దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 20 ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
ఇండోర్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ టాపార్డర్ తడబడినా రహానె హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకుంటున్నాడు. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 22 ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. రహానే (51 నాటౌట్), ధోనీ (9 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. రహానే 6 ఫోర్లు బాదాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌటయ్యాడు.