'రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు' | YSRCP Mla Adimulapu Suresh Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 5:06 PM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

YSRCP Mla Adimulapu Suresh Slams Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ :  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. సోమవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు. అప్పుల కోసం అంకెలను మార్చారంటూ సురేష్‌ విమర్శించారు. భారీగా అవినీతికి పాల్పడటానికే కమీషన్లు, లంచాలు వచ్చే శాఖలకే అధిక నిధుల కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు.

అధికారంలోకి రావడానికి వందలకొద్ది హామీలు ఇచ్చిన చంద్రబాబు, వాటి అమలుకు మాత్రం బడ్జెట్‌లో చిల్లర కూడా విదల్చలేదని సురేష్‌ మండిపడ్డారు. ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తోందని, గత నాలుగేళ్లలో కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. నాలుగేళ్లలో చేసిందేమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు. తలసరి ఆదాయంపైనా ప్రజలను మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి మాయమాటలు చెప్తున్నారంటూ విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement