
మెల్బోర్న్: శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం చలాయించిన ఆస్ట్రేలియా టి20 సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో ఫించ్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక మరోసారి బ్యాటింగ్లో తడబడింది. కుశాల్ పెరీరా (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, సిక్స్) మినహా మిగతావారు విఫలమవ్వడంతో... శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది. 143 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వార్నర్ (50 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో మెరిశాడు. ఫించ్ (37; ఫోర్, 3 సిక్స్లు)తో కలిసి తొలి వికెట్కు 69 పరుగులు జతచేశాడు. స్మిత్ (13), మెక్డెర్మట్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... టర్నర్ (22 నాటౌట్; 2 సిక్స్లు)తో కలిసి వార్నర్ జట్టును గెలిపిం చాడు. వార్నర్ తొలి మ్యాచ్ లో అజేయ సెంచరీ... రెండో మ్యాచ్లో అజేయ అర్ధ సెంచరీ.... మూడో మ్యాచ్లో నాటౌట్గా నిలిచి సిరీస్లో 217 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం కూడా గెల్చుకున్నాడు.