అంతా..నేరమయం | Crime rate increased in Prakasam in 2017 | Sakshi
Sakshi News home page

అంతా..నేరమయం

Published Sun, Dec 31 2017 8:40 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

Crime rate increased in Prakasam in 2017 - Sakshi

ఒంగోలు క్రైం: ఈ ఏడాది జిల్లా నేరమయంగా మిగిలింది. ఏవో కొన్ని మినహా అన్ని రకాల నేరాలు ఎక్కువ మందికి విషాదం మిగిల్చింది.   2017 సంవత్సరానికి సంబంధించి నేరాలను సింహావలోకనం చేసుకుంటే బాధితులకు కన్నీరే మిగిలిందని చెప్పక తప్పదు. 2016తో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు మినహా అన్నీ అధికంగానే జరిగాయని నిరూపితమైంది. మరీ ముఖ్యంగా హత్యలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

రికవరీలో ఊరట
రికవరీ విషయంలో పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది. ప్రజల సొత్తు రూ.5.17 కోట్లు అపహరణకాగా అందులో రూ.3.44 కోట్లు రికవరీ చేశారు. వీటితో పాటు జిల్లాలో సంచలనం రేపిన కేసుల విషయంలో పోలీసుల వేగంగా ఛేదించారు. వేమవరం జంట హత్యలు, ప్రతి చర్యగా చేపట్టిన దాడులు, పీసీపల్లి మండలంలో ఐదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు, ఒంగోలు దంపతుల హత్య కేసు, ఒంగోలులో రూ.3 కోట్ల దొంగతనం, కారులో రూ.2 కోట్ల బంగారు ఆభరణాలు, నగదు కేసు, ఏటీఎంల వద్ద మాటు వేసే అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, కందుకూరు ప్రాంతంలో వృద్ధ మహిళల హత్యలతో పాటు మరి కొన్ని కేసులను త్వరితగతిన ఛేదించి జిల్లా ప్రజలకు పోలీసులు కొంత ఊరట కలిగించారు. 

రోడ్డు ప్రమాద మృతులు
ఈ ఏడాది 466 ప్రమాదాల్లో 518 మంది
గతేడాది 507  ప్రమాదాల్లో  569 మంది

క్షతగాత్రుల సంఖ్య 
ఈ ఏడాది 903 రోడ్డు ప్రమాదాల్లో 1857 
గతేడాది 870 రోడ్డు ప్రమాదాల్లో  1,944  

తీవ్రమైన దొంగతనాలు 
ఈ ఏడాది    62 
గతేడాది    97 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement