Advertisement
Third T20
-
మళ్లీ మనదే గెలుపు
జింబాబ్వేపై వరుసగా రెండో మ్యాచ్లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు చక్కటి ప్రదర్శన చేయడంతో మరో పోరులో టీమిండియాకు సునాయాస విజయం దక్కింది. టి20 వరల్డ్ కప్లో ఆడిన ముగ్గురు ఆటగాళ్ల పునరాగమనంతో బ్యాటింగ్ ఆర్డర్లో కొంత మార్పు వచ్చినా... చివరకు భారత్దే పైచేయి అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పేలవ బ్యాటింగ్తోనే ఆతిథ్య జింబాబ్వే జట్టు ఆరంభంలోనే ఆటను అప్పగించింది. ఇక శనివారం జరిగే నాలుగో మ్యాచ్లో గెలిస్తే సిరీస్ మన ఖాతాలో చేరుతుంది. హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్ 2–1తో ముందంజలో నిలిచింది. బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. డియాన్ మైర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), క్లయివ్ మదాండె (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్ (3/15) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శనివారం ఇదే మైదానంలో నాలుగో టి20 జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ తమ ఇన్నింగ్స్ను జోరుగా ప్రారంభించింది. తొలి ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, రెండో ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి భారత్ 55 పరుగులు చేసింది. తొలి వికెట్కు గిల్తో 50 బంతుల్లో 67 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో అభిõÙక్ శర్మ (10) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన గిల్, రుతురాజ్ మరింత ధాటిగా ఆడారు. మదెవెరె ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టగా... ఆ తర్వాత సికందర్ రజా ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఎట్టకేలకు గిల్ను అవుట్ చేసి ముజరబాని ఈ భాగస్వామ్యాన్ని ముగించాడు. గిల్, రుతురాజ్ మూడో వికెట్కు 44 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. 36 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ చేయగా... ఎన్గరవ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రుతురాజ్ అర్ధ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్తో భారత్కు అదనపు అవకాశాలు కల్పించింది. గిల్, జైస్వాల్, రుతురాజ్ ఇచ్చిన క్యాచ్లను ఫీల్డర్లు వదిలేశారు. చివరి 4 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. టి20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లో సభ్యులైన జైస్వాల్, సామ్సన్, దూబే ఈ మ్యాచ్లో బరిలోకి దిగగా... పరాగ్, సాయిసుదర్శన్, జురేల్లను పక్కన పెట్టారు. టపటపా... భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు నిలవలేకపోయారు. 13 బంతుల వ్యవధిలో తొలి 3 వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తర్వాత ఒకే ఓవర్లో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి 39/5తో జింబాబ్వే ఓటమికి బాటలు వేసుకుంది. ఈ దశలో మైర్స్, మదాండె కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 57 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. అనంతరం 45 బంతుల్లో మైర్స్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో ఓవర్లో మైర్స్, మసకద్జా (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి 18 పరుగులు రాబట్టినా... అప్పటికే ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బెన్నెట్ (బి) రజా 36; గిల్ (సి) రజా (బి) ముజరబాని 66; అభిõÙక్ (సి) మరుమని (బి) రజా 10; రుతురాజ్ (సి) మదెవెరె (బి) ముజరబాని 49; సామ్సన్ (నాటౌట్) 12; రింకూ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–67, 2–81, 3–153, 4–177. బౌలింగ్: బెన్నెట్ 1–0–15–0, ఎన్గరవ 4–0–39–0, చటారా 3–0–30–0, ముజరబాని 4–0–25–2, రజా 4–0–24–2, మసకద్జా 3–0–25–0, మదెవెరె 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (సి) అభిషేక్ (బి) అవేశ్ 1; మరుమని (సి) దూబే (బి) ఖలీల్ 13; బెన్నెట్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 4; మైర్స్ (నాటౌట్) 65; రజా (సి) రింకూ (బి) సుందర్ 15; క్యాంప్బెల్ (సి) (సబ్) పరాగ్ (బి) సుందర్ 1; మదాండె (సి) రింకూ (బి) సుందర్ 37; మసకద్జా (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–19, 4–37, 5–39, 6–116. బౌలింగ్: ఖలీల్ 4–0–15–1, అవేశ్ 4–0–39–2, రవి బిష్ణోయ్ 4–0–37–0, వాషింగ్టన్ సుందర్ 4–0–15–3, అభిషేక్ 2–0–23–0, దూబే 2–0–27–0. 150 అంతర్జాతీయ టి20ల్లో భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు 230 టి20 మ్యాచ్లు ఆడిన టీమిండియా 150 మ్యాచ్ల్లో గెలిచి ఈ మైలురాయి అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ (142), న్యూజిలాండ్ (111), ఆ్రస్టేలియా (105), దక్షిణాఫ్రికా (104), ఇంగ్లండ్ (100) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సత్తా చాటిన శుభ్మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్లో జింబాబ్వే, రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్రేట్తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్రేట్తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్ రన్ స్కోరర్గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్మ్యాన్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్లు ఆడి 833 పరుగులు చేశాడు.జింబాబ్వే, భారత్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
IND W vs SA W : సమం కోసం చివరి పోరు
చెన్నై: దక్షిణాఫ్రికా జట్టుపై వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి... ఏకైక టెస్టులోనూ ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టుకు టి20 సిరీస్ కలిసి రాలేదు. తొలి మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఓడిన హర్మన్ప్రీత్ కౌర్ బృందానికి రెండో టి20లో విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు వరుణుడు అవకాశం ఇవ్వలేదు. దాంతో రెండో టి20 ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20లో గెలిచి సిరీస్ను 1–1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే మంగళవారం కూడా వర్ష సూచన ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో భారత బౌలర్లు రాణించలేకపోయారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్లో భారత బౌలర్ల నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ను కెపె్టన్ హర్మన్ప్రీత్ ఆశిస్తోంది. -
మెరిసిన షఫాలీ: భారత్దే టి20 సిరీస్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే టి20 సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది. -
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్ల సస్పెన్షన్తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
రాణించిన రహ్మానుల్లా గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (43 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్ జట్టు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో అజ్ముతుల్లా ఒమర్జాయ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు) తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 10, మొహమ్మద్ నబీ 16 నాటౌట్, మొహమ్మద్ ఇషాక్ 16 నాటౌట్ పరుగులు చేయగా.. కరీం జనత్ డకౌటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరణ, అఖిల ధనంజయ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ వనిందు హసరంగ ఓ వికెట్ దక్కించకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (2-0-21-0), నువాన్ తుషార (4-0-48-0) భారీగా పరుగులు సమర్పించుకోగా.. దసున్ షనక (2-0-16-0) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన శ్రీలంక 2-0 తేడాతో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్కు ముందు ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ ఆడింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటన ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడో టీ20లో భారీ స్కోర్ చేయడంతో విజయావకాశాలు ఉన్నాయి. -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, బౌలింగ్లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో నిన్న ముగిసిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
ఫిన్ అలెన్ సునామీ శతకం.. పాక్కు మరో ఘోర పరాభవం
పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో పాక్ మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అలెన్తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్చర్చ్లో జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్లతో పరుగుల సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అరివీర భయంకర ఫామ్లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లమ్ (123) పేరిట ఉండింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. మూడో మ్యాచ్లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది. -
IND VS SA 3rd T20: కోహ్లిని వెనక్కునెట్టిన సూర్యకుమార్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు శతకంతో (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు) విరుచుకుపడిన సూర్యకుమార్.. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్ 107 ఇన్నింగ్స్ల్లో 117 సిక్సర్లు బాదగా.. స్కై కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ రికార్డును అధిగమించాడు (123 సిక్సర్లు). ఈ విభాగంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్ల్లో 182 సిక్సర్లు) స్కై, విరాట్ల కంటే ముందున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్ల్లో 99), యువరాజ్ సింగ్ (51 ఇన్నింగ్స్ల్లో 74) ఉన్నారు. ఇదే మ్యాచ్లో స్కై మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు (4).. రోహిత్ తర్వాత సెంచరీ చేసిన రెండో టీమిండియా కెప్టెన్గా.. నాలుగు అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (15) చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సూర్యకుమార్సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. వీరిద్దరు మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
సూర్యకుమార్ సుడిగాలి శతకం.. ప్రపంచ రికార్డు సమం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన స్కై.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ రికార్డును మ్యాక్స్వెల్, రోహిత్ శర్మ సంయుక్తంగా షేర్ చేసుకోగా.. తాజాగా స్కై ఈ ఇద్దరి సరసన చేరాడు. స్కైకు ఈ రికార్డు సాధించేందుకు కేవలం 57 ఇన్నింగ్స్లు మాత్రమే అవసరం కాగా.. మ్యాక్స్వెల్ 92 ఇన్నింగ్స్ల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను సాధించారు. ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు (29/2) బరిలోకి దిగిన స్కై.. తొలి 25 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయిన సూర్యకుమార్.. ఆతర్వాతి 31 బంతుల్లో ఏకంగా 73 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కై తన కెరీర్లో చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా) చేసినవి కావడం విశేషం. కాగా, సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో స్కై, యవస్వి మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. -
IND VS SA 3rd T20: పాపం గిల్.. కాస్త ధైర్యం చేసుండాల్సింది..!
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది మాంచి జోరుమీదున్నట్లు కనిపించిన టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (12).. ఆతర్వాత తానెదుర్కొన్న రెండో బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మూడో ఓవర్ రెండో బంతికి ఎల్బీ కోసం కేశవ్ మహారాజ్ బిగ్గరగా అప్పీల్ చేయగా అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే రీప్లేలో గిల్ ఔట్ కాలేదని తేలడంతో టీమిండియా అభిమానులంతా చాలా బాధపడ్డారు. రివ్యూ విషయంలో గిల్ కాస్త ధైర్యం చేసి ఉంటే ఔట్ కాకుండా బయటపడే వాడని అనుకుంటున్నారు. రిప్లే చూసిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హావభావాలు నెట్టింట వైరలవుతున్నాయి. రివ్యూ తీసుకోకుండా గిల్ చాలా తప్పు చేశాడన్నట్లు ద్రవిడ్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అసలే ఫామ్ లేమితో సతమతమవుతున్న గిల్ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో గిల్ ఔటైన మరుసటి బంతికే తిలక్ వర్మ (0) కూడా ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు కేశవ్ మహారాజ్కే దక్కాయి. మూడో ఓవర్లోనే వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ (19), యశస్వి జైస్వాల్ (28) పోటాపోటీగా బౌండరీలు,సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. -
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా (తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది) ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడగా.. అనంతరం కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (2.5-0-17-5) మాయాజాలం చేసి టీమిండియాను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్కై శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా కుల్దీప్ ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో జడేజా 2, అర్షదీప్, ముకేశ్ తలో వికెట్ పడగొట్టగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మిల్లర్ (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 89 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో కేశవ్ మహారాజ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 82 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఫెహ్లుక్వాయో (0) ఔటయ్యాడు. 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 202 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో ఫెరియెరా (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా జడేజా బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (25) ఔటయ్యాడు. 6.1 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/4గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో క్లాసెన్ (5) క్యాచ్ ఔటయ్యాడు. 5.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/3గా ఉంది. మార్క్రమ్ (25), మిల్లర్ క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 202.. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రీజా హెండ్రిక్స్ను (8) రనౌట్ చేశాడు. టార్గెట్ 202.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సౌతాఫ్రికా వికెట్ కోల్పోయింది. ముకేశ్ బౌలింగ్లో బ్రీట్జ్కీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు తొలి ఓవర్ను సిరాజ్ మెయిడిన్ చేశాడు. సూర్యకుమార్ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్ సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. జడేజాను (4) అనవసరంగా రనౌట్ చేసిన జితేశ్ శర్మ (4) హిట్ వికెట్గా ఔటయ్యాడు. సూర్యకుమార్ ఊచకోత.. 55 బంతుల్లో శతకం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 19.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/4గా ఉంది. స్కైతో పాటు జితేశ్ శర్మ క్రీజ్లో ఉన్నాడు. సెంచరీకి చేరువైన స్కై హాఫ్ సెంచరీ తర్వాత పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న స్కై సెంచరీకి చేరువయ్యాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 173/3గా ఉంది. స్కైతో పాటు రింకూ (5) క్రీజ్లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. జైస్వాల్ ఔట్ 141 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్లో యశస్వి జైస్వాల్ (60) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 141/3గా ఉంది. సూర్యకుమార్ (65), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2గా ఉంది. జైస్వాల్ (57), స్కై (35) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 2 వికెట్లు పడ్డా చెలరేగి ఆడుతున్న జైస్వాల్, స్కై మూడో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడుతున్నారు. జైస్వాల్ (28), జ్కై (19) పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా 29 పరుగుల వద్ద (2.2 ఓవర్లు) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అతర్వాతి బంతికే టీమిండియా మరో వికెట్ కూడా కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (12), తిలక్ వర్మ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన గిల్ రెండో టీ20లో డకౌట్ అయిన శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అరంగేట్రం బౌలర్ నండ్రే బర్గర్ బౌలింగ్లో చివరి 3 బంతులను గిల్ బౌండరీలుగా మలిచాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేయగా.. భారత్, రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగిస్తుంది. ట్రిస్టన్ స్టబ్స్ స్థానంలో డొనొవన్ ఫెరియెరా.. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ స్థానాల్లో కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరియెరా, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, అండిల్ ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
IND VS AUS 3rd T20: 35 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్ ఆతర్వాత గేర్ మార్చి చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రుతు.. ఆతర్వాతి 35 బంతుల్లో ఏకంగా 101 పరుగులు బాదాడు. మ్యాక్స్వెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రుతురాజ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఓవర్లో అతను సిక్సర్తో సెంచరీ పూర్తి చేయడంతో పాటు మరో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్ భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో రుతురాజ్ చేసిన స్కోర్ (123 నాటౌట్) భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా రికార్డైంది. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు శుభ్మన్ గిల్ (126 నాటౌట్) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో మ్యాక్స్వెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది ఆసీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆసీస్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్లో సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. -
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు.. ఒంటిచేత్తో మ్యాచ్ను లాగేసుకుపోతాడు..!
ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో విరుచుకుపడ్డాడు. వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 44 బంతుల్లోనే శతక్కొట్టిన (9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106) మ్యాక్సీ.. అదే వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ద్విశతకం (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తాజాగా భారత్తో జరిగిన మూడో టీ20లోనూ ఇంచుమించు అలాంటి మెరుపు ఇన్నింగ్సే ఆడిన మ్యాక్సీ.. ఈ మ్యాచ్లోనూ తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి ఛేజింగ్లో కింగ్ అనిపించుకున్నాడు. మ్యాక్సీ గత 21 రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో ఛేజింగ్ చేస్తూ రెండు చిరస్మరణీయ సెంచరీలు సాధించాడు. దీంతో సోషల్మీడియా మొత్తం అతని నామస్మరణతో మార్మోగిపోతుంది. వీడెక్కడి మనిషి రా బాబూ.. టోర్నడోలా వచ్చి అమాంతం మ్యాచ్ను ఎగరేసుకుపోతాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ గెలవడం కష్టం అనుకున్న ప్రతిసారి మెరుపు ఇన్నింగ్స్లతో మ్యాచ్ను లగేసుకుంటున్న వైనాన్ని కొనియాడుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మ్యాక్స్వెల్ను మించినోడు లేడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పొట్టి క్రికెట్లో ఇతనికి మించిన ఫినిషన్ లేడు, రాబోడని కితాబునిస్తున్నారు. -
అతడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.. ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు: సూర్యకుమార్
గౌహతి వేదికగా భారత్తో జరిగిన మూడో టీ20లో గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడి ఆసీస్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో మ్యాక్స్వెల్ విశ్వరూపం ప్రదర్శించి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్లో సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మ్యాక్స్వెల్ను త్వరగా ఔట్ చేయాలనుకున్న మా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అతడు మాపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మంచులో 220 స్కోర్ను డిఫెండ్ చేయాలంటే, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఈ విషయంలో కూడా మా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి నుంచే గేమ్లో ఉండింది. ఆఖర్లో వారు మాపై పైచేయి సాధించారు. అక్షర్ అనుభవజ్ఞుడైన బౌలర్. మంచు అధికంగా కురుస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్ స్పిన్నర్ అయినా పేసర్ అయినా ఫలితం ఒకేలా ఉంటుంది. అందుకే 19వ ఓవర్ అక్షర్కు ఇచ్చా. ఇది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఓడినప్పటికీ అబ్బాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని అన్నాడు. -
టీ20 బాస్ మ్యాక్సీ.. హిట్మ్యాన్ ప్రపంచ రికార్డు సమం
గౌహతి వేదికగా భారత్తో జరిగిన మూడో టీ20లో సుడిగాలి శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన మ్యాక్స్వెల్.. టీ20ల్లో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ (47 బంతుల్లో) రికార్డుతో పాటు మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండగా.. తాజాగా మ్యాక్స్వెల్ ఆ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీ ఈ ప్రపంచ రికార్డును తన వందో మ్యాచ్లో సాధించడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు.. రోహిత్ శర్మ-4 గ్లెన్ మ్యాక్స్వెల్-4 బాబర్ ఆజమ్-3 సబావూన్ దవిజి-3 కొలిన్ మున్రో-3 సూర్యకుమార్ యాదవ్-3 విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు.. భారత్తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో మ్యాక్స్వెల్ మరో రికార్డును కూడా సాధించాడు. విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (3) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్ (2), ముహమ్మద్ వసీమ్ (2) మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్పై అత్యధిక సిక్సర్లు.. నిన్నటి మ్యాచ్లో 8 సిక్సర్లు కొట్టిన మ్యాక్స్వెల్ టీ20ల్లో భారత్పై అత్యధిక సిక్సర్లు (37) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సెర్బియా ఆటగాడు లెస్లీ డన్బర్ (బల్గేరియాపై 42 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో (వెస్టిండీస్పై 39 సిక్సర్లు) నిలిచాడు. ఇదిలా ఉంటే, భారత్తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఐదు మ్యాచ్లో సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో మ్యాక్స్వెల్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్ను గెలిపించాడు. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్లో సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ వరల్డ్కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
భారత్తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లో సభ్యులైన మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్డెర్మాట్ ఇదివరకే భారత్కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్తో టీ20 సిరీస్కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
IND VS AUS: విరాట్ సరసన చేరిన రింకూ
టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 31 పరుగులు (344.44 స్ట్రయిక్ రేట్) చేసిన రింకూ.. ఓ టీ20 ఇన్నింగ్స్లో 30 అంతకంటే ఎక్కువ పరుగులు (19 లేదా 20 ఓవర్లలో) చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత్ తరఫున విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్ను సాధించాడు. విరాట్, రింకూ సింగ్ ఇద్దరూ రెండ్రెండు సార్లు ఈ ఘనత సాధించడం విశేషం. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ రెండు మ్యాచ్ల్లో భారత బ్యాటర్లు పేట్రేగిపోయారు. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80) మెరుపులు మెరిపించగా.. రెండో టీ20లో యశిస్వి (53), రుతురాజ్ (58), ఇషాన్ (52), రింకూ సింగ్ (31 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. గౌహతి వేదికగా ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో టీ20లో భారత బ్యాటర్లు ఇదే జోరును కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
India vs Australia 3rd T20I: సిరీస్ విజయమే లక్ష్యంగా...
గువాహటి: టి20ల్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను 3–0తో ఇక్కడే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో టి20 మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఆతిథ్య జట్టుకు సిరీస్ విజయం ఏమంత కష్టమేమీ కాదు. గత రెండు మ్యాచ్ల్లోనూ 200 పైచిలుకు స్కోరు చేసిన భారత్ మళ్లీ గువాహటి ప్రేక్షకులకు అలాంటి మజానే అందించేందుకు సిద్ధమైంది. పైగా ఆల్రౌండ్ సామర్థ్యంతో జట్టు సమరోత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం సిరీస్లో నిలవాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. పరాజయాల ‘హ్యాట్రిక్’ అయితే మాత్రం సిరీస్ చేజార్చుకుంటుంది. బ్యాటర్స్ను ఆపతరమా... టాపార్డర్ బ్యాటర్స్ అసాధారణ ఫామ్లో ఉన్నారు. యశస్వి దూకుడు ఆసీస్ను కంగారు పెట్టిస్తోంది. రెండు వరుస అర్ధ సెంచరీలతో ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లపై సత్తా చాటగా, రుతురాజ్ కూడా ఫిఫ్టీతో తొలిమ్యాచ్ డకౌట్ను మరచిపోయేలా చేశాడు. రింకూ సింగ్ డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇక నిరూపించుకోవాల్సింది, సత్తా చాటుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మే! ఎందుకంటే విశ్రాంతిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ తదుపరి రెండు మ్యాచ్లకు వైస్ కెపె్టన్గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తుది జట్టులో ఆడటం ఖాయం కావడంతో బెంచ్కు పరిమితమయ్యే పరిస్థితి తిలక్కే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్లో మెరుపులు మెరిపిస్తే... ప్రస్తుతానికి పక్కన పెట్టినా టచ్లోకి వచి్చన బ్యాటర్గా జట్టు ఎంపికలో ఉంటాడు. ఇక బౌలింగ్ విభాగం కూడా గత మ్యాచ్లో మెరుగైంది. కీలకమైన వికెట్లను వరుస విరామాల్లో తీసి మ్యాచ్లో పట్టు సాధించింది. ప్రసి«ద్కృష్ణ, అర్‡్షదీప్లతో పాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆసీస్ రేసులోకొచ్చేనా... ఆ్రస్టేలియా తొలి టి20లో 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడింది. తర్వాతి మ్యాచ్లో 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న ఆ్రస్టేలియా గెలిచి నిలవడం సాధ్యమవుతుందా అనేది నేటి మ్యాచ్తో తేలుతుంది. గత మ్యాచ్లో అనుభవజు్ఞలైన డాషింగ్ బ్యాటర్ మ్యాక్స్వెల్, ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాలను కూడా బరిలోకి దించినా కంగారూ జట్టుకైతే ఒరిగిందేమీ లేదు. నిలకడ లేని బ్యాటింగ్, నియంత్రణ లేని బౌలింగ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్మిత్, షార్ట్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, స్టోయినిస్లాంటి మేటి బ్యాటర్లున్నప్పటికీ ఈ సిరీస్లో గెలుపు దారిలో మాత్రం ఆసీస్ పడలేకపోతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తే తప్ప పటిష్టమైన ఆతిథ్య జట్టు జోరుకు కళ్లెం వేయలేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), రుతురాజ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), స్టీవ్ స్మిత్, షార్ట్, జోష్ ఇన్గ్లిస్, మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, స్టోయినిస్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, నాథన్ ఎలిస్, తనీ్వర్ సంఘా. -
అలెన్ అదరహో
బర్మింగ్హమ్: ఇంగ్లండ్ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (53 బంతుల్లో 83; 4 ఫోర్లు, 6 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ (34 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ (3/23), ఇష్ సోధి (3/33) రాణించారు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు.