Chevireddy Bhaskar Reddy
-
న్యాయం నా వైపే ఉంది.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.అసలు జరిగింది ఇదే..కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
అదంతా అబద్ధం.. ఓర్వలేకే ఎల్లో మీడియా దుష్ప్రచారం: చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభూత కల్పనలు సృష్టించి ప్రజలు తప్పుడు సంకేతాలు పంపేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జగన్ ఆఫీస్పై దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.‘‘తమ సమస్యలు చెప్పుకోవడానికే జగన్ వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాబు దుష్టపాలనను జగన్కు వివరిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట జనం నడుస్తున్నారనే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి వైఎస్ జగన్ను తొలగించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు సాధ్యం కాదు’’ అని చెవిరెడ్డి చెప్పారు.ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి: సాంబశివారెడ్డిఇది చేతకాని ప్రభుత్వం.. చేతగానితనాన్ని ప్రజలు జగన్కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్కి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్ను కలిసేందుకు వచ్చారు. జగన్ ఓపికగా నిలబడే ఉదయం నుంచి వారి సమస్యలు వింటున్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి’’ అని సాంబశివారెడ్డి హెచ్చరించారు.చౌక బారు రాజకీయాలు మానుకోవాలి: సతీష్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో ఆయన పలకరింపు కోసం జనం బారులు తీరారు. సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు. పులివెందుల కార్యాలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఎల్లో మీడియా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తోంది. పులివెందుల నుంచి తాతి రెడ్డి పల్లెకు 25 కిలోమీటర్లు మాత్రమే. దారి పొడవునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి 7గంటల సమయం పట్టింది. జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డారు. చిన్న ఇష్యూను దాడి అంటూ ఎల్లో మీడియా స్క్రోలింగ్లు వేయడం విడ్డూరం. చౌక బారు రాజకీయాలు మానుకోవాలి’’ అని సతీష్కుమార్రెడ్డి హితవు పలికారు. -
వైఎస్ జగన్ పేదల పక్షపాతి, సంక్షేమ సారథి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
సాక్షి, ప్రకాశం: ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ను సీఎం చేయడానికి కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ జగన్ను సీఎం చేసే వరకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి రవిబాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.మరోవైపు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షనా వైఎస్సార్సీపీ నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. హామీల అమలు చేయకపోతే పాకాల నుంచే పోరాటాలు ప్రారంభిస్తాం. కూటమి నాయకుల దౌర్జన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు. -
ఇది ప్రజా ప్రభుత్వం కాదు..‘ఈవీఎం’ల ప్రభుత్వం: చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని,ఈవీఎంల ప్రభుత్వమని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్ 9) ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీచేస్తానని,జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు.వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఇప్పటికే ఇంటికి యాభై వేలు వచ్చేవి: మాజీ మంత్రి కారుమూరిరాష్ట్రంలో ప్రజా కంటక పాలన జరుగుతుంది... ఎమ్మెల్యే లు ప్రజలలోకి రావడానికి భయపడుతున్నారుఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలనను మరచిపోయి కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారుఎన్ని కష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట నిలుపుకొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఎన్ని సార్లు అయినా మోసం చేసే ఏకైక సీఎం చంద్రబాబువైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ ఆరునెలల్లో ఇంటికి యాబైవేల రూపాయలు వచ్చేవినేను ఎప్పుడూ వైఎస్ జగన్ వెంబడే: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిఎంపిటిసి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాడిని కార్యకర్తల కష్టాలు తెలుసునాకు రాజకియ బిక్ష పెట్టింది దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డినేను నా కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ వెంబడేప్రజలను వంచించి అక్రమ కేసులు పెడుతున్న పార్టీ పై పోరాటం చేద్దాంఅతి తక్కువ మెజారిటితో గిద్దలూరు సీటును కోల్పోయాంవైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది -
ప్రభుత్వ కుతంత్రం బట్టబయలు
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందలాదిగా నమోదు చేస్తున్న అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు పన్నాగం ఏమిటన్నది కూడా స్పష్టమైంది. అక్రమ కేసులతో వేధింపులు.. అక్రమ నిర్బంధాలతో రోజుల తరబడి థర్డ్ డిగ్రీతో సృష్టిస్తున్న అరాచకం.. వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదాష్టీకం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందని నిగ్గు తేలుతోంది.సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. పోలీసులను పాత్రధారులుగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా సాగిస్తున్న అరాచక పర్వం గుట్టు ఆధారాలతో సహా రట్టు అయింది. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా అక్రమంగా పోక్సో కేసు పెట్టేంతగా బరితెగించిన పోలీసు వ్యవస్థ బండారం బయట పడింది. తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని పోలీసులే తప్పుడు ఫిర్యాదు రాసి అక్రమ కేసు నమోదు చేసేంతగా దిగజారారన్న నిజం విభ్రాంతి కలిగించింది. ఓ మాజీ శాసనసభ్యుడిపై అక్రమ కేసు నమోదు చేసేందుకే అంతటి కుతంత్రం పన్నిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు వత్తాసు పలికిన పోలీసు వ్యవస్థ తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ప్రకాశం జిల్లాలో మరో నిర్వాకం విశాఖపట్నానికి చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ను ప్రకాశం జిల్లా పోలీసులు నవంబరు 4న అక్రమంగా అదపులోకి తీసుకుని, దర్శి పోలీస్ స్టేషన్కు తరలించారు. నవంబరు 5న ఆయన సెల్ ఫోన్ను అన్లాక్ చేయించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారు. ఆయనపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఓ అసభ్యకర పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్టు ఎందుకు పెట్టావని ఆయన్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆ బాధితుడు ఎదురు తిరిగాడు. తన మొబైల్ ఫోన్ నవంబరు 5 నుంచి పోలీసుల జప్తులోనే ఉంటే.. తాను నవంబరు 11న ఎలా పోస్టు పెట్టగలనని ప్రశ్నించారు. ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే అతన్ని విశాఖపట్నం తరలించారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.చివరికి ఏదో పాత అంశాన్ని సాకుగా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించారు. కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసిన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు సూత్రధారులుగా.. రాష్ట్రంలోని పోలీసు అధికారులు పాత్రధారులుగా ఈ అక్రమ కేసుల కుతంత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారన్నది స్పష్టమైంది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తెల్ల కాగితాలపై సంతకాలతో కుట్రరెడ్బుక్ రాజకీయ కుట్రలను అమలు చేయడంలో తాము నాలుగాకులు ఎక్కువే చదివామంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. అందుకోసమే గతంలో చంద్రబాబు వద్ద భద్రతా అధికారిగా పని చేసిన పోలీసు అధికారిని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి డెప్యుటేషన్పై తెప్పించుకుని తిరుపతిలో కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసు వ్యవస్థ ప్రతిష్టనే పణంగా పెట్టేశారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికను కొందరు దుండగులు అపహరించుకుపోయి వేధించారు. దాంతో ఆ బాలిక తండ్రి ఆవేదనతో తమకు న్యాయం చేయాలని బోరుమన్నాడు. విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బాలిక తండ్రికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. ఉదాసీనతపై సర్వత్రా నిరసనటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. పోలీసు వ్యవస్థ చేతగానితనం, ప్రభుత్వ పెద్దల ఉదాసనీతపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో బాలికపై జరిగిన దాడిని వక్రీకరించి ఏకంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి వేధించాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను తిరుపతి జిల్లా పోలీసులు భుజానికెత్తుకున్నారు. బాధిత బాలికకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి, ఆమె తండ్రితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత తమ కుట్రను అమలు చేశారు. బాధిత బాలిక తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ఆ తెల్లకాగితాలపై పోలీసులు రాసేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతరులపై అక్రమ కేసు పెట్టి ఏకంగా పోక్సో చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, కేంద్ర ఐటీ చట్టంలతోపాటు ఏకంగా 11 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాస్త ఆలస్యంగా వాస్తవాన్ని గుర్తించిన బాధిత బాలిక తండ్రి పోలీసుల కుట్రను ఆదివారం బట్టబయలు చేశారు. తాను చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైగానీ, ఇతరులపైనా గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులే ఇదంతా చేశారని కుండబద్దలు కొట్టారు. దాంతో తిరుపతి జిల్లా పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
శ్రీపద్మావతి అమ్మవారికి కాలినడకన సారె సమర్పించిన చెవిరెడ్డి దంపతులు
-
నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్లి, న్యాయం కోసం నిలబడిన వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసు వెనుక ‘అసలు నిజం’ బయటపడింది. బాలిక తల్లిదండ్రులు రమణ, అరుణ ఆదివారం మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించారు. తాను ఎవ్వరిపైనా కేసు పెట్టలేదని బాలిక తండ్రి రమణ స్పష్టం చేశాడు.తాను చదువుకోలేదని.. మీడియా వాళ్లు తమ వద్దకు రాకుండా చూస్తామంటూ పోలీసులు తనతో సంతకం చేయించుకున్నారని వెల్లడించాడు. తీరా చూస్తే తమ కుటుంబానికి అండగా నిలిచి.. సాయం చేసిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైనే తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు పెట్టారని తెలుసుకొని షాక్కు గురయ్యానని చెప్పాడు. తాను పిలిస్తేనే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వచ్చారని.. అటువంటి వ్యక్తిపై తానెలా కేసు పెడతాను? అని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు.. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం యలమందకు చెందిన ఓ బాలికపై ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాలిక తండ్రి అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి యలమందకు వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కానీ చెవిరెడ్డితో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నేత నాగార్జునరెడ్డి, తదితరులపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఆశ్రయించారు. అసలు వాస్తవమేంటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నామని చెప్పడంతో.. బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు ఆదివారం తిరుపతిలో వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాలిక తండ్రి రమణ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.. మీడియా పేరు చెప్పి.. కాగితంపై పోలీసులు సంతకం చేయించుకున్నారు‘‘మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కేసు పెట్టాలని నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చెవిరెడ్డి ఒక్కరి మీదే కాదు.. అక్కడకు వచ్చిన వారెవ్వరి మీదా నేను ఫిర్యాదు చేయలేదు. నా బిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు ఆ కేసును తారుమారు చేస్తారన్న భయంతో.. నేనే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ఫోన్ చేసి రమ్మన్నాను. నేను పిలిస్తేనే ఆయన వచ్చారు. అలాంటి వ్యక్తి మీద నేను ఎందుకు కేసు పెడతా? నా బిడ్డకు ఏదో అన్యాయం జరిగిందని వచ్చిన వ్యక్తి మీద నేను కేసు పెట్టాననడం పాపం కదా! నేను ఎవ్వరి మీదా కేసు పెట్టలేదు. నాకేమో చదువురాదు.పోలీసులు నా దగ్గరకు వచ్చి.. ‘మీడియా వాళ్లు మీ పాప గురించి పదేపదే అడుగుతున్నారు.. వాళ్లు పోస్టులు పెట్టకుండా ఉండాలంటే ఈ కాగితంలో సంతకం పెట్టు’ అని నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని తెలిసి బాధపడ్డాం..బాలిక తల్లి అరుణ మాట్లాడుతూ.. ‘మా బిడ్డకు ధైర్యం చెప్పి మాకు అండగా నిలిచేందుకు వచ్చిన చెవిరెడ్డి మీద తప్పుడు కేసు పెట్టడం దారుణం. పోలీసులు ఇలా చేస్తారని మాకు తెలియదు. ఒక కాగితం మీద సంతకం పెట్టమని పోలీసులు అడిగితే.. నా భర్త సంతకం పెట్టారు. దానిని ఉపయోగించుకొని ఇదంతా చేశారని తెలిసి బాధపడ్డాం’ అని చెప్పారు.అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు..నా బిడ్డ విషయం చెప్పగానే చెవిరెడ్డి.. యల్లమందలోని ఆస్పత్రికి వచ్చారు. ఏం జరిగిందని నన్ను అడిగితే.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నా బిడ్డపై అఘాయిత్యం చేశారని చెప్పా. ఆయన ఆస్పత్రి లోపలకు వెళ్లి.. అక్కడ పోలీసులు పాపను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ‘లేడీ పోలీసు రావాలి కదా.. మీరెలా విచారిస్తారు’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత చెవిరెడ్డి బయటకు వచ్చేశారు. నేను అక్కడ మీడియా వాళ్లతో పాపకు జరిగిన అన్యాయం గురించి చెబుతా ఉంటే.. చెవిరెడ్డి నన్ను పిలిచి.. ‘పాప విషయం కదా.. భవిష్యత్లో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఒకసారి ఆలోచించుకో’ అని నాతో అన్నారు.ఏం కాదులే అన్నా.. ఇంతకన్నా ఏమవుతుందన్నాను. నా బిడ్డ శరీరం మీద రక్తగాయాలు చూసి నా మనస్సుకు బాధ కలిగి నేనే మీడియా వాళ్ల ముందుకు వెళ్లా. నా బిడ్డను ఇలా చేసిన వారిని ఉరితీయాలని, అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని చెప్పా. మా బిడ్డ గురించి చెవిరెడ్డి ఎక్కడ కూడా అత్యాచారం జరిగిందని చెప్పలేదు. మమ్మల్ని ఎక్కడా కించపరచలేదు. మా పరువుకు నష్టం కలిగించేలా ఏమీ చేయలేదు. పాపకు మెరుగైన వైద్యం కావాలంటే.. ఎక్కడకు తీసుకెళ్లినా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయనపై నేను కేసు పెట్టాననడం దారుణం’’ అని బాలిక తండ్రి రమణ వాపోయాడు.ప్రభుత్వం కుట్ర బయటపడింది: భూమనప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా పోలీసులను ఉపయోగిస్తూ.. వ్యక్తులి్న, వ్యవస్థలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. చెవిరెడ్డిపై పెట్టిన ‘పోక్సో’.. తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వం కుట్ర పూర్తిగా బయటపడిందన్నారు. అసలు బాధిత కుటుంబానికే తెలియకుండా కేసులు పెట్టారంటే.. ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి పోలీసులు ఇదంతా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సభ్యసమాజంలో ఎవరైనా ఇలాంటి దారుణాలకు ఒడిగడతారా? అని భూమన నిలదీశారు. ఎవరికైనా ఏదైనా జరిగితే పరామర్శకు వెళ్లకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారా? అని ప్రశి్నంచారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేసే పెట్టలేదు.. పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారు: బాధితురాలి తండ్రి
సాక్షి, తిరుపతి జిల్లా: యలమంద ఘటన బాలిక తండ్రి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎవరి మీద కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ కుమార్తెపై దాడి జరిగిందని మేమే స్వయంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పిలిచామని.. ఆయనపై కేసు పెట్టాలని పోలీసులకు తాను చెప్పలేదంటూ బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. నా బిడ్డకు సాయం చేయడానికి వచ్చినవారిపై ఎలా కేసు పెడతాను.? చిన్నారిపై దాడి చేసిన వారికి శిక్ష పడాలి కోరాను. నేను చదువుకోలేదు.. పోలీసులు చెప్పిన చోట సంతకం మాత్రమే చేశా’ అని బాలిక తండ్రి తెలిపారు. మా బిడ్డపై అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై నేను ఎలా కేసు పెడుతానంటూ బాలిక తండ్రి ప్రశ్నించారు.ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: భూమనరాష్ట్రంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో యలమంద ఘటన నిదర్శనం. ప్రతి పక్ష పార్టీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయబ్రాంతులకు గురి చేసే యత్నం చేస్తున్నారు బాధిత కుటుంబానికి రక్షణగా వెళ్లిన వారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనేది స్పష్టమైంది. బాధిత కుటుంబం పిలిస్తే వెళ్లిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారుటీడీపీ అనుకూల కిరణ్ పత్రికలో లైంగికదాడి జరిగిందని ప్రచురించారు, వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోక్సో, అట్రాసిటీ మరో 11 కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు తప్పు చేసిన వారిని విడిచి పెట్టి.. తప్పు చేయని వారిని శిక్షిస్తున్నారు. ఈ ఒక్క ఘటనతో రాష్ట్రానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు’’ అంటూ చంద్రబాబును భూమన కరుణాకర్రెడ్డి ప్రశ్నించారు.ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా తప్పుడు కేసులు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే ఆదుకున్నారు: బాధితురాలి తండ్రి మేము చెవిరెడ్డిపై ఎలాంటి పోక్సో, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టలేదని.. తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే మమ్మల్ని ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఆదుకున్నవారిపై మేము కేసు పెడితే మహాపాపం అని బాధితురాలి తండ్రి అన్నారు. -
ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి? ఈనాడు మీద కేసు పెట్టరా?: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. .. 21 రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అగతంకులు దాడి చేశారు. ఆ ఘటనలో ఏం జరిగిందో బాలిక తండ్రి మాట్లాడిన వీడియోల్ని మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అనంతరం, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం తనపై పోక్సోకేసు ఎందుకు నమోదు చేసింది. ఎర్రావారిపాలెం మండలంలో ఇద్దరు అగంతకుల దాడిలో తన కుమార్తె అపస్మారక స్థితిలో ఉందని ఓ తండ్రి స్థానిక వైఎస్సార్సీపీ నేత నాగార్జున రెడ్డి సాయంతో నాకు ఫోన్ చేస్తే వాళ్ల ఇంటికి వెళ్లా. ఆపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించా. ఆ ఘటన గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. ఎవరికి చెప్పలేదు... ఈ ఘటన జరిగి.. 22 రెండ్రోజుల తర్వాత సదరు బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ పోక్సో కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని ఈనాడు సహా టీడీపీ అనుకూల మీడియా వాళ్లు కథనాలు ఇచ్చారు. మరి వాటి మీద ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలి?. బాలిక తండ్రిని స్టేషన్లకు పిలిపించి పోలీసులు విచారించారు. ఆయనతో బలవంతంగా నాపై అక్రమ కేసులు పెట్టించారు. .. కూటమి ప్రభుత్వం ఎన్నిక అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వ పెద్దల నేతల కళ్లల్లో ఆనందం కోసం అధికారులు మాపై పెట్టిన కేసులు తాత్కాలికంగా ఇబ్బందులు గురిచేస్తాయి. వాటిపై న్యాయ స్థానంలో పోరాటం చేస్తాం. కానీ అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులు రిటైరైన అదే న్యాయ స్థానం ద్వారా తగిన చర్యలు తీసుకుంటాము’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. Also Read in English: Watch Video: Chevireddy Bhaskar Reddy: I Will Continue Fighting Even If I'm Jailed -
నన్ను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తా: చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం : తనని జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. కేసులకు భయపడి పారిపోను. 2014 నుండి 2019 వరకు 88 కేసులు పెట్టారు. ఏం చేశారు?. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను.. నేను ఎక్కడికి పారిపోను. నన్ను జైల్లో పెట్టిన పోరాటం కొనసాగిస్తా. నాపైకి పెట్టిన కేసుకు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయను. బిడ్డ ఆపదలో ఉందని తన తండ్రి ఫోన్ చేశారు. వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించా. బిడ్డ కుటుంబాన్ని కూటమి నేతలు పరామర్శించారా? అని ప్రశ్నించారు. నాపై కేసులు పెడితే.. కార్యకర్తలు భయభ్రాంతులకు గురవుతారు అని అనుకుంటున్నారు. కానీ అలాంటివేవి జరగవు’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్
-
పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు
సాక్షి, టాస్క్ఫోర్స్, సాక్షి, అమరావతి: ఎక్కడైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పోక్సో కేసులు పెడతారు! కానీ పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి!! తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. అధికార దుర్వినియోగం కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవచనాలు వల్లించిన సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనే లక్ష్యంగా సాగుతున్నట్లు ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.బాధిత కుటుంబానికి బాసటగా ఉండడం నేరమా?చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు. కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ‘అన్న వచ్చాడు.. న్యాయం జరుగుతుంది’ అంటూ అందరి ముందు బాలిక తండ్రి కూడా చెప్పాడు.కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడం.. పోలీసు అధికారులు రంగంలోకి దిగడంతో బాలిక తండ్రి మాట మార్చారు. ఆయనకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మరికొందరిపై దాదాపు 20 రోజుల తర్వాత పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డపై ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా జరిగినట్లు ప్రచారం చేశారని, వైద్యం అందకుండా ఆస్పత్రి వద్ద గందరగోళం సృష్టించారని అందులో పేర్కొన్నాడు. దీనిపై భాస్కర్రెడ్డి, నాగార్జునరెడ్డి మరికొందరిపై పోక్సో, అట్రాసిటీ చట్టాలు, మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మిగతా మీడియాలోనూ అదే వార్త..మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ, ఛానళ్లలోనూ ఈ ఘటన వార్తలు వచ్చాయి. అయితే కూటమి నేతలు బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులు, సాక్షి, సోషల్ మీడియాపై ఫిర్యాదు చేయించారు. తనకు అండగా నిలిచి సాయం చేసిన వారిపైనే ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని, అయినా రోజూ స్టేషన్కు పిలిచి వత్తిడి చేస్తుండడంతో తప్పలేదంటూ బాలిక తండ్రి మనోవేదనకు గురవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.పరామర్శిస్తే ఇన్ని కేసులా..? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల పరంపరకు చెవిరెడ్డిపై మోపిన ఈ కేసును పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రజల అశాంతికి భంగం కలిగించారని.. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఇలా.. ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం... బీఎన్ఎస్ సెక్షన్లు 352, 352(1), 196(1), 62(2), 353(1), 72(2) రెడ్ విత్ ఐటీ చట్టం 67ఏ, పోక్సో చట్టం 23(1), ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 3(1), జెడ్, జెడ్ సీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.రాష్ట్రంలో మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా ప్రేక్షకపాత్రే...రెడ్బుక్ పాలనతో ఒకవైపు అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి సర్కారు మరోవైపు మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న లైంగిక దాడులు, హత్యాచారాలపై ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అపహరించి హత్యాచారానికి పాల్పడి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయింది. పుంగనూరులో ఓ బాలికను అపహరిస్తే నాలుగురోజుల పాటు చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఓ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడితే కేసును కప్పిపుచ్చేందుకు యత్నించారు.పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్లో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తే మూడు రోజుల పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన 115 అత్యాచారాలు, లైంగిక దాడుల కేసుల్లో ప్రభుత్వం తక్షణం స్పందించలేదు. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అరెస్టుకైనా.. పోరాటానికైనా సిద్ధమే ⇒ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ⇒ దేవుడు, న్యాయం మా వైపే ఉన్నాయి ⇒ పరామర్శిస్తే పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసులేంటి? ⇒ తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెబితే వెళ్లి పరామర్శించా ⇒ మెరుగైన వైద్యం అందేలా సహకరించా.. ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదుసాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలిచినందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని, దాడికి గురైన ఆడబిడ్డను పరామర్శిస్తే తనపై పోక్సో కేసు పెట్టడం ఏమిటని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. తాను దేనికీ భయపడనని, అరెస్టుకు, పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దేవుడు, న్యాయం తమ వైపే ఉన్నాయని చెప్పారు. బాధితులకు అండగా నిలిచిన తన మీద పోక్సో, ఎస్సీ, ఎస్టీతోపాటు 11 సెక్షన్లతో కేసు పెట్టారని, ఇంత దారుణం ఎక్కడా ఉండదని అన్నారు. జగన్ వెంట నడుస్తున్న వారిని భయాందోళనలు గురి చేయాలని కూటమి నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.చెవిరెడ్డి మంగళవారం రాత్రి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కుమార్తెపై దారుణం జరిగిందని పాప తండ్రి ఫోన్ చేసి చెబితే అక్కడికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచానని చెప్పారు. బాలికపై దాడి చేసిన దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశాడన్నారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే తాను వెళ్లానని తెలిపారు. ఆ బాలికను తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించానన్నారు. 72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. బాధ్యతగా ఉండటాన్ని తప్పుగా సృష్టిస్తారా అని మండిపడ్డారు.ఆ బిడ్డ గురించి తాను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదని, అయినా తనపై తీవ్రవాదుల మీద పెట్టినట్టు కేసు పెట్టారని చెప్పారు. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా అని నిలదీశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎక్కడికీ వెళ్లనని, పారిపోనని, తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేయనని, ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పారు. పాప తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోతే తమ పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి ఆయన్ని తిరుపతి తీసుకువెళ్లి కూతురి దగ్గరకు చేర్చాడని తెలిపారు. అతని మీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారన్నారు.తాను ఎలాంటి ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేయనని, అరెస్టు చేసి శిక్షించాలంటే తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడైనా ఆ పాప గురించి మాట్లాడినట్లు ఆధారాలు, రికార్డు ఉంటే చూపించాలని, ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలను ఎవరు పరామర్శించినా పోక్సో కేసు పెడతామని ఈ చర్య ద్వారా బెదిరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తన మీద కేసు పెట్టి రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరినీ భయపెట్టాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో భాస్కర్రెడ్డితోపాటు పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి కూడా ఉన్నారు. -
తప్పుడు కేసులకు బెదరను: చెవిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందని.. ఒక బాధ్యతగా చేసిన పనిని తప్పుగా సృష్టిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసులు పెట్టో, బెదిరించో పరిపాలన చేయాలంటే సాధ్యం కాదన్నారు.‘‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. ప్రజల్లోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేను నూటికి నూరు శాతం ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే వెళ్లా.. ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి?’’ అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘నామీద 11 సెక్షన్లతో కేసు పెట్టారు. ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్ వెంట నడుస్తున్న వారికి భయాందోళన కల్పించాలని కుట్ర పన్నారు. బాలిక మీద దారుణం జరిగిందని ఆమె తండ్రే నాతో చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచా. ఆమెని తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించా....72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం నేను చేసిన తప్పా?. బాధ్యతగా ఉండటం తప్పుగా సృష్టిస్తారా?. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా?. బాధితురాలి తండ్రి అన్యాయం జరిగిందని చెప్తేనే నేను వెళ్లాను. నేను ఎక్కడకూ వెళ్లను, పారిపోను. నా ఫోన్ స్విచ్చాప్ చేయను. నేను అందుబాటులోనే ఉన్నా. ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే నేను వెళ్లాను..ఆ బిడ్డ గురించి నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. తీవ్రవాదుల మీద పెట్టినట్టు నామీద కేసు పెట్టారు. ఆ తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లారు. నాగార్జున రెడ్డి వ్యక్తి ఆ తండ్రిని తీసుకుని తిరుపతి వెళ్లాడు. కూతురి దగ్గరకు తండ్రిని చేర్చాడు. అతనిమీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారు. పరామర్శకు వెళ్తే పోక్సో కేసులు పెట్టవచ్చని చూపిస్తున్నారు. ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే’’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. -
Chevireddy Reddy: పవన్ పిఠాపురం ఎందుకెళ్లాడు ?
-
వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను ఓసారి గుర్తు తెచ్చుకోండి: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: సెకీతో ఒప్పందంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలినేని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదంటూ చెవిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం తిరుపతిలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘.. ఎమ్మెల్సీ పదవి కోసం బాలిరెడ్డి దిగజారిపోయారు. ఆరోపణలు మాని విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలి. బాలినేని సంతకంతోనే సెకి ఒప్పందం జరిగింది. కానీ, పార్టీ మెప్పు కోసమే బాలినేని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరినో మెప్పించడం కోసం బాలినేని నాయకుడిపై మాట్లాడుతున్నారు. .. వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను. వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతాం.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. ఒంగోలు లో మీకంటే(బాలినేని) నాకు ఎక్కువ ఓట్లు వేశారు ప్రజలు. ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు లో 52 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. ఒంగోలు ప్రజలుతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తాం. నేను విద్యార్ధి దశ నుంచి వైఎస్ కుటుంబంతో ఉన్నాను. గత 36 సంవత్సరాలగా వైఎస్సార్ కుటుంబంతోనే ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మరోజెండా పట్టుకోలేదు... వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను బాలినేని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు ఇతర పార్టీలు నేతలతో రష్యా కు వెళ్లారు. కూటమి నేతలు ఇతర పార్టీ నాయకులతో స్పెషల్ ఫ్లైట్ లో డిల్లి కు వెళ్తే చంద్రబాబు దిగే లోపే పదవి ఊడగొడతారు. అయినా కూడా మీరు జగన్ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా జగన్ భరించారు. ఇప్పుడు కూటమితో జతకట్టి జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. వాసన్నా.. మీకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుంది’’ అని చెవిరెడ్డి అన్నారు. -
రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం జిల్లా : విద్యుత్ కొనుగోలుకు ఒప్పందంపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకితో జరిగిన ఒప్పందంపై చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలినేని భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలి. సెకి ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగింది. గత టీడీపీ హయాంతో పోల్చుకుంటే 50 శాతం తక్కువే.రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు. ఎనర్జి కమిటీ ఫైల్పై బాలినేని సంతకం పెట్టలేదా?.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.బాబు అపాయింట్మెంట్ కోసమే బాలినేని ఇలా మాట్లాడుతున్నారేమో? బాలినేని మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. -
బాబు నిజస్వరూపం బయటపెట్టిన చెవిరెడ్డి
-
పోలీసులకు సవాల్..
-
విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మోహిత్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత ఏ-37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సెల్ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అంటే నేను తీసుకెళ్లలేదు. నా ఫోన్ను నా పీఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్లాను. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతాం. మేము బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతాం. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డిపై 52 రోజులు తర్వాత తప్పుడు కేసు పెట్టారు. మేము నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లం. నా పోరాటం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరు పరిచే ధైర్యం లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసులు చూసి వాళ్లకు ఖచ్చితంగా చివాట్లు పెడతారు.ఒక సెన్సేషనల్ కోసమే అదుపులోకి తీసుకున్నారు. 41 కింద నోటీసు ఇచ్చేందుకు తీసుకు వచ్చారు. మోహిత్ రెడ్డిపై ఏ రకంగా లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశ పెట్టండి. ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి వదిలి పెట్టారు. తిరుపతి నగరం మొత్తం దిగ్బంధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరింపు ఎందుకు?. 41 నోటీసులు ఇవ్వడానికా ఇంత రాద్దంతం చేస్తారా?. ఓటు వేసిన ప్రజల్ని వదిలేట్టే ప్రసక్తే లేదు. ప్రజలపై ఉన్న కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చూపిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి జరగలేదు అని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. 37 మంది దాడి చేస్తే నానిపై ఒక్కగాయం కూడా కాలేదు. ఈ దాడిలో ఉన్నాడని ఎలా కేసు పెడతారు. కావాలనే కక్ష్య పూరితంగా కేసులో ఇరికించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కిలారు రాజేష్ పేరుతో ఎమ్మెల్యే నాని దందాలు
తిరుపతి రూరల్ : చంద్రబాబు, లోకేశ్కి దగ్గరి వ్యక్తి అయిన కిలారు రాజేష్ పేరుతో తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. నాని చర్యలతో అధికారులు, వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని, ఇలా భయానక వాతావరణం సృష్టించడం చంద్రగిరికి మంచి సంస్కృతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాడ్ఫాదర్ లాంటి కిలారు రాజేష్ తన చెప్పుచేతల్లో ఉన్నాడని, ఎంత చెబితే అంత చేస్తాడంటూ నాని అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్తో ఆయన, రాజేష్ ఉన్న ఫొటోలు, వీడియోలను చూపుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారన్నారు. మామూళ్లు ఇవ్వలేదని ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కిషోర్కు చెందిన రైస్ మిల్లును మూయించాడని, వైఎస్సార్సీపీ సర్పంచ్కు చెందిన రూ.7 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసేందుకు ప్రయతి్నంచారని తెలిపారు. అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో రూ.250 కోట్ల విలువైన దేవదాయ శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. చిత్తూరు నుంచి వంద మంది రౌడీలను తీసుకువచ్చి ఎండోమెంట్ అధికారులను బట్టలు విప్పించి, గదిలో బంధించి, మోకాళ్లపై నిలబెట్టి మరీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిరి్మంచారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్ రమే‹Ùనాయుడు జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారన్నారు.రోజూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇంటికి పిలిపించుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రశి్నంచిన వారిపై చిత్తూరు నుంచి రప్పించిన రౌడీ మూకలకు ముసుగులు వేయించి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. నాని దందాలు, ఆక్రమణలపైనా విచారణ చేయించాలని అన్నారు. -
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
-
ఎమ్మెల్యే పులివర్తి నానికి చెవిరెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు.. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్తను కూడా వేధింపులకు గురిచేయలేదన్నారు.‘‘2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాం. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా.. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా... నేనెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. ‘‘నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా?. ‘టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య నాపై 88 కేసులు పెట్టారు. 7నెలలు జైల్లో పెట్టారు’’ అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా అపారా?. మీ 12 లారీలు ఏ రోజైన ఆపారా..?. కరెంట్ చార్జీలు బకాయిలు ఉన్నా.. మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా?. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చ గొడుతున్నావు.. మీకుటుంబం పైనా నేను ఆరోపణలు చేయడం నా సంస్కృతి కాదు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా?, అధికారులను బెదిరించ లేదా?. కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించలేదా? నేను ఓడిపోతే 4వ తేదీన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా?. చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువు రోడ్డు నెలరోజులకే వేశానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు‘‘ప్రజలు అధికారం మీకు ఇచ్చారు.. ప్రశ్నించడం మాకు ఇచ్చారు. మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నా, ఏరోజూ వెనక్కు తగ్గం.. నా కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టారు, నా కొడుకు ఏరోజు కేసులకు భయపడే వ్యక్తి కాదు. తుడా పరిధిలో అవినీతిపై మీరు విచారణ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా తుమ్మలగుంటలో 133 అడుగుల ఎత్తులో నిర్మాణం చేశాం. జాతీయ జెండా కూడా ఎగర నీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా?. తుడా అధికారులను బెదిరించలేదా?’’ అంటూ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నిలదీశారు. -
పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే
-
‘పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే’
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని అన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 50 రోజుల కాలంలో 34 మంది వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ముసుగులు వేసుకుని వచ్చి అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పులివర్తి నానిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన తన క్వారీని మూసివేసినట్టు చెబుతున్నాడు. సీఎం చంద్రబాబు దగ్గర నన్ను విలన్గా చూపించి పులివర్తి పదవులు పొందాలని చూస్తున్నాడు. నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాలిజపులివర్తి నాని నటన కారణంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇన్ని డ్రామాలు చేస్తుంటే పోలీసుల సంఘం ఏం చేస్తోంది. సస్పెండ్ అయిన అధికారులు జీతాలు లేక రోడ్లపైకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి నాని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. దేనికైనా పోరాటం చేసే వ్యక్తిని నేను. నాకు పోరాటాలు కొత్త కాదు. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు. ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయ్యండి. చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి. అన్యాయంగా అధర్మంగా పని చేయడానికి వచ్చే అధికారులను వదిలిపెట్టను. ఇకపై పూర్తి సమయం కేడర్తోనే ఉంటాను’ అని చెప్పారు. -
ఎంతవరకైనా సిద్ధం..
-
కార్యకర్తలకు అండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్చైర్లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు. -
చంద్రగిరిలో చిత్తూరు రౌడీయిజం
సాక్షి, తిరుపతి: ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని పక్కా ప్లాన్తో విధ్వంసాలు సృష్టించారు.అల్లర్లు సృష్టించి..అసత్యాలకు పదును పెట్టి ఎన్నికల్లో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించేందుకు కూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే విధ్వంసాలకు పథక రచన చేశారు. అందులో భాగంగానే నామినేషన్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వాహనంపై దాడికి తెగబడ్డారు. ఆపై విచక్షణారహితంగా పోలీసులపైన, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. మరోవైపు తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రచారంలో జనసేన రౌడీలు స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఓటర్లు చర్చించుకుంటున్నారు. రిగ్గింగ్ని అడ్డుకున్నందుకే విధ్వంసాలు పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లంతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డికే పట్టం కడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్కు యతి్నంచారు. తమకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్ని బయటకు లాక్కొచ్చి అతనిపై దాడిచేశారు. వైఎస్సార్సీపీ పాకాల మండల పార్టీ అధ్యక్షులు నంగా నరే‹Ùరెడ్డి కుమారుడు లవంత్రెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తర్వాత పులివర్తివారి పల్లెలో రిగ్గింగ్కు యతి్నంచారు. వైఎస్సార్సీపీ ఏజెంట్పై మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, పులివర్తి నాని కుమారుడు వినీల్ దాడికి దిగారు. నారావారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్పైనా టీడీపీ మూకలు దాడిచేశారు. అదేవిధంగా కూచువారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్కి అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్ రాజశేఖర్ని, రిలీవ్ ఏజెంట్గా ఉన్న సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్రెడ్డిపై దాడి చేశారు. చంద్రశేఖర్రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. మోహిత్రెడ్డి వాహనానికి నిప్పు పెట్టి, మరో ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. కూచువారిపల్లెలో కార్యకర్తలను బేడ్లతో కోసి రక్త గాయాలు చేశారు.అక్కడే ఎందుకు తిష్ట? పోలింగ్ రోజున ఎటూ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోయామని భావించిన కూటమి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పులివర్తి నాని అనుచరులు మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉన్న రౌడీ మూకలు మహిళా యూనివర్సిటీ సమీపంలో వైఎస్సార్సీపీ స్టిక్కర్తో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి ధ్వంసం చేశారు. ఆపై దానికి నిప్పంటించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకుడికి కారును కూడా ధ్వంసం చేశారు. -
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలింగ్ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర పన్నుతోందని ఎస్పీకి బాలినేని శ్రీనివాస్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ గొడవలకు ప్లాన్ చేస్తోంది. మాకు ఉన్న సమాచారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. టీడీపీ ‘‘వుయ్’’ యాప్లో ఓటర్ల డేటా తీసుకొని మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ‘వుయ్’ యాప్పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాలినేని శ్రీనివాస్రెడ్డి కోరారు. -
30 ఏళ్ళు మహానేతతో ఉన్న..సీఎం జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు. ‘సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు. -
వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని
సాక్షి, ప్రకాశం : జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి నియమించబడిన తర్వాత మొదటిసారిగా మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అంతకు ముందు.. ఈ ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో బాలినేనితో భేటీ అయిన చెవిరెడ్డి ,అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వచ్చారు. దీంతో పార్టీ కేడర్లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని.. ప్రజా బలంతో పేదల అండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కనపెట్టి అందం సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి -
కాలినడకన వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
ఆరోగ్య చంద్రగిరే చెవిరెడ్డి అభిమతం!
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అభిమతమని, అందులో భాగంగానే ఉచిత మెగావైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని, రూ.3 వేల ఖరీదైన 43 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించారని తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి కొనియాడారు. ఆరు నెలల క్రితం చంద్రగిరిలో చేపట్టిన ఉచిత మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమం స్ఫూర్తితోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్రంలో పురుడుపోసుకుందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఉచిత మెగా వైద్యశిబిరాలు విజయవంతం కావడంతో సోమవారం తిరుపతి రూరల్ మండల పరిధిలోని రామానాయుడు కల్యాణ మండపంలో విజయోత్సవ సభను నిర్వహించారు. మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో భాగస్వామ్యులైన 9,700 మంది అధికారులు, సిబ్బందికి రైస్ కుక్కర్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఏ పనిచేసినా పట్టువదలకుండా విజయవంతంగా పూర్తిచేస్తారన్నారు. ఆరు నెలల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఉచిత మెగావైద్య శిబిరాలను ప్రభుత్వం నిశితంగా గమనించిందన్నారు. ఆ వైద్య శిబిరాలకు ప్రజల నుంచి వచ్చే స్పందన, ఆరోగ్యం పట్ల జనం చూపిన శ్రద్ధ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అమలు చేసిందన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లోనూ అధికారుల వద్ద ప్రస్తావించారని గుర్తుచేశారు. అంతకుముందు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉండడం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. తుడా వీసీ హరిక్రిష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుడా కార్యదర్శి లక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్నాయుడు, ప్రివియా హెల్త్ సంస్థ నిర్వాహకులు ఫణీతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరు మండలాలు.. ఆరు నెలలు.. 1.22 లక్షల మందికి పరీక్షలు ఆరు మండలాలు.. 109 గ్రామ సచివాలయాలు.. ఆరు నెలలు.. 500పైగా ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 1.22 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తిచేయించారు. ప్రతి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలతో పాటు గుండె పరీక్షలు చేయించారు. గుండె పరీక్షల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు కలిగిన వారిని గుర్తించి పెద్ద ఆస్పత్రిలకు పంపి సకాలంలో వైద్య సేవలు అందించారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందిని ప్రాణాపాయం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి రక్షించారు. అసాధ్యాలను సుసాధ్యం చేశారు చంద్రగిరిలో ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రమంతా చెప్పుకుంటారని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే ఉంటుందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి వెల్లడించారు. ఉచిత మెగా వైద్య శిబిరాల వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించామన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల మందికిపైగా ఈసీజీ తీస్తే అందులో సుమారు 3వేల మందికి హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టు గుర్తించగలిగామన్నారు. తొండవాడ పంచాయతీ కార్యదర్శి నజిరీన్ బేగం భర్తకు ఈసీజీ తీసిన వెంటనే అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించి స్విమ్స్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడి వైద్యులు ఆగమేఘాలపై యాంజియో తీసి స్టంటు వేసి ప్రాణం నిలబెట్టారంటూ కన్నీరు పెట్టుకున్నారు. 9,700 మందికి రైస్ కుక్కర్లు పంపిణీ ఉచిత వైద్య శిబిరాలు విజయవంతం కావడానికి కష్టపడిన ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు, 104 సిబ్బందితో పాటు ప్రివియా హెల్త్ సంస్థ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు అందరినీ విజయోత్సవ సభకు ఆహ్వానించి పది రకాల వంటకాలతో శాఖాహార భోజనం ఏర్పాటు చేశారు. సభకు హాజరైన 9,700 మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 7.5 లీటర్ల మల్టీ పర్పస్ రైస్ కుక్కర్లను బహుమతిగా అందించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వారికి సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలే నా కుటుంబం.. వారి కోసం ఏదైనా చేస్తా.. ‘చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించాను.. వారి క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను.. కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తు వచ్చినా.. పండుగలు వచ్చినా.. పర్వదినాలైనా అందరికీ మంచి చేయాలన్న తపనతో వారి వెంట నిలబడుతున్నాను. నా కుటుంబం వేరు కాదు.. నా ప్రజలు వేరు కాదని బలంగా నమ్మిన వ్యక్తిని కనుకనే నా బిడ్డ మోహిత్రెడ్డికి కూడా ఈ వేదికపై నుంచి సూచిస్తున్నా.. రాజకీయాల్లోకి వచ్చాక కుటుంబం వేరు, ప్రజలు వేరు అనుకుంటే రాజకీయనాయకుడే అవుతావు.. కుటుంబం, ప్రజలు ఇద్దరూ ఒక్కటే అనుకుంటే నాయకుడు అవుతావు’ అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అత్యధిక సమయం విజయవాడలో గడపాల్సి వస్తున్నందున తన బిడ్డ మోహిత్రెడ్డిని తనలాగా ఆదరించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞిప్తి చేశారు. -
ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్పై మంచు విష్ణు కామెంట్!
మంచు విష్ణు, వర్సిటైల్ యాక్టర్ మంచు మోహన్బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుని పలు సేవా కార్యక్రమాలతో పాటు సినిమా రంగంలోని పేద కళాకారులకు సాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే అయన్ను వారు 'మా అధ్యక్షుడి'గా కూడా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన 'భక్త కన్నప్ప' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏపీలో పవన్ రాజకీయాలపై పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనే ఏమైనా బ్రహ్మంగారినా..? అంటూ మంచు విష్ణు ఇలా చెప్పుకొచ్చా రు. 'పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. సందేహమే లేదు. పవన్కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయిన మరో సినిమాలో అయినా మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను.' అని అన్నారు. రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్గా ఉన్నారని మంచు విష్ణు అన్నారు. సినిమా వస్తే చూస్తారు. కానీ ఓటేయాలనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రంగానికి చెందిన మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఒక్కోసారి పాలిటిక్స్లో పేరుపొందిన లెజండరీ పర్సన్స్ను కూడా ప్రజలు ఓడించారన్నారు. రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగుచేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో పవన్ భవిష్యత్ ఏమిటనేది చెబుతానని విష్ణు అన్నారు. (ఇదీ చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) ప్రస్తుతం తన ఏకాగ్రత సినిమాలపై ఉందని పేర్కొన్నారు. భారీ బడ్జెతో 'భక్త కన్నప్ప' సినిమా తీస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇందులో భారీగా ఆగ్ర నటులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం తన మార్కెట్కు మించి బడ్జెట్ పెడుతున్నామని, అందుకోసం రూ.150 కోట్లకు పైగానే ఖర్చుచేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. అతను నా తమ్ముడు.. ఏపీ రాజకీయాలపై తాను చంద్రగిరిలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు ప్రకటించారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వాల్లబ్బాయి మోహిత్నే చంద్రగిరిలో నిలబడబోతున్నాడని తెలుస్తోంది. మోహిత్ నా తమ్ముడు. అతన్ని నేను చాలా అభిమానిస్తాను. అవసరమైతే అతనికి సపోర్ట్ చేస్తానని కూడా ఆ ఇంటర్వ్యూలో విష్ణు పేర్కొన్నారు. ఏపీలో నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుంది. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోన్ రెడ్డిగారే అని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశంలో పేరుపొందిన ఎన్నికల సర్వేలన్నీ తెలుపుతున్నాయని ఆయన గుర్తుచేశారు. -
తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు
-
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుపతి/తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. భూమన కరుణాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దయ, ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్గా సేవచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని చెప్పారు. స్వామి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని, స్వామిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామని తెలిపారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సనాతన హిందూధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశామని, సామాన్య భక్తులకు అవసరమైన వసతులు కల్పించటమేగాక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆర్.కె.రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం
పాకాల : మండలంలోని పంటపల్లె పంచాయతీలో వైఎస్సార్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పంటపల్లె పంచాయతీలో మోహిత్రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర సాగింది. ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించి సంక్షేమ బావుటా బుక్లెట్ను అందించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న పాలనలో రామరాజ్యం ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని చెవిరెడ్డి మోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో మహిళలను ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. హామీలను నెరేవేర్చిన ఏకై క సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అద్భుతమైన పథకాల అమలుతో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తథ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన కుటుంబసభ్యుల కంటే నియోజకవర్గ ప్రజలనే ఎక్కువగా అభిమానిస్తారని వివరించారు. నిరంతరం ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో పని చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని మోహిత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోకనాథం, వైఎస్సార్ సీపీ కన్వీనర్ నంగా నరే ష్రెడ్డి, నాయకులు వల్లివేడు విక్రమ్రెడ్డి, మునీశ్వర్రెడ్డి, రఘుపతి, కపిలేశ్వర్రెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
అట్టహాసంగా చంద్రగిరి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం (ఫొటోలు)
-
మహాపాదయాత్రలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రతి ఒక్కరికీ కూడు, గూడు కల్పించడమే సీఎం జగనన్న అజెండా అని వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి తెలిపారు. గడపగడపకు మహాపాదయాత్రలో భాగంగా సోమవారం జంగావాండ్లపల్లి పంచాయతీ పరిధి నుంచి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆత్మీయంగా సత్కరించారు. ప్రతిగడపలో సంక్షేమ పథకాల బుక్లెట్ను అందించి వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలని కోరారు. మహా పాదయాత్ర కురవపల్లి, చినిగేపల్లి, జంగామాండ్లపల్లి, కూనివాండ్లపల్లి, అప్పేపల్లి, బొడేరెడ్డి గారి పల్లి వరకు కొనసాగింది. చిన్నగొట్టిగల్లు మండలం పరిధిలో పది గ్రామాలు కలయికతో జంగావాండ్లపల్లి పంచాయతీ ఏర్పాటైంది. ఇక్కడ 561 నివాసాలు 1,561 మంది జనాభా ఉన్నారు. పంచాయతీ అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తం రూ.6 కోట్ల, 55 లక్షల, 76వేల, 530 రూపాయలు మంజూరు చేసినట్టు మోహిత్రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబం రూ.1.5 లక్షకు పైగా లబ్ధి పొందిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యుగంధర్రెడ్డి, డీసీఎంఎస్ సహదేవ్రెడ్డి, జెడ్పీటీసీ స్వరూపా, సర్పంచ్ విమల, ఉపసర్పంచ్ రఘునాథరెడ్డి, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, పార్టీ డివిజనల్ అధ్యక్షులు అక్బర్, మహేంద్రరెడ్డి, పంచాయతీ కన్వీనర్లు జైపాల్రెడ్డి, విశ్వనాథరెడ్డి, ఎంపీడీఓ దేవేంద్రబాబు, తహసీల్దార్ లోకేశ్వరీ, ట్రాన్స్కో ఏడీ శివయ్య, పశుసంవర్థక శాఖ ఏడీ అవులప్రసాద్, సీఐ తులసీరామ్, ఎస్ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, కార్యక్రమాల నిర్వాహకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పారు. సీఎం జగన్ నివాసంలోని గోశాలలో ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో ఈ వివరాలు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్లు ఉన్నాయన్నారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొంటారని తెలిపారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాల ప్రకారమే ఈ ఉగాది సంబరాలు ఉంటాయన్నారు. ఇక్కడ పూర్తిగా పల్లె వాతావరణం కన్పిస్తుందన్నారు. ప్రారంభంలో గ్రామ ముఖద్వారం ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ దంపతులు విఘ్నేశ్వర ఆలయంలో పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆనందనిలయం నమూనా ప్రాంగణంలోకి చేరుకుంటారని చెప్పారు. అక్కడ స్వామికి సీఎం వైఎస్ జగన్ దంపతులు.. శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలుకలగాలని, సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతీసంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారని వివరించారు. అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమవుతుందన్నారు. చిరుధాన్యాలతో నవరత్నాల పథకాలు ప్రతిబింబించేలా నేలపై ఒక బొమ్మను ఏర్పాటు చేశామన్నారు. నవరత్నాల మధ్యలో రంగులతో వేసిన సీఎం జగన్ ఫొటో ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలు దేనికైనా తిరుమల పంచాంగాన్ని ఫాలో అవుతారని, ఆ ప్రకారమే కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. స్వామి దశావతారాల బొమ్మలు, భూదేవి, శ్రీదేవి బొమ్మలను కూడా మండపంలోని గోడలపై చిత్రీకరించినట్లు తెలిపారు. తిరుమలలో ఉన్నట్లు బంగారు తాపడంతో ఉన్న గంటలు, ధ్వజస్తంభం, కోనేరు కూడా ఇక్కడ చూడవచ్చన్నారు. కొన్ని సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు, ఉగాది పాటలకు నృత్యాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను టీటీడీ వేదపండితులు, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వేదపండితులు ఆశీర్వదిస్తారని తెలిపారు. సీఎం జగన్ ప్రధాన లక్ష్యం సామాన్యుడు బాగుండాలనేదేనని చెప్పారు. పేదల బాగుకోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం తన పాలనాకాలంలో ఇప్పటికి బటన్ నొక్కి రూ.2 లక్షల కోట్లను నేరుగా పేదల అకౌంట్లలోకి వెళ్లేలా చేశారని చెప్పారు. సీఎం ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా, నాడు–నేడు పాఠశాల భవనాల సెట్టింగ్లు భారీగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
చంద్రగిరిలో రూ.430 కోట్ల అభివృద్ధి పనులు చేశాం : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు
-
'కుటుంబం కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించడం చెవిరెడ్డికే సాధ్యం'
సాక్షి, చంద్రగిరి (తిరుపతి): తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, తిరుపతి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సంక్రాంతి కానుకను అందించారు. నియోజకవర్గంలో మొత్తం 1.60 లక్షల కుటుంబాలకు సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం దుస్తులు పంపిణీ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని నారాయణి గార్డెన్స్లో ఇంటింటికీ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిలో కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా కానుకలు పంపిస్తూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తన నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారు చేస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే చెవిరెడ్డికి భగవంతుని ఆశీస్సులు నిత్యం కలగాలని ఆకాంక్షించారు. ఆపద వచ్చినా, ఆనందం కలిగినా తన నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం చంద్రగిరి ప్రజల అదృష్టమని సుబ్బారెడ్డి ప్రశంసించారు. తన కుటుంబ సభ్యుల కంటే గొప్పగా నియోజకవర్గ ప్రజలను ప్రేమించడం ఆయనకు మాత్రమే సాధ్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పండుగ జరుపుకోలేని పేదలకు అన్నీ తానై సంతోషాన్ని పంచే చెవిరెడ్డి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో శానిటైజర్లు, మాస్్కలు, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, విటమిన్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ సిరప్లు, హోమియో మందులు, ఆయుర్వేద మందులు, ఆనందయ్య మందు, యోగా, ప్రాణాయామం పుస్తకాలు, ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు. అదే ఆత్మసంతృప్తి: చెవిరెడ్డి నా సంపాదనలో 70 శాతం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాను.. అదే నాకు ఆత్మ సంతృప్తి కలిగిస్తోంది అని చెవిరెడ్డి పేర్కొన్నారు. కష్టాలు వచ్చినపుడు మాత్రమే కాదు ఆనందంలో కూడా భాగస్వామిని కావాలని కానుకలు పంపుతున్నానని వెల్లడించారు. కులమతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలన్న ముఖ్యమంత్రి జగనన్న స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికీ కానుకలు అందిస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు. -
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి(76) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న ఆయన.. సోమవారం రాత్రి ఊపిరి తీసుకోవడానికి అవస్థపడటంతో కుటుంబ సభ్యులు విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సీఎం జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబసభ్యులకు సీఎం జగన్ పరామర్శ
-
తల్లిని ఓదార్చుతూ.. తండ్రి పాదాలను ముద్దాడుతూ.. (ఫొటోలు)
-
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇంట విషాదం
సాక్షి, తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి (మణిరెడ్డి–76) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందారు. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఆయన ఇబ్బందిపడుతున్నారు. సోమవారం రాత్రి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుబ్రమణ్యంరెడ్డికి ముగ్గురు కుమారులు. వారిలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రథమ సంతానం. సుబ్రమణ్యంరెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చైర్మన్గా పనిచేశారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫోన్ ద్వారా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పరామర్శించారు. చదవండి: (క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం) -
మోహిత్ పాదయాత్ర చరిత్రాత్మకం
తిరుపతి రూరల్: ఏడు నెలల పాటు 2,005 పల్లెలు, 115 సచివాలయాల పరిధిలో 1.46 లక్షల ఇళ్లకు తిరుపతి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి చేపట్టిన 1,600 కిలోమీటర్ల మహా పాదయాత్ర చరిత్రాత్మకమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడైన మోహిత్రెడ్డి చేపట్టిన గడపగడపకు మహాపాదయాత్ర శనివారం పదో రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరుగుతున్న ఈ పాదయాత్రలో ఎంపీ మిథున్రెడ్డి కూడా పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ ఏ పనినైనా చిత్తశుద్ధితో విజయవంతంగా పూర్తి చేసే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మోహిత్రెడ్డి మంచి నాయకుడుగా ఎదుగుతారని చెప్పారు. జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా మహాపాదయాత్ర చేస్తున్నట్లు మోహిత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
టీటీడీ ఆస్తులపై ఏటా శ్వేతపత్రం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్సైట్లో ఉంచుతున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అన్నారు. ఇకపై ఇలా ప్రతియేటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే.. కరోనా కారణంగా మాడ వీధుల్లో నిర్వహించలేకపోయిన బ్రహ్మోత్సవ వాహన సేవలను రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని.. పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, పోకల అశోక్కుమార్, సనత్కుమార్రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం.. సమావేశ నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వానికి రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు కొనుగోలు చేశాం. భవిష్యత్ అవసరాలకు ఈ స్థలం పక్కనే ఉన్న మరో 132 ఎకరాల స్థలాన్ని రూ.25 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ► శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డి) కౌంటర్లు ప్రారంభిస్తాం. 20వేల వరకు టోకెన్లు జారీచేస్తాం. ► శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉ.10 గంటలకు మార్చాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాల తరువాత దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం. ► తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల తరువాత ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా మొదలుపెడతాం. ► తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించని భక్తుల కోసం అక్కడక్కడా జర్మన్ షెడ్లు ఏర్పాటుచేశాం. ► భక్తులకు అందించే శ్రీవారి నైవేద్య ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను ఏపీ మార్క్ఫెడ్, రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలుకు అంగీకరించాం. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయించాం. ► తిరుమలలోని గోవర్థన సత్రాల వెనుక భాగంలో పీఏసీ–5 నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్ టెండర్లకు ఆమోదించాం. తద్వారా మరింత మంది భక్తుల వసతికి అవకాశం కలుగుతుంది. ► వకుళమాత ఆలయం నుంచి పుదిపట్ల జూపార్క్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.. ఇందుకోసం స్థలం సేకరించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ► తిరుమల నందకం విశ్రాంతి గృహంలో ఉన్న 340 గదుల్లో నూతన ఫర్నిచర్ ఏర్పాటు నిమిత్తం రూ.2.45 కోట్లు మంజూరు. ► తిరుమలలో సామాన్య భక్తుల కోసం గదుల ఆధునీకరణ పనుల్లో భాగంగా గీజర్ల ఏర్పాటు. వీటి కోసం అదనపు లోడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ.7.20 కోట్లతో టెండర్లకు ఆమోదం. ► నెల్లూరులో రెండు ఎకరాల స్థలంలో ఉన్న టీటీడీ కల్యాణమండపం ఆధునీకరణ, శీతలీకరణ, చిన్న ఆలయ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ► టీటీడీలోని క్లాస్–4 ఉద్యోగులకు నగదు బదులుగా యూనిఫాం క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ► ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి గదులు, హాస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు నిర్ణయించాం. -
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ అకార్డ్ స్కూల్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్ అందించారు. ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, అకార్డ్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ పాల్గొన్నారు. కాగా, ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. -
పర్యావరణ హితమే లక్ష్యంగా....
తిరుపతి రూరల్: పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 1.24 లక్షల బంకమట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా చెవిరెడ్డి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్ యార్డ్లో బంకమట్టి విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికీ బంకమట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాల్లో.. 7 వేల మంది కుమ్మరి కార్మికులు 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారని, 2,500 టన్నుల బంకమట్టిని ఉపయోగించినట్లు చెప్పారు. ప్రజలకు గణనాథుని పూజించే విధానంపై బుక్లెట్ను అందించనున్నట్లు తెలిపారు. 2వేల మంది వలటీర్లతో ఈ విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. -
శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల విజయవంతానికి తనవంతు కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ విప్ హోదాలో చెవిరెడ్డి వారం రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. సమావేశాల నిర్వహణలో తనకున్న అనుభవం దృష్ట్యా అన్నీతానై వ్యవహరించారు. రెండో రోజు శనివారం ప్లీనరీ ప్రాంగణం చేరుకున్న సీఎంను మంత్రి పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి కలిశారు. ఆ సందర్భంగా ‘శభాష్.. భాస్కర్’ అంటూ చెవిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు) -
కిక్కిరిసిన ఫుడ్ కోర్టులు
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరైన వారితో అక్కడ ఏర్పాటు చేసిన 250 ఫుడ్కోర్టులు కిటకిటలాడాయి. రెండోరోజు ఉ.7 గంటల నుంచి అల్పాహారం అందించారు. సా.4 గంటలకే ప్లీనరీ ముగిసినా రాత్రి 7 గంటల వరకు ఫుడ్కోర్టులలో రద్దీ కొనసాగింది. దూర ప్రయాణాలు చేసేవారు డిన్నర్ కూడా చేసి బయల్దేరారు. రెండ్రోజులూ ఏ చిన్న అవాంతరమూ లేకుండా పసందైన వంటకాలు అందించడంపై సీఎం వైఎస్ జగన్, పార్టీ సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు తమ టీమ్ను ప్రత్యేకంగా అభినందించారని ఫుడ్ కమిటీ కన్వీనర్ డా. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. చెవిరెడ్డిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎంపీ విజయసాయిరెడ్డి ప్లీనరీకి ముందురోజు నుంచి ముగిసేవరకు 3,400 మంది కేటరింగ్ వర్కర్లు రేయింబవళ్లు పనిచేశారని చెవిరెడ్డి వివరించారు. చివరిరోజైన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల పాటు ఆహారాన్ని అందించామన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్త నుంచి మంత్రుల వరకు అందరికీ ఒకే మెనూను అమలుచేశామని.. మొత్తం 25 రకాల వంటకాలను వడ్డించామని ఆయన తెలిపారు. మొదటిరోజు 2 లక్షల మంది వరకు భోజనం అందించామని, రెండోరోజు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది భోజనం చేశారని చెవిరెడ్డి తెలిపారు. -
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు చెవిరెడ్డి, జక్కంపూడి
తిరుపతి రూరల్: ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిపై తెలుగుదేశం ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు నేటికీ వదలిపెట్టడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ 2015లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఉద్యమాలను అణచివేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేసింది. ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి మంగళవారం అమరావతిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన ఉద్యమాల్లో ప్రజల తరఫున గళమెత్తిన వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి, కార్యకర్తలు కలిపి మొత్తం 26 మందిపై 2015లో అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అప్పట్లో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆనాటి ఆందోళనలకు సంఘీభావం తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమరావతి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంగళవారం వాయిదా ఉండటంతో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి విచారణ నిమిత్తం హాజరయ్యారు. -
తిరుపతిలో ఘనంగా జిల్లా ప్లీనరీ
తిరుపతి రూరల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పాదల చెంత వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ మంగళవారం ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఎస్వీ యూనివర్శిటీ స్టేడియంలో ఈ ప్లీనరీ నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 15 వేల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 80 వేలకు పైగా మెజార్టీని అందిస్తాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, సంజీవయ్య, వరప్రసాదరావు, బియ్యపు మధుసూదనరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అనంత, సత్యసాయి జిల్లా ప్లీనరీలు అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైఎస్సార్సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. మంగళవారం అనంతపురం జిల్లాస్థాయి ప్లీనరీ అనంతపురంలోని శిల్పారామం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీ పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రాంలో నిర్వహించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలకు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని ఆయన అన్నారు. మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ప్లీనరీల ఇన్చార్జి ఎస్వీ మోహన్రెడ్డి తదితరులు హాజరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, పీవీ సిద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
15 వేల మందితో నేడే వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ
తిరుపతి తుడా: వైఎస్సార్సీపీ తిరుపతి ప్లీనరీ నిర్వహణకు ప్రత్యేక కమిటీలను నియమించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పారు. ఈ ప్లీనరీకి 15 వేల మంది వస్తున్నట్టు తెలిపారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు జర్మన్ షెడ్లను నిర్మించామన్నారు. తిరుపతి నగరం ఎస్వీయూ స్టేడియంలో మంగళవారం జరగనున్న ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో తొలి జిల్లా సమావేశం తిరుపతిలోనే నిర్వహిస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్లు, పార్టీ నియోజకవర్గ, మండల ఇన్చార్జ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘుమఘుమలాడే వంటకాలను సభా వేదిక వద్ద సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు స్వాగతం పలికేందుకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, అరటి గెలలు, పూల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెవిరెడ్డి వివరించారు. -
గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు. తిరుపతి: బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడంటే? -
సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు. చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
తిరుపతిని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం..
చంద్రగిరి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తిరుపతి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా ముందుకెళ్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పారు. పార్టీ నేతలతో తిరుపతిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్, ఎమ్మెల్సీలు భరత్, కల్యాణ్చక్రవర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిషత్ల చైర్పర్సన్లు శ్రీనివాసులు, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. (క్లిక్: చంద్రబాబుకు ఇన్ని రోజులు తెలివితేటలు లేవా..) -
సీఎం జగన్కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు
పాకాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వలంటీర్లు అత్యంత ప్రీతిపాత్రులని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముకలా పని చేస్తోందన్నారు. శనివారం చిత్తూరు జిల్లా పాకాలలో వలంటీర్లను చెవిరెడ్డి సత్కరించి దుస్తులు అందజేశారు. క్షేత్ర స్థాయిలో వలంటీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. స్థానిక అధికారులు, నాయకులతో వలంటీర్లను సమన్వయపరచి భోజనం ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సకాలంలో సంక్షేమ పథకాలు అందించడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న వలంటీర్ల సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. -
తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కొనసాగింపు
సాక్షి, విజయవాడ: తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవి కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) -
తిరుపతి నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు
-
జన్మదినం సందర్భంగా సీఎం వైఎస్ జగన్పై ప్రత్యేక గీతం
-
గోశాలను సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సోమవారం సందర్శించారు. ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులు.. కపిల, గిర్, పుంగనూరు, కాంక్రిజ్, తార్ పార్కర్, సాయివాలా ఉన్నాయి. గోశాలను వెదురు, రాయి మాత్రమే వాడి పర్యావరణహితంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు) -
రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు. 120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల తర్వాత ఇంటికి.. నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు. -
హమాలీగా మారి.. బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: రాయల చెరువు సమీపంలో వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు. వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు తెలిపారు. -
రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. హెలికాఫ్టర్ సాయంతో
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు. మరోవైపు కొంతమంది ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ప్రజలు స్థానికంగా ఉన్న కొండలు పైభాగంలో ఆవాసంగా చేసుకున్నారు. స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహించడంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెలికాప్టర్ సాయంతో వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. చదవండి: (ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి) రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ వైపు సహాయక, పునరావాస సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు వరద ముంపు తగ్గించే పనులు వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు వద్ద లీకేజీ అరికట్టేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తరలించి కట్టడి చేస్తున్నారు. టీటీడీ అందించిన ఖాళీ గోనె సంచులు, ప్లాస్టిక్, సిమెంట్ సంచుల్లో ఇసుక మిశ్రమం నింపి మూట కట్టి అడ్డుకట్ట వేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి రాయల చెరువు లీకేజీని అదుపులోకి తెచ్చారు. రాయల చెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి, దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగలు, రాత్రి రాయల చెరువు వద్దనే ఉంటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ('మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా') -
ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి
Rayala Cheruvu Present Situation: నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాదఘంటికలను మోగిస్తోంది. చెరువు కట్ట బలహీనంగా మారుతూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కట్ట పటిష్టతకు కృషి చేస్తోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి తదితరులు చెరువును ఆదివారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాయలచెరువులో 0.9 టీఎంసీల నీరు ఉన్నట్లు వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు హెలికాప్టర్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. చదవండి: (తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం) చెరువులో పరిస్థితిని గమనిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అలాగే రామాపురంలోని వెరిటాస్ సైనిక్ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సూచించారు. మరో రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొండలు, గుట్టల్లో తలదాచుకుని ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం రాయలచెరువు వద్దకు చేరుకున్న ఆయన కట్టను పటిష్టం చేసే చర్యలను పర్యవేక్షించారు. అధి కారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రంతా చెరువు వద్దనే గడిపారు. -
తుమ్మలకుంటలో నరకాసుర వధ నిర్వహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు. వారు ప్రజల మన్ననలను పొందారని అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు సీఎంలుగా పనిచేశారు.. ఒకరు మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే, మరొక సీఎం(కిరణ్ కుమార్ రెడ్డి) రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చదవండి: పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని -
నేడు గోపవరంలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ
-
‘దిశ’ డౌన్లోడ్స్లో మెరిసిన చంద్రగిరి
తిరుపతి రూరల్: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ యాప్’ డౌన్లోడ్స్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ రికార్డు స్థాయిలో 1,73,363 మంది తమ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతి మహిళా భద్రత కోసం దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి సందేశాన్ని అతి తక్కువ సమయంలో ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చొరవ తీసుకుని మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్లను దీన్లో భాగం చేశారు. తొలుత వారికి అవగాహన కల్పించి... తరువాతి దశలో వలంటీర్లు, వార్డు సభ్యుల్ని కూడా కలుపుకున్నారు. వీరందరి ద్వారా నియోజకవర్గంలోని మహిళలందరి చేతా డౌన్లోడ్లు చేయించారు. ఈ నియోజకవర్గం విషయం సీఎం దృష్టికి వెళ్లటంతో అక్కడ తీసుకున్న చర్యలను అనుసరిస్తూ... అన్ని చోట్లా యాప్ డౌన్లోడ్లు చేయించి, మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించారు. అక్కడ ఏ ప్రక్రియను అనుసరించారనేది చిత్తూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడాలంటూ... కలెక్టర్లందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచనలు పంపించారు. కాగా అత్యధిక డౌన్లోడ్లు చేయించిన సంఘమిత్రలు, వలంటీర్లకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించటం విశేషం. -
పల్లె.. పల్లెకు.. జగనన్న పచ్చతోరణం
తిరుపతి రూరల్: జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద 10 లక్షల పూలు, పండ్ల చెట్ల ఉచిత పంపిణీకి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి నిమ్మ, దానిమ్మ, జామ, ఉసిరి, బత్తాయి, దబ్బ, సీతాఫలం, సపోటా వంటి పండ్ల చెట్లతో పాటు, మందారం, నందివర్ధనం, గన్నేరు, టెకోమో, పారిజాతాల్లో వారికి నచ్చిన నాలుగు మొక్కలను అందజేశారు. పలువురికి మొక్కలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంకల్పించినట్లుగా ప్రతి పల్లె, వీధి, ఇల్లు.. పూలు, పండ్ల చెట్లతో కళకళలాడాలన్నారు. ఉచితంగా ఇస్తున్న ఈ పూలు, పండ్ల చెట్లను పెంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 20 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, రాష్ట్రంలో పచ్చదనాన్ని, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు పచ్చతోరణం కార్యక్రమంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలియజేశారు. నాటిన మొక్కల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని చెప్పారు. -
దిశ యాప్ డౌన్లోడ్లలో చంద్రగిరి రికార్డ్
తిరుపతి రూరల్: అక్కచెల్లెమ్మల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ డౌన్లోడ్లలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రికార్డు సృష్టించింది. ఆ నియోజకవర్గంలో 1.6 లక్షల కుటుంబాలు ఉండగా శనివారం నాటికి 1,77,363 మంది మహిళలు దిశ యాప్ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. తద్వారా దిశ యాప్ డౌన్లోడ్లలో రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘దిశ’ యాప్ అమలుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడితే.. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మహిళలంతా యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సీఎం వైఎస్ జగన్ సంకల్పం మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముందుకు కదిలారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఉన్న మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్లకు ‘దిశ ’ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. ఇందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భారీ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరితో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించారు. అనంతరం మండలాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి యాప్ పట్ల అవగాహన కల్పించాలని వలంటీర్లు, వార్డు సభ్యులు, మహిళా పోలీస్లకు దిశానిర్దేశం చేశారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య తోడున్నట్టేనని వివరించాలన్నారు. ఆపద ఎదురైతే ‘దిశ‘ యాప్ ద్వారా నిమిషాల్లో పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పాలన్నారు. ప్రయాణాల్లోనూ ఎంతో భద్రత ఉంటుందని వివరించాలని సూచించారు. ఇలా నిత్యం వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారుల వరకు ప్రతి ఒక్కరితో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రోత్సహించారు. సంబంధిత అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి దిశ లక్ష్యాన్ని అధిగమించారు. -
మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ యాప్
తిరుపతి (యూనివర్సిటీ క్యాంపస్): విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి. ఎవరికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి. ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్. దీనిని ఎక్కడి నుంచి.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆపత్కాలంలో ఎలా వినియోగించాలనే విషయాలపై శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఆపద వేళ యువతులు, మహిళలు, విద్యార్థినులను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం మేరకు రూపొందించిన ఈ యాప్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టేననే విషయాన్ని వివరించారు. డౌన్ లోడ్.. ఉపయోగించడం ఇలా ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► యాప్లోఎస్వోఎస్ బటన్ ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్వోఎస్ బటన్ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుతుంది. ► ఆ వెంటనే కంట్రోల్ రూమ్లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ► విపత్కర పరిస్థితుల్లో యాప్ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్కు సందేశాన్ని పంపుతుంది. ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. దిశను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మహిళా రక్షణ గురించి సీఎం వైఎస్ జగనన్నకు బాగా తెలుసని, దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టానికి ఆయన రూపకల్పన చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు యాప్ను ఎక్కువ మందితో డౌన్లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ యాప్ ఆవశ్యకతను వివరించారు. సదస్సుకు హాజరైన చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళా సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ మహిళా పోలీసులంతా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.