
లక్ష్యం దిశగా టీమిండియా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా లక్ష్యం దిశగా కొనసాగుతోంది.
రాజ్ కోట్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా లక్ష్యం దిశగా కొనసాగుతోంది. 271 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(45), మహేంద్ర సింగ్ ధోని (21) క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు రోహిత్ శర్మ(65) రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్(13) మరోసారి నిరాశపరిచాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లనష్టానికి 270 పరుగులు చేసింది.