అమిత్‌ ‘పసిడి’ పంచ్‌ | Amit Panghal strikes gold; Mary Kom, Seema Poonia win silver at Strandja Memorial | Sakshi
Sakshi News home page

అమిత్‌ ‘పసిడి’ పంచ్‌

Feb 26 2018 1:25 AM | Updated on Feb 26 2018 1:25 AM

Amit Panghal strikes gold; Mary Kom, Seema Poonia win silver at Strandja Memorial - Sakshi

అమిత్‌ పంఘల్‌

సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్‌ అమిత్‌ పంఘల్‌ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ఫైనల్లో సయీద్‌ మొర్దాజీ (మొరాకో)పై అమిత్‌ విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ (48 కేజీలు), సీమా పూనియా (ప్లస్‌ 81 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో సెవ్దా అసెనోవా (బల్గేరియా) చేతిలో మేరీకోమ్‌... అనా ఇవనోవా (రష్యా) చేతిలో సీమా ఓడిపోయారు. మహిళల విభాగంలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు లభించాయి. మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement