టీడీపీ ఎంపీలను నిలదీయండి: వైఎస్సార్‌సీపీ | Why TDP MPs Did Not Resign Asks YSRCP | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీలను నిలదీయండి: వైఎస్సార్‌సీపీ పిలుపు

Published Mon, Apr 9 2018 4:40 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Why TDP MPs Did Not Resign Asks YSRCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే, ఆ ఫలితంగా ఉపఎన్నికలు వచ్చేదుంటే.. ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే అవకాశం ఉండేదని, ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం మోసమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించింది.

ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాజీనామాలు చేయకుండా, కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను ఎక్కడిక్కడే నిలదీయాలని వైఎస్సార్‌సీపీ పిలుపిచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో గడిచిన నాలుగేళ్లుగా పూటకో మాట చెబుతూ మోసంచేసి, ఇప్పుడు తామే పోరాడుతున్నట్లు మభ్యపెట్టేయత్నం చేస్తోన్న టీడీపీకి ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement