చంద్రగిరిలో రీపోలింగ్‌పై టీడీపీ ఆందోళన | TDP protest against repolling in chandragiri constituency | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో రీపోలింగ్‌పై టీడీపీ ఆందోళన

Published Thu, May 16 2019 11:46 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

TDP protest against repolling in chandragiri constituency - Sakshi

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది.

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. టీడీపీ శ్రేణులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దకు  చేరుకుని ధర్నాకు దిగారు. రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. 

కాగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి (పోలింగ్‌ స్టేషన్‌ 321), పుల్లివర్తిపల్లి (104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం (313) పోలింగ్‌ స్టేషన్లలో పార్లమెంట్‌, శాసనసభలకు ఈ నెల 19న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ అయిదు బూత్‌ల్లోకి ఇతరులను లోనికి రానీకుండా రిగ్గింగ్‌ చేశారంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: (చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement