చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు.. | YSRCP Leader Merugu Nagarjuna Fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు..

Published Sun, May 6 2018 4:37 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

YSRCP Leader Merugu Nagarjuna Fires On CM Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్రాధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆదివారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత వ్యతిరేకని విమర్శించారు. అంబేడ్కర్‌ పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.

అమరావతిలో అంబేడ్కర్‌ స్మృతివనం పేరుతో కేటాయించిన రూ. 100 కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అందుకు నిరసనగా ఈ నెల( మే) 8న ఆందోళన చేస్తామన్నారు. అంతేకాక చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా మౌనదీక్షలు చేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement