కాంగ్రెస్‌ నేతలకు బీజేడీ తీర్థం | Congress Leaders Join In BJD | Sakshi

కాంగ్రెస్‌ నేతలకు బీజేడీ తీర్థం

Jun 14 2018 4:55 AM | Updated on Mar 18 2019 8:51 PM

Congress Leaders Join In BJD - Sakshi

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు పూలమాలను వేస్తున్న బీజేడీలో చేరిన కాంగ్రెస్‌ నేతలు

పర్లాకిమిడి : భువనేశ్వర్‌లోని నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో జరిగిన ‘మిశ్రణ పర్వ్‌’ కార్యక్రమంలో భాగంగా గజపతి జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, సర్పంచ్‌లు, సమితి సభ్యులు, వార్డు మెంబర్లు ముఖ్యమంత్రి సమక్షంలో బీజేడీ పార్టీలో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గజపతి జిల్లాలోని కాశీనగర్, గుసాని సమితులకు చెందిన కాంగ్రెస్‌ నేతలు బీజేడీలో చేరుతున్నారని తెలిపారు.

దీంతో పర్లాకిమిడి నియోజకవర్గంలో బీజేడీ పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. మిశ్రణ పర్వ్‌లో జిల్లా బీజేడీ పరిశీలకుడు గోపాల్‌పూర్‌ ఎమ్మెల్మే డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రాహి, బరంపురం ఎంపీ సిద్ధాంత మహాపాత్రో, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర సాహు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement