
సాక్షి, అమరావతి : కరోనా వ్యాప్తిని నివారించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా తప్పుడు పోస్ట్లు చేస్తున్నవారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి గురువారం ట్విటర్లో పలు పోస్ట్లు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి.. విపత్కర పరిస్థితులో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్లో తలదాచుకున్నాడని.. ఆయన రేపు ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు. కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నియంత్రణ చర్యలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారని తెలిపారు. దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. కానీ దీనిని చూసి పచ్చ వైరస్ రక్తంలో ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే సీఎం వైస్ జగన్పై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై దొంగదాడికి తెగబతున్నారని విమర్శించారు.
ఇంకో ట్వీట్లో.. ‘తుప్పు నాయుడిది ముగిసిన చరిత్ర. విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్లో తలదాచుకున్నాడు. రేపు ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తాడు. ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్లో.. ‘కరోనా ముట్టడితో ప్రపంచమంతా తల్లడిల్లుతోంది. మన లాంటి దేశానికి ఇదో పెద్ద విపత్తు. కష్టకాలంలో అందరూ వ్యాధిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలి. ఇలాంటి టైంలో కొందరు ఎల్లో వైరస్ దద్దమ్మలు నీచపు కామెంట్లకు తెగబడుతున్నారు. వీళ్లెవరూ చట్టం నుండి తప్పించుకోలేరు’అని తెలిపారు.
తుప్పు నాయుడిది ముగిసిన చరిత్ర. విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. రేపు ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తాడు. ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2020
దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. యువ ముఖ్యమంత్రి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అంతా ప్రశంసిస్తుంటే పచ్చ వైరస్ రక్తంలోకి ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదు. జగన్ గారిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతల పైన దొంగదాడికి తెగబడుతున్నారు. తూ... సిగ్గులేని జన్మలు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2020
కరోనా ముట్టడితో ప్రపంచమంతా తల్లడిల్లుతోంది. మన లాంటి దేశానికి ఇదో పెద్ద విపత్తు. కష్టకాలంలో అందరూ వ్యాధిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలి. ఇలాంటి టైంలో కొందరు ఎల్లో వైరస్ దద్దమ్మలు నీచపు కామెంట్లకు తెగబడుతున్నారు. వీళ్లెవరూ చట్టం నుండి తప్పించుకోలేరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2020
చదవండి : క్వారంటైన్ నుంచి వెళ్లేటప్పుడు పేదలకు రూ 2,000 సాయం
Comments
Please login to add a commentAdd a comment