sk joshi
-
కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన పాల్గొన్నారు.సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు బరాజ్ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు. ‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే.. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్లు వేర్వేరుగా బదులిచ్చారు. అప్పట్లో బరాజ్లలో లోపాలు కనబడలేదు: రజత్కుమార్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. -
అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్కు ప్రాధాన్యత: ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతోపాటు వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్కు ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ సీఎస్ ఎస్కే జోషి అన్నారు. మంగళవారం తన పదవీ విరమణకు ముందు అర్బన్ పార్కులపై అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్కే జోషి మాట్లాడుతూ.. పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతున్నందున, మరింత పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్బన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం కీలకమన్నారు. రాష్ట్రంలోని మొత్తం 129 రిజర్వ్ ఫారెస్ట్ క్లస్టర్లలో 70 క్లస్టర్లను కన్జర్వేషన్ బ్లాక్లుగా ఉంచుతామని.. నగరాలు పెరిగే కొద్దీ వాటిని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 193 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామని, రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లున్న మున్సిపల్ పట్టణాల్లో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కొత్త సీఎస్గా సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎస్గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్న సోమేశ్ కుమార్.. రేపటి నుంచి (జనవరి 1) సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది. నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగనున్నారు. అలాగే నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. ఇక బీహార్కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్గా కొనసాగనున్నారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా సోమేశ్ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కొత్త సీఎస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్ర కుమార్ జోషి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో వారం రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకోనున్నారు. సీఎస్ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్గా నియమించే అవకాశాలున్నాయని సచివాలయ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్లు చాలా మందే.. సీనియారిటీపరంగా సీఎస్ రేసులో తెలంగాణ కేడర్కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి, 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా, 1989 బ్యాచ్ అధికారులు సోమేశ్కుమార్, శాంతి కుమారి ఉన్నారు. వీరిలో బీపీ ఆచార్య, సురేశ్ చందా, రాజేశ్వర్ తివారి సమర్థులైన అధికారులుగా పేరున్నా, ప్రభుత్వంతో ఉన్న సంబంధాల రీత్య సీఎస్ రేసులో వీరి పేర్లు వినిపించడం లేదు. బినయ్కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్, వసుధ మిశ్రాలు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో అజయ్మిశ్రా, సోమేశ్కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అజయ్ మిశ్రా 2020 జూన్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు సీఎస్గా అవకాశం కల్పిస్తే ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగుతారు. సోమేశ్కుమార్ 2023 డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు అవకాశం కల్పిస్తే నాలుగేళ్ల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే సోమేశ్కుమార్కు సీఎస్ పదవి వరించే అవకాశాలున్నాయి. అజయ్ మిశ్రా రిటైరైన తర్వాత సోమేశ్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
రాష్ట్రపతి శీతాకాల విడిదికి యాక్షన్ప్లాన్
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిదికి రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటనకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని 22 వరకు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని చెప్పారు. 23న తిరువనంతపురం వెళ్లి, 26న హైదరాబాద్ చేరుకుంటారన్నారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోంలో పాల్గొని, 28న మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారని వివరించారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. -
జనగణన 45 రోజులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా గణన–2021 లో భాగంగా వచ్చే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 45 రోజులు రాష్ట్రంలో తొలి విడత జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నామని సీఎస్ ఎస్కే జోషి వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు. 71,136 మంది ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. జనాభా గణన–2021 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. 65 మంది మాస్టర్ ట్రైనర్లకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తొలి విడత శిక్షణ ముగిసిందని, రెండో విడత సోమవారం నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా గృహాల జాబితాల తయారీ, జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్ను నవీకరిస్తారని వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపర వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్ యాప్తో పాటు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారన్నారు. జనాభా గణన వ్యవహారాల డైరెక్టర్ కె.ఇలంబర్తి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. -
2020 సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: 2020కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 28 సాధారణ సెలవుల్లో 5 సెలవులు ఆదివారం/రెండో శనివారం వస్తున్నాయి. ప్రధాన పండుగలైన దసరా (విజయదశమి), మొహర్రం, గణతంత్ర దినోత్సవం, బాబూ జగ్జీవన్రాం జయంతి ఆదివారం రానుండటంతోపాటు దీపావళి రెండో శనివారం రానుంది. మిగిలిన 23 సాధారణ సెలవుల్లో 6 సెలవులు శనివారాల్లో వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటిరోజు ఆదివారం సెలవు రోజు కలసి రానుంది. అదే విధంగా మరో 5 సాధారణ సెలవులు శుక్రవారం వస్తున్నాయి. మరో 4 సాధారణ సెలవులు సోమవా రం వస్తుండటంతో అంతకుముందు రోజు ఆదివారం సెలవు కలసి రానుంది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించినందున ఫిబ్రవరి 8న రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రభుత్వం వెల్లడించింది. తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఐచ్ఛిక సెలవుల్లో ఏవైనా 5 సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. నోట్: 1) మార్చి 9న హజ్రత్ అలీ జయంతి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును అదేరోజు హోళి రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. 2) అక్టోబర్ 24న మహర్నవమి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దుర్గాష్టమి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. 3) నవంబర్ 14న నరక చతుర్థి సందర్భంగా ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దీపావళి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. -
దివ్యాంగ అథ్లెట్లను ప్రోత్సహించాలి
బొల్లారం: దివ్యాంగ అథ్లెట్లు క్రీడల్లో రాణించేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషి అన్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారా అథ్లెట్ల కోసం రసూల్పురాలోని మెహతా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ ఆకాడమీ, రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పారా అథ్లెట్ల కోసం అత్యాధునిక పునరావాస, శిక్షణ కేంద్రాన్ని మెహతా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పారా అథ్లెట్లకు సహకరించా లని కోరారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్థలం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సినీ నటి మంచు లక్ష్మి మాట్లా డుతూ అంగవైకల్యం ఉన్న వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్న మెహతా ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వికలాంగులకు క్రీడల్లో మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతోనే దీన్ని ఏర్పాటు చేశామని ఫౌండేషన్ ప్రతినిధి ఆదిత్య మెహతా అన్నారు. పారా సైక్లింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, ఆర్చరీ, షూటింగ్, స్కేటింగ్, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగాల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు కె.కె శర్మ, ఆదిత్య మిశ్రా, అంజనీ సిన్హా, దినకర్ బాబు, ఎమ్.ఆర్ నాయక్, తరుషి, దుర్గాప్రసాద్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు టీఎస్ఆరీ్టసీ ఇన్చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్ అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు. డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదు.. యూనియన్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో మొండిగా వ్యవహరించిన యూనియన్ ఆ డిమాం డ్ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు. యూనియన్ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్ ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ తీర్మానం నోట్ఫైల్స్లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని, పిల్ను డిస్మిస్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. -
ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ?
ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారు, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదు... కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదు, ఔదార్యం. సాక్షి, హైదరాబాద్: ‘దేశం మొత్తం అబ్బురపడేలా ఈ రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి. సాగునీరు సహా పలు ప్రాజెక్టుల కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రైతుల కోసం కేంద్రం రూ. 2 వేలు ఇస్తుంటే ఇక్కడ మరింత ఔదార్యంతో రూ. 4 వేలు ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో ఎంతో పురోగతి సాధించారు. ఒకే ఒక్క భారీ ప్రాజెక్టుతో 80 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నారు. ఒకే నియోజకవర్గానికి అభి వృద్ధి నిమిత్తం రూ. 100 కోట్లు కేటాయిం చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. అటు వంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఔదార్యం చూపడం లేదు. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. రాజు తండ్రిలాంటి వాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపా డాలి. అధికారం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అంత తక్కువ వాడాలి. మా వద్దా కోర్టు ధిక్కారణ అధికారం ఉంది. మా ముందు అధికారులు దాఖలు చేసిన అఫి డవిట్లన్నీ కోర్టు ధిక్కార పరిధిలోకి వచ్చేవే. మేం ఇప్పుడు ఆలోచిస్తోంది 48 వేల మంది ఉద్యోగుల గురించి కాదు. 3 కోట్ల మంది ప్రజల గురించి. ఈ ప్రభుత్వానికి రూ. 47 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులతో చర్చలు జరపండి. వారితో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రండి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మలతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు మా అనుమతి తీసుకోలేదు: కేంద్రం ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. తమ దృష్టిలో టీఎస్ఆర్టీసీకి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాతే విభజన సాధ్యమవుతుందని వివరించారు. తమకున్న వాటా ఏపీఎస్ఆర్టీసీలోనే ఉందని వివరించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్–3 కింద టీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిందన్నారు. కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే... ఈ వాదనతో ధర్మాసనం విబేధిస్తూ ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. సెక్షన్–3 కింద టీఎస్ఆర్టీసీ ఏర్పాటైనప్పుడు ఆస్తి, అప్పుల విభజన గురించి ఎందుకు మాట్లాడతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం ప్రకారమే నడుచుకోవాలే తప్ప ఇతర చట్టాల ప్రకారం కాదని తేల్చిచెప్పింది. ఆర్టీసీ చట్టం ప్రకారం విభజనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, ఇతర చట్టాలను సాకుగా చూపుతూ అనుమతి తీసుకోకుండా తప్పించుకోజాలరని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించింది. వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపింది. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు విడుదల చేయాలని చెబుతుంటే ఇరు వైపుల నుంచి స్పందన రావడం లేదని, ప్రభుత్వ వైఖరి వల్ల రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయని వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజల ఇబ్బందులు ఎవరికీ పట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. అంత మొండి పట్టుదల ఎందుకు? రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ధర్మాసనం ప్రస్తావిస్తూ రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రూ. 47 కోట్ల విషయంలో ఎందుకు మొండి పట్టుదల ప్రదర్శిస్తోందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ రాష్ట్రం రూ. 30 వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పగా అన్ని వేల కోట్ల అప్పులో రూ. 47 కోట్లు ఎంత? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారని, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రభుత్వం ముందుకు రావడం లేదు... దీనికి కార్మిక సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి స్పందిస్తూ గడువు పెట్టి మరీ బేషరతుగా విధుల్లో చేరాలంటూ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కార్మిక సంఘాలతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ సమయంలో జోషి జోక్యం చేసుకుంటూ మూడుసార్లు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, ముఖ్యమంత్రి కూడా కార్మికులకు విజ్ఞప్తి చేశారన్నారు. ముఖ్యమంత్రిది బెదిరింపులా ఉంది... దీనికి ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రిది విజ్ఞప్తి.. హామీ కాదని, అది బెదిరింపులా ఉందని తేల్చిచెప్పింది. ప్రభుత్వంపై ఉన్న గౌరవంతో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీపై ఔదార్యం చూపాలని సూచించింది. బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు చిత్ర కళల పోటీల్లో బహుమతులు ఇవ్వాలని తాము నిర్ణయించామని, అయితే బస్సుల సమ్మె వల్ల పిల్లలను తీసుకురావడం సాధ్యం కాదని జిల్లా జడ్జీలు చెప్పారని ధర్మాసనం గుర్తుచేసింది. సమ్మె వల్ల పిల్లలను ప్రోత్సహించేందుకు సైతం అవకాశం లేకుండా పోతోందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదని, ఔదార్యమని స్పష్టం చేసింది. ‘మాది పేద కుటుంబం. మా అమ్మ 13 మందిని పెంచింది. మా అన్నదమ్ములతోపాటు మరో 10 మందిని కూడా పెంచింది. పిల్లలందరికీ అన్నం సరిపోదని తెలిసీ అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి, అన్నాన్ని పిల్లలకు పెట్టి మా అమ్మ గంజి తాగి బతికింది. అదీ తల్లి మనసు’ అని సీజే చెప్పారు. ప్రజలకు రాజే తండ్రని, అటువంటి రాజు ప్రజలపట్ల ఔదార్యం చూపాల్సిన అవసరం ఉందన్నారు. గజిబిజి లెక్కలతో తెలివి ప్రదర్శిస్తున్నారు... న్యాయస్థానాలైనా.. ప్రభుత్వాలైనా ఉన్నది ప్రజల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులు, గజిబిజి లెక్కలతో చాలా తెలివి ప్రదర్శిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. లెక్కలతో తాము ఎప్పుడు నివేదిక కోరినా అంతకుముందు ఇచ్చిన నివేదికకూ, తాజా నివేదికకూ ఏమాత్రం పొంతన ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విచారణకు వారికి తోచిన లెక్కలు చెబుతున్నారని మండిపడింది. తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించిన అధికారులను తామెలా విశ్వసించగలమని ప్రశ్నించింది. ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేసి అందులో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడింది. ఇలా చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని ప్రశ్నించింది. కోర్టు లేవనెత్తిన అంశాలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారని జోషి చెప్పగా ఆ అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లు చదివే ఈ మాట చెబుతున్నారా? అంటూ జోషిని ధర్మాసనం నిలదీసింది. గతంలో వేసిన అఫిడవిట్కు, ఇప్పుడు వేసిన అఫిడవిట్కు ఏమాత్రం పొంతన లేదని గుర్తుచేసింది. ఇలాంటి అధికారులను ఎలా నమ్మగలమని ప్రశ్నించింది. క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదు... ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తక్కువ సమయంలో కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి వల్ల తప్పులు దొర్లాయని, ఇందుకు క్షమించాలని కోరగా క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి వచ్చి శిక్ష విధించాక ఆ సాక్షి వచ్చి తన వాంగ్మూలం తప్పని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. వాస్తవాలను పరిశీలించేందుకు కాగ్ నివేదికలు ఇంటర్నెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది. ఆర్టీసీకి చెల్లించిందని రూ. 3,903 కోట్లని ఓసారి, రూ. 3,400 కోట్లని మరోసారి అధికారులు చెబుతున్నారని, వీటిలో ఏది వాస్తవమో అర్థం కాని పరిస్థితి నెలకొందని విమర్శించింది. అలాగే ఆర్టీసీకి రుణం ఇచ్చామని ఓసారి, గ్రాంటు అని మరోసారి చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. జీవోల్లో రుణంగా చెప్పి ఇప్పుడు వాటిని గ్రాంటుగా పేర్కొనడంలో అర్థం ఏమిటని నిలదీసింది. జీహెచ్ఎంసీ బకాయిల విషయంలోనూ అస్పష్టత ఉందని ధర్మాసనం విమర్శించింది. ఒకసారేమో జీహెచ్ఎంసీ డబ్బు ఇచ్చిందని, మరోసారి అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదని ఎలా పడితే అలా చెబుతున్నారని ఆక్షేపించింది. ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించే అధికారులను ఆ పోస్టుల్లో కొనసాగించడం సబబు కాదని అభిప్రాయపడింది. డబ్బు తీసుకొని బకాయి ఉందంటే ఎలా? 2019–20లో రూ. 565 కోట్లు రీయింబర్స్మెంట్ ఇచ్చి అందులో రూ. 540 కోట్లను మోటారు వాహన పన్ను కింద ప్రభుత్వం మినహాయించుకుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయని ధర్మాసనం తెలిపింది. అలాంటప్పుడు తీసేసుకున్న మోటారు వాహన పన్నును ఆర్టీసీ బకాయి ఉందని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసింది. ఎవరు చెప్పేది నిజమో.. ఎవరిది అబద్ధమో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ సీఎం చెప్పినా కార్మికులు వినడం లేదని, కేవలం 300 మందే విధుల్లో చేరానన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రూ. 47 కోట్లు ఇచ్చి ఉంటే నాలుగు డిమాండ్లు పరిష్కారమై ఉండేవని, తద్వారా సమస్య పరిష్కారానికి సుహృద్భావ వాతావరణం నెలకొని ఉండేదని అభిప్రాయపడింది. రూ. 47 కోట్లు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేం భావిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఓసారి ఎక్కువ ఇచ్చామని, మరోసారి ఇవ్వాల్సింది ఏమీ లేదని చెబుతోందని తెలిపింది. ఇలా మాట్లాడుతుంటే సమస్య ఎప్పుడు పరిష్కారం కావాలని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. మరోవైపు 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆర్టీసీ సమ్మె:ఇలాంటి అధికారులను చూడలేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ, రామకృష్ణారావులపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. తమ 15 ఏళ్ల చరిత్రలో ఇంత అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ యజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తుంటే అందుకు ఇరువర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని మండిపడింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు : కేంద్రం ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. ఆ వాటా టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్గా బదిలీ కాదని వాదించింది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా అనేది తలెత్తదని వివరణ ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. విభజన చేస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విభజనకు కేంద్రం అనుమతి ఇచ్చిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అలా అయితే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ విభజన జరిగిందా.. లేక కొత్తగా ఏర్పడిందా అని కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. అది ఎలా సాధ్యం నిలదీసిన హైకోర్టు కేంద్రం వాదనపై స్పందించిన ఎస్కే జోషి.. ఆర్టీసీ ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యుల్ 9 కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఏజీ, ఆర్టీసీ ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు.. ఓ వైపు విభజన పెండింగ్లో ఉందని, మరోవైపు కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని అంటున్నారని.. అది ఎలా సాధ్యమని నిలదీసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రం అనుమతి కోరాలి కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించింది. నీటి పారుదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి.. ఆర్టీసీకి రూ. 49 కోట్లు చెల్లించడాని ఇబ్బంది ఎందుకని మండిపడింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని సూచించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని ఆదేశించింది. క్షమాపణ సమాధానం కాదు.. : హైకోర్టు అంతకు ముందు విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నివేదికలపై సీఎస్ను వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. అయితే రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా సూటిగా ప్రశ్నించింది. సమయాభావం వల్ల రికార్డుల ఆధారగా నివేదిక రూపొందించామని.. మన్నించాలని హైకోర్టును కోరారు. అయితే క్షమాపణలు కోరడం సమాధానంని.. వాస్తవాలు చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణపద్దుల కింద కేటాయించిన నిధులు అప్పులు కాదని గ్రాంట్ అని తెలివిగా చెబుతున్నారన్న హైకోర్టు.. ఇప్పటివరకు ఏ బడ్జెట్లో అలా చూడలేదని తెలిపింది. ఆర్టీసీ ఎండీ చెబుతున్న లెక్కలు వేరుగా ఉన్నాయని.. వాటిని మేం పరిగణలోకి తీసుకోవాలా అని ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానమిచ్చిన రామకృష్ణారావు.. 2014 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను తాజా నివేదికలో పొందుపరిచినట్టు వివరణ ఇచ్చారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో హైకోర్టుకు అందజేసినట్టు తెలిపారు. సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నివేదిక మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. మంత్రిమండలికి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంని సైతం తప్పుడు లెక్కలతో స్టేట్మెంట్ ఇప్పించారని మండిపడింది. మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్టు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడింది. మీ బాస్ను తప్పుదోవ పట్టించిన మీరు.. మాకు నిజాలు చెబుతారని ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది. -
‘హైదరాబాద్లో ఉండడానికి కారణమిదే’
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 401తో తీవ్ర ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్లో సూచీ 39తో మంచి నాణ్యతను కలిగి ఉంది. ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్లో ఉండడానికే నేను ఇష్టపడడానికి మరో కారణమిదే’ అని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ‘అయితే, కేంద్రం నుంచి వచ్చిన డిప్యుటేషన్ ఆఫర్ను మీరు తిరస్కరించినట్లు నేను భావించవచ్చా?’అని రీట్వీట్ చేస్తూ ఆదివారం సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీ నుంచి మరో గంటలో నేను ఇంటికి (హైదరాబాద్) వచ్చేందుకు విమానం ఎక్కబోతున్నాను. తిరిగి వచ్చాక నా ఆనందానికి ఇదే కారణం (ఢిల్లీలోని కాలుష్యం) కాబోతోంది’అని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రిటిష్ రాయబారి ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా మరో రీట్వీట్ చేశారు. కాలుష్యం విషయాన్ని పక్కనబెడితే రోడ్ల విషయంలో హైదరాబాద్ అధ్వానంగా తయారైందని, ఢిల్లీ స్థాయిలో నగరంలోని రోడ్లను అభివృద్ధిపరచాలని పలువురు నెటిజన్లు రాష్ట్ర అధికారులకు సూచించారు. Yet another reason why I love being in #Hyderabad vis-a-vis #Delhi (Am being mean 😷) pic.twitter.com/lCwdR4kL01 — Arvind Kumar (@arvindkumar_ias) November 1, 2019 -
తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
-
తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషి సహా మున్సిపల్ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని.. వీటికోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఒకవేళ డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు పేర్కొంది. మీరు ఈ దేశ పౌరులు కాదా? డెంగీపై వివరణ ఇస్తున్న సందర్భంగా తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్లను చేస్తే.. మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా సైలెంట్గా ఉండిపోయినట్లు సమాచారం. చదవండి: డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా? -
నిర్ణీత సమయంలోగా విభజన పూర్తి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజ నకు సంబంధించిన పలు అంశాలపై దాదాపు ఏడాది తరువాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి దీనికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. పెండింగ్లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల ప్రమోషన్లు జోన్ల ప్రకారం చేపడతారని, డీఎస్పీ స్థాయికి వెళ్తేనే కామన్ ప్రమోషన్ల కిందకు వస్తుందని, ఫ్రీజోన్లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, కేటాయింపుల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామ న్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. ఫ్రీజోన్ అనేది కొత్తగా వచ్చింది కాదని హోంశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో హోంశాఖ ఏకీభవించింది. ఆ మేరకు సీనియార్టీ నిర్ధారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాబితాపై ఏపీ స్పందన కోరిన కేంద్రం 9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనపై కూడా సమా వేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఏపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇద్దరు సీఎస్ల వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభ జనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈ జాబితాపై ఆంధ్రప్రదేశ్ స్పందన తెలియచేయాలని హోంశాఖ కార్యదర్శి కోరారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి కావాలి.. సింగరేణి కాలరీస్కి సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తెచ్చింది. షెడ్యూల్ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని తెలిపింది. చట్టప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తుల విభజన నిర్ణీత వ్యవధిలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుపై సుముఖం తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది తర్వాత పౌర సరఫరాల శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే గ్యారెంటీలు, అప్పులు చెల్లించింది. ఈ నేపథ్యంలో దీని విలువ ఎంతో నిర్ధారించి ఆమేరకు ఏపీకి ఇవ్వాలని హోం శాఖ సూచించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇది రూ.1,700 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బకాయిల విషయం లో కూడా భేదాభిప్రాయాలు లేవని ఇరు రాష్ట్రాలు హోంశాఖకు స్పష్టం చేశాయి. రూ.కోట్లలో ఉన్న బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. 10వ షెడ్యూల్కు సంబంధించి శిక్షణ సంస్థల విభజన విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోం శాఖ వివరణ ఉందని ఏపీ ప్రభుత్వం నివేదించింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం తెలియజేస్తామంది. -
యాంత్రీకరణలో...వాహ్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వ్యవసాయ యాంత్రీకరణలో దూసుకుపోతోంది.ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. వ్యవసాయ యంత్రాలు, పంట కోత యంత్రాలు, నిర్మాణ పరికరాల్లో వృద్ధి ఎంతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషి ఆదివారం ట్వీట్ చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వివిధ రకాల వాహన పరికరాలన్నీ కలిపి 1.22 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లు మొత్తం 2.87 లక్షలున్నాయని, అందులో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు అదనంగా 1.36 లక్షల ట్రాక్టర్లు ఇచ్చారు. అంటే 90.39% ట్రాక్టర్లు తెలంగాణ వచ్చాకే ఇచ్చినట్లు అర్థం అవుతోంది. ఇక పంట కోత యంత్రాలు మొత్తం రాష్ట్రంలో 26,856 ఉంటే, అందులో తెలంగాణ వచ్చాకే 12,736 ఇచ్చారు. అంటే 92.48% కొత్త రాష్ట్రంలోనే ఇచ్చారని స్పష్టమవుతోంది. మొత్తంగా వ్యవసాయ యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వాహన పరికరాల వృద్ది తెలంగాణ వచ్చాక 71.4%ఉండటం విశేషం. -
‘కేసీఆర్, కేటీఆర్ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’
సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్, కేటీఆర్ అసమర్థులని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇచ్చిన ర్యాంకులే దీనికి నిదర్శనమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘20 శాఖల పనితీరుని సమీక్షించిన తెలంగాణ సీఎస్ సాగునీటి శాఖకు 8వ ర్యాంక్, విద్యుత్ శాఖకు 11వ ర్యాంక్, ఐటీ శాఖకు 18వ ర్యాంక్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ శాఖల పనితీరు ఎంత దారుణంగా ఉందో ఈ ర్యాంకులే చెప్తున్నాయి. మొదటి మూడు ర్యాంకుల్లో కేసీఆర్, కేటీఆర్కు సంబంధించిన శాఖలు లేవు. విద్యుత్ శాఖ రూ.34 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. సాగునీటి రంగం అభివృద్ధిలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. కేటీఆర్ ఇన్నాళ్లు అవార్డులు, రివార్డులు కొనుక్కొని పబ్బం గడుపుతున్నారు. ఆ శాఖలో జరిగిన అవినీతి బయటపడుతుందనే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నియమించడం లేదు. గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా ఈటల నామమాత్రంగానే ఉన్నారు. అన్నీ కేసీఆరే చూసుకున్నారు. వేలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజల మీద భారం వేస్తున్నారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం పూర్తి కాలేదు. శాఖల నిర్వహణలో విఫలం చెందిన కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అన్నారు. -
శిశు సంక్షేమం టాప్..
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ విద్యార్థులకే కాదు ప్రభుత్వ శాఖలకూ వచ్చేశాయ్. హాజరుశాతం, మార్కుల ఆధారంగా బడిపిల్లలకు ఖరారు చేసే ర్యాంకులను శాఖలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ, పనితీరు, వార్షిక నివేదికల మదింపు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 2018–19లో కనబరిచిన ప్రగతి.. 2019–20 ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా, శిశుసంక్షేమ శాఖకు తొలి ర్యాంకును లభించింది. ఇక పనితీరులో బీసీ సంక్షేమ శాఖ వెనుకబడింది. కార్మికశాఖ రెండోస్థానంలో నిలవగా.. మూడో ర్యాంకును వ్యవసాయ, సహకార శాఖ కైవసం చేసుకుంది. నాణ్యతాప్రమాణాలు, పౌరసేవలు, శాఖల పనితీరును పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను సమీక్షించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ, గృహ నిర్మాణం, రెవెన్యూ, వాణిజ్య, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సారథ్యం వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ర్యాంకుల వడపోత ప్రక్రియ జరిగింది. సగటున 2 నుంచి 4 శాఖల పనితీరును మదింపు చేసిన ఈ అధికారులు.. మార్కులను ఖరారు చేశారు. సచివాలయంలోని 34 విభాగాలకుగానూ 20 శాఖలు వార్షిక నివేదికలు సమర్పించగా.. ఇందులో మహిళా, శిశుసంక్షేమం (9.84 మార్కులు), కార్మిక, ఉపాధి (9.42), వ్యవసాయ, సహకార (8.44), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (8.12), పశుసంవర్థకశాఖ (8.10)లు టాప్–5లో నిలిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రకటించారు. కాగా, బీసీ సంక్షేమశాఖ అట్టడుగున నిలవగా.. జీఏడీ విభాగానికి 19వ ర్యాంకు రావడం గమనార్హం. -
తాత్కాలిక సచివాలయానికి సీఎస్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపు నేపథ్యంలో బీఆర్ కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్సిన్హా తదితరులు తమకు కేటాయించిన చాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు పనులతో పాటు తన చాంబర్లో కొనసాగుతున్న పనులను సీఎస్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కాగా, మంగళవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి విధులు నిర్వర్తించాలనే సీఎం ఆదేశాల నేపథ్యంలో.. పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఫైళ్లకు సంబంధించిన మూటలతో బీఆర్కేఆర్ భవన్కు తరలిరావడం కనిపించింది. జపాన్ బృందంతో జయేశ్ భేటీ తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటైన తన కార్యాలయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ప్రారంభించారు. తన చాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. జపాన్కు చెందిన డెన్షో కంపెనీ ప్రతినిధులతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జపాన్లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న డెన్షోకు షాంఘై, హాంకాంగ్, సింగపూర్లోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. బేరింగ్ ఉత్పత్తులను వివిధ దేశాలకు సరఫరా చేసే డెన్షో ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరగలేదని, సాధారణ భేటీ మాత్రమేనని జయేశ్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
పవర్ పక్కా లోకల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు ఇప్పటి మాదిరిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదాగల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో పూర్తిగా భాగస్వాములు కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్లు ఏం చేయాలి? జిల్లా పరిషత్లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేశాకే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుది రూపం.. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏయే అంశాల్లో వారి బాధ్యతలు ఎంతవరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగంలో పని చేసిన అనుభవంగల నాయకులు, అధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసా యిదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ ఆమోదం అనంతరం అసెంబ్లీలోనూ విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసు కొని ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి... పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ పోస్టులను ఇకపై మండల పంచాయతీ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీఓలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్రావు తదితరులు పాల్గొన్నారు. అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. -
పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనుల పూర్తికి వీలుగా ఈ రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి పాలమూరు–రంగారెడ్డి పనులను రూ.32,500 కోట్లతో చేపట్టగా ఇందులో ఇప్పటివరకు 20 శాతం పనులే పూర్తయ్యాయి. నిధుల కొరత కారణంగా ఏడాదిగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇది వరదజలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలని సర్కారు గతంలో నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా రూ.10 వేల కోట్లు రుణాలిచ్చేందుకు పీఎఫ్సీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రుణం తీసుకునేలా ఉత్తర్వులు వెలువడగా, త్వరలోనే దీనికి సంబంధించి పీఎఫ్సీతో ఒప్పందాలు జరగనున్నాయి. రూ.41,500 కోట్లకు కాళేశ్వరం రుణాలు! దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(టీఎస్డబ్ల్యూఐసీ)’పేరుతో ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,638 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్కు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం రూ.17 వేల కోట్ల మేర రుణం ఇచ్చింది. వీటిల్లో ఎక్కువగా సీతారామ, దేవాదుల పనులకే నిధులు వెచ్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ– 12 పనుల పూర్తికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) నుంచి రూ.1,500 కోట్లు రుణం తీసుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఇప్పటివరకు వివిధ రుణ సంస్థల నుంచి రూ.40 వేల కోట్లకుపైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణపనులకు రూ.32 వేలకోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుత కాళేశ్వరం రుణాలు రూ.41,500 కోట్లకు చేరనున్నాయి. -
60 రోజుల ప్రణాళికతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పల్లెల సమగ్రాభివృద్ధితోపాటు పూర్తిస్థాయిలో పచ్చదనం, పరిశుభ్రతను సాధించేందుకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా నూతన పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించిన వివిధ విషయాలపై మరింత స్పష్టతనిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. 60రోజుల కార్యాచరణ అమలులో భాగంగా పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలుచేస్తున్న ఈ కార్యాచరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ వికాసం, పూర్తిస్థాయిలో అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమగ్రవిధానం తీసుకువస్తోందని ఆయన తెలిపారు. 60 రోజుల గ్రామ వికాసంలో పంచాయతీరాజ్ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్రన్న ముఖ్యమంత్రి ఈ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు స్పష్టంచేశారు. దీని కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్న దానిపై రెండు మూడ్రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 60రోజుల తర్వాత ముఖ్య అధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్ స్క్వాడ్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేపడతాయన్నారు. ఏ గ్రామంలో అయితే 60రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు చేపట్టలేదో అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పీఆర్, పరిషత్ పోస్టులు భర్తీ పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ల్లోని పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు ఏమేమి పనులు చేయాలో స్పష్టంగా నిర్వచించుకుని ఎవరి విధులు వారే నిర్వహించాలన్నారు. శనివారం ప్రగతిభవన్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీపీవోలు, ఈవోపీఆర్డీలు, సర్పంచ్ల సంఘం ప్రతినిధులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, పాలమూరు, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల డీపీవోలు, రిటైర్ట్ డీపీవో లింబగిరి స్వామి, ఈవోపీఆర్డీలు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన యాదవ్, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ చందర్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తాం ‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పడి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగుచేసుకునే పద్ధతి రావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మక మార్పు రావాలి. అందుకోసమే కొత్త పీఆర్ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజా ప్రతినిధులపై కచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పని చేయాలో నిర్దేశించాం. అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఎవరినీ ఉపేక్షించదు. గుణాత్మక మార్పుకోసం ఏంచేయాలో అది చేస్తాం’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈవోపీఆర్డీ పేరు ఎంపీవోగా మార్పు ‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో)లను నియమించాలి. రెవెన్యూ డివిజన్ ఓ డీఎల్పీవోను, మండలానికో ఎంపీవోను నియమించాలి. ఖాళీగా ఉన్న ఎంపీడీవో, సీఈవో పోస్టులను భర్తీ చేయాలి. వీటిని భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులివ్వాలి. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలి. ప్రక్రియ అంతా చాలా వేగంగా జరగాలి’అని సీఎం ఆదేశించారు. ఈ కార్యాచరణలో చేపట్టాల్సిన పనులు.. గ్రామంలో పారిశుధ్య పనులను పక్కాగా నిర్వహించాలి. మురికి కాల్వలన్నీ శుభ్రం చేయాలి. గ్రామ పరిధిలోని పాఠశాల, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్యం గ్రామ పంచాయతీల బాధ్యత. కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలగించాలి. ఉపయోగించని, పాడుపడిన బావులను, నీటి బొందలను పూర్తిగా పూడ్చేయాలి. ఇందుకోసం ఉపాధిహామీ నిధులతో మొరం నింపాలి. గ్రామంలో ఎప్పటికప్పుడు దోమల మందు పిచికారి చేయాలి. వైకుంఠధామం (శ్మశాన వాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. గ్రామ డంపింగ్ యార్డు కోసం స్థలం సేకరించాలి. విలేజ్ కమ్యూనిటీ హాల్, గోదాము నిర్మాణానికి స్థలాలు సేకరించాలి. గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. పంచాయతీలు నిర్వహించాల్సిన బాధ్యతలు గ్రామంలో 100% పన్నులు వసూలు చేయాలి. వారపు సంత (అంగడి)లో సౌకర్యాలు కల్పిం చాలి. వివాహ రిజిస్ట్రేషన్ నిర్వహించాలి. ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే రికార్డు చేయాలి. జనన, మరణ రికార్డులు రాయాలి. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు, కులం వివరాలతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. విద్యుత్ సంస్థలకు తప్పకుండా బిల్లులు చెల్లించాలి. పంచాయతీ నిధు లతో ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యే విధానం రూపొందించాలి. ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలతో సంప్రదించి, సీఎస్ఆర్ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించే విధానం అవలంబించాలి. గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి. ‘పవర్’వీక్ లో చేయాల్సిన పనులు 60 రోజుల కార్యాచరణలో భాగంగా 7రోజుల పాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలి. ఆ గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరెంటు వాడుతున్నారో కచ్చితమైన నిర్ధారణకు రావాలి. మీటర్లు పెట్టాలి. వీధిలైట్ల కోసం థర్డ్ లైను వేయాలి. విధిగా ఎల్ఈడీ బల్బులు అమర్చాలి. గ్రామంలో వంగిపోయిన స్తంభాలు, వేలాడే వైర్లు సరిచేయాలి. హరితహారంలో చేయాల్సిన పనులు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే విలేజ్ నర్సరీ ఏర్పాటు చేయాలి. మండల అటవీశాఖాధికారి సాంకేతిక సహకారం తీసుకోవాలి. ఉపాధిహామీ నిధులు వినియోగించాలి. గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. వాటికి నీళ్లు పోసి, రక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలి. గ్రామస్తులకు కావాల్సిన రకం మొక్కలను సరఫరా చేయాలి. చింతచెట్లను పెద్ద సంఖ్యలో పెంచాలి. -
మొక్కల్ని బతికించండి
సాక్షి,హైదరాబాద్: హరితహారంలో భాగంగా తెలంగాణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సూచించారు. నగరానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోందన్నారు. నగరంలోని గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలసి సీఎస్ ఎస్కే జోషి దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్బన్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ పార్కులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఐదో విడత హరితహారంపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ అభివృద్ధి్ద కార్పొరేషన్ ఎం.డి. రఘువీర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. హరీశ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చేసేందుకు పనేం లేదని...
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి శనివారం ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును అందజేశారు. చేసేందుకు పని లేదనే కారణంతోనే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన, పరిశోధన సంస్థ (స్టేట్ ఆర్కివ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్గా ఏడాదిన్నరగా కొనసాగుతు న్నారు. ప్రాధాన్యతలేని పోస్టు కేటాయించారని గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పదవీ విరమణకు 10 నెలల ముందే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2006 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన గతంలో సెర్ప్ సీఈఓగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా చేసిన సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోని గిరిజనుల్లో క్షయ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అడవి పంది, గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహించే క్రమంలో ఆయన బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం ఆయనను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పదవి నుంచి స్టేట్ ఆర్కివ్స్కు బదిలీ చేసింది. పోస్టింగ్ల కేటాయింపుల్లో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అధికారులకు అన్యాయం జరుగుతోందని, అధిక శాతం అధికారులు ప్రాధాన్యతలేని పోస్టుల్లో మగ్గిపోవాల్సి వస్తోందని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ఆయన కొంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐఏఎస్లతో కలిసి శాసనసభ ఎన్నికలకు ముందు సీఎస్ ఎస్కే జోషిని కలిసి పోస్టింగ్ల విషయంలో తమ అసంతృప్తిని తెలియజేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం తనకు కారును సైతం కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైనింగ్లో తీవ్ర లోపాలున్నాయని పేర్కొంటూ ఇటీవల∙ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి. -
40% ఉంటే కొలువులు
సాక్షి, హైదరాబాద్: వికలాంగుల కోటా ఉద్యోగాల నియామక నిబంధనలను ప్రభుత్వం సవరించింది. వికలాంగ కోటాకు అర్హత కోసం కనీసం 40 శాతం వైకల్యాన్ని ప్రామాణికం (బెంచ్మార్క్ డిసెబిలిటీ)గా నిర్దేశించింది. వికలాంగ కోటాకు అర్హుల జాబితాలో కొత్తగా తక్కువ దృష్టి (లో విజన్), వినికిడి కష్టం (హార్డ్ హియరింగ్), కండరల వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రొఫి), నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగాలతో బాధపడే వ్యక్తులను చేర్చింది. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లను వర్తింపజేసేందుకు అమలు చేసే రోస్టర్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే వికలాంగుల కోసం 6వ, 31వ, 56వ పాయింట్లు కేటాయించగా తాజాగా 82వ పాయింట్ను ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగం, చెవిటి–అంధత్వంతో బాధపడే వారి కోసం కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996కు కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైకల్యం ఉన్నా అర్హులే... కొత్త నిబంధనల ప్రకారం 40 శాతానికి తగ్గకుండా నిర్దేశిత వైకల్యం కలిగి ఉంటే వికలాంగ కోటాలో ఉద్యోగార్హతకు ప్రామాణిక వైకల్యం (బెంచ్మార్క్ డిజేబిలిటీ)గా పరిగణిస్తారు. వైకల్యం లెక్కింపునకు నిబంధనలు ఉన్నా, లేకపోయినా అర్హులే కానున్నారు. అంటే లెక్కించదిగిన వైకల్యం గలవారితోపాటు లెక్కించలేని వైకల్యంగల వారూ అర్హులు కానున్నారు. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలను వికలాంగుల కోసం రిజర్వు చేయాలన్న పాత నిబందనను ప్రభుత్వం తొలగించింది. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలను ప్రామాణిక వైకల్యంగల వారికి రిజర్వు చేయాలనే కొత్త నిబంధనను దాని స్థానంలో పొందుపరిచింది. కేటగిరీల మార్పిడి ఇలా.. ఏదైనా నిర్దేశిత కేటగిరీ వికలాంగులకు రిజర్వ్ అయిన పోస్టుల భర్తీకి సంబంధిత కేటగిరీలో అర్హులైన వికలాంగులు లేకపోతే అనుసరించా ల్సిన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. - ఒక నియామక సంవత్సరంలో ప్రామాణిక వైకల్యంగల అర్హుడైన వ్యక్తి అందుబాటులో లేకపోవడం/ఇతర కారణాలతో ఏదైనా పోస్టు భర్తీకానప్పుడు, ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలోనూ ప్రామాణిక వైకల్యంగల అర్హుడు లభించనిపక్షంలో, ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. మూడో నియామక సంవత్సరం లో ఏ కేటగిరీ వికలాంగుడూ అందుబాటులో లేనిపక్షంలో ఆ ఏడాది సకలాంగుడితో పోస్టును భర్తీ చేయవచ్చు. - ఏదైనా శాఖలో పోస్టుల స్వభావ రీత్యా ఏదైనా కేటగిరీ వికలాంగుడికి ఉద్యోగం కల్పించే అవకాశం లేకపోతే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం.10 ప్రకారం ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. - రోస్టర్ పాయింట్ ప్రకారం మహిళా వికలాంగులకు కేటాయించిన పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మరో నియామక సంవత్సరం వరకు వేచి చూడకుండా ఆ పోస్టును అదే వికలాంగ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. అదే కేటగిరీ పురుష అభ్యర్థులు సైతం అందుబాటులో లేకపోతే ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలో తొలుత సంబంధిత కేటగిరీ మహిళ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈసారి కూడా మహిళా అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో అదే కేటగిరీ పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. రెండో నియామక సంవత్సరంలోనూ సంబంధిత కేటగిరీ మహిళ, పురుష అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో పోస్టును రోస్టర్ పాయిం ట్లలోని తదుపరి వికలాంగ కేటగిరీ వారితో భర్తీ చేయాలి. అయినా అర్హులైన అభ్యర్థులు లేకుంటే రోస్టర్ పాయింట్లోని ఆ తర్వాతి వికలాంగ కేటగిరీ వారికి కేటాయించాలి. - ఏ వైకలాంగ కేటగిరీ అభ్యర్థులు కూడా అందుబాటులో పక్షంలో మాత్రమే సకాలంగులతో పోస్టులు భర్తీ చేసుకోవాలి. - ఏదైనా కేటగిరీ వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, రిజర్వేషన్ల కోటా తగ్గించాలని, పని స్వభావం రీత్యా వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పిళ్లు జరపాల్సి ఉందని ప్రభుత్వశాఖలు భావిస్తే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం. 10 ప్రకారం వికలాంగ రిజర్వేషన్ల అమలు నుంచి సదరు శాఖకు పాక్షిక లేదా పూర్తిగా మినహాయింపు కల్పించాలని ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీని కోరవచ్చు. కొత్త రోస్టర్ పాయింట్లు ఇలా... - రోస్టర్ పాయింట్ల చక్రంలో 6వ, 31వ, 56వ స్థానాలను వరుసగా అంధత్వం/అథమ దృష్టి సామర్థ్యం (మహిళలు)... చెవిటి/వినికిడి కష్టం (ఓపెన్)... లోకోమోటార్ డిసెబిలిటీ, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (ఓపెన్) గల వ్యక్తులకు కేటాయించాలి. - 100 రోస్టర్ పాయింట్ల తర్వాత రెండో, మూడో, నాలుగో చక్రంలో ఈ కింది పాయింట్లు చేరుతాయి.. - 106, 206, 306 – అంధత్వం, తక్కువ దృష్టి సామర్థ్యం (ఓపెన్) - 131, 231, 331 – చెవిటి, వినికిడి కష్టం (131–విమెన్, 231–ఓపెన్, 331–ఓపెన్) - 156, 256, 356 – లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (156–ఓపెన్, 256–విమెన్, 356–ఓపెన్) - 182, 282, 382 – ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగులు, చెవిటి+అంధతోపాటు అంధులు, తక్కువ దృష్టి సామర్థ్యం, చెవిటి/వినికిడి కష్టం, లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగాల్లో ఒకటికి మించి రోగాలుగల వారు.(182–ఓపెన్, 282–ఓపెన్, 382–విమెన్) -
మానసిక రోగులకు హాఫ్వే హోంలు!
సాక్షి, హైదరాబాద్: మానసిక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైన వారికి పునరావాసం కల్పించడానికి హాఫ్ వే హోంల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం అవసరమైన ప్రణాళికను 15 రోజుల్లోగా తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి అధికారులను ఆదేశించారు. మానసిక రుగ్మతలతో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైనప్పటికీ ఆసుపత్రిలోనే మగ్గుతున్న వారి కోసం హాఫ్ వే హోంలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హాఫ్ వే హోంల ఏర్పాటుపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మానసిక ఆరోగ్యం కుదుటపడిన వారిని వీటిల్లో చేర్చి, వారికి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఇవ్వనున్నామన్నారు. హాఫ్వే హోంలకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎర్రగడ్డ మానసిక వైద్య చికిత్సాలయాన్ని సందర్శించి నిర్మాణ నమూనాను రూపొందించడంతో పాటు నిర్మాణానికి, నిర్వహణకు అవసరమైన నిధుల అంచనాలను సమర్పించాలన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణను ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. మానసిక సమస్యలకు సంబంధించి జీవన శైలి, ఒత్తిడిని తట్టుకోవడం తదితర అంశాలన్నీ శిక్షణలో ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సైక్రియాటిస్టుల మ్యాపింగ్ను చేపట్టాలని, ప్రైవేటు సైక్రియాటిస్టుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. జిల్లాల్లో మెంటల్ హెల్త్ బోర్డుల ఏర్పాటుకు అనుమతి కోసం హైకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాయాలని, మెంటల్ హెల్త్కు సంబంధించిన ఔషధాలు అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీన్దయాళ్ డిజెబుల్డ్ రిహాబిలిటేషన్ పథకం నుండి నిధులు పొందేలా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వైద్య, పారామెడికల్ సిబ్బంది శిక్షణకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న తరహాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని, మెంటల్ హెల్త్ స్క్రీనింగ్కు సంబంధించి నిర్దిష్ట విధానాన్ని రూపొందించి వైద్య సేవలు అందిస్తామని ఆమె వివరించారు. ఈ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్జీవోలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, వికలాంగ సంక్షేమశాఖ కమిషనర్ శైలజ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు!
సాక్షి, అమరావతి: విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని పొరుగు రాష్ట్రమైన తెలంగాణాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం శనివారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సలహాదారు రాజీవ్శర్మతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగాయి. కొన్ని అంశాల్లో ఒక రాష్ట్రానికి ప్రయోజనం, మరికొన్ని విషయాల్లో మరో రాష్ట్రానికి ప్రయోజనం కలిగి ఉండవచ్చని అయితే వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే మరో రెండేళ్లయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగానే ఉంటాయనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ప్రధానంగా విభజన చట్టం 9, 10వ షెడ్యూల్ సంస్థల్లోని ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు సాగాయి. తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీకి సంబంధించి షీలాబిడే కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఇందులో కొన్ని సంస్థల్లో ఏపీకి, మరికొన్ని సంస్థల్లో తెలంగాణాకు ప్రయోజనం ఉంటుందని, ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్నందున తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్నేహహస్తం చాపింది. దీనిపై తెలంగాణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపిణీపై కూడా విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలపై కూడా అధికారులు చర్చించారు. విద్యుత్తు బకాయిలపైనా చర్చ... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విద్యుత్ బకాయిలపై కూడా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ఒకసారి అకౌంట్స్ సరిచూసిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చ సాగింది. భీష్మించుకుని కూర్చోవడం వల్ల ఫలితం ఉండదని, పరిష్కారాలు కావాలని శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ తెలంగాణ విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల పంపిణీ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్పై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలు చేసింది. ఇది రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా ఉన్నందున ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. ఏపీఎండీసీ ఆస్తులు రూ.1,200 కోట్లు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ సంస్థఆస్తుల విభజన ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ (ఏపీఎండీసీ) అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు. ఏపీఎండీసీకి సుమారు రూ. 1,200 కోట్ల ఆస్తులున్నాయి. తొమ్మిదో షెడ్యూలులో ఉన్న ఈ సంస్థ ఆస్తులను విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 52: 48 దామాషాలో పంచుకోవాలి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎండీసీకి రూ. 624 కోట్లకుపైగా వాటా రానుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కి రూ.576 కోట్లు దక్కనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో జరిగే సమావేశంలోనే ఏపీఎండీసీ విభజన ప్రక్రియ పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ లేదా తిరుపతిలో ఇద్దరు సీఎంల సమావేశం! రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. వారం రోజుల్లోగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు మరోసారి సమావేశమై సమస్యల పరిష్కారానికి నాంది పలకాలని నిర్ణయించారు. సాగునీటి రంగానికి చెందిన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారం పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. జూలై 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నందున ఆ లోగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విశాఖపట్టణం లేదా తిరుపతిలో సమావేశం నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
ఉద్యమ ఆకాంక్ష నెరవేరుతోంది
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలన్న ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చే దిశగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం అనేది బలమైన అడుగని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం, అమరుల త్యాగాల ఫలితంగానే ఈ కల సాకారమవుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి ఫలితంగా కాళేశ్వరం సాధ్యమైందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాటి సమైక్య పాలకులు కావాలనే అంతర్రాష్ట్ర వివాదాల్లో చిక్కుకునేలా లభ్యత లేని చోట ప్రాజెక్టు డిజైన్ చేస్తే, సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా.. ఓ ఇంజనీర్గా మారి అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టు రీడిజైన్ చేశారని కొనియాడారు. మహారాష్ట్రతో నెలకొన్న వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన ఇంజనీర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ సన్నివేశాన్ని ఆనందభాష్పాలతో తిలకిస్తున్న రాష్ట్ర రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, సస్యశ్యామల తెలంగాణ స్వప్నం సాకారమయ్యేలా ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మారనున్న తెలంగాణ ముఖచిత్రం: ఎస్కే.జోషి ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం మారిపొంతుందని, రైతుల కరువు బాధలు శాశ్వతంగా తీరుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే.జోషీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండ లం నందిమేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్ను వివిధ బ్యాంకర్లకు చెందిన 12 మంది ప్రతినిధులతో కలసి గురువారం ఆయన పరిశీలించారు. సర్జిపూల్, నీటి పంపింగ్, విద్యుత్ వినియోగం, మోటార్ల సామర్థ్యం, పనితీరును ఇంజనీర్లు వారికి వివరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీఎస్ జోషీ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర కృషి ఫలితంగా కాళేశ్వరం కల సాకారమైందని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఎటువంటి వివాదాలు రాకుండా కేసీఆర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే ఈ ఏడాది తొలి ఫలితం అందుతుందని చెప్పారు. రాజీవ్శర్మ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించటానికి కేసీఆర్ చాలా కష్ట పడ్డారన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, బ్యాంకు ప్రతినిధులు పాక్రిసామి, భట్టాచార్య. పీకే.సింగ్, హేమంత్ కుమార వినోద్, విజయ్కుమార్, అశోక్, రామకృష్ణ, నవయుగ, మేగా కంపనీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీకి కళ్ల మంట : మంత్రి శ్రీనివాస్గౌడ్ సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగిన రీతిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం బీజేపీకి కళ్ల మంటగా మారిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి గురు వారం శాసనసభ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదనే రీతిలో బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేమితో విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సొంత నిధులతో సీఎం కేసీఆర్ శ్రమతో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. గుజరాత్తో సహా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు.. స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థలాభావంతో ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని, ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత.. భారీగా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో నవ శకం : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రంలో నవ శకం ప్రారంభమవుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, ఆ తర్వాత అని గుర్తు చేసుకుంటారని తెలిపారు. చరిత్రాత్మక ప్రాజెక్టుగా కాళేశ్వరం: తలసాని సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం భారతదేశ చరిత్రలో చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈ ప్రాజెక్టు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే వరప్రదాయిని అని ఆయన కొనియాడారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, కళాకారులతో కలిసి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. బాధ్యత మరింత పెరిగింది: మారెడ్డి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో పౌరసరఫరాల సంస్థ బాధ్యత మరింత పెరిగిందని సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో రెండు పంటలకు నీరు అందడంతో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి సైతం భారీగా పెరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. -
విత్తన సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ నుంచి జులై మూడు వరకు హైదరాబాద్లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం దానిపై ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశం జరిగింది. సాధ్యమైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్నందున భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సదస్సులో భారతదేశం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎఫ్ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదీలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, దీనికి తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదన్నారు. జూన్ 27న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, తెలంగాణ నుంచి 1500మంది విత్తన రైతులు, గుజరాత్, కర్ణాటకలకు చెందిన విత్తన రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు.. విశేషాలు - వేదిక – హెచ్ఐసీసీ, నోవాటెల్, హైదరాబాద్ - ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉందనే అంశంపై చర్చలు - తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం - జూన్ 26 నుంచి 28 వరకు విత్తన ప్రదర్శన - జూన్ 27న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం - 70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు - ఆఫ్రికా ఖండపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రతినిధుల ప్రత్యేక సమావేశం - 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో తొలిసారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్లోనే నిర్వహణ - సదస్సుకు నోడల్ ఆఫీసర్గా కేశవులు నియామకం. ఎస్ఎల్బీసీపై వివరణ కోరిన సీఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అవాంతరాలు, ఆగిన పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నీటి పారుదల శాఖ నుంచి వివరణ అడిగారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన పనులు, పెండింగ్ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. టన్నెల్ పనులు ఏడాదిగా ఆగాయని, దీనికి తోడు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్న వైనంపై ‘సాక్షి’ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన నిధులు, ఏజెన్సీ ఇదివరకు అడ్వాన్సులు కోరుతూ పెట్టిన అర్జీల అంశాలతో నీటి పారుదల శాఖ నోట్ సిద్ధం చేస్తోంది. పనుల పూర్తికి కనీసం రూ.80కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఏజెన్సీ కోరుతోంది. దీనిపై త్వరలోనే జరిగే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
రాజధానిలోనే అధిక నీటి వినియోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తంలో రాజధాని హైదరాబాద్ భూగర్భ జలాల వినియోగంలో తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్లో ఏకంగా భూగర్భ జల వినియోగం 341 శాతంగా ఉంది. రాష్ట్ర సరాసరి వినియోగం 65 శాతం ఉండగా, దానికి ఐదింతలు ఎక్కువగా హైదరాబాద్లో వినియోగం ఉన్నట్లు భూగర్భజల శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో మల్కాజ్గిరి (94 శాతం), సిద్దిపేట (94 శాతం), మేడ్చల్ (92 శాతం), వరంగల్ అర్బన్ (91శాతం)గా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ భూగర్భ జల శాఖ, కేంద్ర జల వనరుల సంస్థల సమన్వయంతో రాష్ట్రంలో భూగర్భ జల వనరులు 2016–17 నీటి సంవత్సరానికి సంబంధించిన నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్, భూగర్భజల శాఖ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మద్నూర్లు విడుదల చేశారు. రాష్ట్రాన్ని మొత్తంగా 502 గ్రౌండ్ వాటర్ బేసిన్లుగా విభజించి భూగర్భ జలాలను అంచనా వేశారు. ఇందులో 29 బేసిన్లు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నట్లు తేల్చారు. 8,584 మండలాలకు 70 మండలాలు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అత్యధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాలు, మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా జోషి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
జూన్ 11న రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉం డాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై బుధవారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వడగాడ్పు లు ఇంకా కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవసరమైన హెచ్చరికలు పంపాలని ఆదేశించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, తెలంగాణలో జూన్ 10 లేదా 11న చేరుకునే అవకాశం ఉంద న్నారు. అధిక వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంట్రోల్ రూంల ద్వారా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ శాఖ ద్వారా ప్రాంతాల వారీగా వర్షం వచ్చే వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు, పట్టణాలలో అత్యధిక వర్షాలు కురిసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు ఇచ్చారు. వివిధ శాఖల కంట్రోల్ రూంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతోపాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షపాత వివరాలు రోజువారీగా జిల్లాలకు పంపిస్తామని, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమీక్షించడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. రైల్వే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించామని.. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. 195 బృందాల ఏర్పాటు.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధిలో 195 సంచార బృందాలను ఏర్పాటు చేశామని సంస్థ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఫ్లడ్ మ్యాప్స్ రూపొందిస్తున్నామని, విపత్తుల నిర్వహణ బృందాలు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. నాలాల పూడికతీతను జూన్ 6 నాటికి పూర్తి చేస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పట్టణ, గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కూలిన చెట్ల తొలగింపునకు చర్యలతోపాటు అవసరమైన హెలీప్యాడ్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆర్అండ్బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. గోదావరి నది పరీవాహక పరిధిలో ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కరకట్టలను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు తెలిపారు. -
అన్ని జిల్లాల్లో ‘అవతరణ’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న రాష్ట్ర అవతరణ దిన వేడుకలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, జెండావిష్కరణ చేసే వారి పేర్లను ఆయన ఖరారు చేశారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని జెండావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి పాల్గొంటారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఐకే రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్రెడ్డి (నిజామాబాద్), జగదీష్రెడ్డి (సూర్యాపేట), నిరంజన్రెడ్డి (వనపర్తి), దయాకర్ రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి (వరంగ్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి)లు ఆయా జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో పాల్గొననున్నారు. -
అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. సచివాలయంలో ప్రదీప్ కుమార్ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరువు కార్యాచరణ ప్రణాళిక అమలు, భూగర్భజలాలు, విద్యుత్ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డేటాసేకరణ, విశ్లేషణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, బడ్జెట్లో అధిక నిధులు ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించామని, రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. జూలై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని, ప్రధాన రిజర్వాయర్లలో గతేడాది కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, వడగాడ్పులపై జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కర్ణాటక రెండు టీఎంసీల నీటిని విడుదల చేసినందుకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతికి కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారులకు రెవెన్యూ శాఖ కొమ్ముకాస్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. లంచం తీసుకుంటూ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన అధికారులపై విచారణకు అనుమతి ఇవ్వకుండా సచివాలయంలోని రెవెన్యూ అధికారులు కేసులను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఆయన వినతిపత్రం సమర్పించారు. అవినీతి కేసుల్లో పట్టుబడ్డ అధికారులను ప్రాసిక్యూషన్ చేయకుండా అడ్డుకోవడం, తీవ్ర నేరారోపణలున్నా శాఖాపరమైన చర్యలకే పరిమితం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో సుమారు 50 అవినీతి కేసులను విచారణ జరపకుండానే మూసివేశారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. -
విద్యుదుత్పత్తి పెరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుదుత్పత్తి జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఐటీ, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్వంలో రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ కార్మాగారాన్ని శనివారం సీఎం సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, నర్సింగరావు, సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు, ప్రస్తుత ఉత్పత్తి, భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే డిమాండ్ వంటి అంశాలపై వీరితో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావొచ్చిందని.. రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు వేగవంతమయ్యాయన్నారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని, దానికి దాదాపు 6వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా.. పునర్విభజన చట్టంలో 4వేల మెగావాట్ల పవర్ప్లాంట్లను కేటాయించినందున.. తెలంగాణ విద్యుత్ కర్మాగారానికి ప్రధానమంత్రి 2016 ఆగస్టులో శంకుస్థాపన చేశారని ఎన్టీపీసీ అధికారులు గుర్తుచేశారు. వేగంగా ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో అల్ట్రాసూపర్ టెక్నాలజీని వినియోగిస్తూ.. ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి ప్లాంట్ను అక్టోబర్ 2020లోగా.. 2,400 మెగావాట్ల సామర్థ్యమున్న రెండవ యూనిట్ను ఫిబ్రవరి 2021 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. అయితే.. నిర్ణీత గడువుకంటే ముందే ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం వారిని కోరారు. తెలంగాణలో రైతులకు సాగునీరందించడానికి గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం ఒకటే మార్గమని, దానికి విద్యుత్ అందించేందుకు ఎన్టీపీసీ సైతం సహకరించాలని సీఎం కోరారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్టీపీసీ ప్లాంట్ల ద్వారానే విద్యుత్ తీసుకుంటే వెంటనే మన అవసరాలు తీరతాయని, ధర కూడా కలిసొస్తుందని సీఎం అన్నారు. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు.. ఈ విషయంపై సమన్వయం చేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. బొగ్గు విధానం మార్చాలి విద్యుదుత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో ఉత్పత్తి వ్యయం తగ్గించేలా సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దగ్గర తానే చొరవ తీసుకుంటానన్నారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఎన్టీపీసీ నుంచి 2వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీపీసీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సౌర విద్యుదుత్పత్తి కోసం ఎన్టీపీసీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతోందన్నారు. పీజీసీఎల్ విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో కూడా మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎన్టీపీసీ సంస్థ 13.5లక్షల మొక్కలు నాటినందుకు సీఎం అభినందించారు. బొగ్గు గనుల వద్దే ప్లాంట్లుండాలి ‘విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపులు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంటుకు పక్కనే ఉన్న సింగరేణి నుంచి కాకుండా.. 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని మందాకిని నుంచి బొగ్గు తెచ్చి వాడుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. విద్యుత్ ధర పెరుగుతుంది. అంతిమంగా ప్రజలపై భారం పడుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ విద్యుత్ కేంద్రం ఉంటే, దానికి దగ్గరలోని గనుల బొగ్గును వాడాలి. పిట్హెడ్ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా అదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తేవడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. తెలంగాణ జెన్కో సింగరేణి బొగ్గునే వాడుతోంది. రామగుండం ఎన్టీపీసీ కూడా సింగరేణి బొగ్గునే వాడాలి. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాస్తానని, విధానంలో మార్పు తీసుకురావడానికి చొరవ చూపుతా’అని సీఎం స్పష్టం చేశారు. 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ స్టేజ్–2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) పూర్తి కాలేదని అధికారులు సీఎంకు వెల్లడించారు. నిర్మాణానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉన్నప్పటికీ, పీపీఏ పూర్తయితేనే పనులకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఈనెలలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యుత్శాఖ మంత్రితో చర్చించి స్టేజ్–2కి సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచే రామగుండం ఫర్టిలైజర్స్ రామగుండంలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మూతపడ్డ ఎఫ్సీఐని తిరిగి తెరిపించేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్సీఐఎల్ సీఈఓ రాజన్ థాపర్ చెప్పారు. రామగుండలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైతే.. తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు ఇక్కడ నుంచే తీసుకోవచ్చని సీఎం అన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ నాయకత్వంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందని ప్రశంసించారు. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కలెక్టర్ దేవయాని తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. కన్నెపల్లికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. దాదాపు 7గంటల పాటు ఆయన కన్నెపల్లి, మేడిగడ్డ వద్ద జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తారు. ఉదయం 6.30 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్హౌస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామి దర్శనం తర్వాత కన్నెపల్లికి అక్కడినుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తారు. మధ్యాహ్నం 1.30 వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనుల పరిశీలన, ప్రగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రామగుండంలో మధ్యాహ్న భోజనం, విరామం తర్వాత హైదరాబాద్కు బయలుదేరతారు. -
3 రోజులు రాష్ట్రావతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనుంది. జూన్ 2న సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో సీఎం కేసీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం ట్యాంక్బండ్పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీస్టేడియంలో 3న 1,001 మంది కళాకారులతో పేరిణి మహానృత్య ప్రదర్శన, 4న ఐదువేల మంది కళాకారులతో ఒగ్గుడోలు మహా విన్యాసాన్ని నిర్వహించనున్నారు. పీపుల్స్ప్లాజాలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, రవీంద్రభారతిలో పలు రంగాల కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి గురువారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. వేడుకలు ముగిసిన అనం తరం వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, వాహనా ల అలైటింగ్, పికప్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారం, ఎల్ఈడీ టీవీ, పీఏ సిస్టం, కామెంటేటర్లు, మీడియా కవరేజి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరంలోని రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలన్నారు. పరేడ్గ్రౌండ్స్లో పరిశుభ్రత, మొబైల్ టాయిలెట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, అంబులెన్సులు, వైద్యనిపుణుల బృం దాలు, బారికేడ్లు, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శులు అజయ్ మిశ్రా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు సునీల్శర్మ, అర్వింద్ కుమార్, పార్థసారథి, అడిషనల్ డీజీపీ తేజ్దీప్కౌర్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. -
పార్ట్టైం, ఎంటీఎస్ ఉద్యోగులెందరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పార్ట్టైం, మినిమమ్ టైంస్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగుల తాజా లెక్కల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాఖల వారీగా వివరాలను సమగ్రంగా అందజేయాల ని వివిధ విభాగాధిపతులను ఆర్థిక శాఖ ఆదేశించింది. గత నెలలో సీఎస్ ఎస్కే జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల వివరాల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్ఎంఆర్లు, డైలీ వేజెస్, కంటిజెంట్ లేదా కన్సాలిడేటెడ్ కింద వివిధ శాఖల్లో చేరిన అనేకమంది ఉద్యోగులు ఏళ్లుగా పార్ట్టైం, మినిమమ్ టైం స్కేల్పై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొంతమందిని రెగ్యులరైజ్ చేసినా, ఇంకా చాలామంది వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అలాగే ఉండిపోయిన వారి వివరాలను ఇవ్వాలని విభాగాధిపతులను ఆదేశించింది. 4 ప్రధానాంశాలు.. 1993 నవంబర్ 25వ తేదీ నాటికే పదేళ్ల సర్వీసు పూర్తయినా, రెగ్యులరైజ్ కాని పార్ట్టైం ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని కోరింది. ఆ స్థానాల్లో క్లియర్ వేకెన్సీలు ఉన్నాయా? పనిచేస్తున్న వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా? ఇతర కారణాలతో అర్హత పొందలేకపోయారా? పాలనాపరమైన జాప్యం జరిగిందా? అన్న 4 ప్రధాన అంశాలతో ఆ వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ రూపొందించిన ప్రొఫార్మాను అన్ని శాఖలకు పంపించింది. దాని ప్రకారం వివరాలను ఇవ్వాలని పేర్కొంది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, పోస్టు పేరు, నియామక తేదీ, ఎన్ఎంఆర్గా అపాయింట్ అయ్యారా? డైలీ వేజెస్ కింద అపాయింట్ అయ్యారా? కంటింజెంట్ కింద లేదా కన్సాలిడేటెడ్ కింద నియమితులయ్యారా? ప్రస్తుతం వారికి ఎంత వేతనం వస్తోంది? 1993 నాటికి వారికి ఉన్న సర్వీసు ఎంత? ఆ పోస్టులకు నిర్దేశించిన అర్హతలు, అభ్యర్థికి ఉన్న అర్హతలు, సామాజిక వర్గాల వారీగా వివరాలు తదితర 12 అంశాలపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. -
వ్యర్థాల నియమావళి బాధ్యత పీసీబీదే
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్, బయో మెడికల్ వేస్ట్ నియమాల అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి అప్పగించి, ప్రత్యేక అధికారులను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా రీ సైక్లింగ్ చేసేందుకు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాల అమలుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఎన్జీటీకి సమర్పించాల్సిన నివేదికలకు చెందిన సమాచారాన్ని ఈ నెల 23వ తేదీలోగా పీసీబీకి సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహాల నుంచి 8,450 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, 8,273 మెట్రిక్ టన్నులు గడప గడపకూ వెళ్లి సేకరిస్తున్నట్లు సీఎస్ ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యర్థాల సేకరణ కోసం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016’కు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు వివరించారు. పురపాలక సంఘాల్లో డంపింగ్ యార్డులకు అవసరమైన స్థల సేకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలను తగుల బెట్టడంపై ప్రజలకు అవగాహన తదితర అంశాలను జోషి సమీక్షించారు. 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజూ 15వేల కిలోల బయో మెడికల్ వేస్ట్ను సేకరిస్తున్నట్లు అధికారులు వివరించారు. 50 మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించి, నిబంధనలు అతిక్రమిం చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనంపై ప్రణాళిక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా నదీ కాలుష్యాన్ని నివారించేందుకు నిర్దిష్ట కాల పరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. నదుల పునరుజ్జీవనం ప్రణాళికపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించామన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యతలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర కాలు ష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి నివేదిక సమర్పించినట్లు అధికారులు వివరించారు. జూన్ 30 నాటికి తర్వాతి ప్రాధాన్యతా క్రమంలో నదుల్లో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికపై నివేదిక సమర్పిస్తామన్నారు. వాయు, పారిశ్రామిక కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపైనా ఈ సమావేశంలో జోషి సమీక్ష జరిపారు. కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు (ఈటీపీ), ఉమ్మడి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు (సీఈటీపీ), మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల (ఎస్టీపీ) పనితీరుపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1979 పరిశ్రమల్లో ఈటీపీలు పనిచేస్తున్నాయని, పనిచేయని చోట సం బంధిత పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మూసివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు మరో 372 ఎస్టీపీలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. నెల రోజుల్లో పటాన్చెరు ఎస్టీపీ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఖాజిపల్లి, ఇస్నాపూర్, కిష్టారెడ్డిపేట, గండిగూడెం, ఆ సానికుంట చెరువుల్లో కాలుష్య నివారణకు ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ ఎస్టీపీల ఏర్పాటుకు వీలుగా సవివర ప్రణాళిక నివేదిక (డీపీఆర్) తయారు చేయడంతో పాటు నిధుల సేకరణ వ్యూహాన్ని కూడా నెల రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ఏర్పాటు విషయంలో చెన్నై ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలపై ఆరోగ్య, నీటిపారుదల, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ప్రత్యేకంగా చర్చించారు. కాగా, ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ టి.కె.శ్రీదేవిలతో పాటు గనులు, ఆరోగ్య, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
20 కల్లా పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20 కల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 18–20 తేదీల్లోగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎక్కువ సంఖ్యలో జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలున్నచోట, శాంతిభద్రతల పరిస్థితిని బట్టి కొన్ని జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలుండొచ్చు. మిగతా జిల్లాల్లో ఒకటి లేదా రెండు విడతల్లోనే ఎన్నికలు ముగిస్తాం. 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన అనంతరం ఏయే జిల్లాల్లో మూడు విడతలుంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ నెల 20 కల్లా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో 18–20 తేదీల్లోగా నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందులో నామినేషన్ల దాఖలు మొదలు ఎన్నికల వరకు 3 విడతల్లో ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో ఎప్పుడప్పుడు ఎన్నికలుంటాయి, తదితరాలపై స్పష్టమైన వివరాలు, సమాచారం ఉంటుంది’అని చెప్పారు. వసతుల కల్పనపై చర్చ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రధానంగా చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, మండువేసవిలో వీటిని నిర్వహిస్తున్నందున పోలింగ్కేంద్రాల్లో ఓటర్లకు ఎండదెబ్బ తగలకుండా తగిన నీడ, మంచినీటి వసతి కల్పించడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురావడం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యయ అంచనా, దాని కేటాయింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ బాక్స్లు, బ్యాలెట్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, వివిధ శాఖల సీనియర్ అధికారులు రాజేశ్వర్ తివారీ, కె.రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, అధర్సిన్హా, సునీల్శర్మ, బి.జనార్దనరెడ్డి, నీతూకుమారి ప్రసాద్, అశోక్, సీనియర్ ఐపీఎస్లు తేజ్దీప్కౌర్ మీనన్, జితేందర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్కుమార్, జయసింహారెడ్డి పాల్గొన్నారు. నాగిరెడ్డి వెల్లడించిన సమీక్ష వివరాలివీ.. 32,007 పోలింగ్ కేంద్రాలు మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్ల పరిధిలోని 535 మండల ప్రజా పరిషత్లలోని 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఇందుకోసం 32,007 పోలింగ్ స్టేషన్లను వినియోగిస్తాం. ఇటీవలి లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 1.57 కోట్ల గ్రామీణ ఓటర్లున్నారు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు జాబితాలో చేరేవారికి కూడా ఓటు హక్కు కల్పించనున్నందున వీరి సంఖ్య 1.60 కోట్లకు చేరవచ్చని అంచనా. అధికారులు తీసుకోవాల్సిన చర్యలు పరిషత్ ఎన్నికల సందర్భంగా కొత్త పథకాల ప్రకటనగాని, వాటిపై హామీలుగాని ఇవ్వకూడదు. కొత్తగా ఆర్థికపరమైన మంజూరు చేయొద్దు. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు. ఎస్ఈసీ అనుమతి లేకుండా ఏ అధికారినీ బదిలీ చేయరాదు. ప్రజాధనంతో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదు. భద్రతాపరంగా... ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరమన్న దాని ప్రాతిపదికన భద్రతా దళాలపై అంచనా వేయాలి. వివిధ జిల్లాలు, మండలాల్లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని బట్టి భద్రతా సిబ్బందిని మోహరించాలి. ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లు, భయాలకు గురికాకుండా ఓటువేసేందుకు ప్రజలకు విశ్వాసం కలిగించేలా భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలి. మొత్తంగా 55 వేలమంది వరకు పోలీసు, భద్రతా సిబ్బంది అవసరమవుతారు. నోటిఫికేషన్ వరకు... ఓటు నమోదుకు స్పెషల్ డ్రైవ్ అంటూ ఏమి ఉండదని, మార్పులు, చేర్పులు, కొత్త ఓటు నమోదుకు నోటిఫికేషన్ వెలువడే వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. గత పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి లెక్కలు చూపించని వారి వివరాలు ఉన్నాయి. వారిపై నిఘా పెడతాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎంతమంది పోటీ చేసినా ఎన్నికలు నిర్వహిస్తాం. నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే బ్యాలెట్ను ముద్రిస్తామన్నారు. గతంలో నల్లగొండ జిల్లాలో 400 మందికిపైగా అభ్యర్థులు పోటీ చేసినా ఆ మేరకు పేపర్బ్యాలెట్ను ముద్రించి ఎన్నికలను సవ్యంగా నిర్వహించిన అనుభవం మనకుంది. ఎన్నికల సామగ్రి సిద్ధం... ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి మొత్తం సిద్ధమైంది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి బ్యాలెట్ బాక్స్లు తెప్పించాం. బ్యాలెట్పత్రాల ముద్రణ మాత్రం కొంత క్లిష్టంగా ఉంటుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థులు తేలాక బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తాం. ఈ పత్రాల ముద్రణకు 3, 4 రోజుల సమయం పడుతుంది. అయినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లాస్థాయిలో బ్యాలెట్ పత్రాల ముద్రణాకేంద్రాలను సైతం ఖరారు చేశాం. పోలింగ్ సిబ్బందికి నియామకపత్రాలు జారీచేశాం. గులాబీ రంగే ఉంటుంది... గతం నుంచే ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలను గులాబీరంగు బ్యాలెట్పేపర్తో నిర్వహిస్తున్నాం. అందువల్ల ఈసారి కూడా వీటిరంగు అదే ఉంటుంది. ప్రస్తుతం పింక్ కలర్ ఒక పార్టీకి సంబంధించిన రంగు అయినా గతం నుంచి ఇదే పద్ధతిలో సాగుతున్నందున దానినే కొనసాగిస్తాం. జడ్పీటీసీ ఎన్నికలను తెలుపురంగు బ్యాలెట్ పేపర్తో నిర్వహిస్తాం. ఈ రంగులు కొత్తగా ఇచ్చినవి కాదు. గతం నుంచి కొనసాగుతున్నవే. 23 రోజుల్లో పూర్తి ఎన్నికల నిర్వహణకు 15 రోజులు, మూడో నోటిఫికేషన్ల విడుదలకు 8 రోజులు కలుపుకుని మొత్తం పరిషత్ ఎన్నికల ఓటింగ్ 23 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలను అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో విడుదల చేసి ప్రదర్శించాం. వీటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేశాం. ఓటరు జాబితా ఇంకా ఎవరికైనా కావాలంటే తగిన రుసుం చెల్లించి తీసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. 18న పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తాం. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశాం. పోలింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు, ఇతర అధికారులకు శిక్షణ కూడా పూర్తవుతుంది. ప్రతి మండలంలో ఒక్కో జెడ్పీటీసీ సీటు ఉంటుంది కాబట్టి ప్రతి మండలానికి ఒక రిటర్నిం గ్ అధికారి, మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక ఆర్వో ఉంటారు. మిగిలిన పోలింగ్ సిబ్బంది, అధికారులకు త్వరలోనే శిక్షణ పూర్తవుతుంది. ఎన్నికల నిర్వహణకు (మొత్తం మూడు విడతలకు కలుపుకుని) 1.80 లక్షల సిబ్బంది అవసరం అవుతారు. దీనికి సంబంధించి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారు. -
కేసీఆర్ పథకాలపై నివేదిక విడుదల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సారథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల పనితీరుపై ‘టువర్డ్స్ గోల్డెన్ తెలంగాణ’పేరుతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని ప్రధాన పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నివేదికలో క్రోడీకరించారు. అన్ని సంక్షేమ పథకాలు, కాళేశ్వరం, రైతుబంధు, మిషన్ భగీరథ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, టీఎస్–ఐపాస్, విద్య, వ్యవసాయం, విద్యుదుత్పత్తి, మహిళా సాధికారత, నీటిపారుదల రంగాలకు సంబంధించిన సమగ్ర గణాంకాలను ఈ నివేదికలో పొందుపరిచారు. టీ–హబ్, టాస్క్, టీ–వర్క్స్, రిచ్ వంటి సంస్థల పనితీరును సైతం ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. సచివాలయంలో మంగళవారం సీఎస్ను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు ఉమేష్ సిన్హా, సుదీప్జైన్ కలిశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, సీఈవో రజత్కుమార్, అడిషన్ సీఈవో బుద్ధప్రకాశ్జ్యోతి, ఆర్థికశాఖ అధికారి శివశంకర్, అడిషనల్ డీజీ(ఎల్వో) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ...పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 145 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి బలగాల కేటాయింపుపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ లోక్సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ఈవీఎంలు ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్ నుంచి వస్తున్నాయన్నారు. దీనికి అవసరమైన అదనపు సిబ్బంది, టేబుళ్లు, ఇంజనీర్ల కేటాయింపు, పోలింగ్ బూత్లలో సౌకర్యాలు తదితర అంశాలపై కూడా కేంద్ర ఎన్నికల అధికారులతో చర్చించారు. నిజామాబాద్ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలపై ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారికి తెలిపారు. సీఈవో రజత్కుమార్ మాట్లాడుతూ..నిజామాబాద్ ఎన్నికలకు అవసరమైన అదనపు సిబ్బంది వివరాలు సమర్పిస్తామని, పోలింగ్ బూత్ల్లో చేపట్టాల్సిన అన్ని వసతులపై చర్యలు తీసుకుంటున్నామని నివేదించారు. -
ఏప్రిల్ 11న సార్వత్రిక సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఏప్రిల్ 11ను సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్కు ముందు రోజు ఏప్రిల్ 10తో పాటు పోలింగ్ రోజు ఏప్రిల్ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న మే 23న అవసరమైతే స్థానిక సెలవును ప్రకటించాలని కలెక్టర్లను కోరింది. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలు జరగని బయటి ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ల ద్వారా రవాణా చేసే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రయాణాలకు కామన్గా ఒకే మొబిలిటీ కార్డు అందించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. దీనికి అవసరమైన ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వివిధ మార్గాల ద్వారా ప్రయాణించే వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొబిలిటీ కార్డు వేరే అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్, స్వైపిం గ్ తదితర ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ ఉండేలా రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ప్రత్యేకతలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రోడ్డు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్శ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే సీజీఎం కేవీ రావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల రుణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల మేర రుణం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) అంగీకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు , ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఢిల్లీలో పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్శర్మతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఎల క్ట్రో మెకానికల్ వర్క్స్కు ఆర్థిక సహకారం అందించే విషయంపై చర్చించారు. తెలంగాణ జి.ఎస్.డి.పి., రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు, ఆర్థిక క్రమశిక్షణ, తిరిగి చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న పీఎఫ్సీ తెలంగాణ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు రూ.18 వేల కోట్ల మేర రుణం ఇచ్చేందుకు పీఎఫ్సీ అంగీకారం తెలిపిందని వెల్లడించాయి. గతంలోనూ పీఎఫ్సీ నిధులు పీఎఫ్సీ గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులకు, విద్యుత్ రంగ సంస్థలకు నిధులు సమకూర్చింది. తెలంగాణలో నిర్మిస్తున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు విద్యుత్ సంస్థలకు రూ.23 వేల కోట్లను పీఎఫ్సీ మంజూరు చేసింది. గతంలో నూ తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టుల ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసం రూ.17 వేల కోట్లను అందించింది. తాజాగా మరో రూ.30 వేల కోట్లు అందించడానికి అంగీకరించింది. ఈ సందర్భంగా పీఎఫ్సీ చైర్మన్కు తెలంగాణ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. వేగవంతం కానున్న ప్రాజెక్టులు తెలంగాణలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. రాష్ట్ర బడ్జెట్లోనే ఏటా రూ.25 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం నిర్మాణం చివరిదశలో ఉండగా పాలమూరు, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మా ణం వేగంగా జరుగుతోంది. అందుకోసమే పీఎఫ్సీ నుంచి రుణం తీసుకునేందుకు చర్చలు జరిపి సఫలమైంది. -
కొత్త పనులు చేపట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియ మావళిని కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పేర్కొన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమ లు నేపథ్యంలో జిల్లాలో పాలన తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పాలన సాగించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పనులు కొనసాగించాలని సూచించారు. కోడ్ నేపథ్యం లో కొత్త కార్యక్రమాలు చేపట్టొద్దని తెలిపారు. కొత్తగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకోసం తీసుకోవాల్సిన చర్యలను ఈనెల 31 లోగా పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను గత ఏడాది వచ్చిన రాష్ట్రపతి గెజిట్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రొఫార్మా–1 పూర్తిచేశాయని, తమ శాఖలో ఉన్న పోస్టుల వివరాలను నిక్షి ప్తం చేయాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిం చని ప్రత్యేకాధికారులు, రాష్ట్రస్థాయి అధికారుల ను ప్రొఫార్మా–5లోకి తీసుకురావాలన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ అనుమతితో ఉత్తర్వుల జారీకి చర్య లు తీసుకోవాలని, ప్రతి శాఖకు సంబంధించిన పోస్టులను ఆర్థిక శాఖ రీకౌన్సిల్ చేస్తుందన్నారు. టీవెబ్ పోర్టల్కు నోడల్ అధికారి తెలంగాణ వెబ్ పోర్టల్కు ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ సూచించారు. జిల్లాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్, హరితహారం, ఎన్నికల కోడ్, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ, రెవెన్యూ, అటవీ భూముల సర్వే తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ కమిటి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జస్టిస్ సీవీ రాములు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లు సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను జిల్లా కలెక్టర్లు సమర్పించాలన్నారు. కొత్తగా ఎన్నికైన∙గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని ఈనెల 29లోగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు. శిక్షణ పొందిన సర్పంచుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించాలని తెలిపారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, చిత్రా రామచంద్రన్, ముఖ్య కార్యదర్శులు శాంతికుమారి, రామకృష్ణారావు, సునీల్ శర్మ, వికాస్రాజ్, సోమేశ్కుమార్, శాలినీ మిశ్రా, పార్థసారథి, జగదీశ్వర్, శశాంక్ గోయల్, శివశంకర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, బి.వెంకటేశం, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారానికి సిద్ధంకండి
సాక్షి, హైదరాబాద్: ఐదో విడత హరితహారం కోసం అన్ని జిల్లాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచించారు. గురువారం సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెంచుతున్న మొక్కల్లో కచ్చితంగా 25 నుంచి 30 శాతం అటవీ పండ్ల జాతులు, మరో పది శాతం ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఉండాలన్నారు. ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులు, ప్రజలు కోరుకున్న మొక్కలు అందించేలా అటవీ, గ్రామీణాభివృ ద్ధి, మున్సిపల్ శాఖలు సిద్ధం కావాలని సూచించారు. ఇంకా వెయ్యి పంచాయతీల్లో నర్సరీలను సిద్ధం చేయాల్సి ఉందని, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నర్సరీల పెంప కానికి స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేయాలన్నారు. 66 లక్షల ఎకరాల అటవీ భూమికి సంబం ధించి ఇప్పటికే సమారు 54 లక్షల ఎకరాల పరిశీలన, రెవెన్యూ రికార్డుల్లో గుర్తించడం పూర్తయిందని, మిగతావి కూడా వివిధ దశల్లో ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మన విద్యుత్ విధానం దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వం లో తక్కువ సమయంలోనే తెలంగాణ విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు అనితర సాధ్యమైనవని, ఈ విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్ల నుంచి నిరంతర వెలుగుల వైపు ఎలా ప్రయాణించిందనేది ఇతర రాష్ట్రాల కు ఒక పాఠంలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ పీఆర్వోగా పనిచేస్తు న్న ట్రాన్స్కో జీఎం గటిక విజయ్ కుమార్ తెలుగులో ‘తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం’, ఇంగ్లిష్లో ‘ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్’ పుస్తకాలను రచించా రు. ఈ 2 పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి ఎస్కే జోషి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమం లో జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభా కర్ రావు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహరావు, పుస్తక రచయిత గటిక విజయ్ కుమార్ పాల్గొన్నారు. పుస్తకంలో ఏముంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడున్న విద్యుత్ సంక్షోభం, ఏపీ చేసిన కుట్రలు, వాటన్నింటినీ అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు, విద్యుత్ విషయంలో సాధించిన రికార్డులు, తలసరి విద్యుత్ వినియోగం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంశాల్లో అగ్రగామిగా నిలవడానికి కారణాలు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ తదితర బృహత్తర పథకాల్లో విద్యుత్ శాఖ బాధ్యతలు, బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యుత్ రంగం ఎంతటి కీలక భూమిక పోషిస్తున్నది తదితర అంశాలన్నింటినీ ఈ పుస్తకాల్లో వివరించారు. పుస్తక రచయిత విజయ్ కుమార్ను కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా అభినందించారు. -
ఆస్ట్రేలియా సహకరించాలి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత్తో విద్య, వ్యవసాయం, ఐటీ శిక్షణ తదితర రంగాల్లో సహకారానికి ఆస్ట్రేలియా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి అన్నారు. ఈ మేరకు బుధవారం సీఎస్ను ఆస్ట్రేలియా బృందం కలిసింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, భారత్ సహకారంతో రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, విపత్తు నిర్వహణ, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా నార్తర్న్ టెరిటరీ విద్యా మంత్రి సెలెనా యూఈబో అన్నారు. -
సాగులోకి గిరిజనుల భూమి
సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వ్యవసాయానికి సాగునీరు అందించడానికి చిన్ననీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొనేలా వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్లో ఎస్టీ ప్రాంతాల్లో చిన్ననీటి వనరుల ఉపయోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా నీరందే భూములకు కాకుండా, మిగిలిన భూములకు చిన్ననీటి వనరులైన చెరువులు, వాగుల ద్వారా నీరందించాలని సూచించారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా కొండలు గుట్టల్లో ఉంటాయని.. అందుకోసం పైపుల ద్వారా సాగునీరందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. పోడు భూముల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని.. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎంత సాగుభూమి ఉందనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎస్టీ రైతులు మంచి పంటలు పండించుకునే విధంగా సాగునీటి ప్రణాళిక ఉండాలన్నారు. రాష్ట్రంలో 46,500 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టులున్నాయి. 16,771 చెరువులు విడిగా ఉన్నాయి. మిషన్ కాకతీయలో నీటి నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే 90% చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ చెరువులకు ఈ వర్షాకాలం నుంచే ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాలి. వర్షం ద్వారా వచ్చే నీళ్లు, పడువాటు నీళ్లు చెరువులకు చేరే విధంగా ఫీడర్ ఛానళ్లు, అలుగు కాలువలు ఈ ఎండాకాలంలోనే పూర్థిస్థాయిలో సిద్ధం చేయాలి’అని సీఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ దృష్టి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో చాలా ఏజెన్సీ ప్రాంతాలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షపాతం కూడా అధికంగానే ఉంది. వాగులు, వంకలు చాలా ఉన్నాయి. వీటిపై ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ద్వారా ఎంతవరకు నీరందించవచ్చో గుర్తించాలి. మిగతా ప్రాంతాలకు చిన్ననీటి వనరుల ద్వారానే నీరివ్వాలి’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సలహాలు, సూచనల మేరకు చిన్ననీటి వనరుల వినియోగం ద్వారా గరిష్ట భూ–వినియోగం అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బూర్గంపాడు సమీపంలో జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు 1500 హెచ్పీ మోటార్లను ఉపయోగించి ఆ ప్రాంతానికి నీరివ్వాలని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును కోరారు. ఆదిలాబాద్లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల స్వరూపం, వాటివల్ల సాగయ్యే భూమి వంటి అంశాలను అధ్యయనం చేయాలన్నారు. పినపాక నియోజకవర్గంలో వట్టివాగు, లాతూరు గండిలను వినియోగించుకొనే మార్గాలను చూడాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఈఎన్సీలు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరంతో రైతులకు మేలు
కాళేశ్వరం/ధర్మారం(ధర్మపురి)/సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్ లహరి, రీటా లహరి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆర్థిక సంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్థిక సంఘం సభ్యులు మొదట హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ పనులను పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు ప్రాజెక్టు పురోగతిని ఫొటో ఎగ్జిబిట్ ద్వారా వారికి వివరించారు. 80 శాతం వరకు పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, త్వరగా నిర్మించి రైతులకు సాగు నీటిని అందించాలని అన్నారు. ప్రాజెక్టుకు ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం భేష్! తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని సభ్యులు ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు ప్యాకేజీ 6 కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. 6వ ప్యాకేజీలోని విద్యుత్ సబ్స్టేషన్, పంప్హౌస్, సర్జిపూల్ పనుల గురించి తెలుసుకున్నారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపులనుంచి ప్రతిరోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తం 36 లక్షల ఎకరాలకు సాగు నీరిందిస్తామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, కాలువలు ప్రవహించే దారిలోని గ్రామాల తాగునీటి అవసరాలను సైతం తీర్చే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6వ ప్యాకేజీ పనులను రూ.5,046 కోట్లతో ప్రారంభించి ఇప్పటి వరకు 95 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. జూన్ నెలాఖరులోగా వందశాతం పనులు పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 టీఎంసీలను తరలించటానికి అవసరమైన సివిల్ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగు, సాగునీటికి ప్రాధాన్యం కల్పిస్తూ, మత్స్య పరిశ్రమ, టూరిజం పెరిగేలా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మిషన్ భగీరథ పనుల పరిశీలన: రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం బాగుందని వారు కితాబిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అగ్రహారం వద్ద చేపట్టిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆదివారం వారు సందర్శించారు. రాష్ట్రంలో 1.3 లక్షల కిలోమీటర్ల పైపులైన్ను భగీరథలో ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో 15వ ఆర్థిక సంఘం సభ్యులు అరవింద్ మెహతా, రవి కోట, ఆంటోని ఫిరాయిక్, సీఎస్ ఎస్కే జోషీ, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, మిషన్ భగీరథ సీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. శంషాబాద్లో స్వాగతం: రాష్ట్ర పర్యటనకోసం వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులకు ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వాగతం పలికారు. ఆర్థిక సంఘం సభ్యులు ఈనెల 20 వరకు రాష్ట్రంలో పర్యటిస్తారు. -
రైతుబంధులో కేంద్ర ‘పెట్టుబడి’ విలీనం!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రైతుబంధు పథకం అమలవుతోంది. ఇప్పటికే ఖరీఫ్, రబీలకు రెండు విడతలుగా సొమ్ము విడుదల చేశాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎంకేఎస్ఎన్వై–పీఎం కిసాన్) ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశం కూడా ఇదే. పైగా కేంద్రం కంటే తెలంగాణలోనే అధికంగా పెట్టుబడి సాయం చేస్తున్నాం. కేంద్ర లక్ష్యం ప్రకారం తెలంగాణలో 90% మంది ఐదెకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు సొమ్ము అందింది. ఈ నేపథ్యంలో కేం ద్రం తన పథకం కింద తెలంగాణకు రావాల్సిన సొమ్ము వాటాను రైతుబంధులో కలపాలి’అని కోరే ఆలోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ అమలవట్లేదు. దీన్ని ఆధారం చేసుకొనే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున కేంద్రం మళ్లీ వేరుగా రైతులకు సొమ్ము ఇవ్వడంలో అర్థంలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా చేస్తే ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోం దన్న తప్పుడు సంకేతాలు ఇతర వర్గాల ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని చెబుతున్నాయి. అందువల్ల రాష్ట్రం లో ఐదెకరాలలోపు రైతుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రం పెట్టుబడి సొమ్మును తమ ఖాతాలో వేస్తే సం బంధిత రైతులందరికీ రైతుబంధు కింద అందజేస్తామని, ఆ మేరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యూసీ) కూడా సమర్పిస్తామని పేర్కొంటున్నాయి. నేడు హైదరాబాద్కుకేంద్ర అధికారి... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో చర్చించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా మంగళవారం హైదరాబాద్ రానున్నారు. సీఎస్తో సమావేశానికి వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఐటీశాఖలకు చెందిన ఉన్నతాధికారులూ హాజరుకానున్నారు. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ఎలా అమలు చేశారన్న సమాచారంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎలా అమలు చేయవచ్చన్న అంశంపై ఆమె చర్చించే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధును విజయవంతంగా అమలు చేస్తున్నందున ఇక్కడి అనుభవాలను కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఆమెకు వివరించే అవకాశముంది. మరోవైపు తెలంగాణలో కేంద్ర పెట్టుబడి పథకాన్ని వేరుగా అమలు చేయడం కాకుండా రైతుబంధులో విలీన అంశాన్ని కూడా రాష్ట్ర అధికారులు చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రం నిధులు ఇస్తున్నందున అవసరమైతే ఈ పథకాన్ని ‘రైతుబంధు– పీఎంకేఎస్ఎన్వై’గా (పీఎం కిసాన్) మార్చడానికి కూడా అభ్యంతరం లేదన్న ప్రతిపాదనను కూడా ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయాలో నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. 10 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. అందులో 90 శాతం సన్నచిన్నకారు రైతులకే అందింది. ఈ నేపథ్యంలో కేంద్రం సాయం చేస్తే రూ. 2,800 కోట్లకుపైగా తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్న అంశంపై వ్యవసాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఇస్తామని అంటున్నారు. -
ఒకే గొడుగు కిందకు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వెల్లడించారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూపొందించిన 2019–20 తెలంగాణ రాష్ట్ర రుణ విధాన పత్రాన్ని బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకే రంగానికి చెందిన శాఖలు వేర్వేరుగా కాకుండా ఒకే విభాగం కిందకు వచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అంత సులువు కాదని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటేనే అది సాధ్యపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా సగటున 3 శాతమే వ్యవసాయ వృద్ధి రేటు ఉంటుందని, ఇది ఇలాగే కొనసాగితే 20 ఏళ్లు అయినా కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేమన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో కూడా భారీ మార్పులు రావాల్సి ఉందని జోషి అభిప్రాయపడ్డారు. చిన్న కమతాలు ఉన్నవారందరూ కూడా యంత్రాలు కొనుగోలు చేయడం కాకుండా ఓలా, ఉబర్ తరహా అద్దెకు యంత్రాలు లభించేలా మార్పులు రావాలన్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ వరి, గోధుమలే పంటలు కాదని, పప్పు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ సాగుకు పంట రుణాలివ్వాలి సేంద్రియ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కల్పించి, రుణాలు అందేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే పాడికీ, పంటలకు కలిపి ఒకే రుణం కింద ఎందుకు ఇవ్వరాదని, ఈ విషయంపై బ్యాం కులు ఆలోచన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాబార్డు సీజీఎం విజయ్కుమార్, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, ఎస్ఎల్బీసీ జనరల్ మేనేజర్ రమేశ్, ఆంధ్రాబ్యాంకు ఈడీ ఎ.కె.రత్, తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలకు పదును పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: అటవీ నేరాల విచారణ, కఠిన శిక్షల ఖరారులో మరింత వేగం పెంచుతామని, ప్రస్తుత చట్టాలకు పదునుపెట్టి త్వరలోనే మరింత కఠిన చట్టం తీసుకురానున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వెల్లడించారు. అటవీ నేరస్తులు ఇకపై అడవుల్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడాలని, కఠినంగా వ్యవహరించటం ద్వారా నేరాలను అదుపులో పెట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా సీఎం చెప్పారని, హరితహారంతో అడవుల బయట, కఠిన చర్యలతో అడవి లోపల పచ్చదనాన్ని రక్షించుకోవాలన్నారు. అటవీ ప్రభావిత జిల్లాల్లో సాయుధ బలగాలతో అటవీ, పోలీస్ శాఖలతో ఉమ్మడిగా 54 చెక్ పోస్టుల ఏర్పాటుకు ఆదేశించారు. ఫిబ్రవరి ఆరుకల్లా ప్రతి జిల్లాలో అటవీ రక్షణ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తామని, అటవీ నేరస్తులపై సరైన సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచి, రివార్డులు కూడా ఇస్తామన్నారు. పర్యావరణ పరంగా అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయం నుంచి అడవుల రక్షణ, సంబంధిత నేరాల అదుపుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్, అటవీశాఖ అధికారులు, సిబ్బందితో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసుల వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని, అన్ని స్థాయిల్లో పోలీస్ సిబ్బంది స్థానిక అటవీ అధికారులకు సహకరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు కలిసి ఒక టీమ్ గా అటవీ నేరాలను అరికట్టేందుకు పనిచేయాలన్నారు. అడవులపై నిరంతర నిఘా కోసం సాయుధ పోలీసుల పహారా ఉంటుందన్నారు. తరచుగా అటవీ నేరాలకు పాల్పడే నేరస్తులను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలప కోత యంత్రాలపై (సా మిల్లులపై) నిఘా ఉంచుతామన్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, అడవిని కాపాడటం ఒక ఎత్తు అయితే, క్షీణించిన అడవులను పునరుద్ధరించుకోవటం మరో ఎత్తు అన్నారు. అటవీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అదిలాబాద్ జిల్లాలో ముల్తానీలను కలప స్మగ్లింగ్ నుంచి దూరం చేసేందుకు అవసరమైన పునరావాస ప్యాకేజీని వెంటనే ఆమోదిస్తామన్నారు. పీసీసీఎఫ్ పీకే ఝా మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసుల సహకారంతో అటవీ ఆక్రమణలు జరగకుండా చూస్తామని, వన్యప్రాణుల వేటపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అడిషనల్ డీజీ జితేందర్, ఐ.జీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, పీసీసీఎఫ్ విజిలెన్స్ రఘువీర్, అదనపు పీసీసీఎఫ్లు మునీంద్ర, లోకేశ్ జైస్వాల్, డోబ్రియల్, తిరుపతయ్య, స్వర్గం శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు. -
లోక్సభ ఎన్నికలకు సిద్ధమే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తెలిపారు. శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతపై భారత ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ ఆరోరా సోమవారం ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎస్ జోషి చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పనితీరుతో అవార్డు పొందిందని వివరించారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 22న ప్రచురిస్తామని సీఈసీకి చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో వచ్చే నెల 5న సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. సరిహద్దు రాష్ట్రాలతో ప్రత్యేక కార్యాచరణ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా నిర్వహించామని డీజీపీ మహేందర్రెడ్డి సీఈసీకి చెప్పారు. పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయ్యాయని, ఈ నెల 30న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలను సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నక్సల్స్ ప్రభావంపై ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగంతో కలసి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామని వివరించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు చేస్తామన్నారు. గత ఎన్నికల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, సమాచార మార్పిడి చర్యలు తీసుకుంటామని వివ రించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు పొరుగు రాష్ట్రాల నుంచి 19 వేల మంది, కేంద్రం నుంచి 276 కంపెనీల పోలీసు సిబ్బందిని కేటాయించారని.. లోక్సభ ఎన్నికలకూ అదే స్థాయిలో కేటాయించాలని డీజీపీ కోరారు. గత ఎన్నికల సందర్భంగా రూ.97 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, కేసులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో నూ మద్యం, డబ్బు ప్రభావాన్ని నిరోధించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. 16 లక్షల అభ్యంతరాలు: రజత్కుమార్ ఎన్నికల సంఘం రాష్ట్ర విభాగంలో అవసరమైన సిబ్బంది, ఆర్వోలు, ఏఆర్వోలు ఉన్నారని సీఈఓ రజత్కుమార్ సీఈసీకి తెలిపారు. ఎన్నికల అంశాలపై ఫిర్యాదు కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ (1950) ప్రారంభించామన్నారు. సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని 16 లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలున్నందున ఈ గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించామన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటిస్తామని సీఈసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శులు సోమేశ్కుమార్, రాజీవ్ త్రివేది, అడిషనల్ డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు 350 కోట్లు అవసరం తెలంగాణలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. శాంతి భద్రతల విషయంలో కొన్ని సూచనలు చేశాం. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించాం. ఎన్నికల నిర్వహణకు రూ.350 కోట్లు అవుతుంది. ఎన్నికల నిర్వహణలో ఉండే 2.5 లక్షల మందికి అలవెన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఓటరు నమోదు అభ్యంతరాలపై టోల్ ఫ్రీ నంబరుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వారి నుంచి అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు ఐదుగురు పోలింగ్ పిటిషన్లు వేశారు. పోలింగ్ నిర్వహణపై 28 మందిని శిక్షణకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మంచిగా ఉంది. అవసరం మేరకు పోలీస్ బలగాలను వినియోగించుకుంటాం..’అని సీఈఓ చెప్పారు. -
రైతుకు నీరందించడమే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగాలని, నిధుల కొరత లేదని చెప్పారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే బిల్లులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో పాటు, పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందించుకుని నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిధుల విడుదలకు సిద్ధం.. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.77,777 కోట్ల వ్యయమైందని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి, ఆర్ఆర్ ప్యాకేజీల కోసం మరో రూ.22 వేల కోట్లు ఖర్చు చేశాం. మొత్తంగా ఇప్పటివరకు రూ.99,643 కోట్లు ఖర్చయింది. ఈ ఏడాది మార్చి నాటికి మరో రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం కానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు వ్యయం రూ.1.07 లక్షల కోట్లకు చేరనుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతో పాటు, మిషన్ కాకతీయ పనుల కోసం మరో రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేసి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు కృషి చేయాలి. నిర్మాణాల కోసం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్రను మార్చాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులు ఓ జోక్గా మారాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడమే తప్పా ప్రాజెక్టులు కట్టి నీళ్లివ్వలేదు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యత కలిగిన ఆదిలాబాద్ జిల్లా చరిత్ర మార్చాలి. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలి. సిర్పూర్ కాగజ్నగర్ నియోజక వర్గంలో 56,900 ఎకరాలకు, ఆసిఫాబాద్లో 38,830 ఎకరాలకు, చెన్నూరులో 31,500 ఎకరాలకు, బెల్లంపల్లి నియోజక వర్గంలో 72,770 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి సీడబ్ల్యూసీ అంగీకారం తెలిపింది. దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలి. అలాగే అక్కడే పారే పెద్దవాగుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చాలా నియోజకవర్గాల గుండా వెళ్తుంది. ఈ పెద్దవాగు నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. పెన్గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చనఖా–కొరటా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి. కుఫ్టి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వాటాను వినియోగించుకోవాలి కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్లో రాష్ట్రం వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ‘ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించాను. నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టు పనులను సందర్శించారు. మొత్తం గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన వచ్చింది. ఈ అవగాహనతో ఈ నెలాఖరులోగా కార్యాచరణ ఖరారు చేయాలి. ఫిబ్రవరిలో స్వయంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తాను. అదే నెలలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై కార్యాచరణ రూపొందిస్తాం. వర్షాకాలం వరకు వేగంగా పనులు చేసుకునే అవకాశముంది. వెంటనే కార్యరంగంలోకి దిగాలి..’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తొలుత నీటిని చెరువులకు మళ్లించాలి ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని మొదట చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్ మానేరు నుంచి ఎస్పారెస్పీ వరకు, ఇటు మల్లన్నసాగర్ వరకు నీరు అందుతుందన్నారు. అలా వచ్చిన నీటిని మొదట చెరువులకు తరలించేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.కాల్వలపై తూములు నిర్మించి, చెరువులను నింపాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, సీఈలు హరిరామ్, శంకర్, శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈలు విష్ణుప్రసాద్, వేణు, ఈఈ రామకృష్ణలు పాల్గొన్నారు. -
పల్లెకు పోదాం చలో చలో!
సాక్షి, హైదరాబాద్/ చౌటుప్పల్ /కట్టంగూర్: సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం నుంచే సెలవులు ప్రారంభం కావడంతో.. ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువైంది. దీనికి అనుగుణంగా ఆర్టీసీ శనివారం ఒక్క రోజే సుమారు 1,500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రెగ్యులర్గా వెళ్లే రైళ్లతో పాటు, సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, జనసాధారణ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో టికెట్ దోపిడీ తారస్థాయికి చేరింది. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ, డిమాండ్ భారీగా పెరిగిపోతుండటంతో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనంగా వసూలు చేస్తున్నారు. మొదట్లో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అన్ని ప్రత్యేక బస్సుల్లోనూ ఈ పెంపు అమలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అటు, బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాలతో టోల్ప్లాజాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది. ప్రయాణంలోనే సంబరాల ఆవిరి నగరవాసుల సంక్రాంతి సంబరాల ఆశలన్నీ ఈ పెరిగిన ధరలతో ప్రయాణంలోనే ఆవిరవు తున్నాయి. చార్జీల రూపంలోనే వేల రూపాయల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. బస్సులు, రైళ్లే కాకుండా టాటా ఏస్, తూఫాన్లు, వ్యాన్లు, తదితర అన్ని రకాల వాహనాల్లోనూ జనం తరలి వెళుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్లినట్లు అంచనా. ఆది, సోమవారాల్లోనూ ఈ రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండ్రోజుల్లో మరో 10 లక్షల మంది ఊళ్లకు తరలే అవకాశం ఉంది. మరోవైపు పల్లెబాట పట్టిన వాహనాలతో హైవేలు కిక్కిరిశాయి. సంక్రాంతి రద్దీతో నగర శివారు కూడళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సొంతూళ్లకు వెళ్తున్న బస్సులు, వ్యక్తిగత వాహనాలతో రహదారులు స్తంభించాయి.ఉప్పల్, ఎల్బీ నగర్, మెహిదీపట్నం, జేబీఎస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఏఎస్ రావునగర్, ఈసీఐఎల్, తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతూరికి వెళ్లే వ్యక్తిగత వాహనాలతో.. సిటీ రోడ్లపైన భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. రైల్వేస్టేషన్లకు, బస్స్టేషన్లకు తరలివెళ్లే ప్రయాణికులతో మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. మియాపూర్–ఎల్బీనగర్, నాగోల్–అమీర్పేట్– మియాపూర్ మార్గంలో సుమారు 2.6 లక్షల మందికి పైగా పయనించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా 5,252 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన ఆర్టీసీ ఇప్పటి వరకు సుమారు 3 వేల బస్సులను నడిపింది. అలాగే ప్రతి రోజూ సుమారు 1,000 ప్రైవేట్ బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎల్బీనగర్లో.. ఒంటికాలిపై రైలు ప్రయాణం ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్ బెర్తులకు అవకాశం లేక పోవడంతో ప్రయాణికులు జనరల్ బోగీలపైనే ఆధా రపడాల్సి వచ్చింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బయలుదేరిన అన్ని రైళ్లలోనూ సాధారణ బోగీలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా 60 జనసాధారణ రైళ్లను కూడా ఏర్పాటు చేసిన ప్పటికీ ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వయోధికులు తీవ్ర ఇబ్బందు లకు గురయ్యారు. బోగీల్లో ఒంటికాలిపైన గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రచారం లేక ఫాస్టాగ్ ఫెయిల్ హైవేలపై గంటలతరబడి టోల్ ఛార్జీ చెల్లింపుల కోసం వేచి చూడకుండా సులువుగా వెళ్లగలిగే ఎన్హెచ్ఏఐ ఎలక్ట్రానికి టోల్ కలెక్టింగ్ సిస్టమ్ (ఈటీసీ)ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ఫాస్టాగ్ అనే పరికరాన్ని కారు లేదా వాహనం ముందు వరుసలో అమరుస్తారు. ఇందులో ఆన్లైన్లో కొంతమొత్తాన్ని రీచార్జ్ చేసుకునేందుకు వీలు ఉంది. ఇవి టోల్గేట్ వద్దకు రాగానే పరికరంలోని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా రుసుము దానికదే కట్ అయి, గేట్లు పైకి లేస్తాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ ప్రధాన టోల్గేట్ల వద్ద ఈ పరికరాలను విక్రయానికి అందుబాటులో ఉంచింది. కానీ సరైన ప్రచారం కల్పించలేకపోయింది. సంక్రాంతి సమయంలో రద్దీ కారణంగా టోల్గేట్లకు సమస్యలు తప్పవని సాక్షి ముందే హెచ్చరించింది. ఫాస్టాగ్ కార్డుల ప్రాధాన్యాన్ని కూడా వివరిస్తూ ఈనెల 10న కథనం కూడా ప్రచురితమైంది. కానీ, వీటిపై వాహనదారులు అంతగా ఆసక్తి చూపక పోవడంతో వీటి కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రవాణాశాఖ అధికారులు ఎక్కడ? తెలంగాణ రవాణా శాఖ గణాం కాల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 8,000కుపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలామటుకు కాంట్రాక్టు కారియర్గా అనుమతులు తీసుకుని, స్టేజీ కేరియర్గా తిప్పుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వీటి కారణంగా ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వాటిల్లుతోంది. సంక్రాంతి, దసరా సందర్భంగా ఈ నష్టం రోజుకు రూ.2 కోట్లకుపైనే. ఇంత నష్టం జరుగుతున్నా.. రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పండుగ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న బస్సులను తనిఖీలను చేపట్టాలని రవాణాశాఖ నిపుణులు, ఆర్టీసీ కార్మిక యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. టోల్ప్లాజా వద్ద భారీ క్యూ.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు వేలాదిగా తరలివెళ్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలకు పైగా వాహనాలు వెళ్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. పంతంగి టోల్ప్లాజా నుంచి లింగోజిగూడెం గ్రామం వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనాలు గంట సేపట్లో పంతంగి టోల్ప్లాజాను దాటాల్సి ఉన్నా రద్దీ నేపథ్యంలో మూడు గంటలకు పైగా సమయం పట్టింది. జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించకుండా సివిల్, ట్రాఫిక్ పోలీసులతో పాటు జీఎమ్మార్ సిబ్బంది తగుచర్యలు తీసుకున్నారు. టోల్ప్లాజా వద్ద మొత్తం 16 ద్వారాలు ఉండగా.. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో 12 ద్వారాలు తెరిచారు. కొర్లపహాడ్ ప్లాజా వద్ద పది ద్వారాలు తెరిచారు. సాధారణంగా.. విజయవాడ మార్గంలో 15–18వేల వాహనాలు పయ ణిస్తుండగా శనివారం ఒక్కరోజే సుమారు 40వేల వాహనాలు ప్రయాణించినట్లు జీఎమ్మార్ సిబ్బంది వెల్లడించారు. టోల్ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లింపులో ఆలస్యం కాకుండా సిబ్బందే నేరుగా వాహనదారుల వద్దకు వెళ్లి టోల్ సొమ్ము స్వీకరించారు. ట్రావెల్స్ దారి దోపిడీ పరిస్థితి చూస్తుంటే.. ప్రయాణికుల కన్నా.. ప్రైవేటు ట్రావెల్స్కే అసలైన సంక్రాంతి పండుగ వచ్చినట్లుంది. పండుగ రద్దీని సొమ్ము చేసుకుని.. ఇష్టానుసారంగా వ్యవ హరిస్తు న్నాయి. మోటారు వాహన చట్టాన్ని తుంగలో తొక్కినా.. భద్రతా నిబంధనలను గాలి కొదిలేసినా అధికారులు పట్టిం చుకోవడం లేదు. ఆర్టీసీ చార్జీల కన్నా 4 రెట్లు ఎక్కువగా వసూలుచేస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పండుగ సమయం..ఎలాగైనా సొంతూరికి వెళ్లాలన్న సామాన్యుడి ఆత్రుత వీరికి వరంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ 1,500, ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 2వేల బస్సులను ఏర్పాటు చేసింది. 150 వరకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. అయితే, ఇవేవీ ఈ రద్దీకి సరిపోవడం లేదు. ఆకాశంలో ధరలు.. వాస్తవానికి టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు టికెట్ చార్జీలపై 50% అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ, ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం ఏకంగా టికెట్ ధరలను 400%పైగా పెంచేశాయి. ఇందులో స్లీపర్, ఏసీ ధరలైతే.. ఏకంగా రూ.4000 దాటుతుండటం గమనార్హం. వీటికి టోల్ట్యాక్స్, జీఎస్టీ కలిపితే 4,400 వరకు ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదే ముందస్తుగా బుక్ చేసుకుంటే విమాన చార్జీలు కూడా రూ.2వేల లోపే ఉండటం గమనార్హం. అసలింత పెంపుపై ఓ విధానం అంటూ లేకుండా పోయిందని స్వయంగా ఆర్టీఏ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, దీనిపై చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. టోల్గేట్ల వసూళ్ల రద్దు ఈ నెల 13, 16 తేదీల్లో అమలులో ఉంటుందని సీఎస్ ప్రకటన సంక్రాంతి సెలవుల సందర్భంగా జాతీయ రహదారులపై టోల్గేట్ల వసూళ్లను రద్దు చేస్తున్నట్టు సీఎస్ ఎస్కే జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ప్రక టన విడుదల చేశారు. సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు, పండుగ తర్వాతి రోజు (జనవరి 13, 16)న ఇది అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్– విజయవాడ (నం.07192/07193) ప్రత్యేక రైలు 13న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 7.30కి విజయవాడ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో అదే రోజు రాత్రి 8.25కి విజయవాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు హైదరాబాద్ చేరు కుంటుంది. సికింద్రాబాద్– విజయవాడ (నం.07194/07195) ప్రత్యేక రైలు 13న రాత్రి 11.30కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 8.35కి బయల్దేరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్– తిరుపతి (నం.07191) ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి 13న సాయంత్రం 6.45కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45కి తిరుపతి చేరుకుంటుంది. విజయవాడ– విజయనగరం (నం.07184/07185) ప్రత్యేక రైలు 13న రాత్రి 09.10కి విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20కి విజయనగరం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఉదయం 7.45కి బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30కి విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఈ ప్రత్యేక రైళ్లల్లో చార్జీలు ఒక్కొక్కరికి సికింద్రాబాద్– విజయవాడ రూ. 130, విజయవాడ– హైదరాబాద్ రూ. 135, తిరుపతి– కాకినాడ టౌన్ రూ. 175, విజయనగరం– విజయవాడ రూ. 145గా నిర్ధారించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. -
గిరిజన యూనివర్సిటీకి మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీకి ముందడుగు పడింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర అవతరణ సమయంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. భూపాలపల్లి జిల్లా జాకారం సమీపంలో 483 ఎకరాల విస్తీర్ణంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వద్ద పెండింగ్లో ఉంది. పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం లభించాకే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటులో బిల్లుకు జాప్యం జరుగుతున్నందున విభజన చట్టం ప్రకారం పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ మంజూరు, నిధుల కేటాయింపులు, నిర్వహణ అంతా కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది. 173 ఎకరాలు అప్పగింత..: జాకారంలో 483 ఎకరాల స్థలాన్ని గిరిజన యూనివర్సిటీకి ప్రతిపాదించారు. ఇందులో 173 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో ఆ మేరకు రెవెన్యూ శాఖ.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరో వంద ఎకరాలు అసైన్డ్ భూమి కావడంతో రైతులకు పరిహారం చెల్లించాక అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సేకరణ ప్రక్రియ మొదలైంది. మరో 213 ఎకరాలు అటవీ శాఖ పరిధిలో ఉంది. ఈ భూమి అప్పగింతకు సంబంధించి అటవీ శాఖతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అటవీ శాఖ భూమిలో ఉన్న పచ్చదనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని, ప్రహరీ మాత్రమే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రూ.500 కోట్లతో నిర్మాణాలు గిరిజన వర్సిటీ కార్యకలాపాలు మరో 6 నెలల్లో ప్రారంభం కానుండగా అప్పట్లోగా కొత్త భవనాలు నిర్మించడం సాధ్యంకానందున మౌలిక వసతుల కల్పనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జాకారంలో ఉన్న వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్)ను పరిపాలన విభాగం, తరగతుల నిర్వహణకు వాడుకోనున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్తో పాటు 300 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలున్నా యి. రెండేళ్లలో నిర్మాణ పనులు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనులకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలుత యూజీ, పీజీ కోర్సులు 2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీలో 6 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ(హోటల్ మేనేజ్మెంట్), బీసీఏ, బీబీఏ, ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్డీ కోర్సులను దశల వారీగా అందుబాటులోకి తేనున్నారు. తొలి ఏడాది వివిధ కోర్సుల్లో 180 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏడేళ్ల తర్వాతికి ఈ యూనివర్సిటీలో 7 వేల మంది విద్యార్థులుంటారు. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30శాతం సీట్లు వారికి కేటాయించనుంది. పరిహారానికి రూ.10 కోట్లు: ఎస్కే జోషి గిరిజన వర్సిటీ భూసేకరణ వేగవంతం చేయాలని సీఎస్ ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.10 కోట్లను భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించారు. గిరిజన వర్సిటీపై సచివాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ వర్సిటీ కమిటీలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా నియమించాలన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పా ట్లు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇటు జీహెచ్ఎంసీకి పరేడ్గ్రౌండ్స్లో పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్, గన్పార్క్, క్లాక్టవర్, ఫతేమైదాన్ లాంటి చారిత్రక కట్టడాలను విద్యుద్దీపాలతో అలకరించాలన్నారు. వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్శాఖను ఆదేశించారు. వేడుకకు హాజరయ్యే పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. వేదిక వద్ద అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచిం చారు. అమరుల సైనిక స్మారక్ వద్ద సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. -
జూన్, జూలై నెలల్లో ఇస్టా కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగే 32వ అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. ఇస్టా కాంగ్రెస్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ విత్తన ఎగ్జిబిషన్పై రూపొందించిన బ్రోచర్ను సీఎస్ ఆవిష్కరించారు. జూన్ 26న ప్రారంభోత్సవ కార్యక్రమం, 26 నుంచి 28 వరకు విత్తన సింపోజియం, అంతర్జాతీయ విత్తన ప్రదర్శ న, 28న విత్తన వ్యవసాయదారుల సమావేశం, జూన్ 29 నుంచి జూలై 3 వరకు ఇస్టా వార్షిక సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వీరికి వసతి, భద్రత, రవాణా సదుపాయాలు కల్పించాల ని అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 విత్తన కంపెనీలు పాల్గొంటాయన్నారు. కొత్త ఉత్పత్తులు, సీడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఎక్విప్మెంట్స్, సీడ్ ట్రీట్మెంట్, నూతన టెక్నాలజీపై ప్రదర్శన ఉంటుందని చెప్పారు. విత్తన ఉత్పత్తి, నాణ్యతపై సింపోజియం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ సహకారంతో ఈ కాంగ్రెస్ జరుగుతుందన్నారు. రైతులకు అవగాహన సమావేశాలు.. రైతులకు విత్తన ఉత్పత్తిలో అమలవుతున్న నూతన పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశాలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. ఇస్టా కాంగ్రెస్కు ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్యా కేజీ వివరాలను వారికి తెలపాలన్నారు. ఈ సమా వేశంలో ఇస్టా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వియాస్, స్విట్జర్లాండ్కు చెందిన ఇస్టా ప్రతినిధి ఓల్గా స్టోకీ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ కార్ బెర్రీ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ’ తరహాలోనే ఎన్నికల కోడ్: ఎస్కే జోషి
‘సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలోలాగానే పంచాయతీ ఎన్నికల సందర్భంగానూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషి స్పష్టం చేశారు. గతంలోనే మొదలైన పథకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి పరిధిపై అధికార వర్గాల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో జోషి ఈ మేరకు శుక్రవారం స్పష్టతనిచ్చారు. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని జోషి నిర్ణయించారు. డీజీపీ మహేందర్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల అధికారి వి.నాగిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు. -
రిజర్వేషన్లు తగ్గిస్తే ‘పంచాయితే’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గిస్తే ఊరుకోబోమని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. తక్షణమే బీసీల రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతంగా అమలు చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్ర కేబినెట్ తీర్మానం ప్రకారం వెంటనే బీసీ జనగణన నిర్వహించి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లెఫ్ట్, ఇంటిపార్టీ నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను రాజకీయంగా అణచివేసే ప్రక్రియను టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిందని ఆరోపించారు. బీసీ జనగణన లెక్కలు లేకపోవడంతో కోర్టు తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తున్నాయని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ఎల్.రమణ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు రావడంతో తెలంగాణలో దొరల, పటేళ్ల రాజ్యం తగ్గిందని, ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించి మళ్లీ పెత్తందారీ వ్యవస్థ పెరిగేలా చూస్తున్నారని వాపోయారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వేషన్లు తగ్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు... పొన్నాల, వీహెచ్ మాట్లాడుతూ బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎవరికీ రిజర్వేషన్లు తగ్గించకుండా బీసీల మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు కాయడానికే బీసీలుండాలని కేసీఆర్ భావిస్తున్నారా.. అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల ముట్టడికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ మద్దతు ప్రకటించారని తెలిపారు. జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక ప్రధాని నరేంద్రమోదీని కలసి 16 డిమాండ్లు అడిగినప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. దీనిపై కనీసం చర్చకు రాకపోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు. శనివారం జరిగే రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి యథా తథంగా ఉంటుందన్నారు. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం పెంచేదిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాండురంగాచారి, టీజేపీ నేత ప్రకాశ్, బీసీ నేతలు ఎస్. దుర్గయ్య, తాటికొండ విక్రంగౌడ్, గొడుగు మహేశ్, కొటికే రాము, కొప్పుల చందు, లక్ష్మణ్, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
మూడ్రోజుల్లో ఆసరా అర్హుల జాబితా
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకంలో మార్పులకు తగినట్లుగా వెంటనే చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 19న ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా గ్రామాలవారీగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు ఉన్నవారి వివరాలను మూడ్రోజుల్లో ఈ–సేవ కమి షనర్కు పంపాలని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు,పంచాయతీ ఎన్నికలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రైల్వేల భూ సేకరణ, అటవీ భూముల సర్వేల అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, పీసీసీఎఫ్ పి.కె.ఝా, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, సీసీఎల్ఏ డైరెక్టర్ వాకాటి కరుణ, సెర్ప్ సీఈవో పౌసమిబసు, ఈ–సేవ కమిషనర్ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. జోషి మాట్లాడుతూ, ‘57 ఏళ్లు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుంచి ఆసరా పింఛన్ల మంజూరుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అర్హుల జాబితాను కలెక్టర్లు సిద్ధం చేయాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన ప్రతి అభ్యర్థికి మార్కులు, ర్యాంకు, కేటగిరీలు ప్రకటించాలి. జాతీయ రహదారులు, రైల్వేలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి’ అని చెప్పారు. -
ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా ఆసరా పెన్షన్ అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. గ్రామాల్లో వార్షిక ఆదాయం లక్ష యాభై వేలు, పట్టణాలలో రెండు లక్షల ఆదాయ పరిమితి పెన్షన్కు అర్హతగా నిర్ణయించారు. మూడు ఎకరాల తడి, 7.5 ఎకరాల మెట్ట భూములు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికే అర్హత ఉంటుందని తెలిపారు. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు జారీ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016లకు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుండి రూ.3,016లకు పెంచే విషయంపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పెన్షన్ల గుర్తింపునకు నవంబర్ 2018లో ప్రచురించిన ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో 57 నుండి 64 వరకు వయసు ఉన్న వారి వివరాలు తీసుకొని ఎస్కేఎఫ్ డేటాలో సరిచూసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ లిస్టులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీలకు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లకు ధ్రువీకరణకోసం అందిస్తారని తెలిపారు. అర్హులైన వారి లిస్టులో సంబంధిత లబ్ధిదారుని యూఐడీ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫొటోసహా సేకరించి, గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లు పరిపాలన అనుమతి నిమిత్తం జిల్లా కలెక్టర్లకు అందచేస్తారన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకొన్న తదుపరి అర్హుల జాబితాను సంబంధిత వెబ్సైట్లో ఉంచుతారని సీఎస్ తెలిపారు. -
సీషెల్స్కు రాష్ట్ర ఉద్యాన శాఖ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యాన శాఖ టెక్నా లజీని సీషెల్స్ దేశం అందిపుచ్చుకోనుంది. అధునాతన సాంకేతికతతో పాలీహౌస్లు నిర్మించి కూరగాయలు, పండ్ల తోటలు, పూలసాగును తమ దేశంలో చేపట్టేందుకు సహకరించాలని ఆ దేశ వ్యవసాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అనుమతించారు. త్వరలోనే ఆ దేశ వ్యవసాయాధికారులు ఎనిమిది మంది రాష్ట్రంలో పర్యటించి పాలీహౌస్లు, పండ్ల తోటలు, ఇతర టెక్నాలజీపై శిక్షణ తీసుకోనున్నారు. సీషెల్లో 4 పాలీహౌస్ల నిర్మాణం చేపట్టి, వాటి పనితీరును కూడా వివరించాలని చేసిన విజ్ఞప్తి పై కూడా ఉద్యానశాఖ సంచాలకులు ఎల్.వెంకట్రామ్రెడ్డి కస రత్తు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల పనితీరు, పంటల సాగుపై అధ్యయనం చేయడానికి సీషెల్స్ వ్యవసాయశాఖ బృందం ఇటీవల మన దేశ పర్యటనకు వచ్చింది. రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జీడిమెట్లలో నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని సందర్శించింది. -
అందరి చిరునవ్వే లక్ష్యంగా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజలందరి మొహాల్లో చిరునవ్వు చిందించడమే లక్ష్యంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశంలోనే సర్వమతాలు, వర్గాల సమాహారంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ ఆర్థికంగా ప్రగతి సాధిస్తోందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ భగవంతుడి దయ వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. నాలుగున్నరేళ్లలో చక్కని శాంతియుత వాతావరణం, అద్భుతమైన మతసామరస్యం, అభివృద్ధిపరంగా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. క్రిస్మస్, రంజాన్ వేడుకలను రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. త్వరలో క్రైస్తవ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాజకీయ అడ్డంకులు, కోర్టు పిటిషన్లతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం ఆలస్యమైందని, త్వరలో దానిని పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. విద్య ద్వారా మంచి ఫలితాలు రాబట్టేందుకే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం మైనారిటీ గురుకులాలు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయని, పదేళ్ల తర్వాత మరింత అద్భుత ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ వృద్ధి 29.97 శాతం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రెవెన్యూ వృద్ధి 29.97 శాతం ఉందని కేసీఆర్ వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత రెవెన్యూ వృద్ధి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో ఇసుక అమ్మకాల ద్వారా రూ.9.56 కోట్ల ఆదాయం సమకూరితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాలుగేళ్లలో రూ.2,057 కోట్ల ఆదాయం సాధించగలిగామన్నారు. కఠినమైన క్రమశిక్షణ, అవినీతి రహితంగా, అధికారులు అద్భుతంగా పనిచేస్తేనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. సుస్థిరమైన బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, పలువురు క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన క్రైస్తవులను నగదు పురస్కారాలతో సన్మానించారు. అనంతరం క్రైస్తవ సొదరులకు విందు ఇచ్చారు. -
పరిశోధనల్లో సృజనాత్మకత అవసరం
హైదరాబాద్: పరిశోధనల్లో కొత్తదనం, సృజనాత్మకత అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ), ఓయూ కామర్స్ విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘అఖిల భారత 71వ కామర్స్ సదస్సు’ప్రారంభమైంది. క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం అధ్యక్షతన ప్రారంభమైన ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎస్ ఎస్కే జోషి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధనల్లో కొత్తదనంతో పాటు సృజనాత్మకత అవసరమని, అప్పుడే విజయం సాధించగలమని అన్నారు. మారుతోన్న మార్కెట్ అవసరాలకు అనుకూలంగా పరిశోధనలు ఉండాలని ఆయన సూచించారు. పరిశోధనల వల్ల కనుగొన్న కొత్త అంశాలు, తయారు చేసే వస్తువులు అధిక సంఖ్యలో వినియోగంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఐసీఏ అధ్యక్షుడు సుభాష్ గార్గె మాట్లాడుతూ.. కామర్స్, ఎంబీఏ పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులలో పరిశోధనాతత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అతిథులంతా కలిసి సదస్సు సావనీరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే మిశ్రా, డెలాయిట్ అధికారి రమేశ్, సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. -
బీబీనగర్లో ఎయిమ్స్కు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి/ న్యూఢిల్లీ: బీబీనగర్ ఎయిమ్స్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో బీబీనగర్లో ఎయిమ్స్ను 45 నెలల్లో నెలకొల్పేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బీబీనగర్ ఎయిమ్స్తో పాటు, తమిళనాడులోని మధురైలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బీబీనగర్లోని ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అవసరమైన నిధులను ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద సమకూర్చుతారు. 2019–20 విద్యా సంవత్సరంలోనే బీబీనగర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహించేలా ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా అద్దె భవనాలు, ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాల్లో ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. బీబీనగర్ ఎయిమ్స్లో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ సీట్లు వస్తాయి. దీంతోపాటు 750 పడకలతో ఎయిమ్స్ ఆసుపత్రి నెలకొల్పుతారు. రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎయిమ్స్లో ఏర్పాటు చేసే 750 పడకల్లో ఎమర్జెన్సీ లేదా ట్రామా బెడ్స్, ఆయుష్ బెడ్స్, ప్రైవేటు పడకలు, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉంటాయి. మెడికల్ కాలేజీ, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి బస, గెస్ట్హౌస్, హాస్టళ్లు, రెసిడెన్షియల్ సదుపాయం ఉంటాయి. 3 వేల మంది సిబ్బంది.. బీబీనగర్ ఎయిమ్స్లో అనేక రకాల స్పెషలిస్టు వైద్యులుంటారు. నిపుణులైన వైద్య సిబ్బంది ఉంటుంది. కేంద్రం పేర్కొన్న ప్రకారం 3 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఉంటారు. ఎయిమ్స్కు అవసరమైన భవనాలు, స్థలం అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే అక్కడున్న నిమ్స్ భవనాలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్కు సీఎస్ ఎస్కే జోషి గతంలో లేఖ రాశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలు ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. బీబీనగర్లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. ఒక అంచనా ప్రకారం వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి అక్కడ ఎంబీబీఎస్ తరగతులతో ఎయిమ్స్ ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా, ఎయిమ్స్కు కేంద్రం ఆమోదం తెలపడంపై వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు బి.వినోద్కుమార్, బూర నరసయ్యగౌడ్, బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రారంభమైన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) 9వ ప్రాపర్టీ షో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో 2008–14 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొందని.. కానీ, గత నాలుగేళ్లుగా ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో రియల్టీ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయని గుర్తు చేశారు. నగరానికి ఐటీ, ఇతర రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు రావటం, ఉన్న కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపట్టడంతో ఆఫీసు స్పేస్కే కాకుండా గృహాలకు కూడా డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ బీఈ పాపారావు, ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ రావు, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి కే, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ సాయి ఎం, సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు కూడా.. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఇందులో నగరానికి చెందిన వందకు పైగా నిర్మాణ సంస్థలు 145 స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్లను, వెంచర్లను ప్రదర్శించాయి. ఈ షోలో 11 బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటరీయర్ కంపెనీలు ఆయా ఉత్పత్తుల, ఆఫర్లను ప్రదర్శించాయి. ట్రెడా 9వ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్, అపర్ణా, మై హోమ్, గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, హోల్మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. రెయిన్బో విస్టాస్కు ఐజీబీసీ అవార్డు సాక్షి, హైదరాబాద్: సైబర్సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నిర్మిస్తున్న రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ ప్రాజెక్ట్ను ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ అవార్డు వరించింది. హెచ్ఐసీసీలో జరుగుతున్న ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2018లో ఈ అవార్డును కంపెనీ ఎండీ వేణు వినోద్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ హైదరాబాద్ ప్రెసిడెంట్ సీ శేఖర్ రెడ్డి, వరల్డ్ జీబీసీ మాజీ చైర్మన్ టై లీ, ఏపీ–రెరా చైర్మన్ రామనాథన్, టీ–రెరా చైర్మన్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. రెయిన్బో విస్టాస్ మూసాపేట్లో 45 లక్షల చ.అ.ల్లో 2,500 గృహాలతో ఉంటుంది. -
‘అహోబిలం’ ప్రాజెక్టును నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాలను వాడుకుంటూ ఏపీ చేపట్టిన పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎస్కే జోషి కేంద్ర జలవనరుల శాఖను కోరారు. దిగువనున్న తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాన్ని ఆపేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్కు లేఖ రాశారు. రాష్ట్రంలోని రాజోలిబండ మళ్లింపు పథకం పూర్తిగా తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉందన్నారు. ఇక కృష్ణా ప్రవాహాలకు తుంగభద్ర ప్రధాన నీటి వనరని , కృష్ణా జలాలపై రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుంటూ ఏపీ అనంతపురం నీటి అవసరాల కోసం పెన్నా అహోబిలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని, దీనివల్ల దిగువనున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇదే విషయమై మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నీటి పారుదల మంత్రి హరీశ్రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ముగ్గురు ఐఏఎస్ల పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులు బుధవారం పదవీ విరమణ చేస్తున్నారు. వీరి స్థానాల్లో ఇతర అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.శివశంకర్, దేవాదాయశాఖ కమిషనర్గా, కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివశంకర్ రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్.వి. చంద్రవదన్ పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో సెలవులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే డిసెంబర్ 7న, కౌంటింగ్ నిర్వహించే డిసెంబర్ 11న సెలవులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ ఎస్.కె.జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ సెలవులను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అవసరమైన మేరకు ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. కార్మికులు పనిచేసే అన్ని సంస్థలు పోలింగ్ రోజున కచ్చితంగా సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. -
ఎయిమ్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్కు లేఖ రాశారు. అలాగే నిమ్స్ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఎయిమ్స్ కోసమే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఎయిమ్స్ కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రులను కలసి వినతిపత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఉద్యాన– పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో తెలంగాణ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అర్బన్ఫార్మింగ్ అండ్ వర్టికల్ గార్డెనింగ్ మొదటి రాష్ట్రస్థాయి వర్క్షాప్లో ప్రభుత్వ సీఎస్ ఎస్కేజోషి, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కూరగాయల డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేదన్నారు. దీన్ని చేరుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో కిచెన్గార్డెన్, వర్టికల్గార్డెన్ అర్బన్ఫార్మింగ్, ఇంటితోటల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో పండించిన కూరగాయల్ని కొని తినే బదులు, ఇంట్లో పండించిన కూరగాయలు మేలన్నారు. ఆహార సమస్యల కారణంగా తలెత్తే వ్యాధులను ఇంటిపంటలతో అరికట్టవచ్చని సూచించారు. సీఎస్ ఎస్కే.జోషి మాట్లాడుతూ..గతంలో తాను వ్యవసాయశాఖలో పనిచేసినపు డు అనేక సదస్సులు నిర్వహించామని, కానీ రైతుల నుంచి ఇంతటి ఆదరణ ఎప్పుడూ చూడలేదన్నారు. సీఎస్ ఘెరావ్..ఉద్రిక్తత: సమావేశం ముగిసిన అనంతరం ఎస్కే జోషిని పాలీహౌస్ రైతులు చుట్టుముట్టి తమ బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పాలిహౌస్ల్లో వ్యవసాయం చేయాలని ఆశచూపి ఇప్పుడు రూ.80 లక్షల వరకు బకాయిలు ఎగ్గొట్టిందని ఆరోపించారు. నాలుగేళ్లుగా సచివాలయం, ఉద్యాన శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యానశాఖ డైరెక్టర్తోనూ రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్రామ్రెడ్డి అసలు పాలీహౌస్ సాగును ఎవడు చేపట్టమన్నాడు? అంటూ మండిపడ్డారు. రైతులపై సీఎస్ అసహనం.. సీఎస్ కారుకి రైతులంతా అడ్డంగా వచ్చి కదలకపోవడంతో చాలాసేపు జోషి కారులోనే ఉండిపోయారు. దీంతో ఆయన అసహనానికి గురై వారిని మందలించారు. బిల్లులు చెల్లించేందుకు కృషిచేస్తానని సీఎస్ హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
చెరో వంద టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న రెండు వందల టీఎంసీల లభ్యత జలాల్లో ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని కృష్ణాబోర్డు సమక్షంలో నిర్ణయించాయి. చెరో వంద టీఎంసీల నీటిని వచ్చే జూన్ వరకు తాగు, సాగు అవసరాలకు వాడుకోవాలనే అంగీకారానికి వచ్చాయి. మంగళవారం కృష్ణా జలాల నీటి వినియోగం, భవిష్యత్తు అవసరాలు, పంపిణీ తదితరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు జలసౌధలో భేటీ అయింది. బోర్డు చైర్మన్ ఆర్కే జైన్ అధ్యక్షతన జరిగిన భేటీకి సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు,తెలంగాణ సీఎస్ ఎస్కే జోషితో , ఈఎన్సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, ఖగేందర్, డీసీఈ నరహరిబాబుతో పాటు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగంపై చర్చించారు. మొత్తంగా బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాలు కలిపి 344,89 టీఎంసీలు వినియోగించుకోగా, ఏపీ 256.07 టీఎంసీ, తెలంగాణ 88.82 టీఎంసీలు వినియోగించుకుంది. నిజానికి ఏపీ, తెలంగాణ 66:34నిష్పత్తిలో నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నా, 74.24:25.76నిష్పత్తిలో వాడుకున్నారు. ఏపీ అధికంగా వాడినట్లు బోర్డు భేటీలో తేల్చారు. ఈ దృష్ట్యా ప్రస్తుతం లభ్యతగా ఉన్న 199.39 టీఎంసీల్లో దాన్ని సర్దుబాటు చేస్తూ నీటిని పంచుకోవడానికి బోర్డు ఓకే చెప్పింది. ఈ నీటిని ఏ ప్రాజెక్టు కింద ఎంతెంత వాడుకోవాలన్న దానిపై త్రిసభ్య కమిటీ నిర్ణయించాలని సూచించడంతో ఆ కమిటీ సైతం భేటీయై చర్చించింది. వచ్చే జూన్ నాటికి 27చోట్ల టెలిమెట్రీ.. ఇక టెలిమెట్రీ అంశాలపైనా బోర్డు భేటీలో చర్చించారు. తొలి దశ టెలిమెట్రీలపై రెండేళ్ల కిందటే నిర్ణయం జరిగినా, ఇంతవరకు వాటిని అమల్లోకి తేకపోవడంపై తెలంగాణ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఈ ప్రక్రియను వేగిరపరచాలంది. దీనికి ఏపీ సైతం అంగీకరించింది. మొదటి, రెండో దశ టెలిమెట్రీలు కలిపి మొత్తం 27చోట్ల వచ్చే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ భేటీ అనంతరం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం నేతృత్వంలో త్రిసభ్య కమిటీ భేటీయై ఇరు రాష్ట్రాల అవసరాలపై చర్చించింది. విద్యుదుత్పత్తి ఆపాలన్న ఏపీ భేటీ సమయంలో శ్రీశైలంలో 885 అడుగుల మట్టాలకు గానూ, 855.20 అడుగులకు నీటి నిల్వలు పడిపోయాయని, ఈ దృష్ట్యా తమ ప్రాంతంలో తాగునీటి అవసరాలు, హంద్రీనీవా అవసరాలు దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ద్వారా విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ కోరింది. 847 అడుగుల మట్టం దాటితే హంద్రీనీవా నుంచి నీటి విడుదల కష్టమవుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ సీఎస్ జోషి అభ్యంతరం తెలిపారు. తిత్లీ తుపాను వల్ల రాష్ట్రానికి కరెంట్ను తెచ్చే కారిడార్ దెబ్బతిందనీ, దీంతో విద్యుత్ కొరత లేకుండా శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తోందని వివరించారు. అవసరం ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తామని, లేకుంటే నిలిపివేస్తామంది.అయితే హంద్రీనీవా కింద వాస్తవ అవసరాలు ఏమిటో చెబితే విద్యుదుత్పత్తిపై అంచనాకు వద్దామని బోర్డు సూచించింది. -
విత్తన సదస్సును విజయవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన సదస్సు–2019కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో విత్తన సదస్సు లోగో, కరదీపికలను ఆవిష్కరించారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు ఈ సదస్సు జరగనుంది. 94 ఏళ్ల సదస్సు చరిత్రలో ఆసియా ఖండంలో ఇలాంటి సదస్సు జరగడం ఇదే తొలిసారని, దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ఇలాంటి గొప్ప అవకాశం రాష్ట్రానికి రావడం సంతోషకరమని, అధికారులు సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సదస్సుకు 83 దేశాల నుంచి విత్తన పరిశోధన, ఉత్పత్తి, నాణ్యత మొదలగు రంగాలకు చెందిన 800 మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకులు కేశవులు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ కార్బెర్రి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, వ్యవసాయ వర్సిటీల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
విమానయానాన్ని మరింత చేరువ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైమానిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో మరింత మందికి విమానయానాన్ని చేరువ చేస్తామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కలసి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌబే మాట్లాడుతూ. అత్యంత ఆధునిక సదుపాయాలతో కేవలం 6 నెలల సమయంలో ఇంటరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ను జీఎంఆర్ సంస్థ నిర్మించడాన్ని ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో ఆధార్ తరహాలో డిజియాత్ర సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తనిఖీలు లేకుండా ఫేస్ రికగ్నైజేషన్తో నేరుగా విమానం ఎక్కవచ్చని చెప్పారు. సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ.. ఎయిర్పోర్టును అనుసంధానం చేసేలా ఎక్స్ప్రెస్ హైవేలు, ఓఆర్ఆర్లకు తోడుగా త్వరలోనే మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. ఏటా పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ టెర్మినల్ను అందుబాటులోకి తీసుకొచ్చామనిఅన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) సీఈవో ఎస్టీకే కిశోర్, హైదరాబాద్ కస్టమ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్కుమార్, ఐబీ జాయింట్ డైరెక్టర్ విజయ్కుమార్, జీఎంఆర్ ఎయిర్పోర్టుల బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించండి
సాక్షి, హైదరాబాద్: ఘనవ్యర్ధాల నిర్వహణకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలను, పట్టణాభివృద్ధి సంస్థలను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఘనవ్యర్థాల నిర్వహణ 2018 నిబంధనల అమలుపై సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనవ్యర్థాల నిర్వహణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ఆదేశాల మేరకు డంపింగ్ యార్డులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్నారు. నిర్ణీత కాల వ్యవధి ప్రణాళికలు ఉండాలని, జిల్లాల్లో అవసరమైన డంపింగ్ సైట్లను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 72 మున్సిపాలిటీలకు డీపీఆర్లు తయారుచేశామని, నూతనంగా ఏర్పడిన మరో 68 మున్సిపాలిటీల డీపీఆర్లు తయారు చేయాలని ఆదేశించారు. ఘనవ్యర్థాల నిర్వహణకు రూల్స్ 2016 అమలుకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశాల ప్రకారం గత నెల 28న చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పర్యవేక్షణ కమిటీ సమావేశం చైర్మన్ జ్యోతిమణి అధ్యక్షతన జరిగిందని, మన రాష్ట్రంలో ఘనవ్యర్థాల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించామని సీఎస్కు తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల అమలుకై స్వచ్ఛ ఆటోలు, ఈ–ఆటోలు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను చేపట్టినట్లు వివరించారు. పీసీబీ, మున్సిపల్ శాఖ సమన్వయంతో ఎన్జీటీ ఆదేశాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎస్కు చెప్పారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, సీడీఎంఏ టి.కె.శ్రీదేవి, ఈపీటీఆర్ఐ, డీజీ కల్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. -
ఎన్నికలకు పోలీస్ శాఖ రెడీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పోలీస్శాఖ ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది. బందోబస్తు, అందుకు తగిన కార్యాచరణ, బలగాల పరిస్థితి, సిబ్బంది తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సందర్భంలో తీసుకున్న చర్యలు, చేపట్టిన బందో బస్తు వివరాలు, మానిటరింగ్, తదితరాలపై నివేదిక రూపొందించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి తో డీజీపీ మహేందర్రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సీఎస్కు వివరించినట్టు తెలిసింది. బెటాలియన్లు, ఆర్మ్డ్ రిజర్వ్లకు... రాష్ట్రంలో 13 స్పెషల్ పోలీస్ బెటాలియన్లున్నాయి. ప్రతి బెటాలియన్లో వెయ్యిమంది సాయుధ సిబ్బంది ఉండాలి. కానీ, ఖాళీల కారణంగా ప్రతి బెటాలియన్లో 600 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఎన్నికల బందోబస్తుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని మౌఖికంగా బెటాలియన్ విభాగానికి పోలీస్శాఖ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం బెటాలియన్ల నుంచి 7 వేల నుంచి 8 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. ప్రతి జిల్లాలో ఆర్మ్డ్ హెడ్క్వార్టర్లలో 80 నుంచి 100 మంది, కమిషనరేట్లలో 250 నుంచి 300 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. సుమారు 3,500 మంది, బెటాలియన్లు, ఆర్మ్డ్ ఫోర్స్ కలిపి 12 వేల మంది, రాష్ట్రంలోని సివిల్ పోలీసులు సుమారు 40 వేల మంది సిబ్బంది ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు. మొత్తం 60 వేల మంది సిబ్బందితో పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. రంగంలోకి పారామిలటరీ... ఎన్నికలకు పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇప్పుడు 150 కంపెనీల బలగాలను ఎన్నికలవేళ బందోబస్తు కోసం కేటాయించాలని ఎన్నికల కమిషన్ ద్వారా పోలీస్ శాఖ కోరనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో కంపెనీలో 125 నుంచి 128 మంది సిబ్బంది ఉంటారు. హోంగార్డులు సైతం... రాష్ట్ర పోలీస్ సిబ్బంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతోపాటు రాష్ట్రంలో ఉన్న 24 వేల మంది హోంగా ర్డులను ఎన్నికల విధుల్లో నియమించేలా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 90 వేల నుంచి లక్ష మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల బందోబస్తులో నియ మించే అవకాశమున్నట్టు తెలిసింది. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల కోసం బలగాల మోహరింపు తదితరాలపై త్వరలోనే ఎన్నికల కమిషన్తో పోలీస్ శాఖ భేటీ కాబో తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సిబ్బందిని మోహరించాలి, సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలెన్ని? వాటిని ఎలా నియంత్రించాలన్న అంశాలపై చర్చించే అవకాశముంది. -
కొత్త జోన్లకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టుల వర్గీకరణకు కసరత్తు ప్రారంభమైంది. కొత్త జోనల్ వ్యవస్థ అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈనెల 3న సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కేటగిరీలవారీగా పోస్టులు, ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలతో హాజరు కావాలని సాధారణ పరిపాలన శాఖ కోరింది. ఉమ్మడి ఏపీలో ఆరు జోన్లుండగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 4, తెలంగాణకు 2 జోన్లు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెంచారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని రూపొందించింది. రాష్ట్రపతి గత ఆగస్టు 29న ఈ ప్రతిపాదనలను ఆమోదించిన విషయం తెలిసిందే. దీనినే ‘ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్, 2018’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. 36 నెలల్లోపు ఈ కొత్త జోనల్ వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు, పోస్టుల వివరాలు సేకరించేందుకు ఆరు రకాల నమూనా దరఖాస్తులను రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ అధికారిక వెబ్సైట్లో శాఖల వారీగా ఉద్యోగులు, పోస్టుల వివరాలను అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.