Telugu Desam MPs
-
లోక్సభ స్పీకర్ను కలిసిన జీవీఎల్ నరసింహారావు
-
ప్రత్యేకహోదాపై జగన్ చెప్పిందే సత్యం
పెనగలూరు: ప్రత్యేకహోదాపై నాలుగున్నర సంవత్సరాల నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలే సత్యమని తేలిందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ పేర్కొన్నారు. కొండూరులో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై జగన్ ఏమైతే ప్రజలకు చెప్పారో.. అవే మాటలు పార్లమెంటులో గల్లా జయదేవ్ ఇంగ్లిష్లో చెప్పారన్నారు. జగన్ చెప్పిన మాటలు అప్పుడు కాదనుకున్న టీడీపీ ఇప్పుడు అవే మాటలు పార్లమెంటులో చెప్పడం చూస్తే జగన్ మాటలే సత్యమని తెలుస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినరోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఉండి కూడా ప్రత్యేకహోదాపై విఫలం చెందారని ఆమె విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ చెపుతుంటే టీడీపీ కనీసం నిరసన కూడా తెలుపకపోవడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ను విమర్శించడం మానుకుని, ప్రత్యేకహోదా కోసం పోరాడాలని ఆమె హితవు పలికారు. అలాగే ఈనెల 24న వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్లో టీడీపీ కూడా పాల్గొనాలని కోరారు. ప్రత్యేకహోదా అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని ప్రతి పార్టీ నిలబెట్టేలా కృషి చేయాలన్నారు. అలాగే మంగళవారం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ను రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రభావతమ్మ కోరారు. కార్యక్రమంలో పెనగలూరు జెడ్పీటీసీ విజయ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కేతా చక్రపాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నోరు మెదపని టీడీపీ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. నిధులిచ్చామని రాజ్నాథ్ చెబుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని రాజ్నాథ్ గుర్తుచేశారు. చరిత్రలో కర్ణాటక అనుభవ్ మండపం, తంజావూరు చోళుల వ్యవస్థ నుంచి కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, ప్రజాస్వామ్య పునాదులు భారత్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘దేశంలో నాలుగేళ్లుగా ఉగ్రదాడులు జరగకుండా అణచివేశాం. చరిత్రలో అతిపెద్ద మూక దాడులు 1984లో జరిగాయి. కొందరు నేతలు హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో పార్లమెంట్పై దాడి జరిగినప్పుడు తాలిబన్ గుర్తుకురాలేదా..? కౌరవులను చంపిన పాండవులే వారి కర్మకాండలు నిర్వహించారు. అంతటి గొప్ప సంప్రదాయం ఉన్న దేశ మనది. పాకిస్తాన్ ఒక దేశం కాదు.. ఒక దరిద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నిజాయితీ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. నిరుపేద తల్లిగర్భం నుంచి పుట్టిన మోదీలాంటి వ్యక్తే రైతుల నిజమైన బాధను అర్థం చేసుకోగలరని’రాజ్నాథ్ అన్నారు. డైలమాలో కాంగ్రెస్!! మరోవైపు అవిశ్వాసంలో ఓటు వేయాలా.. వద్దా.. అనే దానిపై కాంగ్రెస్ సందిగ్దంలో పడిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసానికి ఓటేయడంపై కాంగ్రెస్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదంటుండగా.. మరికొందరు ఓటింగ్కు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
తొలిరోజే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో వాతావరణం గందరగోళంగా మారింది. లోక్సభలో విశ్వాస పరీక్ష, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పలు రాజకీయ పక్షాల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. అయితే ఈ గందరగోళంలోనూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. స్పీకర్ క్వశ్చన్ అవర్ను ప్రారంభించగానే తెలుగుదేశం, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సహాపలు పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేశారు. ఎన్డీయే మాజీ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ‘వి వాంట్ జస్టిస్’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఎస్పీ నేతలు కూడా వెల్లోకి దూసుకొచ్చి పలు డిమాండ్లతో నినదిం చారు. కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థలాల్లోనే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు. కొత్త సభ్యుల ప్రమాణం సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభకు చేరుకుని అధికార, విపక్ష సభ్యులందరికీ అభివాదం చేశారు. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కుకాడే యశ్వంత్ రావ్ (ఎన్సీపీ), గవిట్ రాజేంద్ర (బీజేపీ), తోఖేహో (ఎన్డీపీపీ), తబస్సుమ్ బేగమ్ (ఆర్ఎల్డీ) ప్రమాణం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చబోం అటు, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో ఆందోళన నెలకొందని సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని.. ఇందుకోసం సంబంధిత చట్టాలకు సవరణలు జరుపుతున్నామన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకుండే హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోం. ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఈ హక్కులను కాలరాస్తే ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 30 రాష్ట్రాల్లో 24 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు మరో మంత్రి హన్స్రాజ్ గంగారామ్ ఆహిర్ వెల్లడించారు. మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు దేశ తొలి సమగ్ర మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును కేంద్ర మంత్రి మేనకా గాంధీ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నేరాన్ని నిరోధించడంతో పాటు బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. చాకిరి, భిక్షాటన, వివాహాల్ని కూడా దీని పరిధిలో చేర్చారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు కూడా..: ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించే బిల్లును ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. -
టీఆర్ఎస్ ఎంపీలతో టీడీపీ ఎంపీలు భేటీ
-
‘ఆ దారుణాలన్నీ అద్వానీకి తెలుసు’
సాక్షి, రాజమహేంద్రవరం : ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తుచేశారు. సభ (పార్లమెంట్)లో ఎన్ని దారుణాలు జరిగాయో అద్వానీకి తెలుసునని, ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులిస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉండవల్లి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. ‘సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో రాష్ట్రనేతలు నిలదీయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. మీడియాకు పార్లమెంట్ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీలు)కు ఉంది. మీకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్లో ప్రశ్నించాలని’ ఉండవల్లి చెప్పారు. -
హోదాపై టీడీపీ దొంగ దీక్షలు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న దొంగ దీక్షల తీరు తేటతెల్లమైందని, ఇక వారిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు కిలోల బరువు తగ్గడానికి దీక్షలు చేస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అంటే, హోదానా గీదానంటూ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించి వారి దొంగ దీక్షల గుట్టును విప్పారన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సాధించేందుకు తాము చిత్తశుద్ధితో దీక్షలు చేస్తున్నామంటూ ప్రగడ్భాలు పలుకుతున్న తీరును ప్రజ లు నిశితంగా గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్ల పా టు కేంద్రంతో మిత్రపక్షంగా మెలిగి, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నంత కాలం నోరెత్తకుండా పబ్బం గడిపారని ఆరోపించారు. కొత్త డ్రామాలకు సీఎం తెర.. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కొత్త డ్రామాలకు చంద్రబాబు తెరలేపారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. రైల్వే జోన్ కోసం దీక్షల పేరిట భారీ సెట్టింగ్లతో వేదికలు వేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలకు ఢిల్లీ వీధుల్లో తిరిగే ధైర్యం లేక విశాఖ గల్లీలో తూతూ మంత్రపు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి ఢిల్లీలో దీక్షలు చేసే సత్తా లేకే విశాఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం ముందు సినీ సెట్టింగ్లను తలదన్నే రీతిలో సెట్ వేసి బూటకపు దీక్షలు చేసి ప్రయాణికులకు, ప్రజలకు అసౌకర్యం తలపెడుతున్నారని ఆరోపించారు. పవన్కల్యాణ్వి అవగాహన రహిత వ్యాఖ్యలు.. జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేకుండా వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు విసురుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. టీడీపీ గెలుపునకు బాటలు వేసి, కేంద్రానికి మద్దతిచ్చి నాలుగేళ్లగా వారి సహవాసం చేసినప్పుడు చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి పవన్కు తెలియదా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చోడవరం సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంటే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. అధికార పార్టీ అడుగులు మడుగులొత్తి పవన్ ఎన్నికల్లో తన హవాను మళ్లీ చాటుకునేందుకు టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆ మేరకే వైఎస్సార్సీపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్న విషయం ఇప్పటికే పవన్కల్యాణ్కు స్పష్టమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించి అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలో టీడీపీని దానికి మద్దతిస్తున్న పార్టీలను రాష్ట్రం నుంచి జనం తరమి కొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి సమన్వయకర్త వరుధు కల్యాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి, జాన్వెస్లీ, పక్కి దివాకర్, షరీఫ్, బర్కత్ ఆలీ, రామన్నపాత్రుడు, శ్రీనివాస్ గౌడ్, కాంతారావు, తడ్డబారికి సురేష్, బాబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీలకు వైఎస్సార్సీపీ నేత సవాల్
సాక్షి, విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందో, లేక రైల్వేశాఖ మంత్రి ఇంటి ముందో ధర్నా చేయాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ నేతల డ్రామాలను జనాలు గుర్తించారని, ఇక స్థానిక రైల్వేస్టేషన్లలో రైల్వే జోన్ గురించి దీక్ష చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలతో ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని, నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ అంశాన్ని ఆరు నెలల్లోగా తేల్చాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. అదే విధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీపై కూడా 6 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఉండగా.. ఈ నాలుగేళ్లు టీడీపీ నేతలు నిద్రపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతల డ్రామాలు ఎలా ఉన్నాయంటే.. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నాయన్న భయంతో నేడు టీడీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నట్లు నటిస్తున్నారంటూ మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేసిన పోరాటాన్ని గుర్తుకుచేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులను కలుపుకుని పోరాటం చేస్తే వైఎస్సార్సీపీ నేతలను అధికార టీడీపీ నేతలు అవహేళన చేశారు. ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ నాయకులకు నిజంగా సిగ్గుందా అని ప్రశ్నించారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందనగా ఇప్పుడు దీక్షలేందుకు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచినా ఏం లాభం లేదు. ఈ ఏడాది మార్చి వరకు టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించారు. కానీ ఏం సాధించారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ డ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలరోజుల్లో ప్రకటన రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఆ ఎంపీ ఇటీవల ఢిల్లీలో ఏం మాట్లాడారో ఏపీ మొత్తం చూసింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలను ఏపీ ప్రజలు ఓసారి గుర్తుచేసుకోవాలి. జోను లేదు.. గీను లేదు అంటూ చాలా చులకనగా మాట్లాడి అవంతి శ్రీనివాస్ దొరికిపోయారు. మరో ఎంపీ మురళీమోహన్ అయితే 5 కేజీల బరువు తగ్గాలంటే ఎన్ని రోజులు దీక్ష చేయాలి అనడం వీడియోల్లో స్పష్టంగా చూశాం. ఎన్డీఏ నుంచి బయటకొచ్చినప్పటికీ బీజేపీకి టీడీపీ ఎంపీలు రహస్య మిత్రులుగా ఉన్నారు. టీడీపీ చేసిది దీక్షలు కాదు కిట్టీ పార్టీల్లా ఉన్నాయంటూ’ ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని టీడీపీ నేతలపై గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
నాలుగేళ్లుగా టీడీపీ నేతలు నిద్రపోతున్నారా..?
-
తుంపాల షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దిరించాలి
-
చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా?
-
‘తీవ్ర భయాందోళనలో చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధసారథి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు ఏళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే రాష్ట్రాన్ని అంపశయ్య పై పడుకోబెట్టారని విమర్శించారు. ఎప్పుడెప్పుడు బాబుని సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన టీడీపీ నేతలపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని విదేశాలకి తాకట్టు పెట్టే ఆయన జన్మభూమి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. హోదా కంటే ప్యాకేజీ కోసం పాకులాడింది వాస్తవం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అబద్దాలు చెప్పారో నిరూపించగలరా? చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా దొరికితే కుట్రలు, కుతంత్రాలు అంటారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఆయనకు ఇప్పుడే తెలిసిందా అన్నారు. చంద్రబాబు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్ధసారథి డిమాండ్ చేశారు. -
డామిట్ కథ అడ్డం తిరిగింది!
-
వీడియో దుమారం: టీడీపీ ఎంపీల వివరణ
సాక్షి, ఏలూరు: హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షల వ్యవహారం బయటపడటంతో టీడీపీ ఎంపీలు నష్టనివారణ చర్యలకు దిగారు. తమ సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు. తమ మాటలను మార్ఫింగ్ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పన్నిన కుట్రగా ఎంపీలు పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కితాబిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు మార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
టీడీపీ ఎంపీలకు చంద్రబాబు క్లాస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలక అంశాల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రదర్శిస్తున్న చులకన భావం, వారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కీలకమైనవేవీ ఇప్పటివరకు నెరవేరకపోగా, కడప ఉక్కు కర్మాగారం, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వంటి వాటి విషయంపై టీడీపీ ఎంపీల నైజం తేటతెల్లం చేసే వీడియో బయటకుపొక్కడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకించి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేయాలన్న అంశంపై టీడీపీ ఎంపీలు సమావేశమైన సందర్భంగా ఒక్కక్కరు తేలిక భావంతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో లీక్ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాక్కయ్యారు. అలాంటి వీడియో లీక్ కావడంపై ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. ఎంపీలు చాటుమాటుగా మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన వీడియో ఎవరు చిత్రీకరించారు? ఎలా బయటకు పొక్కింది? అన్న విషయాలపై విచారణ చేయించాలని నిర్ణయించారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప ఉక్కు కర్మాగారం కోసం ఏదో పోరాటం చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికొచ్చారు. ఆ క్రమంలో వారంతా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై చాలా తేలికగా, చులకన భావంతో స్పందించారు. పార్టీ అధినేత చెప్పినట్టుగానే తమ వంతుగా నిరాహార దీక్ష చేయడంపై సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ అంటూ ఒక్కో ఎంపీ ఒక్కో రకంగా తమలోని ఆలోచనలు బయటపెట్టారు. అంతా సరదాగా సమావేశాన్ని ఎంజాయి చేశారు. అయితే తమ నిజస్వరూపం బయటపెట్టేలా వీడియో రికార్డవుతుందని వారు ఊహించలేకపోయారు. వారు మాట్లాడిన మాటల వీడియో మీడియాలో దర్శనమీయడంతో పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తమ నాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతం కావడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నివ్వెరపోయారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలా వీడియో తీస్తుండగా గమనించకుండా ఎలా ఉన్నారు? ఇంతకు ఆ వీడియో తీసిందెవరు? అంటూ వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. తమ వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారమయ్యాయని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో రికార్డింగ్ ఎవరు చేశారో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి బయటకు పొక్కడం వల్ల పార్టీ పరువు పోతుందంటూ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటలకు వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ ఏదో చెబుతుండగా, ఇకనుంచి బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇలాంటివి బయటకు రావడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. సంబంధిత కథనం : బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీలకు బాబు క్లాస్
-
మెకాన్ తుది నివేదిక తరువాతే ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మెకాన్ సంస్థ ముసాయిదా నివేదిన సమర్పించిన తరువాతే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై తదుపరి ప్రకటన చేయగలుగుతామని, అప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు గురువారం కూడా కేంద్ర మంత్రిని కలసి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, ముడిసరుకు సరఫరాపై వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి ఒక్కరే విడిగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై మెకాన్కు పూర్తి సమాచారం ఇవ్వాలని టీడీపీ ఎంపీలకు సూచించానన్నారు. సదురు సంస్థ ముసాయిదా నివేదిక సమర్పించిన అనంతరం టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశమై చర్చించాక తదుపరి ప్రకటన చేయగలుగుతామన్నారు. ప్లాంట్ ఏర్పాటుపై నాలుగేళ్లుగా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందన్న టీడీపీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయాలనుకుంటే ఇన్నిసార్లు కమిటీలు నియమించి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అవకాశాలపై ఎందుకు అధ్యయనం జరిపిస్తామని ఆయన ప్రశ్నించారు. ‘1966లో మా రాష్ట్రం (హరియాణా) ఏర్పడింది. ఇప్పటికి కూడా మా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. అలాంటిది నాలుగేళ్లకే ఏపీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పడం సరైందికాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు. టీడీపీ ఎంపీల అభ్యర్థన మేరకు ఎంపీ రమేశ్తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించాలని సూచించారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఎకరం రూ. నాలుగు లక్షలకు ఇస్తామని, రైల్వేలైన్కు అయ్యే ఖర్చులు భరిస్తామని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెకాన్కు ఇవ్వాలని ఆయన సూచించారన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 24 గంటల్లో మెకాన్కు వివరాలిస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని కోరగా ఆయన తిరస్కరించారంటూ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. అయితే ప్రధాని గురువారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. -
బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య. కడుపుకాలిన ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కపట నాటకాలా?? కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు. గారడీలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు ఇంద్రజాల దిగ్గజం పీసీ సర్కార్ను మించిన వాడని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులపై ఆయన ట్విటర్లో మండిపడ్డారు. గాల్లో అసెంబ్లీని నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తారని, అంకెల్లోనే అభివృద్ధి చూపుతారని, చెట్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్ను హరితవనం చేస్తారని, ప్రసంగాల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలనలో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆకాంక్షలను గాలికొదిలేశారని మండిపడ్డారు. -
బట్టబయలైన టీడీపీ ఎంపీల కపట దీక్ష
-
కడప జిల్లాపై వివక్ష చూపుతున్నారు
సాక్షి, రాజంపేట : వైఎస్సార్ జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్సీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో ఉన్న అనుకూలత ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ నేతలకు ఉక్కు పరిశ్రమ గుర్తొచ్చిందా అని నిలదీశారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టే టీడీపీ నేతలు దీక్షలు చేసేవారా అంటూ ఎద్దేవా చేశారు. ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ, సీఎం రమేష్కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలని.. దానికి తాము కూడా మద్ధతు ఇస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చిత్తశుధ్దితో పోరాటం చేస్తోందని అన్నారు. తాను, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఎన్నోసార్లు ఉక్కు పరిశ్రమ కోసం గట్టిగా నిలదీశామని చెప్పారు. ఆరోజు నోరు కూడా తెరవని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమతో పాటు టీడీపీ ఎంపీలు కలిసి రావాలని కోరితే ఎదురు దాడికి దిగుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్క రోజుకూడా పదవిని వదులుకోవడానికి టీడీపీ ఎంపీలు సిద్ధంగా లేరని విమర్శించారు. వైఎస్ జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన మహధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా తరలివచ్చారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ నినదించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రవీంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, రాజంపేల పార్లమెంట్ అద్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు సమన్వయ కర్తలు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న వైసీపీ నేతలకు రాజంపేట న్యాయవాదుల అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. -
టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలి
-
ఆత్మగౌరవం కాపాడేందుకే రాజీనామా
పొదలకూరు: ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఆర్అండ్బీ అతిథిగృహంలో శని వారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్æ ప్రజలం దరూ రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలను కీర్తిస్తున్నట్టు తెలి పారు. టీడీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి దొంగ దీక్షలు చేస్తూ, పూటకో మాట, రోజుకో ఎత్తుగడతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్రావు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పి.మిథున్రెడ్డి ప్రత్యేకహోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గార్చి, ఇప్పుడు ఎంపీ ల రాజీనామాలపై తన మంత్రులతో ఎదురు దాడి చేయించేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాను సజీవంగా ఉంచిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. యుద్ధం, స్నేహం సోమిరెడ్డికి బాగా తెలుసు యుద్ధం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా టీడీపీకే తెలుసని మం త్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్యే కాకాణి తిప్పికొట్టారు. కాంట్రాక్టర్లు, మిల్లర్లు ముడుపులు ఇవ్వకుంటే యుద్ధం చేయడం, ముడుపులు చెల్లింస్తే స్నేహం చేయడం ఆయనకు మామూలేనన్నారు. నాలుగు పర్యాయాలు వరుసగా ఓటమి చవిచూసి, దొడ్డిదారిన మంత్రైన సోమిరెడ్డికి ప్రజల ఓట్లతో వచ్చిన పదవి విలువ తెలియదన్నారు. రాజీనామా చేసిన ఎంపీలను జీతాలు వదులుకున్నారని సోమిరెడ్డి అవహేళన చేయడాన్ని చూస్తే ఆయన జన్మలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదన్నారు. జేబులు నింపుకోవడం తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి తెలియని నాయకుడికి తమ ఎంపీల త్యాగాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ కండే సులోచన, పలుకూరు పోలిరెడ్డి పాల్గొన్నారు. -
‘టీడీపీ ఎంపీలు దోషులుగా మిగులుతారు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను అవహేళన చేసిన టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, అంజాద్ బాషా అన్నారు. హోదాను నిర్లక్ష్యం చేసి ప్యాకేజీయే మేలని నాడు టీడీపీ నాయకులు డ్రామాలాడారని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తే, టీడీపీ దుష్ప్రచారం చేసిందని ధర్మాన మండిపడ్డారు. హోదా కోసం ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు హోదాతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎంపీ పదవులను త్యాగం చేయడం ఆషామాషీ కాదని అంజాద్ బాషా అన్నారు. మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో తమ ఎంపీలు చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలని బాషా డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారు
-
చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎంపీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పోరాటం ఉధృతం చేయాలనుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ఎంపీలు షాక్ ఇచ్చారు. హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆ పార్టీకి పోటీగా కార్యక్రమాలు రూపొందించాలనుకున్నారు. ఆ దిశంగా టీడీపీ ఎంపీలతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్పై చర్చించేందుకే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఎంపీల బస్సు యాత్ర ద్వారా హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతోపాటు ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రపై నుంచి జనం దృష్టి మరల్చడానికి చంద్రబాబు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. అయితే అధినేత ప్రతిపాదించిన బస్సు యాత్రకు ఎంపీలు సముఖంగా లేకపోవండంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఎంపీల బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన చంద్రబాబుకు ఎంపీలు ...యాత్రకు సుముఖంగా లేకపోవడంతో తదుపరి కార్యాచరణ దిశగా పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. -
రాజ్ఘాట్ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి బాబు, జయదేవ్ తదితరులు మౌనదీక్ష చేపట్టారు. హామీల సాధనకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని, బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. -
బాబు ఇంటిని ముట్టడిస్తే ఊరుకుంటారా: జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని ఇంటి వద్ద టీడీపీ ఎంపీలు ధర్నాకు యత్నించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు చేసినట్లుగా చంద్రబాబు నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడిస్తే ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీల తీరు సిగ్గుచేటని.. ఇప్పటికైనా దొంగ నాటకాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. -
టీడీపీ ఎంపీలు రాజీనామా చేయరెందుకు?
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలకు సంఘీభావంగా ఇప్పటికే నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలతోపాటు మరిన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని, బుధవారం నాడు రైల్రోకో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంతకల్, గుత్తి, కర్నూలు, అనంతపురంలలో రైల్రోకోలు నిర్వహించాలని పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్ష కొనసాగినంత వరకూ ప్రతిరోజూ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించింది. ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయరెందుకు ప్రత్యేక హోదా సాధన కోసం అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదో ప్రశ్నించాలని ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాజీనామా చేయకుండా కుంటిసాకులు వెతుక్కుంటున్న టీడీపీ ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీయాలని పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించింది. టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదు? వైఎస్సార్సీపీ ఎంపీలతోపాటు వారు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయడం లేదు? 25 మంది పదవులు వదులుకుని, ఆమరణ దీక్షకు దిగితే... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగదా? ఎంపీల రాజీనామాలు, దీక్షలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, ప్రత్యేక హోదా ఇవ్వరా? రాజీనామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఎందుకు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు? లోక్సభ సభ్యులు రాజీనామా చేస్తే అది ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించదా? రేపు ఉప ఎన్నికలు వచ్చినా ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే అవకాశం రాదా? ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. నాలుగో రోజుకు ఎంపీల దీక్ష ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆయన రక్తంలో చక్కెరస్థాయి పడిపోవడం, డీహైడ్రేషన్తో బాధపడుతుండడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వైఎస్ అవినాశ్రెడ్డి, పీవీ మిథున్రెడ్డి ఏపీ భవన్లో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షా వేదికపై ఎంపీలకు సంఘీభావం తెలిపారు. శరద్ యాదవ్ సంఘీభావం జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ దీక్షా వేదికను సందర్శించి వైఎస్సార్సీపీ ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వాలు మారినా ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హోదా సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలను అభినందిస్తున్నానని, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని శరద్ యాదవ్ అన్నారు. ఎంపీల ఆమరణ దీక్షకు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ప్రాణాలైనా అర్పిస్తా: వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. దీక్ష కొనసాగిస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆంబులెన్స్లోకి ఎక్కించి రామ్మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయగా సుబ్బారెడ్డి బీపీ 104/60, షుగర్ లెవెల్స్ 64కు పడిపోయాయి. దీక్ష విరమణకు నిరాకరించడంతో వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆర్ఎంఎల్లో చికిత్స పొందుతున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావులను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. రాత్రి మేకపాటి, వరప్రసాదరావు డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు -
కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను నిలదీయాలి
-
టీడీపీ ఎంపీలను నిలదీయండి: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే, ఆ ఫలితంగా ఉపఎన్నికలు వచ్చేదుంటే.. ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే అవకాశం ఉండేదని, ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం మోసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించింది. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాజీనామాలు చేయకుండా, కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను ఎక్కడిక్కడే నిలదీయాలని వైఎస్సార్సీపీ పిలుపిచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో గడిచిన నాలుగేళ్లుగా పూటకో మాట చెబుతూ మోసంచేసి, ఇప్పుడు తామే పోరాడుతున్నట్లు మభ్యపెట్టేయత్నం చేస్తోన్న టీడీపీకి ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు. బాబుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు#YSRCPMPsFastforAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/5QROIyGq0B — YSR Congress Party (@YSRCParty) 9 April 2018 -
మరోసారి బట్టబయలైన టీడీపీ ఎంపీల నాటకం
-
టీడీపీ ఎంపీలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు టీడీపీ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్లో హంగామా సృష్టించారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత కూడా ఆందోళన పేరిట వారు సభ లోపలే ఉండిపోయారు. ఇంతలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుస్తున్నారంటూ ఆమె కార్యాలయ సిబ్బంది చెప్పడంతో టీడీపీ ఎంపీలు బయటకు వచ్చారు. స్పీకర్ చాంబర్కు వెళ్లగా అప్పటికే ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీంతో అవాక్కయిన టీడీపీ ఎంపీలు తిరిగి సభ లోపలికి వెళ్లి ఆందోళనకు దిగాలని భావించగా.. భద్రతా సిబ్బంది అప్పటికే లోక్సభ తలుపులను మూసివేశారు. కంగుతిన్న టీడీపీ ఎంపీలు స్పీకర్ చాంబర్కు వెళ్లి అక్కడే బైఠాయించడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారంతా పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్దకు ధర్నా నిర్వహించి వెనుతిరిగారు. -
పలు విచిత్రమైన రాజకీయ దృశ్యాలు..
-
సోనియా పక్కన సీఎం రమేశ్.. జైరాంతో సుజనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో గురువారం పలు విచిత్రమైన రాజకీయ దృశ్యాలు దర్శనమిచ్చాయి. టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలతో చెట్టపట్టాల్ వేసుకొని తిరగడం కనిపించింది. పార్లమెంటు ఆవరణలో గురువారం ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్, ఎస్పీ సభ్యులతోపాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పక్కన నిలబడి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్లకార్డు ప్రదర్శించారు. మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్కు షేక్హ్యాండ్ ఇవ్వగా.. తోట నర్సింహం చేతిలో చెయ్యేసి జైరాం సన్నిహితంగా ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని పైకి టీడీపీ ఆరోపిస్తున్నా.. అంతర్గతంగా ఆ రెండు పార్టీలు సన్నిహితంగా మెసులుతున్నట్టు తాజా పరిణామాలు చాటుతున్నాయి. తాజా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ కాంగ్రెస్-టీడీపీ అనుబంధం బయటపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్తో చంద్రబాబు భేటీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాంగ్రెస్తో కలవనని చెబుతూనే ఆ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కావడం గమనార్హం. పార్లమెంట్లోనూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్తో చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. -
టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి
-
మోదీ, జైట్లీతో టీడీపీ ఎంపీలు.. రివర్స్సీన్!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..’ అంటూ టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు చేసిన నిర్దేశం దిశ మారింది! బాబు సూచనకు సరిగ్గా రివర్స్సీన్ నేడు పార్లమెంట్ ఆవరణలో చోటుచేసుకుంది. సర్వత్రా ఆసక్తిరేపిన ఆ దృశ్యాల వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్సీపీతోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నేడు లోక్సభ ముందుకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇవాళ పార్లమెంట్కు వచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మోదీ సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ అటుగా వెళ్లారు. ఆ ఇద్దరు పెద్దలతో ఎంపీలు చర్చ జరిపే ప్రయత్నం చేశారు. ఒక దశలో సుజనా.. జైట్లీ చేతులు పట్టుకుని మరీ ఏవేవో వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానికి కూడా నమస్కారం పెట్టారు. ఆసక్తికరమైన ఈ దృశ్యాలపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. (చదవండి: నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..) నిలదీయమంటే ఇదేంది?: మంగళవారం ఉదయం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఆదేశించారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, గతంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తనపై నిందలు వేయడాన్ని నిలదీయమన్నారు. బాబు ఘాటు సూచనల వార్తలు అన్ని జాతీయ చానెళ్లలోనూ ప్రసారమయ్యాయి. అయితే ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించడం పార్లమెంట్ ఆవరణలో చర్చనీయాంశమైంది. -
టీడీపీ ఎంపీలు సైతం రాజీనామా చేయాలి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం : హోదాపై చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు సైతం రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి ఐదుగురు ఎంపీలే ఉన్నా చిత్తశుద్ధితో హోదాపై పార్లమెంట్లో పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. తమ అధినేత సూచనల మేరకు పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన రోజే ఏంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో తమతో కలిసి రావాలని ఆయన సూచించారు. -
బీజేపీ దుష్ప్రచారం.. అధైర్యమొద్దు: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలకు టీడీపీ ఎంపీలంతా విధిగా హాజరుకావలని, అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవిశ్వాసం నోటీసులు అనేక పార్టీలు ఇచ్చాయని, టీడీపీ, వైఎస్ఆర్సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా నోటీసులు ఇచ్చాయని పేర్కొన్నారు. లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశం ఉందని, లేదా ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చునని అన్నారు. అవిశ్వాసంపై చర్చను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయిలో వినిపించాలని, నాలుగేళ్లయినా విభజన చట్టంలోని 19అంశాలు అమలుచేయకపోవడాన్ని ప్రశ్నించాలని సూచించారు. పార్లమెంట్లో ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకపోవడాన్ని నిలదీయాలన్నారు. అవిశ్వాసంపై చర్చ ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైనదని, ఈ సందర్భాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, సభావేదికగా ఐదుకోట్ల ఏపీ ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలని సూచించారు. ఈ విషయంలో కావాల్సిన సమాచారం మొత్తం ఎంపీలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎంపీలంతా ఈ రాత్రికే ఢిల్లీకి చేరుకోవాలి అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశమున్నందున మంగళవారం పసుపు చొక్కాలు, కండువాలతో టీడీపీ ఎంపీలు లోక్సభకు హాజరుకావాలని, ఈ రాత్రికే ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇది రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదని, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం జాతీయస్థాయి అంశంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఒంటరి చేయాలనే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తుందని, సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారాన్ని అధికం చేసిందని, దీనిపై ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ నేతలకు సూచించారు. దీనివల్ల బీజేపీపైనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, టీడీపీపై మరింత సానుభూతి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. -
పరాకాష్టకు చేరుకున్న టీడీపీ నాటకాలు
-
టీడీపీపై బీజేపీకి అనుమానం
అమరావతి: టీడీపీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్నప్పటికీ ఢిల్లీ పరిణామాలపై సీఎం నిశితదృష్టి సారించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజలకోసం పోరాడుతున్నాం. న్యాయం కోసం పోరాడుతున్నాం. మన హక్కుల కోసం పోరాడుతున్నాం. చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, సంఘటితంగా ఉండాలి. ఆగస్ట్ సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు ఒకేతాటిపై చివరిదాకా నిలిచారు. ఘన విజయం సాధించారు. అదే స్ఫూర్తి ఇప్పుడు ఎంపీలు అందరిలో కనిపించాలి. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడాలి. మనకు ఎవరిమీదా కోపం, ద్వేషం లేదు. కేంద్ర పెద్దలు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. పైపెచ్చు అన్యాయం చేశారనే భావన ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్థాయి అంశంగా మారాయి’ అని అన్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏపీ పట్ల సానుభూతిగా ఉన్నాయని, మద్ధతు కూడా ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇది స్ఫూర్తిదాయక సమయమని, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొంతకాలంగా టీడీపీపై బీజేపీ అనుమానం పెంచుకుందని అన్నారు. జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదన్నా వాళ్లు నమ్మడం లేదని తెలిపారు. నాలుగేళ్లు ఎదురుచూశామని, ఆఖరి బడ్జెట్లో కూడా మనకు న్యాయం జరగలేదని, దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చిందన్నారు. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. దేశరక్షణ, సైన్యం నిధులు అడిగామనడం ప్రజల్లో ఆవేశం పెంచిందని తెలిపారు. విభజనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని పేర్కొన్నారు. వృద్ధిరేటులో తెలంగాణ కన్నా 2 శాతం ముందున్నామని, తలసరి ఆదాయంలో రూ.33 వేలు వెనుక ఉన్నామని వెల్లడించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాదా..? ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..? అని ప్రశ్నించారు. -
ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఅర్ఎస్, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టడంతో లోక్సభ అట్టుడికిపోయింది. మరోపక్క టీడీపీ ఎంపీలు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లో ఆందోళనలు చేస్తున్నారని, మిగతా పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలబడ్డాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబుకు వివరించారు. టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ, కమ్యూనిస్టులు, వామపక్షాలు సంఘీభావం తెలిపాయని లోక్సభ పక్ష నేత తోట నర్సింహం పేర్కొన్నారు. కొందరు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు ఎన్నికలు, బీజేపీతోనే వైఎస్ జగన్ అని.. ఎకనామిక్ టైమ్స్ ఎడిటోరియల్లో వచ్చిన వార్త గురించి ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ మీడియా ఛానళ్లలో చర్చల సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చెప్పామని వారు వివరించారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే వెల్లో గలాటా సృష్టించటంపై చంద్రబాబు స్పందిస్తూ ఏయే పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయో, వారు అలా ఎందుకు చేస్తున్నారో దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ‘అందరినీ సంప్రదించండి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వివరించండి, సహకరించమని అడగండి అని’ చంద్రబాబు ఎంపీలకు సూచించారు. -
టీడీపీ ఎంపీల డ్రామా బట్టబయలు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాలు మరోసారి బయటపడ్డాయి. ఏపీ రైల్వేజోన్ కోసం తనను కలవలేదని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీడీపీ ఎంపీలను తాను కలవలేదని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం సాయంత్రం ఎంపీలందరినీ కలుస్తుంటానని, టీడీపీ ఎంపీలెవరూ తనను అపాయింట్మెంట్ అడగలేదని చెప్పారు. పరిశీలనలో ఉంది ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని లేదని, కేవలం పరిశీలించాలని మాత్రమే పెట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రైల్వేజోన్ పరిశీలనలో ఉందని.. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాలను పర్యవసనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జోన్పై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఒడిశా ఎంపీలతో అలా అనలేదు ‘ఏపీకి రైల్వేజోన్ ఇవ్వడం లేదని బీజేడీ ఎంపీలతో చెప్పలేదు. ఒడిశా ఎంపీలు వారి రాష్ట్రంలో మూడు కొత్త డివిజన్లు అడిగారు. అవి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పాను. ఏపీలో రైల్వేజోన్ ఏర్పాటు చేయలేమని ఒడిశా ఎంపీలతో చెప్పలేదు. వారు మీడియాతో అలా చెప్పితే అబద్ధాలు ఆడుతున్నట్టేన’ని పియూష్ గోయల్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని అవమానిస్తారా?: చంద్రబాబు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించాలని సీఎం తెలిపారు. ఏపీకి పార్లమెంట్ ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలన్నారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. దశలవారిగా పోరాటం ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వదలిపెట్టేది లేదని, ఇక్కడ శాసనసభ, శాసన మండలిలో, అక్కడ లోక్సభ, రాజ్యసభలో ఏపీ సమస్యలే ప్రతిధ్వనించాలని తెలిపారు. లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారన్నారు. టీడీపీ ఏంపీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ అపాయింట్మెంట్ ఇవ్వక పోవడం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అవమానిస్తున్నారు? రాష్ట్రాన్ని అవమానిస్తారా అని ఆయన మండిపడ్డారు. ప్రజలే మనకు హైకమాండ్, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యమని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. -
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
-
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
సాక్షి, అమరావతి: రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటంతో అమరావతి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కసరత్తు కొలిక్కిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో నేడు భేటీ కానున్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వీరితో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని అభ్యర్ధుల కసరత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు సీట్లకే పోటీచేయాలని టీడీపీ భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తారని ఎస్సీ, బీసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధానిలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. -
బీజేపీపై చంద్రబాబు మండిపాటు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం, ప్రజా ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం వల్లే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామన్నారు. హోదాతో పాటు అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు బలహీనపడ్డాయని, 42 ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి లబ్ధి చేకూర్చామని చెప్పారు. నాలుగేళ్లయినా విభజన గాయాలు మానలేదన్నారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతారా? బీజేపీపై రాయలసీమ డిక్లరేషన్పై చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రాన్ని నిధులు అడగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు. కేంద్రంతో సంప్రదింపుల్లో తాము అలక్ష్యం చేయలేదని, నిన్న కూడా సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఏపీ ఆర్ధికలోటు భర్తీకి ఫార్ములా ఇచ్చామన్న కేంద్రం వాదనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సంక్షోభాలు టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడం, టీడీపీ నాయకత్వ మార్పిడి, రాష్ట్ర విభజన, ప్రస్తుత పరిస్థితుల్లోనూ సంక్షోభం ఎదుర్కొంటున్నామని చెప్పారు. -
వెన్నుపోటు, లొంగుబాటు ఇదే బాబు చరిత్ర : వాసిరెడ్డి
సాక్షి, హైదారాబాద్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆమె మండిపడ్డారు. సీఎంకు దుబాయ్ వెళ్లడానికి సమయం ఉంది కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే టైమ్ లేదంటూ దుయ్యబట్టారు. ఏపీలో ముఖ్యమంత్రి ఉన్నారో, లేదోనన్న అనుమానం రాష్ట్ర ప్రజల్లో కలుగుతోందని అన్నారు. గత 12 రోజుల నుంచి సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని పద్మ ప్రశ్నించారు. చంద్రబాబు అసమర్థత వల్లే ఆరుకోట్ల ఆంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విషయంలో రాష్ట్రంలోని అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖం చూపించలేని స్థితిలో బాబు ఉన్నారంటూ దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు వెనుకేసుకొచ్చారని ఆమె మండిపడ్డారు. ఆంధ్రులంటే ఆత్మాభిమానం, ఆంధ్రులంటే పౌరుషానికి ప్రతీకలని, అలాంటి ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించని చంద్రబాబుకు ఏశిక్ష వేయాలంటూ ప్రశ్నించారు. వెన్నుపోటు, లొంగుబాటు చంద్రబాబు చరిత్ర అని వాసిరెడ్డి మండిపడ్డారు. ఆనాడు అధికారంలో ఉన్న ఎన్టీఆర్ను కుర్చీ దింపి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అధికారం ఇచ్చిన ప్రజలను వెన్ను పోటు పొడిచారని విమర్శించారు. అంతేకుండా ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడానికే కేంద్రానికి లొంగిపోయారని, అందుకే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా 12రోజుల నుంచి కనిపించడం లేదని, అజ్ఞాతవాసంలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ అనకపోయినా, తెలుగుదేశం ఎంపీలు ఏదో అన్నట్లుగా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో ఏపీకి జరిగన అన్యాయం గురించి తెలుగుదేశం ఎంపీలు ప్రశ్నించారా అని నిలదీశారు. టీడీపీ ఎంపీలు ఏమి సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నప్పుడు ఎంపీలు వెనక నుంచి బల్లలు చరిచి తమ మద్దతు తెలిపిన విషయాన్ని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. తెలుగుదేశం ఎంపీలు డ్రామాలు బాగా ఆడుతున్నారని, వచ్చే ఏడాది అన్న నంది అవార్దులు వారికే అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎంపీలు కలరింగ్ ఇవ్వడం మానుకోవాలంటూ వాసిరెడ్డి పద్మ సూచించారు. -
చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీ ప్రజలు నష్టపోతున్నారు
-
'సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి'
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీలు ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఐదేళ్లలో ఏపీకి 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిందని.. అయితే ఇప్పటివరకు రూ. 12,700 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఏపీకి చేస్తున్న అన్యాయంలో బీజేపీ పాపమెంతో.. టీడీపీది కూడా అంతే ఉందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యమనే సంగతి మర్చిపోకూడదని తెలిపారు. టీడీపీ తన పాపాలను బీజేపీ మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఎన్టీఏలో భాగస్వామి అయిన టీడీపీ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రపోతోందన్నారు. గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బాగా సహాయం చేస్తుందని టీడీపీ నేతలు అసెంబ్లీలో స్వీట్లు పంచుకున్నారని తులసీ రెడ్డి గుర్తుచేశారు. -
టీడీపీలో ‘గల్లా’ కలకలం!
సాక్షి, అమరావతి: టీడీపీలో ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం కలకలం రేపింది. అధికార పార్టీ ఎంపీల మధ్య విభేదాలు టీడీపీ అధినేత చంద్రబాబు సాక్షిగా బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆదివారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కృష్ణా జిల్లా ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గైర్హజరయ్యారు. విజయవాడలో ఉన్నప్పటికీ కేశినేని నాని సమావేశానికి రాలేదు. గల్లా జయదేవ్కు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తితోనే వీరు సమావేశానికి గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వర్గీయులుగా ముద్రపడిన కేశినేని, నారాయణరావు సమావేశానికి రాకపోవడంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. హంగామా అవసరమా..? మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుతో కలిసి చేసిన హంగామా చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమీ సాధించకుండానే విజయోత్సవాలు నిర్వహించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని సరి చేసేందుకు కేంద్రం ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ, ఏదో సాధించినట్టు టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయకపోయినా సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల్లో చెలరేగిన అసంతృప్తి ఏవిధంగా మారుతుందోన్న చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై మిత్రపక్షంగా తాము అసంతృప్తిగా ఉన్నామంటూనే టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం కొసమెరుపు. -
టీడీపీ ఎంపీల విజయోత్సవ ర్యాలీలు.. విస్తుపోయిన జనం!
సాక్షి, అమరావతి : పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గుంటూరు, మంగళగిరిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు జయజయధ్వానాలతో వీరికి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ ఎంపీల సంబరాలను చూసి జనం విస్తుపోతున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదాపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఈ విషయమై పార్లమెంటు వేదికగా ఆందోళన డ్రామాలు నిర్వహించిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా.. సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఎంపీ గల్లా జయదేశ్ ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంటులో ప్రసంగించారు. హోదాకు బదులు ప్యాకేజీ కావాలని ఆయన కోరారు. గల్లా జయదేవ్ బాగా ప్రసంగించారంటూ టీడీపీ నేతలు ప్రశంసిస్తుండటం గమనార్హం. పార్లమెంటులో నాలుగురోజులపాటు ఆందోళనల పేరిట హైడ్రామా నడిపిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు కేంద్రం తీరుపై నోరు మెదపడం లేదు. అంతేకాకుండా కేంద్రం దగ్గర అన్నీ సాధించామన్నట్టుగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ ఎంపీల తీరును చూసి జనం ఇదేమి చోద్యమని విస్తుపోతున్నారు. -
ఇంకా డ్రామాలను నమ్మరు : బొత్స
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ప్రజలందరికీ తెలుసని, హామీల అమలు కోసం బంద్ చేస్తే అరెస్టులు చేశారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘టీడీపీ ఎంపీలు రాజకీయ డ్రామాలు మొదలుపెట్టారు. కేంద్రంపై ఒత్తిడి చేయకుండా నాటకాలుఆడుతున్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్ను పణంగా పెట్టారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు?. టీడీపీ నేతల అవినీతి పరాకాష్టకు చేరింది. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు ఏమయ్యాయి. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.’ అని అన్నారు. -
హోదా వద్దనటానికి మీరెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో స్వయంగా నాటి ప్రధాని హామీ ఇస్తే.. ఇప్పుడు దాన్ని వదులుకునే హక్కు టీడీపీకి ఎవరిచ్చారని వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్రెడ్డి, వి.విజయసాయిరెడ్డి ధర్నా నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. హోదా వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. హోదా సంగతే మరిచిన టీడీపీ.. టీడీపీ చిత్తశుద్ధి తేటతెల్లమైందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగినా ప్రజలు ఆ పార్టీని నమ్మరని ఎంపీ మేకపాటి రాజమోహ న్రెడ్డి పేర్కొన్నారు. ‘టీడీపీ సభ్యుల్లా మేం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించం. నిరసన అంటే నిరసనే. నిబంధన అంటే నిబంధనే. మేం నమ్మిన సిద్ధాంతాల మేరకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మా పోరాటం కొనసాగుతుంది..’ అని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ ప్రత్యేక హోదా ఊసే మరచిపోయిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ‘మరీ ఎంత దారు ణమంటే.. వాళ్ల (టీడీపీ) ఎంపీ లోక్సభలో మాట్లాడుతూ ప్యాకేజీ ఇస్తామంటే ప్రత్యేక హోదా వదిలేశామని అన్నారు. ప్రత్యేక హోదా వదిలేసేందుకు మీకు అధికారం ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రజలు వద్దన్నారా? వీళ్లెవరు హోదా వదిలేయడానికి? ప్రత్యేక హోదా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాడుతోంది. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పార్లమెంటులో, బయటా ప్లకార్డులు పట్టుకుని నిరసన ఎలా తెలియజేస్తారు? రాష్ట్ర ప్రజలు వారికి తగిన సమయంలో గుణపాఠం తెలియచేస్తారు..’ అని పేర్కొన్నారు. ఏపీకి చట్టం ప్రకారం కేబీకే, బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వాలని ఎంపీ వరప్రసాదరావు డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. మేం ఎన్నికల కోసం పోరాటం చేయడం లేదు. ప్రత్యేక హోదాపై టీడీపీ రాజీ పడి ప్యాకేజీకి ఒప్పుకొంది. ఇప్పుడు కూడా రాజీపడుతోంది..’ అని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. సభలో వైఎస్సార్ సీపీ ఎంపీల నిరసన ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, వైఎస్ అవినాష్రెడ్డి వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా వెల్లో నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో పోతరాజు విన్యాసాలు ప్రదర్శించి అదే వేషంతో సభలోకి రావటంతో.. ‘ప్రతి రోజూ ఇలా చేయడం సరికాదు..’ అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగా వైఎస్సార్సీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. అనంతరం 12.10 సమయంలో స్పీకర్ సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు. ఏమిటీ అన్యాయం? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి జరగటం అసాధ్యమని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీలే న్యాయం కావాలని డిమాండ్ చేయటం ఏమిటని నిలదీశారు. ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించి విభజన హామీలను నెరవేర్చాలని రాజ్యసభలో వెల్లో నిలబడి ప్లకార్డును ప్రదర్శించారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభాపతి స్థానంలో ఉన్న బస్వరాజ్ పాటిల్ను కోరి రెండు నిమిషాలు మాట్లాడారు. -
రెడీ 1, 2, 3 స్టార్ట్ యాక్షన్..
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసమర్ధతను కప్పిపుచ్చుకోనేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు రోజుకో విషయాన్ని అనుకున్న విధంగా రక్తి కట్టిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయకున్నా, నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతున్నా ఒక్కసారైనా నోరు విప్పని అధికార తెలుగుదేశం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తోంది. ఎప్పటిలాగే అనుకూల మీడియా ద్వారా లీకులిస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంట్లో టీడీపీ ఎంపీల పోరాటం అంటూ భజన బ్యాచ్తో డబ్బులు కొట్టించుకొంటోంది. ఇందులో భాగంగానే దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం తెలుగుదేశం ఎంపీలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అందరూ అనుకునే విధంగానే పార్లమెంట్లో విభజన చట్టంలోని హామీల అమలుకు గట్టిగా పోరాటాలంటూ ఊకదంపుడు కార్యక్రమం జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లడుతున్నప్పుడు ఏమాత్రం చప్పుడు చేయకుండా కూర్చున్న టీడీపీ ఎంపీలు, అదే తీరును ఉభయసభల్లో శుక్రవారం కూడా అదే తీరును అనుసరించాలంటూ తీర్మానించారు. గురువారం లోక్సభలో అరుణ్ జైట్లీ ప్రసంగిస్తున్నప్పుడు టీడీపీ నేత, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి సభలో బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ప్రకటన అద్భుతం అంటూ పరోక్షంగా చెప్పేశారు. టీడీపీ ఎంపీలు కూడా నోరుమెదపకుండా మౌనం దాల్చారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇది పసిగట్టిన టీడీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. -
మీరే ఆమోదించి.. మీరే నిరసనలా?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు సమష్టి బాధ్యత నుంచి తప్పుకొని రాష్ట్రపతి ప్రసంగంపై నిరసనలకు దిగటంపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగాన్ని మీరే ఆమోదించి మీరే నిరసనలకు దిగటం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేశారు. అరుణ్జైట్లీ బడ్జెట్పై సమాధానం ఇస్తుండగా... ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కోరారు. ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ జోక్యం చేసుకుంటూ ఈ అంశాన్ని జైట్లీ దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నందున మంత్రి పదవికి రాజీనామా చేయటం మినహా సుజనాకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ చైర్మన్ జోక్యం చేసుకుంటూ..సుజనా చౌదరి కేంద్రానికి సూచన మాత్రమే చేసినందున ఇందులో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంశం తలెత్తదన్నారు. -
మౌనమెందుకు బాబు ?
-
వెనక్కి తగ్గిన టీడీపీ.. ఆందోళనపథంలోనే వైఎస్ఆర్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరుబాట కొనసాగిస్తుండగా.. అధికార టీడీపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు తమ ఆందోళన విరమించారు. మరోవైపు.. టీడీపీ ఎంపీలు నిర్వహించిన ఆందోళనకు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి దూరంగా ఉండటం గమనార్హం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ఆందోళన కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిర్ణయించారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో కొత్త విషయం లేదని వారు స్పష్టం చేశారు. గతంలో చెప్పినవాటినే జైట్లీ మళ్లీ చెప్పారని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము వెనక్కితగ్గబోమని వైఎస్ఆర్సీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. పార్లమెంటు లోపల, బయట తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. -
టీడీపీ ఎంపీలూ.. ప్లకార్డులు మాకు కాదు ప్రధానికి చూపండి!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో తాజాగా టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన వ్యవహారంపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వమే టీడీపీ ఎంపీలతో ఆందోళన చేయిస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ ఎంపీలు ప్లకార్డులు తమ ముందు కాదు.. ప్రధాని మోదీ ముందు ప్రదర్శించాలని ఖర్గే సూచించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్లమెంటులో ఆందోళనకు దిగడంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం రాజ్యసభ జరిగిన తీరుకు నిరసనగా సభను విపక్షాలు బహిష్కరించాయి. మంగళవారం రోజంతా సభను బహిష్కరించాలని నిర్ణయించాయి. -
‘సుజనా, అశోక్ అందుకే రాలేదు’
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, అందుకే టీడీపీ పోరాటం చేస్తోందని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మంత్రులు, ఎంపీల వద్ద ప్రస్తావించారని సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యక్తిగత ఆరోపణలు చేశారని, వీటిని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్ర మంత్రులు అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి వేరే పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్లే పార్లమెంట్లో ఆవరణలో టీడీపీ ఎంపీలు నిర్వహించిన నిరసనలో పాల్గొనలేదని వెల్లడించారు. మంత్రుల గైర్హాజరుపై విభిన్న కథనాలు విన్పిస్తున్నాయి. తమ పదవులకు ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే టీడీపీ మంత్రులు తమ కార్యాలయాలకే పరిమితమైయారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతూ, అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న భయంతోనే ఇద్దరు మంత్రులు ధర్నాలో పాల్గొనలేదని ప్రచారం జరుగుతోంది. ధర్నాకు ఎందుకు రాలేదన్న దానిపై మంత్రులు నోరు విప్పలేదు. రాజ్నాథ్తో భేటీ తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఏడాదిలోగా అన్ని హామీలు అమలయ్యేలా చొరవ చూపాలని రాజ్నాథ్కు విజ్ఞప్తి చేశారు. -
అసంతృప్తే.. ఆగ్రహం వద్దు..!
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేయాలే తప్ప తొందరపాటు ప్రకటనలు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు, మంత్రులకు నిర్దేశించారు. బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని, భాగస్వామ్య పక్షంగా టీడీపీకి ఇది తీవ్రమైన అంశమని, అయినప్పటికీ వెంటనే ఓ నిర్ణయానికి రాలేమని, ఆచితూచి స్పందించాల్సి ఉందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై గురువారం చంద్రబాబు టీడీపీ ఎంపీలు, మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తొలుత ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో కొనసాగడం మంచిది కాదని పలువురు ఎంపీలు చెప్పగా.. తామంతా రాజీనామాలు చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ అన్నట్టు సమాచారం. రాజీనామాలకంటే ఈ బడ్జెట్ సమావేశాల్ని బహిష్కరించడం ద్వారా నిరసన తెలిపితే బాగుంటుందని మరికొందరు ఎంపీలు అభిప్రాయపడగా, కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని ఒకరిద్దరు సూచించారు. అందరి మాటలు విన్న చంద్రబాబు ఆవేశపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని, ఎంపీలు తొందరపాటుగా ఎక్కడా మాట్లాడవద్దని సూచించారు. ఆదివారం జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించాక ఓ నిర్ణయానికి వద్దామని, అప్పటివరకు ఆచితూచి స్పందించాలన్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరితో ఆయన విడిగా మాట్లాడి ఢిల్లీ పరిణామాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై బడ్జెట్పై ఎలా మాట్లాడాలనే దానిపై సూచనలు చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోకున్నా ఎన్డీయేను టీడీపీ వదలట్లేదనే భావన ప్రజల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఇబ్బంది వస్తుందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. సీఎం స్పందిస్తూ.. కేంద్రంపై ఒత్తిడి చేయడమే మన ముందున్న మార్గమని, అంతకుమించి ఎక్కువ చేయొద్దని స్పష్టం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చెప్పాలని, నేరుగా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేయొద్దని సూచించారు. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిద్దామని, కేంద్రమంత్రులను కలవడమా? నిరసన తెలపడమా? ఇంకా గట్టిగా ఒత్తిడి తేవడమా? అనే విషయాన్ని రెండురోజుల్లో నిర్ణయిద్దామని చెప్పారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోతామని, దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
రైతులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం
చంద్రబాబుపై ధ్వజమెత్తిన బొత్స సాక్షి, హైదరాబాద్: ఓవైపు కరవు, మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆంధ్రప్రదేశ్లో రైతాంగం అల్లాడుతూ ఉంటే వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఎన్డీయే సమావేశాలకు వెళ్లి అక్కడ ఎన్డీయే తరఫున మీడియా సమావేశాల్లో మాట్లాడటం ఆపి ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు సఖ్యతగా ఉన్నందువల్ల, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వల్ల రాష్ట్రానికి, రైతుకు ఏం ఒరిగిందని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంతో స్నేహంగా ఉండటంలో తప్పులేదని, దానివల్ల రాష్ట్రానికి మేలు జరగాలని చెప్పారు. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ కనుచూపు మేరలో కన్పించడం లేదని విమర్శించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేసి తక్షణం మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు టీడీపీ ఎంపీలు సభలోనే ఉన్నా తమ నోళ్లకు ప్లాస్టర్లు వేసుకున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
పోలవరం అదనపు భారం ఎవరు భరించాలి?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 తర్వాత పెరిగిన అంచనాల వ్యయం అదనపు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి రాజ్యసభలో పిడుగు లాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తే టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఇంత ముఖ్యమైన అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు టీడీపీ ఎంపీలు నక్కి నక్కి దాక్కొని తెలుగు ప్రజల గొంతు కోశారనిఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు ఈ అదనపు భారం ఎవరు భరించాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. విభజన చట్టం ప్రకారం పూర్తి నిధులతో కేంద్రమే నిర్మించి ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. ఎప్పటికప్పుడు అంచనా వ్యయాలను పంపిస్తున్నట్లు చెబుతున్న సీఎం.. కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్పై ప్రతీ దానికీ విమర్శలతో నానా యాగీ చేసే టీడీపీ నేతలు రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన చేస్తూంటే ఎక్కడున్నారని గడికోట ప్రశ్నించారు. ‘ఈ ప్రాజెక్టు వ్యయాన్నంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తాం అంటే మీకు నొప్పి ఏంటి?’ అని చంద్రబాబు అన్నారని, ఇపుడు ఉమాభారతి మాటలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. -
‘జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి’
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఉద్దేశించి టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వ్యవస్థకు కళంకం తెస్తున్నారని, జేసీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని బొత్స సూటిగా ప్రశ్నించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవస్థలతో పాటు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అదే విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్తున్నారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, స్పీకర్ల అధికారాలకు పరిమితి ఉండాలని బొత్స అన్నారు. కాగా ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏమీ చేయలేరని, ఆయన అధికారాలు నామమాత్రమేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నాం: టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై పార్లమెంటులో రెండ్రోజులుగా చేస్తున్న ఆందోళనకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ బుధవారమిక్కడ తెలిపారు. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో హామీ ఇచ్చినందున.. అమలుకు కొంత సమయం ఇవ్వాలనే ఆందోళనకు విరామం ప్రకటించామన్నారు. ప్రత్యేక హోదాపై లోక్సభలో చర్చకు పట్టుపడతామని పేర్కొన్నారు. హోదా అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సీఎం చంద్రబాబు సూచనలిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే హోదా ఇచ్చే వరకు.. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టే ఏ బిల్లుకూ మద్దతు ఇవ్వకూడదని సవాల్ విసిరారు. -
అంతా మీ వల్లే జరిగింది
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో మీ వల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోయామని టీడీపీ ఎంపీలు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. సభలో హోదాపై ఎప్పుడు ఏ వైఖరి తీసుకోవాలో తమకు సరైన సమయంలో సరైన సమాచారం అందలేదని, దీంతో అరుణ్జైట్లీ ప్రసంగం అనంతరం సరిగ్గా స్పందించకలేకపోయామని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. హోదా విషయంలో రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీయడంలో టీడీపీ విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఆదివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఏపీ, తెలంగాణ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాజ్యసభలో మన ఎంపీల చర్యల వల్ల పార్టీ ఇబ్బంది పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన రాజ్యసభ సభ్యులు మిత్రపక్షంగా ఉండి కేంద్ర మంత్రి జైట్లీ సమాధానానికి వ్యతిరేకంగా వాకౌట్ చేస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో మిన్నకుండిపోయామని చెప్పినట్లు తెలిసింది. సభలో ఎలా వ్యవహరించాలి? ఏం మాట్లాడాలి? అనే అంశాలను గతంలో మాదిరిగా చీటీలు రాసి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు పంపుతున్నానని చంద్రబాబు చెప్పగా తమకు అవి ఆలస్యంగా అందాయని, ఈ సమాచార లోపం వల్లే పరిస్థితి ఇంత దాకా వచ్చిందని ఎంపీలు వివరించినట్లు తెలిసింది. భవిష్యత్లో సమాచార లోపం లేకుండా చూసుకుందామని చంద్రబాబు సర్ది చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాలుగు దశల్లో ఆందోళన రాష్ర్టం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నాలుగు దశల్లో ఆందోళన చేపట్టాలని ఈ సమావేశంలో అనుకున్నట్లు తెలిసింది. తొలుత బాధను వ్యక్తం చేయటం, తరువాత ఆవేదన చెందటం, ఆ త రువాత ఆగ్రహం వ్యక్త పరచటం, అంతిమంగా ఆందోళన చేయటం అనే దశ లను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడదామనే ప్రతిపాదనను సీఎం తిరస్కరించినట్లు సమాచారం. ఒకవైపు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను కోరుతూ మరోవైపు వాయిదా తీర్మానం అంటే మంచి సంకేతాలు చంద్రబాబు చెప్పారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం చేశారు, ఇంకా ఏం చేయాలో వివరించనున్నారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తాము పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి హోదా ఎంత అవసరమో కేంద్రానికి తెలిపేలా వినూత్న తరహాలో నిరసనలు తెలుపుతామని రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మోదీకి ప్రధాన శత్రువు చంద్రబాబు: జేసీ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన శత్రువు చంద్రబాబు అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. మోదీ తరువాత ప్రధానమంత్రి పదవికి పోటీపడే వ్యక్తులు దేశంలో చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మాత్రమేనని చెప్పారు. చంద్రబాబును ఎలా అణగదొక్కాలా? అని బీజేపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో టీడీపీకి విడాకులు తప్పవని, అది ఎప్పుడనేది వేచి చూడాలన్నారు. -
'బీజేపీ, కాంగ్రెస్ కలసి అన్యాయం చేశాయి'
విజయవాడ : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ.... బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు అసలు సంబంధమే లేదన్నారు. ఆర్థిక సంఘం పేరు చెప్పి బీజేపీ తప్పించుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయం వివరిస్తారని చెప్పారు. ప్రధాని సమాధానం చెప్పిన తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వనరులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్తోపాటు ప్రజలను ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఖచ్చితంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆందోళనకు పిలుపు ఇచ్చే పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇక్కడ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని... బంద్లతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షానికి సూచించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నిరసన ఉండాలి... మళ్లీ అదే సమయంలో నష్టం కలగకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్నామని అందుకే సంకీర్ణ ధర్మాన్ని తాము పాటిస్తున్నట్లు వివరించారు. ప్రధాని వద్దకు అఖిల పక్షం వెళ్తే ఏం చేస్తుంది ? దాని వల్ల లాభం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదారు మంది వెళ్తే ఏం జరుగుతుంది... ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లి ఓ వినతిపత్రం ఇస్తే సరిపోతుందా? అని చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలపాలంటే బంద్లు అవసరం లేదని ... మొక్కలు నాటండి... రోడ్లు ఊడ్చండి అని రాజకీయ పార్టీలకు చంద్రబాబు సూచించారు. -
ఎందుకీ అంతులేని సహనం?
త్రికాలమ్ రాజ్యసభలో మాట్లాడే టీడీపీ సభ్యులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రత్యేక హోదా లేదంటూ జైట్లీ స్పష్టం చేస్తుంటే ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారో ఇప్పుడైనా చెప్పండి అంటూ సుజనా చౌదరి అడుగు తున్నారు. సీఎం రమేశ్ కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడలేక పోయారు. అధినాయకుడి ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. స్వయంగా రాజకీయ వైఖరి తీసుకునే అనుభవం కానీ సాహసం కానీ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే చంద్రబాబు హర్షిస్తారో, కోపగిస్తారోనన్న సందేహం. ఆ స్పష్టత నాయకుడికి సైతం లేదు. ‘పొమ్మంటే పోతాం’ అంటూ చంద్రబాబు రాజ్యసభ చర్చ తర్వాత వ్యాఖ్యానించినట్టు వార్తాకథనాలు వచ్చాయి. ఇంత పొగపెట్టిన తర్వాత పొమ్మని వేరే చెప్పాలా? ఢిల్లీ వెడితే ప్రధాని ఇంటర్వ్యూ దొరకదు. సుజనా చౌదరికి కోరిన శాఖ ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో శుక్రవారం చేసిన ప్రసంగం తర్వాత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందని భావించడం సహజం. ఇంతకంటే మిత్రద్రోహం మరొకటి ఉంటుందా అని అదేరోజు రాత్రి మీడియా గోష్ఠిలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమితమైన ఆవేదన వెలిబుచ్చారు కానీ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం లేదు. అవ మానం జరిగినా, వాగ్దానభంగం జరిగినా ఎందుకింత సహనం పాటిస్తున్నది? ‘ఒక రాజకీయ నాయకుడు స్వార్థచింతన లేకుండా కృషి చేస్తే ఏదైనా సాధిం చవచ్చునని వెంకయ్యనాయుడు నిరూపించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడానికి కారకుడుగా ఏ ఒక్క వ్యక్తి పేరు అయినా చెప్పవచ్చుననుకుంటే ఆ వ్యక్తి మీ జిల్లాలోనే పుట్టిన వెంకయ్యనాయుడు...’- ఎన్నికల ముందు నెల్లూ రులో జరిగిన సభలో నరేంద్రమోదీ హిందీలో చేసిన ప్రసంగానికి వెంకయ్యనా యుడు స్వయంగా తెలుగులోకి చేసిన అనువాదం ఇది. వేదికపైన కూర్చున్న చంద్రబాబునాయుడు రుమాలుతో ముఖం తుడుచుకుంటూ నాటి దృశ్యంలో కనిపించారు. తిరుపతి నుంచి విశాఖపట్టణం వరకూ మోదీ ప్రసంగించిన నాలుగు ఎన్నికల సభలలో ఇదే వరుస. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా అంతకు మించి చేస్తామంటూ వాగ్దానం. అరుణ్జైట్లీ స్పష్టీకరణ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపైన జరిగిన లఘు చర్చకు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సమా ధానం చెబుతూ, కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉన్న ఆర్థిక సమస్యలను ఏకరవు పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 42 శాతం (ఇదివరకు 32 శాతమే ఉండేది) రాష్ట్రాలకే దక్కాలంటూ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును ఆమోదించిన ఫలితంగా కేంద్రం దగ్గర నిధులు పెద్దగా మిగలవనీ, మిగిలిన నిధులతోనే కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు జరగాలనీ, రక్షణ అవసరాలూ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతనాతాలూ, ఇతర ఖర్చులు సకలం ఆ నిధులతోనే నిర్వహించాలనీ చెప్పుకొచ్చారు. పైగా ఈ సంవత్సరం కేంద్రం 3.9 శాతం ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నదని అన్నారు. అరుణ్జైట్లీ తేల్చిందేమంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మంజూరు చేయడం సాధ్యం కాదని. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడూ, అరుణ్జైట్లీ పట్టుబడితే అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదాకు అంగీకరించారు. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదిస్తే, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. మార్చి ఒకటిన రాజపత్రం విడుదలయింది. మార్చి 2న కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదాను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. జూన్ 2న అధికారి కంగా రాష్ట్ర విభజన అమలు జరిగింది. ఎన్నికల సభలలో వెంకయ్య నాయుడు పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉండాలంటే, పదిహేనేళ్ళు ఉంటేనే ప్రయోజనం అంటూ చంద్రబాబునాయుడు వాదించారు. ఎన్నికలు జరిగాయి. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. మోదీ ప్రభంజనం సహకా రంతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలుపొందింది. మోదీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసి ఇరవై ఆరు మాసాలు గడిచాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ మంత్రిమండలిలో వెంకయ్యనాయుడు ముఖ్యమైన మంత్రి. మోదీ తర్వాత స్థానం అరుణ్జైట్లీదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునా యుడు ఉన్నారు. రాజ్యసభలో రాబట్టుకున్న, ఎన్నికల సభలలో అదేపనిగా ప్రచారం చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి అభ్యంతరం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి అధికారం హస్తగతం చేసుకొని రెండు సంవత్స రాలు దాటిన తర్వాత సైతం హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయక పోగా కాంగ్రెస్ను నిందించడంలో అర్థం ఉన్నదా? టీడీపీ ఏమి చేసింది? అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని దుయ్యపడుతూ ఇంకా ఎంత కాలం టీడీపీ, బీజేపీలు పబ్బం గడుపుకుంటాయి. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ కొన్ని సూచనలు చేసింది, కొన్ని హామీలు కావాలంటూ పట్టుపట్టింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీటీపీ ఏమి చేసింది? ‘దమ్ముంటే విభజన బిల్లు పెట్టండి. మేం సహకరిస్తాం’ అని పదే పదే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సవాలు విసరడమే కానీ బిల్లును ప్రతిపాదించిన తర్వాత సవరణలు ఏమైనా టీడీపీ ప్రతిపాదించిందా? అవిభక్త ఆంధ్రప్రదేశ్ను తొమ్మిది సంవత్స రాలు పరిపాలించిన విశేషానుభవం కలిగిన చంద్రబాబునాయుడికి రాష్ట్ర విభ జన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటో తెలుసు. వాటి పరిష్కారానికి బిల్లు లలో ఏయే అంశాలు పొందుపరచాలో తెలుసు. సోనియాగాందీతోనో, మన్మో హన్సింగ్తోనో, బిల్లును రూపొందించిన జైరాం రమేశ్తోనో చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ ప్రతినిధి బృందం కూర్చొని సమాలోచనలు జరిపి ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది. టీడీపీ సలహాలను తిరస్కరిస్తే నేరం కాంగ్రెస్ది అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేసిన ప్పుడు విభజనకు తన లేఖే కారణమంటూ చెప్పుకున్న చంద్రబాబునాయుడు తనకు బొత్తిగా ఇష్టం లేకుండానే విభజన జరిగినట్టూ, అది అడ్డగోలుగా జరిగి నట్టూ ప్రచారం చేయడంలో మర్మం ఏమిటి? విభజన చంద్రబాబునాయుడు అంగీకారంతోనే జరిగింది. విభజన బిల్లులో బీజేపీ ప్రతిపాదించిన కొన్ని సవరణలను మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. బిల్లులో లేని ప్రత్యేక హోదాపైన కూడా మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా కేంద్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. సవరణలు సూచించకుండా, సలహాలు ఇవ్వకుండా బిల్లుపైన చర్చ జరగడానికి సహకరించకుండా రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందంటూ నిందించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. నరేంద్రమోదీ స్వతంత్ర ప్రధాని. వాజపేయి లాగా సంకీర్ణధర్మం పాటించ వలసిన అవసరం మోదీకి లేదు. బీజేపీకి సొంతంగా లోక్సభలో మెజారిటీ ఉన్నది. అందుకే చంద్రబాబునాయుడు ఇదివరకు ఢిల్లీలో చక్రం తిప్పినట్టు ఇప్పుడు తిప్పలేక తిప్పలు పడుతున్నారు. శాసనసభ స్థానాలు పెంచుతారనే ఆశ చూపించి ప్రతిపక్షం నుంచి శాసనసభ్యులను ఆకర్షించారు. తీరా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చిచెప్పడం చంద్రబాబునాయుడికి మోదీ హయాంలో తగిలిన రెండో ఎదురుదెబ్బ. పైకి ఏమి చెప్పినా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోదనే సంకేతం చంద్రబాబునాయుడికి చాలా కాలం కిందటే అందింది. ఆయన వ్యూహాత్మకంగా అరుణ్జైట్లీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. అందుకే ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ, దాని వల్ల అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయను కోవడం పొరబాటంటూ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో అరుణ్జైట్లీ ప్రసంగించిన తీరు తనకు బాధ కలిగించిందని ముఖ్యమంత్రి ఖేదం వెలిబుచ్చారు. సభలో గట్టిగా మాట్లాడనందుకు టీడీపీ సభ్యులను ఆయన గట్టిగా మందలించినట్టు కూడా కొన్ని పత్రికలలో వచ్చింది. రాజ్యసభలో మాట్లాడే టీడీపీ సభ్యులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రత్యేక హోదా లేదంటూ జైట్లీ స్పష్టం చేస్తుంటే ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారో ఇప్పుడైనా చెప్పండి అంటూ సుజనా చౌదరి అడుగుతున్నారు. సీఎం రమేశ్ కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడలేకపోయారు. అధినాయకుడి ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. స్వయంగా రాజకీయ వైఖరి తీసుకునే అనుభవం కానీ సాహసం కానీ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే చంద్రబాబు హర్షిస్తారో, కోపగిస్తారోనన్న సందేహం. ఆ స్పష్టత నాయకుడికి సైతం లేదు. ‘పొమ్మంటే పోతాం’ అంటూ చంద్రబాబు రాజ్యసభ చర్చ తర్వాత వ్యాఖ్యానిం చినట్టు వార్తాకథనాలు వచ్చాయి. ఇంత పొగపెట్టిన తర్వాత పొమ్మని వేరే చెప్పాలా? ఢిల్లీ వెడితే ప్రధాని ఇంటర్వ్యూ దొరకదు. సుజనా చౌదరికి కోరిన శాఖ ఇవ్వరు. అసెంబ్లీ స్థానాలు పెంచడం లేదని స్పష్టం చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపిస్తారు. ఈ చర్యలన్నీ అమిత్ర వైఖరినే సూచి స్తున్నాయి కదా! ప్రధానమంత్రి వైఖరి అట్లా ఉంటే, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయ కులు టీడీపీ పరిష్వంగంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తున్నారు. సఖ్యతే సంజీవని కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయో జనం ఏమీలేదు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కొంత వెసులుబాటు ఉండే మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తే అనేక రకాల చిరాకులు, చిక్కులు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఈసారి వ్యవహరి స్తున్న తీరు ఇదివరకటి కంటే భిన్నం. వేల ఎకరాల భూమి సేకరించడం, సింగ పూర్ ప్రభుత్వంతో, అక్కడి ప్రైవేటు కంపెనీలతో నేరుగా లావాదేవీలు పెట్టుకో వడం వంటి అంశాలపై ఎవరు కోర్టులో పిటిషన్ వేసినా, కోర్టు విచారణ జరిపి సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ నిర్ణయించినా ఇబ్బందే. నరేంద్రమోదీ రాజకీయ ప్రత్యర్థులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో గమనించినవారు ఆయ నతో సున్నం వేసుకునే సాహసం చేయరు. ఎవరు ఏమి చెప్పినా సీబీఐ స్వతం త్రంగా వ్యవహరించే మాట కల్ల. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో బలమైన ఆయుధం. సోనియా అయినా మోదీ అయినా తేడా లేదు. పైగా ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగితే ఆ స్థానం భర్తీ చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. టీడీపీ అధినేతను భ్రష్టుపట్టించాలనుకుంటే ఓటుకు నోటు వ్యవహారం ఒక్కటే చాలు. రాజ్యసభ తాజా ఉదంతం వల్ల ప్రజలకు తెలిసి వచ్చింది ఏమిటంటే బీజేపీ, టీడీపీలు మరి కొంతకాలం కలసి కాపురం చేస్తాయి. కనీసం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే వరకూ చంద్రబాబునాయుడు ఓపికపడతారు. ఢిల్లీ, బిహార్లో లాగా యూపీలో కూడా బీజేపీ బోర్లపడితే టీడీపీ ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే బిహార్, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాలు అడుగుతాయని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన నరేంద్రమోదీకి తెలియదా? రాజ్యసభలో మన్మోహన్సింగ్ చేత వాగ్దానం చేయించిన వెంకయ్య నాయుడికీ, అరుణ్జైట్లీకీ తెలియదా? వారిద్దరూ లోగడ కేంద్రమంత్రులుగా పనిచేసిన జాతీయస్థాయి నాయకులు. అందరికీ తెలుసు. అమలు చేయడం అసాధ్యమని తెలిసి కూడా బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలకు పాతర వేయడం ఆనవాయితీగా మారితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. ఆర్థిక ప్రవీణులతో ఒక సంఘాన్ని ఎన్నికల కమిషన్ నియమించాలి. అన్ని రాజకీయ పార్టీలూ తమ ఎన్నికల ప్రణాళిలలో చేసిన వాగ్దానాల సాధ్యా సాధ్యాలను ఆ సంఘం పరిశీలించాలి. సాధ్యమని భావించిన వాగ్దానాలనే ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి. సాధ్యం కావనుకున్న వాగ్దానాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయకుండా రాజకీయ పార్టీలనూ, నాయకులనూ ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలి. ఈ సంస్కరణ తక్షణం జరగకపోతే ప్రజాస్వామ్యానికి పూచీ ఉండదు. ( వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్) -
బాలయ్య వ్యాఖ్యలతో ఇరకాటంలో టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళల పట్ల అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలను మంగళవారం ఇరకాటంలో పడేశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలపై చర్చ జరుగుతున్న సమయంలోనే కొన్ని జాతీయ ఛానళ్లలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ జరిగింది. దీంతో పలువురు ఇతర పార్టీ ఎంపీలు బాలకృష్ణ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలతో ఆసక్తిగా వాకబు చేసారు. బాలకృష్ణ ఆ వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చారని, విచారం వ్యక్తం చేసారని టీడీపీ ఎంపీలు ఇబ్బందిగానే జవాబివ్వాల్సివచ్చింది. బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసారనే విషయంపై టీడీపీ ఎంపీల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. -
వాళ్లే వచ్చి పచ్చ కండువాలు కప్పుకుంటున్నారు
సాక్షి, విజయవాడ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో చేరాలని తాము ఎవ్వరినీ రమ్మనలేదని, వాళ్లే వచ్చి పచ్చ కండువాలు కప్పుకుంటున్నారని ఎంపీలు జేసీ దివాకర్రెడ్డి, సీఎం రమేష్ అన్నారు. విజయవాడలోని సీఎం కార్యాలయం మీడియా పాయింట్లో ఆదివారం వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెరిగే 50 అసెంబ్లీ స్థానాల్లో కొత్తగా చేరుతున్న ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేస్తామని సీఎం చెప్పారన్నారు. -
ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో టీడీపీ ఎంపీలు విఫలం
కర్నూలు(అర్బన్) : రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో టీడీపీ ఎంపీలు ఘోరంగా విఫల మాయ్యరని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మీనరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. శేషఫణి విమర్శిం చారు. గురువారం స్థానిక మద్దూర్నగర్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి యు వజన చట్టం సెక్షన్ 46 (3) ప్రకారం రూ.25 వేల కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. పార్లమెంట్లో సీమ టీడీపీ ఎంపీలు ఈ విషయం గురించి ఏ మాత్రం చర్చించకపోవడం దారుణమన్నారు. విభజనకు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.5 లక్షల కోట్లు అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నోరు మెదపడం లేదన్నారు. డీఆర్డీఓ, డీటీటీ, ఉర్దూ విశ్వ విద్యాలయం, వ్యవసాయ యూనివర్శిటీ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం రాయలసీమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్కుమార్, నాయకులు లక్ష్మయ్య, నాగరాజు, రంగస్వామి, మధు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీలూ.. చీరలు కట్టుకోండి!
అనంతపురం సిటీ: ప్రత్యేక హోదా విషయంలో చేతగాని మాటలు మాట్లాడుతున్న ఎంపీలు చీరలు కట్టుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం విద్యార్థి, యువజన నాయకులు, కార్యకర్తలు స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ తీసుకుని ర్యాలీగా ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడే బైఠాయించి ప్రత్యేక హోదా సాధించడం చేతగాని ఎంపీలు దివాకర్రెడ్డి, నిమ్మల కిష్టప్ప చీరలు కట్టుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.వై.ప్రసాద్, బి.రమణ మాట్లాడుతూ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. భవిష్యత్లో వీరు ఎక్కడ తిరిగినా కోడిగుడ్లు, టమాటాలతో స్వాగతం పలుకుతామన్నారు. ఎంతసేపు గడిచినా ఎవరూ రాకపోవడంతో చీర, గాజులు, పసువు కుంకుమ ఇంట్లో పెట్టి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.జాన్సన్బాబు, నరేష్, నగర కార్యదర్శి మనోహర్, కుళ్లాయప్ప, గాదిలింగ, చాంద్బాషా, రాఘవ, మోహన్, రియాజ్ పాల్గొన్నారు. -
'ప్రజలే మీ గుడ్డలు ఊడదీస్తారు'
హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలే టీడీపీ ఎంపీల గుడ్డలు ఊడదీస్తారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం తాపత్రయ పడుతూ.. రాష్ట్ర ప్రతిష్టను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్ర మంత్రి చెబుతుంటే.. మిగతా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఈనెల 10న దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నా కోసం ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు బొత్స విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన
-
చంద్రబాబుకు... పవన్ కల్యాణ్ ఓ లెక్కా ?
-
కుమ్మలాటా? కుమ్ముక్కులాటా?
-
'చిరంజీవిని మర్చిపోయావా పవన్'
హైదరాబాద్ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా ఎంపీలంతా వ్యాపారాలు చేసుకుంటున్నారని పవన్ చులకనగా మాట్లాడటంపై వారు అసంతృప్తి చెందుతున్నారు. దాంతో టీడీపీ ఎంపీలు...పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన పవన్ విమర్శిస్తే సహించేది లేదనే అభిప్రాయంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన సమయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారన్న విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకుంటే బాగుండేదని టీడీపీ ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. పవన్ తన వైఖరిని మార్చుకుంటే మంచిదని, వ్యాపారాలు చేస్తున్నంత మాత్రాన రాజకీయాల్లో ఉండకూడదా అని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా పవన్ కల్యాణ్ నిన్న ప్రెస్మీట్లో సీమాంధ్ర ఎంపీలంతా ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడిన విషయం తెలిసిందే. ఎంపీలకు పౌరుషం లేదా అని, ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న ఎన్డీఏ చెప్పాయని, ఇప్పుడు ఆమాటే మర్చిపోయాయని విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సీటు కోసం ఆ రోజు ఊగిపోయారని, ఎంపీ అయిన తర్వాత పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారా అని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. -
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
-
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
ఏలూరు: కోడిపందాలు ఆడుతు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఎంపీలు పోలీసులను డిమాండ్ చేశారు. నేతల అరెస్ట్కు నిరసనగా మంగళవారం ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. దాంతో జడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లాలోని ద్వారక తిరుమలలో కోడిపందాలు ఆడుతున్న దాదాపు 17 మంది టీడీపీ నేతలను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. అదికాక రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. దాంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్కుమార్ గతవారం హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ ప్రత్యేక హోదాకు ఉమ్మడిగా పట్టు పట్టాలి
టీడీపీ, బీజేపీ ఎంపీల సమావేశంలో నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన విధంగా ఏపీకిప్రత్యేక హోదా సాధించుకోవడానికి టీడీపీ, బీజేపీ ఎంపీలంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని రాష్ట్రంలో అధికార టీడీపీ ఎంపీలు కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా ఈ విషయంపై రెండు పార్టీల ఎంపీలూ గట్టిగా పట్టు పట్టాల్సిందేనన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ చేసిన డిమాండ్ను.. ఇప్పుడు వారి పార్టీ అధిష్టానవర్గానికి గుర్తుచేయాలని ఆ ఎంపీలను టీడీపీ ఎంపీలు కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు శనివారం విజయవాడలో తొలిసారి సమావేశమయ్యారు. టీడీపీపీ నేత సుజనాచౌదరి ఆహ్వానం మేరకు సమావేశానికి బీజేపీ ఎంపీలు సైతం హాజరయ్యారు. సమావేశం వివరాలను సుజనాచౌదరి ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. రమేష్, శివప్రసాద్ల డుమ్మా... టీడీపీ ఎంపీల సమావేశానికి ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్లు డుమ్మా కొట్టారు. సుజనా నాయకత్వంలో జరిగినందునే రమేష్ హాజరుకాలేదని సహచర ఎంపీలు వ్యాఖ్యానించారు. -
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన బీసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వీరిలో బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎంపీలు ఉన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కోరారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విన్నవించారు. టీడీపీ ఎంపీలు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. -
మీ ఎంపీలే...మిమ్మల్ని కొడుతుంటే బాబు ఏం చేస్తున్నారు?
నరసరావు పేట ఎంపీ, టీడీపీ నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్లే దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. అంతేకాని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి హితవు పలికారు. అయిన మీ పార్టీ ఎంపీలే మిమ్మల్ని కొడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుతో ఇప్పటికేనా జై సమైక్యాంధ్ర అనిపించగలరా అంటు మోదుగులకు ఆయన సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ బ్రోకర్ పార్టీగా మారిందని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. -
బాబు డెరైక్షన్లో తన్నుకున్న తమ్ముళ్లు...
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం లోక్సభలో టీడీపీ ఎంపీలు అడుగడుగునా కాంగ్రెస్ కంటే తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరించారు. అధినేత డెరైక్షన్లో సభలో తన్నుకుని నాటకాన్ని రక్తి కట్టించారు! విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలను ప్రాంతాలవారీగా ఉసిగొల్పి చోద్యం చూసిన చంద్రబాబు.. తాజాగా లోక్సభలోనూ అదే వ్యూహాన్ని పునరావృతం చేశారు. తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి అమలు చేశారు. మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసి ‘సమ న్యాయం’ పేరుతో జాతీయ నేతలను కలుస్తున్న బాబు, గురువారం ఉదయమే ఇరు ప్రాంత టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. సభలో విభజన బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించాలని, వారిపై తెలంగాణ ఎంపీలు ఎదురుదాడికి దిగాలని ‘దిశానిర్దేశం’ చేశారు. అధినేత డెరైక్షన్ మేరకు లోక్సభలో సీమాంధ్ర ఎంపీలు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, కొనకళ్ల నారాయణ, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప ముందుగా వెల్ లోకి దూసుకుపోయారు. టేబుళ్ల అద్దాలను పగలగొట్టి, మైకులు విరిచి ధ్వంసరచనకు తెర తీశారు. చేతికందిన కాగితాలనల్లా చించి విసిరేశారు. ఆ వెంటనే... బిల్లుకు అడ్డు రావొద్దంటూ తెలంగాణ టీడీపీ ఎంపీలు రమేశ్రాథోడ్, నామా నాగేశ్వరరావు వారితో వాగ్వాదానికి దిగారు. అది క్రమంగా బాహాబాహీగా పరిణమించింది. ఆ క్రమంలో పక్కనే ఉన్న ఇతర సీమాంధ్ర ఎంపీలపైనా వారు దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ంది. విపక్షాల విస్మయం: సభలో మునుపెన్నడూ జరగని ఘటనలు చోటు చేసుకోవడంతో విపక్షాలన్నీ ఒక్కసారిగా విస్తుపోయాయి. గొడవపడుతున్న సభ్యులను సముదాయించేందుకు శరద్ యాదవ్ తదితరులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సభలో కాంగ్రెస్ ఎంపీలే మార్షల్స్ అవతారమెత్తడం, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు విధ్వంసానికి పాల్పడటం, తెలంగాణ సభ్యులు బాహాబాహీకి దిగడం వంటి పరిణామాలు చూసి విపక్ష సభ్యులు విస్తుపోయారు. విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ అనుసరించిన ఎత్తుగడకు నోరెళ్లబెట్టారు. కాంగ్రెస్ డబుల్గేమ్ను ఎండగట్టారు. అయినా సిగ్గుపడ్డారు.. ఖండించారు: ఎలాగోలా విభజన బిల్లును విజయవంతంగా లోక్సభలో ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పెద్దలు లోలోపల ఆనందించారు. గురువారం నాటి పరిణామాలకు తమ ఎత్తుగడలే కారణమని తెలిసి కూడా, పైకి మాత్రం వాటిపై విచారం వ్యక్తం చేశారు. స్క్రిప్టుకు కారకుడైన మంత్రి కమల్నాథ్తో పాటు షిండే తదితరులంతా మీడియా ముందుకొచ్చి వాటిని ఖండించారు. ఎంపీల తీరు సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు! -
అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన ఎంపీలు
-
లోక్సభ వాయిదా
-
విభజనను అడ్డుకుంటాం: టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదించిన విభజన బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో సోమవారం నుంచి పోరాటాన్ని కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు. టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, సీఎం రమేష్ శుక్రవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. సెంటిమెంటులేని ఇటలీ సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని దుయ్యబట్టారు. -
ఢిల్లీలో టిడిపి ఎంపీల హైడ్రామా
-
ఢిల్లీలో టిడిపి ఎంపీల హల్చల్
-
సోనియాకు వ్యతిరేఖంగా టిడిపి ఎంపీల చెక్క భజన
-
'టీడీపీ ఎంపీలు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారు'
ఢిల్లీ:లోక్ సభలో తెలుగుదేశం సభ్యులు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని తెలంగాణ ఎంపీలు మండిపడ్డారు. సభలో టీడీపీ ఎంపీల ప్రవర్తనపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటువేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆపుతామని సీమాంధ్ర నేతల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అపోహలు పెంచుతున్నారని మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ అనేది తెలంగాణలో ఒక భాగమన్న విషయాన్ని సీమాంధ్ర నేతలు గుర్తించుకోవాలన్నారు. -
మా రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో లేవు: తెదేపా ఎంపీలు
-
‘సస్పెండ్ చేసినా పోరాటాన్ని కొనసాగిస్తాం’
ఢిల్లీ: ప్రజలకు న్యాయం జరగకుంటే పార్లమెంట్ సమావేశాలను కొనసాగనివ్వమని టీడీపీ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు సోమవారం మీడియాతో మాట్లాడారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. సీమాంధ్ర ప్రజలను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని వారు విమర్శించారు. ఏ కమిటీ నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని విభజనకు మొగ్గుచూపారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం స్వార్థపూరితమని ఎంపీలు మండిపడ్డారు. -
‘సస్పెండ్ చేసినా పోరాటాన్ని కొనసాగిస్తాం’
ఢిల్లీ: ప్రజలకు న్యాయం జరగకుంటే పార్లమెంట్ సమావేశాలను కొనసాగనివ్వమని టీడీపీ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు సోమవారం మీడియాతో మాట్లాడారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. సీమాంధ్ర ప్రజలను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని వారు విమర్శించారు. ఏ కమిటీ నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని విభజనకు మొగ్గుచూపారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం స్వార్థపూరితమని ఎంపీలు మండిపడ్డారు.