
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్కోసం రైతులు ధర్నాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా రైతుబంధు, రైతు బీమా పథకాలు తెచ్చామన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్కు పాలసీ ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయాలలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అది చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని హరీశ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment