కేంద్రమాజీ మంత్రికి తుపాకీతో గురిపెట్టాడు! | Cop Pointed Rifle At Kamal Nath In MP | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 16 2017 9:34 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Cop Pointed Rifle At Kamal Nath In MP - Sakshi

ఛిన్‌ద్వారా: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్‌కు ఓ కానిస్టేబుల్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను గురిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో  కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన అంగరక్షకులు కానిస్టేబుల్‌ అడ్డుకొని పక్కకు తోసేశారు.

కమల్‌నాథ్‌ ఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా.. పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టి.. అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అంగరక్షకులు కానిస్టేబుల్‌ను అడ్డుకొని.. పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో కానిస్టేబుల్‌ పవార్‌ను సస్పెండ్‌చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్‌ సోనీ వెల్లడించారు. కమల్‌నాథ్‌ ఛిన్‌ద్వారా లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈ ఘటన కమల్‌నాథ్‌ దృష్టికి రాలేదు. ఆయన యథావిధిగా ఢిల్లీకి బయలుదేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement