నేటి నుంచి కాంగ్రెస్‌ ‘సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’ | Rahul Gandhi to launch Save the Constitution drive today | Sakshi

నేటి నుంచి కాంగ్రెస్‌ ‘సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’

Published Mon, Apr 23 2018 4:23 AM | Last Updated on Mon, Apr 23 2018 4:23 AM

Rahul Gandhi to launch Save the Constitution drive today - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగంతోపాటు దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ సోమవారం నుంచి కాంగ్రెస్‌ ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ (సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వరకు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు.

2019 ఎన్నికల్లో దళితులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా పార్టీ చేపట్టే ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ , ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సుశీల్‌ కుమార్‌ షిండే తదితరులు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ దళిత నేతలు వివిధ స్థాయిల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుత బీజేపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, ప్రజాభిప్రాయాన్ని కూడగడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement