సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో ఐదేళ్ళపాటు జైల్లో ఉంచారు. జైలు నుండి విడుదలై హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్ని కల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి అత్యధిక మెజా రిటీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో ఏర్పడిన నకిరేకల్ నియోజకవర్గం నుండి, 1962లో నల్ల గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. 1991, 1996లో లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజలు సంఘటితమై ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యల పరిష్కా రంతో పాటు, హక్కులు సాధిం చుకోవచ్చని ధర్మభిక్షం బలంగా విశ్వసించే వారు. ఆయన పెట్టిన సంఘాలు కోకొల్లలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్మికుల సంఘం, హోటల్ వర్కర్స్ సంఘం, లారీ డ్రైవర్స్ యూని యన్, గీతకార్మికుల సంఘం... ఇలా ఆయన అనేక సంఘాలు స్థాపించారు. ఐదుసార్లు చట్టసభ లకు ఎన్నికైనా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి. ఆయన మరణించి 15 ఏళ్లవుతున్నది. ఈ తరానికి ధర్మభిక్షం సేవలు, పోరాట పటిమను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రత్యేకించి ప్రభుత్వం మీదా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి ఇంకా ఎన్నో కార్యక్ర మాలు చేపట్టాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
15న ధర్మభిక్షం శతజయంతి ముగింపు ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు ఉత్సవాలు ఈ నెల 15న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. పార్టీలకతీతంగా కదలివచ్చి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీలోని వివిధ ప్రజా సంఘాల బాధ్యుల సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్న సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... 15న రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డితో కూడిన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. -
బొమ్మగాని ధర్మభిక్షం నేటితరానికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ధర్మభిక్షం మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించడంలో ఆదర్శప్రాయులని కొనియాడారు. ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. నిర్వహణ కమిటీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ‘మహాసంకల్పం’పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థ ఏర్పడని సమయంలోనే ధర్మభిక్షం విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఉంటూ ఎందరో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఎమ్మె ల్యేగా, ఎంపీగా ఐదుసార్లు చట్టసభలకు వెళ్లిన ధర్మభిక్షం, సాధారణ జీవితాన్ని గడిపారన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ధర్మభిక్షం స్వస్థలం సూర్యాపేటలో మహా సంకల్పం పుస్తక చర్చను నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ధర్మభిక్షం శతజయంతి సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రొఫె సర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ, ధర్మభిక్షం అచ్చమైన ప్రజల మనిషి అని కొనియాడారు. ధర్మభిక్షం అంటేనే పోరాటం.. శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ, మహాసంకల్పం పుస్తకం చదివితే ధర్మభిక్షం గురించి నేటి తరానికి తెలుస్తుందన్నారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ, ధర్మభిక్షం, బండ్రు నరసింహులు గురించి మాట్లాడడం అంటేనే ప్రజా పోరాటాల గురించి మాట్లాడడమన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ, ధర్మభిక్షం మానవతా ఉద్యమతార అని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంలాగా ‘మహా సంకల్పం’పుస్తకం ఒక రూపాన్ని నిర్మించిందన్నారు. కార్యక్రమంలో పుస్తక సంకలనకర్త, అరసం రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్, అరసం కార్యనిర్వహక కార్యదర్శి పల్లేరు వీరస్వామి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, సినీ దర్శకుడు బాబ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘మహాసంకల్పం’పుస్తక ముద్రణకు సహకరించిన బూర మల్సూర్ గౌడ్ను జ్ఞాపికతో సత్కరించారు. -
గాలిలో మేడ కట్టారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు, అర్హులందరికీ ఇళ్లు అనే వాగ్దానాలకు గతి లేకున్నా.. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ల ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అనడం హాస్యాస్పదమన్నారు. ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించిన రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటలకు కనీస మద్దతు ధరపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం.. కర్షకులకు నమ్మక ద్రోహం చేసినట్టేనన్నారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తదితర విభజన హామీలను బడ్జెట్లో పేర్కొనకుండా.. మరోసారి మోసం చేసిందన్నారు. -
పోడు రైతులకు పట్టాలివ్వకపోవడం అన్యాయం
సాక్షి, హైదరాబాద్: పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టాలివ్వకపోవడం అన్యాయమని, వెంటనే వారికి పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోడుసాగుదారులకు అన్యాయం జరిగిందని, ఎన్ని పోరాటాలు చేసినా పోడుసాగుదారులకు పట్టాలివ్వలేదని వాపోయారు. తెలంగాణ వచ్చి ఇప్పటికి ఏడేళ్లు గడుస్తున్నా పట్టాలివ్వకపోవడం శోచనీయమని, ధరఖాస్తులు తీసుకుని ఎందుకు పెండింగ్లో పెడుతున్నారో అర్థం కావడంలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోడుపట్టాలివ్వకపోవడం వల్ల రైతుబంధు అందడం లేదని, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా అందక రోడ్డున పడ్డారని, పంట రుణాలు ఇవ్వడం లేదని విచారం వ్యక్తంచేశారు. -
బలపడి.. తలపడదాం..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరం ఉంది..’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ముందుగా వామ పక్షాలు మరింత బలపడి, ప్రజాస్వామిక, లౌకికశక్తులను కలుపుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి ఆన్లైన్లో.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ అజెండాను అమలు చేయడమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. అదే ఈ రోజు నిజమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా త్వరలోనే ‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం’అంటూ బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అవినీతి ‘చట్టబద్ధమైన రాజకీయ అవినీతి’గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్దయెత్తున దాడి జరుగుతోందని చెప్పారు. అయితే ఇదే సమయంలో బీజేపీ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు బలపడుతున్నాయని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఉదహరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న టీఆర్ఎస్: తమ్మినేని కేంద్రంలోని బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతుంటే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషా లు రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పడే వాగ్దానాలను విస్మరించి, ఎన్నికల్లో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు ప్రధానంగా ప్రజాస్వామిక, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో పొత్తు వార్తలను ఆయన ఖండించారు. పునరేకీకరణకు కృషి జరగాలి: చాడ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేప ట్టే పోరాటాల్లో సీపీఐ, సీపీఎంల మధ్య సారూప్యత ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు తమ ఐక్యతకే కాకుండా పునరేకీకరణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఈ మహాసభల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్కారత్, ఆ పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పలు వురు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి రైతుకు పరిహారం ఇవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రెండ్రోజులుగా వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వడగండ్లు, అకాల వర్షాలతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నర్సంపేట ప్రాంతంలో పండుకు వచ్చిన మిర్చి పంట పూర్తిగా నీట మునిగిందన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలపై సీఎం కేసీఆర్ స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా ఆదేశించాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపు కోకుండా ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. -
దేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ అసలైన దేశ వ్యతిరేకి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. కేంద్రం రిమోట్ కంట్రోల్ తమ చేతిలో లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారని, కానీ రిమోట్ అవసరం లేకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోందని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలో కొనసాగితే దేశాన్ని ఫాసిస్టు దేశంగా, మతరాజ్యంగా మార్చే ప్రమాదముందని హెచ్చరించారు. బీజేపీ రాజ్ నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు యువత భగత్సింగ్, చేగువేరా లాంటి విప్లవ కిశోరాల్లాగా మారి పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్లో జరిగిన బహిరంగ సభకు రాజా ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమంలో ఎక్కడున్నాయ్? బ్రిటిష్ పాలనను కూలదోసేందుకు స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాడారని రాజా గుర్తు చేశారు. ఇప్పుడు గొప్ప దేశభక్తులమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్, బీజేపీలు నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బ్రిటిష్ వారితో చేతులు కలిపిన ఆర్ఎస్ఎస్కు అసలు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాత్రే లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని.. అచ్చే దిన్ అదానీ, అంబానీలకే వచ్చాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వారికే కట్టబెడుతున్నారని.. దేశ సంపద, ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఏం మిగలుతుందని ప్రశ్నించారు. సభలో సీపీఐ రాజ్యసభ సభ్యులు బినొయ్ విశ్వం, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. -
భూపోరాటం ఉధృతం చేయాలి
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశంలో మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బీజేపీ తాటాకు చప్పుళ్లు ఎక్కువయ్యాయని, వాటిని నిలు వరించటంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం వారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే.. అది పామై కరుస్తుందని హెచ్చరించారు. గురువారం మేడ్చల్ జిల్లా కీసరలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ముగింపు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం భూపోరాటాలను ఉధృతంగా నిర్వహించాలని చెప్పారు. ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టు పార్టీలే: చాడ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ ప్రధాని మోదీ తిరోగమన నిర్ణయాలతో పేదల బతుకులు ఛిద్రం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రజల హక్కుల కోసం పోరాడేది కేవలం కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాన్ని మించింది లేదని, ఇటీవలే చిలీ దేశాధ్యక్షుడిగా వామపక్ష పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటోంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించడంలో, నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి వారి హక్కులను కాలరాస్తోంది’అని ధ్వజమెత్తారు. ధరణిలో లొసుగులు రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాల అమలు తరువాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ధరణి పోర్టల్లో కూడా అనేక లొసుగులు ఉన్నా యని చాడ ఆరోపించారు. ‘దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న హామీని టీఅర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్న హామీని కూడా అటకెక్కించింది. ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని టీఅర్ఎస్ ప్రభుత్వాన్ని పారదోలేందుకు మిలిటెంట్ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముంది. ప్రజలను చైతన్యపరుస్తూ రైతులు, కార్మికులు ఉమ్మడిగా తమ హక్కుల కోసం ఉద్యమించాలి’అని అన్నారు. కార్యక్రమంలో భారతీయ కేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే పెరియస్వా మి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకండ్ల కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కాంతయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర నూతన కౌన్సిల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొండం కాంతయ్య ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ జిల్లాకు చెందిన ఎన్.బాలమల్లేశ్ ఎన్నికయ్యారు. 71 మంది సభ్యులతో నూతన కౌన్సిల్ ను, 21 మందితో కార్యవర్గాన్ని, 11 మందితో ఆఫీసు బేరర్లను ఎన్నుకున్నారు. -
మిరప రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: తామర పురుగుతో తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో వేసిన మిరప తోటలను వారం రోజుల్లోనే తామర పురుగు సర్వ నాశనం చేశాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తామర పురుగుతో ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందో అధికారులతో సర్వే చేయించి, రైతులను ఆదుకోవాలని చాడ కోరారు. -
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాల వల్లనే రైతులు బజారున పడ్డారని, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని, ఈ ఆందోళనలో 600 మంది రైతులు చనిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, యాసంగిలో వరి పంట సాగులో కేసీఆర్ ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలోకి రాకుండా మెయిన్ గేట్లు వేయడంతో చాడ ఆధ్వర్యంలో కార్యకర్తలు గేట్లను తొలగించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, రోడ్లపై ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు అనుమతిచ్చిన పోలీసులు, శాంతియుతంగా ధర్నా చేసుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలాపి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలన్నారు. ధర్నాచౌక్ను ఎత్తివేసిన ఇందిరాపార్క్ వద్దే నేడు టీఆర్ఎస్ ధర్నా చేస్తుందని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు. -
హిందూ జాతీయవాదుల దాడులను తిప్పికొట్టాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాలపై బీజేపీకి చెందిన హిందూ జాతీయవాదుల దాడులను తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరగబోయే అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల సన్నాహక కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, పాలనలో మార్పు రావడానికి దేశ యువత బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారాలని అయన అన్నారు. కేంద్రంలోని నిరంకుశ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మరుపాక, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు బి.స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆనాడు వద్దన్న ధర్నా చౌక్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తుందని చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను టీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించిందని, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాల ద్వారా ధర్నా చౌక్ను తిరిగి సాధించుకున్నాయన్నారు. ఆనాడు వద్దన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు అదే ధర్నా చౌక్లో కావల్సి వచ్చిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: చాడ సింగరేణి కాలరీస్ యాజ మాన్యం తప్పిందంతో శ్రీరాంపూర్ బొగ్గుగనిలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందా రాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కో రారు. రక్షణ చర్యలు చేపట్టకుండా కార్మికులను విధుల్లోకి పంపడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. యాజమాన్యం తప్పించుకొని అధికారుల మీద తప్పును తోయడం సరైంది కాదని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించి మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ బీజేపీకి అనుకూలమా, వ్యతిరేకమా?: చాడ
హుస్నాబాద్: ఢిల్లీకి వెళ్లినప్పుడు బీజేపీకి అనుకూలంగా, తెలంగాణకు వస్తే ప్రతికూలంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ బీజేపీకి అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలపై ఆర్థికంగా, చట్టపరంగా దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకుంటే, ఇక రాష్ట్రాలకు చెరువులు, కుంటలు తప్ప ఏమీ ఉండవన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూనే, 25 నియోజకవర్గాల్లో పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు చాడ వివరించారు. -
పంటల సాగులో రైతుకు స్వేచ్ఛ లేదా: చాడ
సాక్షి, హైదరాబాద్: రైతులు ఏయే పంటలు సాగుచేయాలనే విషయంలో ప్రభుత్వం శాసించడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. వరి విత్తనాల విక్రయంపై వ్యవసాయ శాఖ నిషేధం విధిస్తూ, మరోవైపు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడాన్ని తప్పుబట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మఖ్దూంభవన్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్పాషాతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలో వరి పంట పండించుకునేందుకు రైతులు అచ్చుకట్టు వేసుకున్నారని, ఇప్పుడు వరి సాగు చేయొద్దనడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. -
కేంద్ర గెజిట్ను అడ్డుకుందాం
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అందుకే కేంద్ర గెజిట్ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు. కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దేశాన్ని అమ్మేందుకు మోదీ తహతహ
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అమ్మనీయబోమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు దేశాన్ని అమ్మేందుకు తహతహలాడుతున్నారని సీపీఐ జాతీయకార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ విమర్శించారు. నేషనల్ ఇన్ పైప్ పేరుతో రైల్వే, రోడ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్, విదేశీ కంపెనీలకు మోదీ ప్రభుత్వం కట్టబెట్టి రూ.6 లక్షల కోట్లు సమీకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ హయాంలో ఆర్థికవ్యవస్థ కుదేలైపోయిందని, శాంతిభద్రతలు గాలికి ఎగిరిపోయాయని, సరిహద్దులకు రక్షణ కరువైందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి మఖ్దూంభవన్లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనలో ఆర్థికరంగం అథఃపాతాళానికి చేరుకుందని, తిరిగి పూర్వస్థితికి రావడం కష్టంగా మారిందన్నారు. లఖింపూర్ ఖిరీ ఘటనకు కారణమైన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని అతుల్ కుమార్ ప్రశ్నించారు. అజయ్ మిశ్రాకు నేరచరిత్ర ఉన్నదని, 2003లో ఒక యువకుని హత్య కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉందన్నారు. అటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రైతుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మరోసారి చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, బుల్లెట్లు దూసుకొచ్చినా ఖాతరుచేయబోమని స్పష్టం చేశారు. జూలైలో సీపీఐ రాష్ట్ర మహాసభలు: చాడ వచ్చే ఏడాది జూలై నెలాఖరున రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సీపీఐ రాష్ట్ర మహాసభలు, వచ్చే ఏడాది అక్టోబర్ 14–17 తేదీలలో విజయవాడలో జాతీయ మహాసభలు జరుగుతాయని చాడ తెలి పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తాను ఎన్నడూ అనలేదని సీఎం కేసీఆర్ శాసనసభలో అసత్యం పలకడం శోచనీయమన్నారు. 2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టంగా ఉందన్నారు. లఖింపూర్ ఖీరి ఘటన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నుట్లు తెలిపారు. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల నిర్ణ యాలను వెల్లడించారు. పోడుభూముల సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యక్ష కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
హోరెత్తిన ‘పోడు’ పోరు
సాక్షి నెట్వర్క్: పోడుభూముల పోరు తీవ్రతరమైంది. వెంటనే పట్టాలివ్వాలని మంగళవారం గిరిజన రైతులు రోడ్డెక్కారు. అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ సడక్బంద్ నిర్వహించారు. కదంతొక్కారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పోడుభూముల కోసం పోరాడే గిరిజనులను జైళ్లలో పెట్టడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోడుసాగుదారులకు పట్టాలివ్వాలనే డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చేపట్టిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన నర్సింహులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచల్లో కూడా రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లిల్లోనూ వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పేద గిరిజన రైతులకు వెంటనే పట్టాలివ్వాలి పోడు భూములు గిరిజనుల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని హైదరాబాద్–శ్రీశైలం హైవేపైనున్న హాజీపూర్ చౌరస్తాలో నల్లమల సడక్బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్వెస్లీ హాజరయ్యారు. అంతకుముందు నారాయణ హైదరాబాద్ నుంచి హజీపూర్ వెళ్తూ డిండిలో మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్ గిరిజనుల వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఉమ్మడి వరంగల్లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన ‘సడక్ బంద్’విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు రాస్తారోకోలు నిర్వహించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై ఆందోళన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో సడక్ బంద్ నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని మిర్యాలగూడలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై, బాన్సువాడ, గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్డు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సత్తెనపల్లి, కడెంలోని పాండ్వపూర్, దస్తురాబాద్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, దహెగాం, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఉట్నూర్ ఎక్స్రోడ్డు వద్ద సడక్బంద్లో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. -
అంతా కలిసి రండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, అనుకున్న లక్ష్యాల కోసం అంతా కలిసి పోరాటం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ నేత భట్టి అధ్యక్షతన జరిగి ఈ భేటీకి సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొ. విశ్వేశ్వరరావ్, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, న్యూ డెమోక్రసీ, టీటీడీపీ, లిబరేషన్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని భట్టి అఖిలపక్ష నేతలను కోరారు. అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయని, అదే విధంగా పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామని చెప్పాయన్నారు. ఆయా పార్టీలే కాకుండా వాటి అనుబంధ సంఘాలు కూడా తమతో కలిసి వస్తాయని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేశామని, సాధించుకున్న తెలంగాణలో పోరాట లక్ష్యాలు నెరవేరేందుకు మరింతగా పోరాడిల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు. తాము అసెంబ్లీలో పోరాటం చేస్తున్నామని, మీ అంశాలు తెలియజేస్తే మీ గొంతుకను కూడా శాసనసభలో వినిపిస్తామని భట్టి అన్నారు. సీపీఐ కార్యదర్శి చాడ మాట్లాడుతూ, కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంతోపాటు పోడు భూముల సమస్య పై పోరాటం ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్తో కలసి పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవ్వడంలో కేసీఆర్ విఫలం అయ్యారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలిసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాల మద్దతు: భట్టి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాలు మద్దతు తెలిపాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్లో గురువారం నిర్వహించిన అఖిలపక్షభేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మాతో కలసివచ్చే పార్టీలను కోరడం జరిగింది. మా ప్రతిపాదనకు మీటింగ్లో పాల్గొన్న అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయి. పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నాయి. మాతో కలిసి వచ్చే పార్టీలే కాదు.. ఆ పార్టీల అనుబంధ సంఘాలు కూడా మాతో కలసి పని చేస్తాయి’’ అని భట్టి విక్రమార్క తెలిపారు. (చదవండి: గుర్రపు బండిపై అసెంబ్లీకి..) నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్తో కలసి పోరాటం చేస్తాం: చాడ వెంకట్ రెడ్డి.. సీపీఐ కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు.. పోడు భూముల సమస్యపై పోరాటం ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాం అన్నారు సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్తో కలసి పోరాటం చేస్తాం. ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కేసీఆర్ విఫలం అయ్యాడు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలసి పనిచేయాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై మా పార్టీ లో చర్చించి మరోసారి సమావేశం అవుతాం’’ అని చాడ వెంకటరెడ్డి తెలిపారు. చదవండి: విద్యార్థి, నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం: రేవంత్రెడ్డి -
‘కోదండరాంపై బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’
సాక్షి, హైదరాబాద్: భారత్బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఆయన బట్టలు చినిగిపోయేలా దాడి చేసి అరెస్ట్ చేయడం దారుణమని విరుచుకుపడ్డారు. ఈ చర్యను తెలంగాణ సమాజమంతా ఖండించాలన్నారు. బంద్ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేతలపై దాడులకు పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్లో మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకట్రాములు, సీపీఐ (ఎంఎల్) నాయకుడు గోవర్ధన్ మాట్లాడారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. రాజకీయ పారీ్టల నాయకులపై మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా దొంగలపై, దోషులపై వ్యవహరించినట్లు పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేసి అరెస్ట్ చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని నిరసన తెలియజేస్తూ తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలు బంద్కు మద్దతివ్వగా తెలంగాణ సర్కార్ మాత్రం బంద్ పాటించిన ఉద్యమకారులను అణచివేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేయాలని ప్రధాని, సీఎం మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు కనబడుతోందని వారు ఆరోపించారు. -
ఎల్లుండి భారత్ బంద్ అందరూ పాటించాలి: ప్రజలకు ప్రతిపక్షాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న జరగబోయే భారత్ బంద్కు ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ను జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు శుక్రవారం ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కోవిడ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం సాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన అనంతరం కాంగ్రెస్ నేత మల్లు రవి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు అచ్యుత రామారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు డీజీ నర్సింహారావు, బెల్లయ్యనాయక్, బాలమల్లేశ్, కె.రమ, బక్క నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 5న భారీ రాస్తారోకో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలపై ఉద్యమించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ భూముల సాగుకు హక్కు పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 400 కిలోమీటర్ల మేర కనెక్టింగ్ కారిడార్ అంతటా వచ్చే నెల 5వ తేదీన రాస్తోరోకో నిర్వహించాలని తీర్మానించాయి. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన ఏడు ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. మధుయాష్కీగౌడ్, మల్లురవి, కోదండరెడ్డి, అన్వేష్రెడ్డి (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడా వెంకటరెడ్డి, బాలమల్లేశ్ (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం, పీఎల్ విశ్వేశ్వర్రావు (టీజేఎస్), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ) పోటు రంగారావు, గోవర్ధన్, నరసింహారావు, కె. రమ (సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ), రాజేశ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), ప్రదీప్ (పీవైఎల్), రాము (పీడీఎస్యూ)లు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల, పోడు భూములు, వ్యవసాయ, రైతాంగ సమస్యలపై చర్చించారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వాల మెడలు వంచుతాం: రేవంత్రెడ్డి కేసీఆర్, మోదీల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య చాలా కీలకమైందని, దాదాపు 20 నియోజక వర్గాల్లోని గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై దీర్ఘకాలిక పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ధరణి పోర్టల్లో దాదాపు 25 లక్షల ఎకరాల రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్య, పేద రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులు, బాధితులను సమీకరించి మహాధర్నా చేస్తామని తెలిపారు. అదే విధంగా ఈనెల 27న జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈనెల 30న రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కేసీఆర్కు భయం పట్టుకుంది: తమ్మినేని పోడు భూముల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటం అని ప్రకటించగానే సీఎం కేసీఆర్కు భయం పట్టుకుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. అందువల్లే వెంటనే పోడు భూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ఎద్దేవా చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పోరాట కార్యక్రమాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. మహాధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలన్నిటినీ విజయవంతం చేయాలని కోదండరాం ప్రజలను కోరారు. పోటు రంగారావు తదితరులు మాట్లాడారు. టార్గెట్ కేటీఆర్ సీఎం కేసీఆర్ లక్ష్యంగా గజ్వేల్లో దండోరా సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా ఆయన కుమారుడు కేటీఆర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. అక్టోబర్ 2వ తేదీన సిరిసిల్లలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇలావుండగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిపక్ష పార్టీలు గాంధీభవన్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సమావేశం కావడం ఇదే తొలిసారని, ఇది రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు దోహదపడుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల డిమాండ్లివే.. ►దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తేవాలి. విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవాలి. ►కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. ►ఆదాయ పన్ను పరిధిలోని లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 నగదు అందించాలి. తలకు ఒక్కింటికి 10 కిలోల బియ్యం ఇవ్వాలి. ►పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీలు, సర్ చార్జీలను వెంటనే ఉపసంహరించాలి. ►రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. ►ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. మూసివేసిన పరిశ్రమలను తెరిపించాలి. ►కార్మిక కోడ్ను రద్దు చేయాలి. సమ్మె, వేతనాల కోసం బేరసారాల హక్కులను పునరుద్ధరించాలి. ►ఉపాధి హామీ చట్టంలో ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలి. ►‘పెగాసస్’వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరిపించాలి. ►దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టం లాంటి దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించాలి. ►అటవీహక్కులు, పీసా చట్టాల అమలు జరపా లి. పోడు భూములకు సాగుహక్కు పత్రాలివ్వాలి. -
TS: పోరాట చరిత్రను గుర్తించాలి
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి ఆగస్టు 15, 1947న దేశానికంతటికి స్వాతంత్య్రం లభించినా, తెలంగాణ నవాబు హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. ఆనాడు తెలంగాణలోని కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాల నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఎగురవేయడంతో నిజాం పోలీసులు వారిపై కేసులు పెట్టారు. 1947 సెప్టెంబర్ 11న నిజాంను గద్దె దించాలని, సాయుధులై గెరిల్లా పోరాటాలు చేయాలని సీపీఐ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో తరతరాలుగా వెట్టి చేసిన చేతులు బందూకులు పట్టాయి. ఊరూరు ఒక విప్లవ కేంద్రమయ్యింది. హైదరాబాద్ అంటే 16 జిల్లాల పరగణ. ఇప్పుడున్న మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలుగా ఇవి వున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు 17 సెప్టెంబర్ 1948ని స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ గానీ, తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలు గానీ తెలంగాణ విలీన దినం నిర్వహించడానికి నిరాకరించాయి. కానీ తెలంగాణ పోరాటంలో ఉనికి లేని బీజేపీవాళ్లు విమోచన దినం అధికారికంగా జరపాలని అంటున్నారు. అగ్రనాయకుడు అమిత్ షాను తెచ్చి జెండాలను ఎగురవేసే ముందు ఆనాటి సాయుధ పోరాట చరిత్రను గుర్తించి, చిరస్మరణీయం చేయాలి. సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లిముల తగాదాగా చిత్రీకరించి మత రాజకీయాలు చేయ పూనుకోవడం తగనిది. అనేక మంది ముస్లింలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. గతంలో బీజేపీ నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను వక్రీకరించేందుకు చాలా ప్రయ త్నించింది. రజాకార్లు, కమ్యూనిస్టులు చేతులు కలిపి భారత యూనియన్కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారంది. ప్రజలు నమ్మకపోవడంతో కొత్తగా నిర్మల్లో వెయ్యి ఊడల మర్రిచెట్టుకు నిజాం పాలకులు వెయ్యి మందిని ఉరి తీశారనీ, అక్కడ సెప్టెంబర్ 17 విమోచనోత్సవాలు చేస్తున్నామనీ ప్రకటించారు. నిజానికి ఇది 1948 సెప్టెంబర్ 17తో సంబంధం లేని అంశం. అలనాడు రాంజీ గోండు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా 1860లో చేసిన వీరోచిత తిరుగుబాటుతో నిర్మల్ వెయ్యి ఊడల మర్రికి సంబంధం ఉన్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియిద్దీన్, చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య త్యాగాల వలన భారత యూనియన్లో తెలంగాణ విలీనమైందని, వారు లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్లాగా వుండేదని చిలుక పలుకులు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ చేస్తూ విలీన దినంగా గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు. సెప్టెంబర్ 17ను అధికరంగా గుర్తిస్తే ప్రజలలో ఒక చర్చ జరుగుతంది. గతం లేనిది వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్ వుండదని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. సాయుధ పోరాట త్యాగాల చరిత్ర లేకుండా తెలంగాణ లేదని గ్రహించుకోవాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, మతోన్మాద బీజేపీ నాయకులకు దానిపై మాట్లాడే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయుధ పోరాట యోధుడు మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సభకు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ అధ్యక్షత వహించగా నేతలు మఖ్డూమ్ మొహియుద్దీన్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అసలు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని ప్రజలను నారాయణ కోరారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతరేకంగా రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిందని, ఈ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. అనంతరం ఎర్ర జెండాలతో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
బీజేపీ, టీఆర్ఎస్లకు నార్కో టెస్టులు చేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలనే అంశంలో బీజేపీ, టీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదని, ఈ విషయంలో ఆ రెండు పార్టీలకు నార్కో పరీక్షలు చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషాతో కలసి హైదరాబాద్ మఖ్దూంభవన్లో బుధవారం మీడియాతో నారాయణ మాట్లాడారు. విజయవాడలో జాతీయ మహాసభ అక్టోబర్ 3 నుంచి 4 వరకు ఢిల్లీలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించనున్నట్లు నారాయణ తెలిపారు. జాతీయ మహాసభను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మోదీకి పరిపాలించే నైతిక హక్కు లేదని, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 19 రాజకీయ పార్టీలు ఈ నెల 27న భారత్ బంద్ చేపడుతున్నాయన్నారు. -
సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా గుర్తిస్తూ జాతీయ జెండాను ఎగురవేసి సాయుధ పోరాట అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సచివాలయం సమీపంలో నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖరాశారు. ‘దేశా నికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతం నిజాం రాచరిక, నిరంకుశ పాలనలో నలుగుతున్నది. నిజాం రాచరిక వ్యవస్థ అంతం కావాలని, వెట్టిచాకిరీ, దుర హంకారాలు, దోపిడీ, దౌర్జన్యాలు అంతం కావాలని 1947 సెప్టెంబర్ 11న ఆంధ్ర మహా సభ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొ హియుద్దీన్ సాయుధ పోరాటానికి పిలు పునిచ్చారు. నిజాం సైన్యాలు, రజాకార్లు సా గించిన దాడుల్లో వేలాది మందిని చిత్రహిం సలకు గురిచేశారు. దీంతో పరిస్థితిని గమ నించిన నిజాం రాష్ట్రంపై యూనియన్ సైన్యా లు పోలీస్ యాక్షన్ పేరుతో దాడి చేశాయి. రెండు రోజుల్లో నిజాం ప్రభుత్వం లొంగుబా టును ప్రదర్శించి, హైదరాబాద్ను భారతదే శంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది’ అని వివరించారు. కానీ, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం పొందిన రోజు చరిత్రలో కనుమరుగయిందని తెలిపారు. ఆనాటి తెలం గాణ పోరాటయోధుల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని గుర్తించి రాష్ట్రప్రభుత్వం తరపున పెన్షన్ మంజూరు చేయాలని చాడ కోరారు. -
గిరిజనులపై దాడులు అమానుషం: చాడ
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్య గూడెంలో అటవీశాఖ అధికారులు 55 ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్న రైతులపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనతో తీవ్రంగా మానసిక వేదనకు గురైన ఇద్దరు రైతులు అక్కడికక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, వారికి చికిత్స అందించారని తెలిపారు. పోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేసేంతవరకూ కమ్యూనిస్టు పార్టీ అలుపెరుగని ఉద్యమం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే పోడు సాగుదారులపై దాడులు నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
భూ సమస్యలపై నిరంతర ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: భూ సమస్యలపై నిరంతర ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగానే ధరణి పోర్టల్ లొసుగులను ఎత్తిచూపుతూ సెప్టెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే జీవో 58 ప్రకారం పేదలకు పట్టాలు, డబుల్ బెడ్రూంల సాధనకు సెప్టెంబర్ 10లోపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, కార్యవర్గ సమావేశ వివరాలను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి చాడ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మోదీ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమైందని, చట్టాల ఉల్లంఘనతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీల పిలుపు మేరకు సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు తెలంగాణ లో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పా రు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నుసన్నల్లోనే అసైన్డ్, పట్టా, వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూములు కబ్జాకు గుర య్యాయని ఆరోపించారు. 2014లో 125 గజాల ఇళ్ల స్థలాలకు పట్టా సర్టిఫికెట్ ఇస్తామని ప్రభుత్వం 58 జీవో విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరికీ కూడా పట్టా ఇవ్వలేదని విమర్శించారు. 11న బస్సుయాత్ర కృష్ణా–గోదావరి జలాలపై రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని చాడ ధ్వజమెత్తారు. జల వివాదంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించకపోతే తామే రాష్ట్రస్థాయిలో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. పోడు భూముల అంశంపైనా అన్ని పార్టీలతో కలిసి పోరాటాల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట స్మృతులను గుర్తుచేస్తూ సెప్టెంబర్ 11న బస్సుయాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ తిలోదకాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతకు మూలమైన నీళ్లు–నిధులు–నియామకాల విషయంలో తీవ్ర అన్యా యం జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకో వడం లేదని శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ధ్వజమెత్తారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని, గడీల పాలన తో కుటుంబపాలనకే పరిమితమైందని మండిపడ్డారు. ఈ అంశాలన్నీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకే ఈ నెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నారని వివరించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్ డా.జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్తో కలిసి స్వామిగౌడ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ల విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు నెలకొన్నాయని డీకే అరుణ విమర్శించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉండగా, తక్కువ నీటి వాటాకు కేసీఆర్ ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు. ‘ఉద్యమ నిర్మాణాల్లో కీలకభూమిక పోషించాలి’ సాక్షి, హైదరాబాద్: ప్రజాఉద్యమాల నిర్మాణం, సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. సామాన్యులు, కష్టజీవులకు అండగా నిలుస్తూ సమస్యలపై తీవ్రస్థాయి ఉద్యమాలు చేపట్టి పార్టీపట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచాలని సూచించారు. మంగళవారం ఆయన నగరానికి వచ్చిన సందర్భంగా మఖ్దూంభవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకట్రెడ్డిలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉద్యమకార్యాచరణ, విస్తరణపై చర్చించారు. ప్రధాని మోదీ రైతు, కారి్మక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక నల్లచట్టాలను తీసుకొచ్చారని రాజా ధ్వజమెత్తారు. ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది: చాడ తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగిందని చాడ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోలేదని, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడంలేదని అన్నారు. నగరంలోని సీఆర్ ఫౌండేషన్ను డి.రాజా, ఆయన సతీమణి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా సందర్శించారు. -
‘గిరిజన బంధు’ అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు పథకం అమ లుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్కు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం మంచిదేననీ, రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ పథకం అమలు చేయాలనేది తమ పార్టీ అభిప్రాయమన్నారు. షెడ్యూల్ కులాలకు చెందిన వారి మాదిరిగానే గిరిజనులు కూడా వారి కాళ్లమీద వారు నిలబడటానికి గిరిజన బంధు పథకం దోహదపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న ఆదివాసీ/గిరిజనులపై ఫారెస్టు అధికారులు, పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా పంటలను పాడు చేయడాన్ని నియంత్రించాలన్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ పాత ప్రాజెక్టే
జడ్చర్ల టౌన్/కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కిరణ్కుమార్రెడ్డి ఉన్నప్పుడే మంజూరయిందని, దానిని కేంద్రం గుర్తించకపోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా మంగళవారం సీపీఐ రాష్ట్ర బృందం జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌస్ నిర్మాణ పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్లయినా ఇప్పటికీ నీళ్ల పంచాయితీ తెగలేదని, ముఖ్యంగా కృష్ణా నికర జలాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పేరు మార్చినప్పటికీ, ప్రాజెక్ట్ మాత్రం పాతదేనని ఏపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రాజెక్టుపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. ఏడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికీ ఉదండాపూర్ రిజర్వాయర్ పనులే పూర్తికాలేదని, ఇక లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ ఎప్పుడు ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ మొదటి నుంచి పక్షపాత వైఖరి చూపిస్తున్నారని విమర్శించారు. కృష్ణానది 66 శాతం తెలంగాణలో, ఏపీలో 34 శాతమే ప్రవాహం ఉందని, కానీ, నీటి కేటాయింపుల్లో మాత్రం ఏపీకీ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించడం దారుణమన్నారు. -
అమ్మొద్దు.. అన్యాక్రాంతం కానీయొద్దు
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్/ఖమ్మం: ప్రభుత్వ భూముల అమ్మకం, అసైన్డ్, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సీపీఐ పోరుబాట పట్టింది. గురువారం కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఖమ్మం కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాలపై విచారణ జరిపి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 16 వేల ఎకరాల ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకోవడంలో సర్కార్ వెనుకంజ వేస్తోందని మండిపడ్డారు. వేలం ఆపకపోతే ఎర్రజెండాలు పాతి పేదలకు పంచుతామని హెచ్చరించారు. రాష్ట్ర సహాయకార్యదర్శులు పల్లా వెంకట్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో, కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, బీఎస్ బోస్ హైదరాబాద్లో, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు ఖమ్మంలో, పశ్య పద్మ కామారెడ్డిలో, బాలమల్లేశ్ మేడ్చల్ జిల్లాలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. -
పోరాటాల అడ్డా.. సిద్దిపేట గడ్డ
సిద్దిపేట అర్బన్: ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలి విడత పోరాటాలకు సిద్దిపేట గడ్డ దిక్సూచిగా నిలి చిందని, అలాంటి గడ్డకు తొలి శాసనసభ్యుడిగా ప్రాతి నిధ్యం వహించిన ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని ఆవిష్క రించుకోవడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన గురువారెడ్డి విగ్రహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసనసభ్యుడిగా గురువారెడ్డిది గొప్ప చరిత్ర అని, సిద్దిపేటకు మొట్టమొదట కరెంట్ను తీసుకొచ్చిన నాయకుడు అని కొనియాడారు. పోరాటాలు చేసిన వీరుల, నాయకుల విగ్రహాలు ఘనంగా ప్రతిష్టించుకున్న ఘనత సిద్దిపేటకే దక్కుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నా రు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డిలు పాల్గొన్నారు. రూ.60 లక్షలతో కుక్కల కు.ని. కేంద్రం ప్రశాంత్నగర్ (సిద్దిపేట): సిద్దిపేటలో రూ.60 లక్షలతో వీధి కుక్కల జనన నియం త్రణ కేంద్రాన్ని నిర్మించామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రంలో ప్రతి రెండు రోజులకు ఒకసారి 240 కుక్కలకు ఆపరేషన్ చేసి, అవి కోలుకునే వరకు ఆహారం ఇవ్వడంతో పాటుగా రేబిస్ ఇంజక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. చదవండి: బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ మృతి -
రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా మంగళవారం వారు చేపట్టిన ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు నిరసనలు కేవలం పంజాబ్ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఆహార భద్రతకు చిల్లు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రాజ్యాంగ వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను మోదీ సర్కారు జైల్లో పెడుతుందని, అలా చేసిన వరవరరావు సహా పదహారు మందిని జైల్లో పెట్టడం దుర్మార్గ చర్య వారు విమర్శించారు. రైతులకు మద్దతుగా నిలవకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు సైతం నిరసన సెగలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తొలుత వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. మూడు రోజుల్లోనే మాట మార్చారని, రైతుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధే లేదని వారు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేంద్ర పెద్దలకు వంగివంగి దండాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విపలమయ్యారని ఆరోపించారు. దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారు: ప్రొ. కోదండరామ్ వ్యవసాయం అంటే కంపెనీలు కాదు, వ్యవసాయం అంటే రైతులు మాత్రమే.. అలాంటిది రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చాలని మోదీ సర్కారు భావిస్తే, దేశప్రజలంతా ఏకమై తగిన శాస్తి చెబుతారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ హెచ్చరించారు. చట్టాలను సామాన్య ప్రజల లబ్ధి కోసం రూపొందించాలి కానీ, కార్పొరేట్ శక్తుల కడుపు నింపడం కోసం కాదని ఆయన విమర్శించారు. సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని మాత్రమే రైతులు కోరుతున్నారని, అంతకు మించి వారు ఏదీ ఆశించడం లేదన్నారు. రైతు పోరాటం ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కొనసాగుతుందని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాడు. -
రద్దు చేయకపోతే గద్దె దిగుతారు
కవాడిగూడ(హైదరాబాద్): కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గద్దె దిగక తప్పదని అఖిల భారత రైతు పోరాటాల సమన్వయ కమిటీ(ఏఐకేఎస్సీసీ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగిన రైతు మహాధర్నా హోరెత్తింది. రైతు వ్యతిరేక చట్టాలతోపాటు, విద్యుత్ సంస్కరణ బిల్లునూ ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని రైతులు, కారి్మకులతో కలసి యువజన, విద్యారి్థ, ప్రజాసంఘాలు కదంతొక్కాయి. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిరసనకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ధర్నాకు హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ మోదీ అధికారంలోకి రాక ముందు స్వామినాథన్ కమిషన్ను చేస్తానన్నారని, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షామా? మోదీ పక్షామా తేల్చుకోవాలని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రైతు ఉద్యమాన్ని బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తోందన్నారు. కార్పొరేట్ శక్తుల లాభాల కోసం ఆహార పంటలను నిరీ్వర్యం చేస్తూ, వాణిజ్య సాగును ప్రోత్సహిస్తున్నారని, దీని వల్ల అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయనని సీఎం కేసీఆర్ చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే ఢిల్లీ తరహాలోనే తెలంగాణలోనూ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయంపై విలువలేదని పంజాబ్ రైతు ఉద్యమ నాయకుడు సత్బీర్ సింగ్ అన్నారు. రైతు ఉద్యమంలో రెండేళ్ల బాలుడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకూ పొల్గొంటున్నారని, కచి్చతంగా గెలిచితీరతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు పోటు రంగారావు, సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సిరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య, రైతు సమన్వయ కమిటీ ప్రతినిధులు పశ్య పద్మ, సాగర్, రాయల చంద్రశేఖర్, రంగయ్య, అచ్యుతరామారావు, ఉపేందర్రెడ్డి, రవి, రాఘవచారి, ప్రసాద్, అబిద్ పరీదా, సంధ్య, రాయల రమ తదితరులు పాల్గొన్నారు. -
నయీం డైరీని, బాగోతాల్ని బయటపెట్టాలి
సాక్షి, కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీం డైరీని, అతని బాగోతాల్ని బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నయీం బాగోతంపై న్యాయవిచారణ జరిపించాలని కోరారు. నయీం కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీస్ ఆఫీసర్లకు, క్లీన్చీట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దోషులను నిర్దోషులుగా ప్రకటించడం చట్టవిరుద్దమని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ జీవోను, రేట్లను సవరించాలని కోరారు. ఆస్తుల క్రమబద్దీకరణకు ఇంటింటా సర్వేను సీపీఐ స్వాగతిస్తుందని తెలిపారు. ఆస్తుల క్రమబద్దీకరణతో దేవాలయ భూములను, వక్ఫ్ బోర్డు భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. (ఆ పోరాటం స్ఫూర్తిగా సీపీఐ పోరాడుతుంది) -
అదే నిజమైన నివాళి
ఏడవ నిజాం నవాబు హయాంలో జమీందారు, జాగీ ర్దార్, దేశ్ముఖ్, పటేల్, పట్వారి, భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఖాసీంరజ్వీ నాయకత్వాన నిజాం నవాబ్ రాజ్యాన్ని నిలబెట్టేందుకు మతపరమైన విషప్రచారం చేసేం దుకు రజాకార్లు ప్రయత్నం చేశారు. గ్రామాల మీద భూస్వాములతో కలిసి ప్రజ లను లూటీలు, హత్యలు చేశారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున నిజాం నవాబు అధికార భాష ఉర్దూగా ఉండేది. అప్పుడు తెలుగులో విద్యాభ్యాసం, పాఠశాలలు ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితులలో మెదక్ జిల్లా జోగిపేటలో 1931లో తొలి ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది. దాని ప్రధాన తీర్మానాలు తెలుగులో విద్యా బోధన, గ్రంథాలయాల ఏర్పాట్లు జరగాలి. ఆ తర్వాత అనేక మహాసభలు జరి గాయి. భువనగిరిలో జరిగిన 15వ ఆంధ్రమహాసభ నూతనత్వాన్ని సంతరించుకున్నది. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరి రద్దు, తెలుగులో విద్యా బోధన అందుబాటులో రావాలని, గీసే వాడికే తాడిచెట్టు, దున్నేవాడిదే భూమి అనే విప్లవాత్మకమైన నినాదాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు గెరిల్లా పోరాటానికి రూపకల్పన చేశాయి. ఉద్యమ నేపథ్యంలో 3,000 గ్రామాలు విముక్తి అయ్యాయి. 10 లక్షల ఎకరాల భూములు పేదల స్వాధీనంలోకి వచ్చాయి. అయితే బ్రిటిష్ వారితో సంప్రదింపులు చేస్తుండగానే 15 ఆగస్టు 1947న దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుం దని ప్రకటించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో నవాబు రాయబారాలు సాగిస్తూనే, మరోవైపు ఉద్యమాన్ని అణచడానికి వినూత్న పద్ధతుల్లో ప్రయత్నించాడు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మాఖ్దూం మొహియుద్దీన్ సెప్టెంబర్ 11న రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు ప్రభంజనం అయింది. ఎట్టకేలకు 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అనేక తర్జనభర్జనల పిదప 1951, అక్టోబర్ 21న సాయుధ పోరాటం విరమించారు. 1952లో హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జైళ్ళలో ఉన్నా కమ్యూనిస్టు యోధులకు బ్రహ్మరథం పట్టి భారీ మెజారిటీతో గెలి పించారు. జవహర్లాల్ నెహ్రూకంటే అత్యధిక మెజారిటీతో నల్లగొండ నుండి రావి నారాయణరెడ్డిని గెలి పించి తెలంగాణ ప్రజలు భారతదేశాన్నే ఆశ్చర్యపరిచారు. ఇంతటి త్యాగాలు, వేలాదిమంది ఆత్మార్పణం, రక్తపాతం పిదప కూడా బూర్జువా పాలకులు చరిత్రను కనుమరుగు చేయ ప్రయత్నిం చారు. త్యాగాలు కమ్యూనిస్టులవి, భోగాలు బూర్జువా పాలకులవిగా మారాయి. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యకాంతి ఎలాగైతే ఆపలేరో తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలు ఎవరు కనుమరుగు చేయజాలరు. అలనాటి సాయుధ పోరాట త్యాగాలను మెచ్చుకున్న కేసీఆర్ ఈనాడు ఈ ఊసే ఎత్తడం లేదు. సాయుధ పోరాట యోధుల త్యాగాలను శాశ్వతం చేయడానికి కనీసం ఆలోచించడం లేదు. ఆత్మగౌరవ పరిపాలన కనుచూపు మేరలో కనబడటం లేదు. కేంద్రంలో బీజేపీ మరింత మతోన్మాద చర్యలకు పాల్ప డుతున్నది. మరోవైపు కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా అణగారిన ప్రజలు ఐక్యమై ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సన్నద్ధం కావాలి. అదే ఉద్యమకారులకు ఇచ్చే నిజమైన నివాళి. వ్యాసకర్త :చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
ఆ పోరాటం స్ఫూర్తిగా సీపీఐ పోరాడుతుంది
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో పార్టీ కార్యాలయం వద్ద తన వాహనంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలకు చాడ వెంకట్ రెడ్డితోపాటు కమ్యూనిస్టులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా వెట్టిచాకిరి బానిసత్వం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభాకర్ రావు లాంటి వారు ఎందరో పోరాడి అసువులు బాశారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాంటి సమరయోధులను గుర్తుంచుకునేలా ప్రభుత్వం వెంటనే హైదరాబాద్లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్రం కోసం పోరాడిన ప్రభాకర్ రావు లాంటివారు ఎన్కౌంటర్ అయిన హుస్నాబాద్ సమీపంలోని మహ్మదాపూర్ గుట్టల్లో స్మృతి వనంతో పాటు కరీంనగర్లోని ప్రభాకర్ రావు విగ్రహం వద్ద పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇలాంటి పరిస్థితుల్లో నాటి పోరాటయోధులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టులు పోరాడక తప్పదని హెచ్చరించారు. -
చారిత్రక భూమిగా బైరాన్పల్లి
సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటంలోని ప్రధాన ఘట్టం వీర బైరాన్పల్లిని చారిత్రక భూమిగా గుర్తించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ని బైరాన్పల్లి, కూటిగల్లు, హుస్నాబాద్ ప్రాంతాల్లోని బురుజులు, స్తూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం చాడ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల త్యాగాలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రం నిజాం పాలన అంతమైన తర్వాతే వచ్చిందన్నారు. 86 మంది అమరులను ఒకే చితిపై పెట్టి నిప్పుపెట్టిన చరిత్ర ఇక్కడి నేలదన్నారు. ఎన్నికల సందర్భంలో వచ్చిన నాయకులు ౖబైరాన్పల్లిని చారిత్రక ప్రదేశంగా గుర్తిస్తామని, అభివృద్ధి చేసి స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మిస్తామని చెప్పారే తప్పా.. ఏ ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ౖబైరాన్పల్లి్లని చారిత్రక భూమిగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీపీఐ కార్యాలయంపై దాడి
హిమాయత్నగర్ (హైదరాబాద్): కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కేంద్ర కార్యాలయం (మఖ్దూం భవన్)పై ఆగంతుకులు దాడి చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాచ్మేన్ సురేంద్రను తెలుగు అకాడమీ అడ్రస్ అడిగారు. పది నిమిషాలు అక్కడే తచ్చాడి ఆపై దాడికి పాల్పడ్డారు. కర్ర, రాళ్లతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇన్నోవా కారుపై దాడి చేశారు. దీంతో కారు ముందు అద్దం, ఎడమవైపు అద్దాలు ధ్వంస మయ్యాయి. కార్యాలయం బయట పార్క్ చేసి ఉన్న మరో కారుపై కూడా దాడి చేశారు. అనంతరం వాచ్మేన్పై కర్రతో దాడి కి యత్నించగా ఆయన బిగ్గరగా కేకలు వేశా డు. వారు మినర్వా కాఫీషాప్ వైపు వెళ్లిపోయారు. కేసు నమోదు.. సమాచారం తెలుసుకున్న ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కార్యాలయానికి చేరుకుని పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. నారాయణగూడ పోలీసులు వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, యువకుల కోసం మూడు బృందాలు గాలింపు చేపట్టాయని ఇన్స్పెక్టర్ రమేశ్కుమార్ తెలిపారు. ఆకతాయిల పని కాదు.. ప్రజల పక్షాన నిలబడి పోరాడే తమకు ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తాము ఎండగడుతున్న కారణంగానే దాడి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దాడిపై లోతైన విచారణ జరిపించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన చాడ వెంకటరెడ్డి కారు అద్దాలు -
సీఎంతో రాజకీయాలు చర్చించలేదు: చాడ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్తో తాను సమావేశమైన సందర్భంగా రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం రెవెన్యూ బిల్లుపైనే చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి స్పష్టంచేశారు. రెవెన్యూ బిల్లుపై గతంలో సీపీఐ, టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడైన సూచనలతో పాటు, తమ పార్టీ అభిప్రాయాలను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. శనివారం మఖ్దూంభవన్లో పార్టీ నాయకురాలు పశ్య పద్మతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ ఆధ్వర్యంలో అనేక రౌండ్ సమావేశాలు నిర్వహించడమే కాకుండా భూమి, రెవెన్యూ అంశాలపై సీఎంకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం తనకు స్వయంగా ఫోన్ చేసి రెవెన్యూ బిల్లుపై చర్చించేందుకు ఆహ్వానించారని సమగ్ర భూ సర్వే చేసి తప్పుల్లేకుండా సర్వే, రికార్డులను సరి చేయాలని తాము సూచించినట్లు వెల్లడించారు. తన స్వగ్రామం రేకొండలో 50–60 ఏళ్లుగా దళితులు, బీసీలు సాదాబైనామాపై భూములు తీసుకున్నా ఇప్పటికీ పట్టాలు రాలేదని సీఎం దృష్టికి తెచ్చామని, దీంతో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను ఫోన్లో ఆదేశించారని చెప్పారు. కాగా, మఖ్దూం భవన్ రూ.24 లక్షల ఆస్తి పన్ను కట్టాలని జీహెచ్ఎంసీ నోటీసు ఇచ్చిందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే అధికారులతో మాట్లాడి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆదేశించారన్నారు. తర్వలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ప్రగతి భవన్ ముట్టడి భగ్నం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్ : ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వివిధ పార్టీల నాయకులను పోలీసులు శుక్రవారం ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు, తెలంగాణ జన సమితి (టీజేఎస్), టీటీడీపీల ఆధ్వర్యంలో ‘ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజల ప్రాణాలు కాపాడు.. బతుకులు నిలబెట్టు’అనే నినాదంతో ప్రగతి భవన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తారని భావించిన ఆ పార్టీల నేతలు గురువారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నేరుగా ప్రగతి భవన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. మొదటగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు ఎం.నర్సయ్యలతో పాటు న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గోవర్ధన్, ప్రసాద్, పీవోడబ్ల్యూ నేత వి.సంధ్య తదితరులు ప్రగతి భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఇక పంజాగుట్ట చౌరస్తాలో సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్, ఈశ్వర్రావు తదితరులను అరెస్ట్ చేసి అక్కడికే తరలించారు. పీపీఈ కిట్ ధరించి ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన సీపీఐ నేత కె.నారాయణ, ఆ పార్టీ నాయకులు అజీజ్ పాషా, బాలమల్లేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిని ఆర్టీసీ క్రాస్రోడ్లో, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని గోల్కొండ చౌరస్తా వద్ద అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అడ్డుకొని నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. నగరంలో ఎల్బీ నగర్, ఉప్పల్, ముషీరాబాద్, ఎంజే మార్కెట్, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్టలతో పాటు పలు ప్రాంతాల్లో నల్ల బెలూన్లను ఎగురవేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని, కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అమెరికాలో వైట్హౌస్ ముందు నిరసనలకు అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం సీఎం నివాసం వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. -
ఉస్మానియా భూములను కాపాడండి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకొని వాటిని కాపాడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి , టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, ప్రొ.రమేశ్రెడ్డి విజ్ఞప్తిచేశారు. భూముల పరిరక్షణలో భాగంగా ఓయూలోని ఆగ్నేయ మూలలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. శుక్రవారం రాజ్భవన్ లో గవర్నర్కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. 1917లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓయూ ఏర్పాటుకు 1,628 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, దాని సరిహద్దులను సూచిస్తూ సర్వే మ్యాప్ను పొందుపరిచారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి చెందిన డాక్యుమెంట్లు, మ్యాప్లు యూనివర్సిటీ ఎస్టేట్ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వర్సిటీ ఆగ్నేయ మూలలో డీడీ కాలనీ పక్కనే చిన్న చెరువు ఉందని, అది కొన్నేళ్లుగా ఎండిపోవడంతో చుట్టుపక్కల వాళ్లు చెత్తపారేయడానికి ఉపయోగిస్తుండగా కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ప్రాంతంలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తికాలేదని పేర్కొన్నారు.ఓయూకు తులసి సొసైటీతో గతంలో భూవివాదం ఉండగా అది సమసిపోయిందని, ఇప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు.ఈ సొసైటీ కొత్త సభ్యులకు భూమి కేటాయింపు గురించి డిమాండ్ చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. గవర్నర్ సానుకూల స్పందన.. తాము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, ఓయూ భూముల వ్యవహారంలో సమాచారం తెప్పించుకుంటున్నామని చాడ, కోదండరాం మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్సిటీది ఎంతో కీలకమైన పాత్ర కాబట్టి, ఈ భూములు కోల్పోకుండా సీఎం బాధ్యత తీసుకోవాలని చెప్పారు. -
కేంద్రంపై పోరుకు కేసీఆర్ కీలకపాత్ర పోషించాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీ డొల్ల, పచ్చి మోసం అని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఫెడరల్ అధికారాలు, హక్కులను లాక్కుంటున్న కేంద్రంపై పోరులో ప్రధాన పాత్ర పోషించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కలసి కేంద్రం మెడలు వంచే పోరాటాలకు సీపీఐ అండగా ఉంటుం దన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు నడుచుకుంటూ వెళుతూ దారిలో మరణిం చిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ వర్గాలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మంగళవారం మఖ్దూం భవన్లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, పశ్యపద్మ, సుధాకర్ తదితరులు నల్లజెండాలతో భౌతికదూరం పాటిస్తూ నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా చేపడుతున్న చర్యలపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు సీపీఐ నేత నారాయణ లేఖ రాశారు. కోవిడ్కు, ప్రభుత్వరంగ సంస్థలపై వేటుకు సంబంధముందా అన్న విషయాన్ని చెప్పాలని కోరారు. దేశమంతా కరోనా ఎజెండానే ప్రధానంగా ఉండగా.. కేంద్రం ఎజెండా మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి కోల్మైన్స్, ఇస్రో, రక్షణ, అటామిక్ ఎనర్జీ వంటి పరిశ్రమలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కోరలకు బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
లాక్డౌన్: రూ.10 లక్షల కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలు తదితర రంగాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న బాధిత ప్రజలను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. బాధిత వర్గాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. మఖ్దూంభవన్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 దాకా దీక్షలో పాల్గొన్న పార్టీ నాయకులు చాడ వెంకట్రెడ్డి, డా.కె.నారాయణ, అజీజ్పాషా, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్, డా. సుధాకర్లకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఇక జిల్లాలు, మండలాల స్థాయిలో పార్టీ రాష్ట్రనాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు తమ తమ ఇళ్లలోనే దీక్షల్లో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షలో రాష్ట్రంలో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, చేతి వృత్తిదారులకు ప్రభుత్వం రూ. 7 వేలు చొప్పున ఆర్థిక సాయం, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం, ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలని, తెల్లకార్డులు లేని అర్హులను, పేదలను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ వైద్య, విద్యాసంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇప్పించాలని, వరి కొనుగోలు క్వింటాకు 5 కిలోల తరుగు విధానంపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. (తెలంగాణ: అటు కేబినెట్ భేటీ, ఇటు దీక్షలు) -
అలాంటి రాజకీయాలకు కాలం చెల్లింది..!
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో సీపీఐ పార్టీ బలహీనపడిందని.. కొత్త కార్యవర్గం, నాయకత్వ నిర్మాణం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. మంచిర్యాలలో శనివారం ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కనీసం ఒక్క ఎమ్మెల్యే గెలవకపోవటం, అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం లేకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం నిజాయితీ రాజకీయాలు చెల్లుబాటు కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన సీపీఐకి తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యలు, సంక్షేమ పథకాల అమల్లో లోపాలు ఎండగడుతూ ప్రజా పోరాటాలతో ప్రజల్లోకి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల్లో సీపీఐ పార్టీకి చాలా బలముందని, సింగరేణి గుర్తింపు ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసిందని విమర్శించారు. అందుకే సింగరేణి ఏర్పాటు నుంచి బలంగా ఉన్న సీపీఐ కార్మిక సంఘం పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మికుల్లో ఉన్న వ్యతిరేకత, అన్ని సంఘాల మద్దతుతో గత వైభవాన్ని చాటుతామన్నారు. ఎన్సీఆర్, ఎన్పీఆర్ల చట్టాలతో దేశ ప్రజల్లో కేంద్రం భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. కేంద్రలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ ఉద్యమాలను రూపొందించే దిశగా రాష్ట్ర నిర్మాణ మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఫిబ్రవరి 24వరకు కొనసాగనున్నాయి. చదవండి: కేసీఆర్కు వకాలత్ పుచ్చుకున్నారా?: చాడ -
వైవీ స్ఫూర్తితో రైతుల పక్షాన పోరాడాలి: సురవరం
కాచిగూడ : రైతులు పండించిన పంటకు మెరుగైన ధరకోసం, వారి రక్షణ కోసం రైతు సంఘం పోరాడాలని సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. రైతు సంఘాల ఐక్యకార్యచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవడం అభినందనీయమ న్నారు. ఆదివారం హిమాయత్నగర్ అమృత ఎస్టేట్స్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రైతు సంఘం వై.వి.కృష్ణారావు కార్యాలయాన్ని సుధాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మఖ్దూంభవన్లో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేర్రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో సుధాకర్రెడ్డి మాట్లాడుతూ రైతు సంఘం సీనియర్ నేత వై.వి.కృష్ణారావు తన జీవితాంతం కనీస ధరల కోసం పోరాడారని, కేద్రం ఏర్పాటు చేసిన కనీస ధరల కమిషన్కు ఆయనే చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికీ వామపక్షాలకు చెందిన రైతు సంఘాలే వారికోసం పనిచేస్తున్నాయన్నారు. ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ మంచి కమ్యూనిస్టుగా ఉండడం అరుదనీ, ఇలాంటి వారిలో వై.వి.ఒకరని, ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉండటం ఆ పార్టీకే గొప్పతనం అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ వై.వి.కృష్ణారావు వ్యవసాయంపైనే కాకుండా దేశ ఆర్థిక విధానాలపైనా ఎన్నో పుస్తకాలు రాశారన్నారు. -
‘విడిచిపెట్టే వరకు ఆందోళనలు’
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ అధ్యాపకుడు డా.కాశింను విడిచిపెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. గురువారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాశీం విడుదల కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఓయూ ప్రధాన కార్యదర్శి రవినాయక్ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, డా.అన్సారీ, ఎంఎల్ పార్టీ నేత గోవర్ధన్, రమా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విమలక్క, ఎమ్మార్పీఎస్ నేత మేడిపాపయ్య, ఓయూ అధ్యాపకుడు డా.గాలి వినోద్కుమార్ పాల్గొని ప్రసంగించారు. కాశింపై కొత్త కేసులను బనాయించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉపా కేసు పెట్టి జైల్కు తరలించడం అన్యాయమని మండిపడ్డారు. కాశింపై పోలీసులు చేసిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డా.గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ బంద్ చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. -
మేమందుకు వ్యతిరేకం : చాడ వెంకటరెడ్డి
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మినహా ఇతర లౌకిక పార్టీలతో కలసి పోటీ చేసేందుకు సిద్ధంగా తాము ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీల నాయకత్వం అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సోమవారం కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు పెరిగాయని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం మత విభజనకు రూపకల్పనగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అంటూ రాష్ట్రంలో ఒక రాజకీయ చర్చ జరుగుతోందని, దీనికి కొందరు మంత్రులు భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని అన్నారు. -
మద్యాన్ని నిషేధించే వరకు పోరాటం: సీపీఐ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం అరికట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యం విక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యచారాలకు కారణం.. విచ్చలవిడిగా మద్యం దొరకడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు అపహరణకు గురైనా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమంది బాలికలు కిడ్నాప్, అపహరణకు గురయ్యారో పోలీసులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పల్లెల్లో కిరాణం కొట్టులు కూడా బెల్టు దుకాణాలుగా మారాయని విమర్శించారు. మద్యంతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బెల్టు దుకాణాలు లేకుండా చూడాలని కోరారు. ఏపీ లాగా.. తెలంగాణలో కూడా మద్యపాన విక్రయాలు నియంత్రించాలని, మద్యాన్ని నిషేధించే వరకు సీపీఐ అధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలతో కలుపుకుని పోరాటం మరింత ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. -
‘పౌర’ సవరణ లౌకికవాదానికి చేటు
సాక్షి, వరంగల్: పౌరసత్వ చట్ట సవరణ దేశ లౌకికవాదానికి చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలోని మతతత్వ బీజేపీ చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టంతో లౌకిక దేశంగా పేరుగాంచిన భారత్కు ఇక మీదట ఆ పిలుపు దూరం కానుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో అంతరాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 19న కమ్యూనిస్టుల పిలుపుతో నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై చిత్తశుద్ధి కనబర్చడం లేదని ఆరోపించారు. జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా కేసీఆర్ ఎన్నిక హామీలు అమలవుతున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మత్తులో యువత చెడు సావాసలకు పాల్పడుతోందని అన్నారు. రాష్ట్ర మద్యపాన నిషేధం కోసం మహిళలు, మహిళా సంఘాలతో ఈ నెల 23న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయ ముట్టడి చేపడుతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్రజావ్యతిరేక విధానాలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు ప్రజారంజక పాలన కొనసాగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలు ఉద్యమబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. విజయసారథి, జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎం. సదాలక్ష్మీ, వీరస్వామి, అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, శంకరయ్య, సుంకరనేని నర్సయ్య, శ్రీనివాస్, ఆరెల్లి రవి పాల్గొన్నారు. -
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం: చాడ
సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లిగడ్డ ధరలతో సహా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఖరీఫ్ సహాయాన్ని త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు పర్మిట్లు ఇవ్వడంతో మద్యానికి బానిసలైన యువకులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . -
రైతును ‘రెవెన్యూ’తో కలపాలి
ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవదహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన భూములు, దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల వంటి అంశాలు పక్కకు పోయి రెవెన్యూ శాఖపై ప్రజల ఆగ్రహానికి దారి తీయడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఈ వివాదాలన్నిటికీ నిజాం కాలం నాటి సర్వేనే ఇప్పటికీ అమల్లోకి ఉండడం, చట్టాలలో లొసుగులు కారణం. 1936– 42 వరకు తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే జరిగింది. అప్పుడే రికార్డులు అమలు అయినాయి. ఎక్కువ భాగం భూములన్నీ భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమైనందున, సన్న, చిన్నకారు రైతులకు నామ మాత్రంగా భూములుండటంతో భూ వివాదాలు చోటు చేసుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘‘దున్నే వాడికే భూమి’’ అనే నినాదం తెరపైకి రావడంతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, కౌలు భూములు పేదలకు ధారాదత్తం అయినాయి. అయితే చాలా చోట్ల సర్వే నంబర్ల హద్దు తొలగించడంతో భూ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా రెవెన్యూ చట్టానికి కొన్ని సవరణలు తెచ్చారు. అందులో అసైన్మెంట్ చట్టం, కౌలుదారుల హక్కుల చట్టం, ఇనాం భూముల చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములలాంటివి ఎన్నో. అంతే కాకుండా రికార్డులను సరి చేయడానికి ‘‘రికార్డ్స్ ఆఫ్ రైట్’’ ద్వారా పాసు పుస్తకాలివ్వడంలాంటివి జరిగాయి. పహానిలో విధిగా అనుభవదారు కాలం పెట్టి, ప్రతి సంవత్సరం పంట వివరాలు రాస్తూ, గ్రామసభల ద్వారా తెలియపరచాలి. అప్పుడు రైతు భూమి వివరాలు, రెవెన్యూ శాఖకు సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ చట్టాల మార్పు నకు నడుం బిగించాలి. ప్రజలు కేంద్రంగా ఉండే విధంగా రెవెన్యూ చట్టాలు మార్చాలి. అందుకు కొన్ని సూచనలు 1.గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర భూసర్వే ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అందుకు తగిన రీతిలో ప్రభుత్వం రూపొందించే రెవెన్యూ బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశం కల్పించాలి. 2.తక్షణమే శాస్త్రీయ పద్ధతిలో భూ సర్వే చేపట్టాలి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, సాటిలైట్ ఇమేజినరీ టెక్నాలజీ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ వంటి టెక్నాలజీని వినియోగించాలి. ప్రతి సర్వే నెంబర్ హద్దులను నిర్ణయించి, హద్దురాళ్ళును పాతించి, శాశ్వతంగా వివాదాలను పరిష్కరించాలి. 3.రెవెన్యూ పరిపాలన గ్రామస్థాయి నుండి వేళ్ళూనటానికి, సమస్యలు పరిష్కారం కావడానికి గ్రామస్థాయిలో విధిగా రెవెన్యూ అధికారిని నియమించాలి. 4.వారసత్వం, కుటుంబ భూ పంపకం, క్రయవిక్రయాలు, గిఫ్టు డీడ్, కోర్టు డిక్రి, అసైన్మెంట్ ద్వారా పొందే భూములకు భూమిపై హక్కు కల్పించే క్రమాన్ని పూర్తి చేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారికి నిర్ధిష్టకాల పరిమితి విధించాలి. 5.పెండింగ్లో వున్న సాదాబైనామాల క్రయవిక్రయాల దరఖాస్తులను వీలైనంత త్వరగా క్రమబద్దీకరణ చేయడానికి పూనుకోవాలి. 6.రికార్డు ఆఫ్ రైటస్ (ఆర్.వొ.ఆర్) చట్టంలో వున్న లొసుగులను తొలగించాలి. 7.పట్టాదారు పాసుపుస్తకాలలో అవకతవకలను సరిదిద్దాలి. 8.అటవీ శాఖ, రెవెన్యూశాఖల స్వాధీనంలోని భూముల హద్దులను తక్షణమే సరిచేయాలి. 9.పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పట్టాలివ్వాలి. 10.కోనేరు రంగారావు కమిటీ చేసిన 104 సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ చట్టాలను సవరించడం సబబుగా ఉంటుంది. 11.రికార్డులను తారుమారు చేసినా, తప్పులతో నమోదు చేసినా కారకులైన సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. 12.రెవెన్యూ శాఖతో రైతుల సంబంధాల పునరుద్ధరణ కొరకు తగు కార్యాచరణ ఉండాలి. 13.హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భూములను హెచ్ఎండిఎ తదితర సంస్థలు వేలం వేసే భూముల్లో ప్రభుత్వమే అపార్ట్మెంట్లు కట్టించి అందుబాటు ధరలో కేటాయించాలి. వ్యాసకర్త: చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 94909 52301 -
నిందితులను కఠినంగా శిక్షించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ప్రియాంకారెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల్లో ఇంకా కఠినమైన మార్పులు తీసుకురావాలని కోరారు. ఇలాటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: జీవన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య దురదృష్టకరమని, ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాధితురాలి తల్లిదం డ్రులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు జాప్యం చేశారని, అయినా తమ నిర్లక్ష్యం ఏమీ లేదని పోలీస్ కమిషనర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మహిళలపై నేరాలను నియంత్రించలేమా?: పొంగులేటి సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంకా ఎంత మంది అమ్మాయిలు చనిపోవాలి? ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ దీనిని నియంత్రించలేదా? దోషులను నిర్దిష్ట కాల వ్యవధిలో శిక్షించలేరా?’అంటూ సమాజం ప్రశ్నిస్తోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాకు పొంగులేటి శనివారం ఓ లేఖ రాశారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ పీనల్ కోడ్ను సరికొత్తగా తీసుకురావాలని పొంగులేటి పేర్కొన్నారు. స్త్రీలపై నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చట్టం రావాలన్నారు. మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారహితం: ఎంపీ సంజయ్ సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసుపై మంత్రుల మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సిన హోంమంత్రి మహమూద్ అలీ బాధితురాలు పోలీసులకు ఫోన్ ఎందుకు చేయలేదని ఎదురు ప్రశ్నించడం దారుణమన్నారు. ఇంటింటికీ పోలీసులను పెట్టలేమన్న మంత్రి తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రజలను హేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో సంజయ్ డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి ఘటన బాధ కలిగించింది: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఘటన తన మనసుకు తీవ్ర బాధ కలిగిం చిందని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని, ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి పాశవిక దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. -
సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: విధుల్లో చేరేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించినందున రాష్ట్ర ప్రభు త్వం కూడా సానుకూల దృక్పథంతో వ్యవహ రించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దాదాపు 3 నెలలుగా జీతాలు లేకున్నా ఆర్టీసీ కార్మికులు అద్భు త పోరాట పటిమ ప్రదర్శించి సమ్మెను కొనసాగించడం అభినందనీయమన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి కార్మికులు సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకుని ఉదారత చాటాలని కోరారు. -
ప్రజా సమస్యలపై వామపక్షాల పోరాటం
సాక్షి, సంగారెడ్డి: వామపక్షాలు చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం, భారతీయ జనతా పార్టీ అధికశాతం పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్న క్రమంలో వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటా లతో బలోపేతమయ్యేందుకు ప్రయత్ని స్తున్నాయి. వీటితోపాటు అనుబంధ సంఘా లు సైతం నిరంతరం ప్రజా సమస్యలపై, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి చేరువవుతున్నాయి. వామపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు తక్కువగా ఉన్నప్పటికీ సమస్యల పోరాటంలో ఆ పార్టీ యే ముందుంటోంది. ముఖ్యంగా కార్మికులకు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, పంచాయతీ పారిశుధ్య కార్మికులు.. ఇలా సమాజంలోని పలు వర్గాల పోరాటాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వారి మన్నన చూరగొంటున్నారు. కార్మికులకు, ప్రజలకు అండగా.. సీపీఎం, సీపీఐ పార్టీలతోపాటు వాటి అనుబంధ సంఘాలు కార్మికులకు, ప్రజలకు అండగా ఉంటున్నాయి. కార్మికులు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నాయి. సమాజంలోని ఏ వర్గానికి అన్యాయం జరిగినా, కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు, నిరసనలు తెలిపినా వారికి మద్ధతుగా నిలుస్తున్నాయి. అదే విధంగాఅంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ పారిశుధ్య వర్కర్ల సమస్యల పరిష్కారానికి అనుబంధ సంఘాలు ప్రత్యక్షంగా వారితో కలిసి పోరాటం చేస్తున్నాయి. సీపీఐకి అనుబంధంగా ఏఐటీయూసీ, రైతు సంఘాలు, ఏఐఎస్ఎఫ్, మహిళా సమాఖ్య, బీకేఎం, ఏవైఎఫ్లు ఉన్నాయి. అదే విధంగా సీపీఎంకు అనుబంధంగా సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు, హమాలీ వర్కర్స్, తాపీ మేస్త్రీలు, మోటార్ వెహికిల్స్ యూనియన్లు ఉండి ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఆర్టీసీ కార్మికులు గడిచిన 50రోజులుగా చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కొత్త బస్స్టేషన్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమాలకు నిరంతరం హాజరవుతున్నారు. వారికి పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తున్నారు. వారి తరఫున నిరసన గళం వినిపిస్తున్నారు. అనుబంధ సంఘాల్లోని కళాకారులు పాటలు, ఆటల ద్వారా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతున్నారు. అదే విధంగా విద్యుత్ ఉద్యోగులకు కూడా అండగా నిలుస్తున్నారు. డబుల్బెడ్ రూం ఇళ్ల మంజూరు, రైతుబంధు డబ్బు ఖాతాల్లో జమకాని వారికోసం అధికారులకు ప్రజల తరఫున విన్నవిస్తున్నారు. ప్రధాన సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే విధంగా జిల్లాలోని పటాన్చెరు, జహీరాబాద్, సదాశివపేట్, తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, ఖార్ఖానాలు అధికంగా ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగినా, యాజమాన్యాలు వేధించినా వీరు కలుగజేసుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అవర్ బేస్డ్ ఉద్యోగులు, పార్ట్ టైం, తదితర రెగ్యులర్ కాని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సైతం వామపక్ష, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం వీరు పోరాటాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రోజు రోజుకూ ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటూ వామపక్ష పార్టీలు పుంజుకుంటున్నాయి. వామపక్ష, అనుబంధ పార్టీలు మాత్రం ప్రజల్లో, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, తదితర ఉద్యోగుల మన్ననలు పొందడానికి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే విషయాలు పార్టీ నిర్ణయం మేరకే ఉంటాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జిల్లా వేదికగా వామపక్ష, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇటీవల అంగన్వాడీ రాష్ట్ర మూడవ మహాసభలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సభలకు అంగన్ వాడీ వర్కర్స్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి సింధు, తదితర ప్రముఖులు హాజరయ్యారు. గత నెలలో రైతు శిక్షణ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మూడు రోజులపాటు స్థానిక కేవల్కిషన్ (కేకే) భవన్లో సీపీఎం ఆధ్వర్యంలో రైతుసంఘం నేతృత్వంలో నిర్వహించారు. గత నెలలోనే ఏఐటీయూసీ ఆవిర్భావ ఉత్సవాలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. 50 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు హాజరవుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. -
కేసీఆర్కు వకాలత్ పుచ్చుకున్నారా?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో సంస్థ ఎండీ సునీల్శర్మ తీరు చూస్తుంటే ఆయన సీఎం కేసీఆర్కు వకాల్తా పుచ్చుకున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపక్షాలతో కలసి ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నించిందని సునీల్శర్మ ఆరోపించడం తగదన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ల కమిటీ, హైకోర్టు సూచనలతో వేసిన మరో కమిటీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకపోగా.. మరింత జఠిలంగా మార్చాయన్నారు. హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నా ఐఏఎస్ అధికారుల తీరు మారకపోవడం బాధాకరమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని, సర్కార్ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ సమ్మె: ‘ప్రభుత్వానికి బుద్ధి లేదు’
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి 40 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నరే అపాయింట్మెంట్ ఇచ్చినపుడు సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 రోజుల నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వానికి కనీస ధ్యాస లేదన్నారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. మరి కేసీఆర్కు ఏమైంది? ఆయన మొండివైఖరే సమ్మెకు కారణం. ఇంత దీర్ఘకాలికంగా సమ్మె ఎప్పుడూ జరగలేదు. హైకోర్టు మందలించినా కేసీఆర్కు బుద్ధి రాలేదు. ముఖ్యమంత్రి కార్మికులను చర్చలకు పిలవాలి. త్వరలో అన్ని సంఘాల నాయకులు సమ్మెబాట పట్టే రోజులు వచ్చాయి. మరోవైపు భూ ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ ధరణి వెబ్సైటే పనిచేయడం లేదు. అన్నీ బోగస్ లెక్కలుగా తేలిపోయాయి. కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రం రూ.3,12,000 కోట్ల అప్పుల తెలంగాణ అయింది. త్వరలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా’ మని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. -
‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో ఆవిర్భవించిన ఆర్టీసీని నయా నిజాం కేసీఆర్ ప్రైవేట్ పరం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎంఐఎం ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సీపీఐ నారాయణ సూచించారు. శుక్రవారం మగ్దూం భవన్లో అత్యవసరంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నప్పటికీ.. ప్రభుత్వానికి ఎంఐఎం ఇప్పటికి కూడా మద్దతివ్వడంపై విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే చలో ట్యాంక్ బండ్లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. హైకోర్టు ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్పై స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ప్రయత్నిస్తే.. కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఏకంగా సీఎం పదవికే రాజీనామా చేశారని గతాన్ని గుర్తు చేశారు. కోర్టులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు అవమానం ఎదురైతే.. ప్రభుత్వానికి కూడా అది అవమానమే అని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, అధికారులకు అవమానం జరిగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు అవమానమని భావించి తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోకపోతే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందని విమర్శించారు. హైకోర్టు 11న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచేందుకు అవకాశం ఇచ్చిందని.. ఇప్పటికైనా వారిని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. రాష్ట్ర రెండో రాజధానిపై విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు.. సొంత పార్టీ వారు సంబంధం లేదంటే.. ఆయన మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం ఏమి బాలేదన్నారు. కేవలం ఆర్టీసీ సమస్యను పక్కదారి పట్టించేందుకే విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నరని ధ్వజమెత్తారు. ఛలో ట్యాంక్బండ్ పిలుపు నేపథ్యంలో.. ముందస్తు అరెస్టులపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తదితరులు హాజరయ్యారు. కేసీఆర్ చెప్పినట్లు చేయడం వల్లే.. కోర్టు బోనులో తలదించుకుంటున్నారు చట్టాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు చేయడం వల్లే.. నేడు ఐఏఎస్ అధికారులకు కోర్టు బోనులో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదున్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పాలనలో కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసిందని అన్నారు. ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్పై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలానే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఏమాత్రం ప్రశాంతత లేదని.. ఉద్యమాలు అణచడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఛలో ట్యాంక్ బండ్ను విజయవంతం చేయాలని అందరిని కోరారు. -
‘మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదు’
సాక్షి, వరంగల్ : ఆర్టీసీలో కేంద్రం వాటా 31శాతం ఉందని, కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు మంగళవారం సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బలిదానాలు లేని తెలంగాణ కోరుకుంటే కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల చెంపపై కొడితే.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిషా.. కేసీఆర్ చెంపపై కొడతారని ఎద్దేవా చేశారు. మోడీ, అమిత్ షా.. కేసీఆర్ మెడలు వంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రేవేటుపరం చేసి బస్సులు నడిపితే తమ శవాలపై చక్రాలు వెళ్లాలన్నారు. ప్రభుత్వం ఎన్ని డెడ్లైన్లు పెట్టినా కార్మికులు పట్టుదలతో ఉండాలని సూచించారు. అలాగే టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఆర్టీసీ కార్మికులపై అవాకులు, చవాకులు పలుకుతున్నారని మండిపడ్డారు. అసలైన తెలంగాణ వాదులైన ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీశ్రావు కార్మికులపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని నిలదీశారు. మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదని ప్రతి ఒక్కరూ గర్తుంచుకోవాలని సూచించారు. ఈ కుటుంబంలోనే పుట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిలిచిపోతుందని, కార్మిక వర్గం విజయం సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం కానే కాదని, దేశ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.