185వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | YS Jagan Prajasankalpayatra 185Th Day Starts | Sakshi
Sakshi News home page

185వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Sun, Jun 10 2018 8:45 AM | Last Updated on Thu, Jul 26 2018 7:17 PM

YS Jagan Prajasankalpayatra 185Th Day Starts - Sakshi

సాక్షి, నిడదవోలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ ​జగన్‌ ఆదివారం ఉదయం పాదయాత్రను నిడదవోలు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారవరం, మర్కొండపాడుకు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు.

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అనంతరం చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ ఇక్కడే బస చేస్తారు. వైఎస్‌ జగన్‌ మల్లవరంలో బీసీలతో ఆత్మీయ సమావేశం కానున్నారు. దారిపొడవునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement