SriLankaTeam
-
అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియ జోరు
-
కింగ్, లూయిస్ ఊచకోత.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లో చేధించింది.లక్ష్య చేధనలో విండీస్ ఓపెనర్లు బ్రాండెన్ కింగ్, ఈవెన్ లూయిస్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 33 బంతులు ఎదుర్కొన్న కింగ్ 11 ఫోర్లు, 1 సిక్స్లతో 63 పరుగులు చేయగా, లూయిస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 50 రన్స్ చేశాడు. లంక బౌలర్లలో మతీషా పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా, హసరంగా, మెండిస్,థీక్షణ చెరో వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో కెప్టెన్ అసలంక(59, 9 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, కమిందు మెండిస్(51) పరుగులతో రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు, అల్జారీ జోషఫ్, షెమర్ జోషఫ్, మోటీ,స్ప్రింగర్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆక్టోబర్ 15న దంబుల్లా వేదికగానే జరగనుంది.చదవండి: T20 WC: ఆసీస్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్కు చేరాలంటే? -
వరల్డ్కప్లో బోణీ కొట్టిన ఆసీస్.. శ్రీలంక టోర్నీ నుంచి ఔట్
మహిళల టీ20 వరల్డ్కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. షార్జా వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా అమ్మాయిలు చేధించారు. స్టార్ ఓపెనర్ బెత్ మూనీ 43 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేసింది. లంక బౌలర్లలో ప్రబోధని, రణవీర, కుమారి తలా వికెట్ సాధించారు.తేలిపోయిన లంక బ్యాటర్లు.. అంతకముందు ఆసీస్ బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులకే పరిమితమైంది.ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ స్కాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోలనిక్స్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఈ ఓటమితో శ్రీలంక దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్లో ఆక్టోబర్ 8న న్యూజిలాండ్తో తలపడనుంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
NZ vs SL 2nd Test: విజయానికి 5 వికెట్ల దూరంలో శ్రీలంక
న్యూజిలాండ్పై చారిత్రక సిరీస్ క్లీన్స్వీప్నకు శ్రీలంక జట్టు ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న శ్రీలంక... రెండో టెస్టులోనూ విజయానికి చేరువైంది. శనివారం మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 22/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ధాటికి విలవిలలాడి 39.5 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది.శ్రీలంకపై న్యూజిలాండ్కు ఇదే అత్యల్ప స్కోరు. మిషెల్ సాన్ట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.లంక సారథి ధనంజయ ఐదు క్యాచ్లు అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో 514 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న శ్రీలంక... న్యూజిలాండ్ను ఫాలోఆన్ ఆడించగా.. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో కివీస్ 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆత్మరక్షణ ధోరణిలో ఆడి దెబ్బతిన్న న్యూజిలాండ్... రెండో ఇన్నింగ్స్లో ఎదురుదాడికి దిగింది. డ్వేన్ కాన్వే (62 బంతుల్లో 61; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), బ్లండెల్ (50 బంతుల్లో 47 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (41 బంతుల్లో 32 బ్యాటింగ్; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో నిషాన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు శ్రీలంక 602/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ జట్టు... ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 315 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా మూడోరోజు ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. మొత్తంగా న్యూజిలాండ్ శనివారం ఇక్క రోజే రోజు 13 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లోనే 9 వికెట్లు నెలకూలాయి.చదవండి: IND vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు -
జయసూర్య 'సిక్సర్'.. 88 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కివీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 88 పరుగులకే కుప్పకూలింది.లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ వలలో కివీస్ చిక్కుకుంది. జయసూర్య తన మాయాజాలంతో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కీలక వికెట్లు పడగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్లో జయసూర్య 6 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్లో 7 మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయమయ్యారు. మిచెల్ శాంట్నర్(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో ఘోర ప్రదర్శన కరబరిచిన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. ఫాలో ఆన్లో కూడా కివీస్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇంకా 385 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో లంక చేతిలో కివీస్ ఓటమి చవిచూసింది. -
చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ చిత్తు
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంక అదరగొట్టింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(29 బంతుల్లో 5 ఫోర్లు, 46), అసలంక(21 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్లు, 46) టాప్ స్కోరర్లగా నిలిచారు. వీరిద్దరితో పాటు దనుంజయ డిసిల్వా(30),మాథ్యూస్(30) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్బీక్ రెండు వికెట్లు పడగొట్టగా.. కింగ్మా, దత్, వాన్మీకరన్, ప్రింగిల్ తలా వికెట్ సాధించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 118 పరుగులకే కుప్పకలింది. ఫలితంగా శ్రీలంక 83 పరుగులతో జయభేరి మోగించింది. చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా శ్రీలంక ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్ -
శ్రీలంక బౌలింగ్ కోచ్గా పాకిస్తాన్ దిగ్గజం..
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్కప్ వరకు జావేద్ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెరకు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్ను మా జాతీయ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్కప్-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హెడ్కోచ్గా, బౌలింగ్ కోచ్గా జావేద్కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు జావేద్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్కోచ్గా అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో కూడా జావేద్ కోచ్గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్కప్ గెలుచుకున్న పాక్ జట్టులో జావేద్ సభ్యునిగా ఉన్నాడు. -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్గా మెండిస్
స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్తో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్.. శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి డిప్యూటీగా మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో అతడికి చోటు దక్కింది. కాగా ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్గా హసరంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 మధ్యలోనే తప్పుకున్న మాజీ కెప్టెన్ దసున్ షనక కూడి జింబాబ్వే సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా తొలుత ఈ సిరీస్కు 21 మంది సభ్యుల ప్రిలిమనరీ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇప్పుడు 17 మంది పేర్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలెక్షన్ కమిటీ ఖారారు చేసింది. జనవరి 6న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో, దసున్ షనక, జనిత్ లియానాగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, ప్రమోద్ చమీర, వాండర్సే, అకిల దనంజయ, వనిందు హసరంగా (ఫిట్నెస్కు లోబడి). చదవండి: #Saim Ayub: బ్యాటింగ్లో విఫలం.. ఈజీ క్యాచ్ వదిలేశాడు.. బాబర్ రియాక్షన్ వైరల్ -
శ్రీలంకకు బిగ్ షాక్.. వరల్డ్కప్ నుంచి కెప్టెన్ ఔట్
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లన్నింటికీ దూరమయ్యాడు. అతడు తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో షనక కుడి తొడకు గాయమైంది. అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్రౌండర్ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. మరోవైపు యువ పేసర్ మతీషా పతిరానా కూడా భుజం గాయం కారణంగా ఈ టోర్నీలో ఒకట్రెండు మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో లంక బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్లలోనూ శ్రీలంక ఓటమి పాలైంది. చదవండి: World Cup 2023: అంపైర్కు కండలు చూపించిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? వీడియో వైరల్ -
CWC 2023 SA VS SL: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం (ఫొటోలు)
-
టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!
ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్ను ప్రశంసిస్తూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) రాజమౌళి ట్వీట్ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్ను చూసిన అభిమానులు సైతం సిరాజ్ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻 And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗 — rajamouli ss (@ssrajamouli) September 17, 2023 -
మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్కప్ విన్నర్ అరెస్టు!
శ్రీలంక మాజీ క్రికెటర్ సుచిత్ర సేనానాయకే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ దేశపు క్రీడా మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు సేనానాయకే బుధవారం లోంగిపోయాడు. అతడిని త్వరలోనే కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి న్యాయ విచారణకు హాజరకానున్న మొదటి క్రికెటర్ సేనానాయకే కావడం గమనార్హం. లంక ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్.. సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్ల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అతడు విదేశాలకు వెళ్లకుండా మూడు నెలల పాటు ట్రావెల్బ్యాన్ కొలంబోలోని స్ధానికి కోర్టు విధించింది. కోర్టు ఉత్తర్వులను అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ పొందింది. అటార్నీ జనరల్ ఆదేశాల మెరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం సేనానాయక్పై నేరారోపణలు మోపింది. ఈ క్రమంలో సేనానాయకేనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. ఇక 28 ఏళ్ల సేనానాయకే శ్రీలంక తరపున 49 వన్డేలు, 24 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2016 టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న జట్టులో సేనానాయకే భాగంగా ఉన్నాడు. చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్ ఫైర్ -
వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్కు గుడ్బై
శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుక్రికెట్కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు మంగళవారం శ్రీలంక క్రికెట్కు తెలియజేశాడు. పరిమిత ఓవర్లపై దృష్టిసారించేందుకే హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతడిని నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కూడా అంగీకరించరింది. మేము హసరంగా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము. "మా వైట్-బాల్ జట్టులో హసరంగా కీలక ఆటగాడిగా కొనసాగుతాడని భావిస్తున్నామని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా పేర్కొన్నాడు. కాగా శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న హసరంగా.. టెస్టులకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా టెస్టుల్లో 2021లో బంగ్లాదేశ్పై ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఇప్సటివరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20ల్లో అతడు ప్రాతినిథ్యం వహించాడు. హసరంగా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్లో బీలవ్కాండీ జట్టుకు సారధిగా ఉన్నాడు. చదవండి: ODI WC 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్ సింగ్ వారసుడెవరు? -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా!
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమారీ ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమన్స్ వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి శ్రీలంక క్రికెటర్గా ఆటపట్టు రికార్డులకెక్కింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 758 పాయింట్లతో ఆటపట్టు టాప్ ర్యాంక్కు చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(758)ను వెనుక్కి నెట్టింది. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో అటపట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలతో చెలరేగింది. ఓవరాల్గా ఈ సిరీస్లో 248 పరుగులు అటపట్టు సాధించింది. ఈ అద్బుత ప్రదర్శన ఫలితంగా తన కెరీర్లో తొలిసారి నెం1 ర్యాంక్ను సొంతం చేసుకుంది. జయసూర్య తర్వాత చమారీనే.. ఇక ఓవరాల్గా శ్రీలంక మెన్స్, ఉమెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా కూడా ఆటపట్టు నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ సాధించాడు. సెప్టెంబరు 2002 నుంచి మే 2003 వరకు జయసూర్య నెం1 ర్యాంక్లో కొనసాగాడు. అ తర్వాత ఏ ఒక్క శ్రీలంక క్రికెటర్(మెన్స్ అండ్ ఉమన్స్) టాప్ ర్యాంక్ను సాధించలేకపోయారు. తాజాగా అటపట్టు 20 ఏళ్ల తర్వాత అగ్రస్ధానానికి చేరుకుని రికార్డులకెక్కింది. ఇక తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ రు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు చేరుకుంది. శ్రీలంక సిరీస్లో భాగంగా రెండో వన్డేలో సోఫీ డివైన్ 137 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. చదవండి: Harbhajan Singh: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ వీరే.. కోహ్లి, రోహిత్కు నో ఛాన్స్! -
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
శ్రీలంక వేదికగా ఆసియా కప్.. పాపం పాకిస్తాన్!
ఆసియా కప్-2023 నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఏడాది ఆసియా కప్ను పాకిస్తాన్లో కాకుండా శ్రీలంక వేదికగా నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీని పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలిపాయి. దీంతో ఆసియాకప్ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ఆసియా కప్ నిర్వహణ వేదికపై ఈ నెలాఖరున ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: సచిన్ నన్ను బ్యాట్తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ -
చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
టెస్టు క్రికెట్లో శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్గా జయసూర్య నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్తో పాల్ స్టిర్లింగ్ను ఔట్ చేసిన ప్రబాత్ జయసూర్య.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డును కేవలం 7 మ్యాచ్ల్లోనే జయసూర్య సాధించాడు. ఈ వరల్డ్ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. ఆల్ఫ్ వాలెంటైన్ ఎనిమిది టెస్టు మ్యాచ్ల్లో అద్భుతమైన రికార్డును సాధించాడు. వాలెంటైన్ 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. తాజా మ్యాచ్తో 71 ఏళ్ల ప్రపంచ రికార్డును ప్రబాత్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్గా కూడా జయసూర్య రికార్డులకెక్కాడు. చదవండి: IPL 2023-Teamindia: కిషన్ వద్దు.. అతడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్! విధ్వంసం సృష్టిస్తాడు.. అదే విధంగా ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్గా దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టామ్ రిచర్డ్సన్తో జయసూర్య సంయుక్తంగా నిలిచాడు. ఇక ఐరీష్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్కు దొరికిన ఆణిముత్యం! -
డబుల్ సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండీస్.. 18 ఫోర్లు, 11 సిక్స్లతో
గాలే వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. తమ తొలి ఇన్నింగ్స్ను 704/3 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 212 పరుగుల అదధిక్యంలో నిలిచింది. కుశాల్ మెండిస్, నిషాన్ మదుష్కా డబుల్ సెంచరీలతో చెలరేగారు. 339 బంతుల్లో మదుష్కా 22 ఫోర్లు, ఓ సిక్సర్తో 205 పరుగులు చేయగా.. మెండిస్ 18 ఫోర్లు, 11 సిక్స్లతో కేవలం 291 బంతుల్లోనే 245 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరితో పాటు మాథ్యూస్(101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో కుశాల్ మెండిస్ అరుదైన రికార్డు సాధించాడు.సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో శ్రీలంక బ్యాటర్గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే(374) తొలి స్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య(340),కుమార సంగక్కర(287) వరుసగా రెండు మాడు స్ధానాల్లో నిలిచారు. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ అదే విధంగా మరో రికార్డును కూడా మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన శ్రీలంక బ్యాటర్గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఐర్లాండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కుశాల్ 11 సిక్స్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సంగక్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. చదవండి: IPL 2023: మద్యం మత్తులో మహిళతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అనుచిత ప్రవర్తన..! -
ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ విజయం.. శ్రీలంకను చిత్తు చేసిన కంగారూలు
గెబెర్హా: మహిళల టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా లంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగు లకే పరిమితమైంది. హర్షిత (34)దే అత్యధిక స్కోరు. అనంతరం ఆసీస్ 15.5 ఓవర్లలో వికెట్ కో ల్పోకుండా 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (43 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (53 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్ లు.. షెడ్యూల్ ఇదే..!
-
రాణించిన శ్రీలంక బౌలర్లు..
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఘనీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు వీరిద్దరూ కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మిడిలార్డర్ బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో ఆఫ్గాన్ 150 పరుగుల మార్క్ను దాటలేకపోయింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్(28), ఘనీ(22), ఇబ్రహీం జద్రాన్(22) పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్ల పడగొట్టగా.. కుమారా రెండు, రజితా, డి సిల్వా తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ధనుంజయ డి సిల్వా 66 పరుగులతో చెలరేగడంతో శ్రీలంక.. ఆఫ్గనిస్తాన్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? -
T20 WC 2022: చమీరా ఔట్.. మూడేళ్ల తర్వాత శ్రీలంక పేసర్ రీఎంట్రీ
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక ఆటగాళ్లు గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక దూరమయ్యారు. అదే విధంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో గాయపడిన పేసర్ ప్రమోదు మధుషాన్ కూడా ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. ఇక ఇప్పటికే మధుశంక స్థానాన్ని పేసర్ ఫేర్నాండోతో భర్తీ చేసిన శ్రీలంక క్రికెట్.. తాజాగా గుణతిలక, చమీరా రిప్లేస్మెంట్స్ను కూడా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గుణతిలక స్థానంలో స్టాండ్బై జాబితాలో ఉన్న యువ బ్యాటర్ ఆషెన్ బండార, చమీరా స్థానంలో కసున్ రజితాను శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. అదే విధంగా వీరిద్దరి భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా కసున్ రజితా చివర సారిగా 2019లో శ్రీలంక జట్టు తరపున టీ20ల్లో ఆడాడు. ఇక గురువారం(ఆక్టోబర్ 20) నెదర్లాండ్స్తో జరిగిన క్వాలిఫియర్ మ్యాచ్లో విజయం సాధించిన శ్రీలంక.. సూపర్-12 అర్హత సాధించింది. చదవండి: T20 WC 2022: నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్ -
73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం
ICC Mens T20 World Cup 2022- Sri Lanka vs United Arab Emirates, 6th Match, Group A: శ్రీలంక వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 79 పరుగుల తేడాతో శ్రీలంక విజయ భేరి మోగించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 17.1 ఓవర్లలోనే కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో చమీరా, హాసరంగా చెరో మూడు వికెట్లతో యూఏఈను దెబ్బ తీయగా.. తీక్షణ రెండు, షనక, మధుషాన్ తలా వికెట్ సాధించారు. ఇక యూఏఈ బ్యాటర్లలో ఆఫ్జల్ ఖాన్(19) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. 36 పరుగులకే 6 వికెట్లు.. ఓటమి దిశగా యూఏఈ 36 పరుగులకే యూఏఈ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9 పరుగులు చేసిన ఆరవింద్.. హాసరంగా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. యూఏఈ విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి. నాలుగో వికెట్ కోల్పోయిన యూఏఈ 21 పరుగుల వద్ద యూఏఈ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూరి.. మధుషాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక పేసర్ చమీరా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన వసీం.. చమీరా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. యూఏఈతో క్వాలిఫైయర్ మ్యాచ్లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. కుశాల్ మెండిస్(18), ధనుజంయ డి సిల్వా(33) తప్ప మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. మరో వికెట్ కోల్పోయిన లంక లంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 15వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దసున్ షనక బృందం.. ఆ మరుసటి ఓవర్లో మరో వికెట్ నష్టపోయింది. 16వ ఓవర్లో అఫ్ఝల్ ఖాన్ బౌలింగ్లో నాలుగో బంతికి హసరంగ.. బాసిల్ హమీద్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 121-6. చమిక కరుణరత్నె, పాథుమ్ నిసాంక క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు యూఏఈ బౌలర్ మెయప్పన్ శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ నాలుగో బంతికి రాజపక్సను పెవిలియన్కు పంపిన అతడు.. ఆ మరుసటి రెండు బంతుల్లో అసలంక, దసున్ షనకలను బౌల్డ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మెయప్పన్ హ్యాట్రిక్ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 117-5 14 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరెంతంటే యూఏఈ జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్లో శ్రీలంక 14 ఓవర్లు ముగిసే సరికి 114/2 రెండు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. పాథుమ్ నిసాంక, భనుక రాజపక్స క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 12వ ఓవర్ మొదటి బంతికే శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. అఫ్జల్ ఖాన్ బౌలింగ్లో ధనుంజయ (33పరుగులు) రనౌట్గా వెనుదిరిగాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 84/1 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(38), ధనుంజయ డి సిల్వా(27) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 42 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. లక్రా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 57/1 2 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 19/0 2 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(13), నిస్సాంక(5) పరుగులతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో యూఏఈ, శ్రీలంక జట్లు చావోరేవో తేల్చుకోవడానికి శ్రీలంక సిద్దమయ్యాయి. గీలాంగ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్కు శ్రీలంక ఆటగాడు గుణతిలక గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో అసలంక తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్లో ఓటమి చెందాయి. ఈ క్రమంలో సూపర్-12 అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ యూఏఈ: చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, కాషిఫ్ దౌద్, వృత్త్యా అరవింద్(వికెట్ కీపర్), ఆర్యన్ లక్రా, బాసిల్ హమీద్, చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయ్యప్పన్, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్ చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత! -
మధుశంక స్థానంలో శ్రీలంక యువ పేసర్
టీ20 ప్రపంచకప్-2022కు మెకాలి గాయం కారణంగా శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంక దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్బై జాబితాలో ఉన్న బినురా ఫెర్నాండోను క్రికెట్ శ్రీలంక భర్తీ చేసింది. కాగా బినురా ఫెర్నాండోను భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా శ్రీలంక ప్రస్తుతం క్వాలిఫియర్స్ రౌండ్లో తలపడుతోంది. తొలి రౌండ్(గ్రూప్ ‘ఎ’)లో భాగంగా ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఘోరపరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రయ్లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిత్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: T20 World Cup 2022: కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ.. -
కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్తో మెరిశాడు. నమీబియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కరుణరత్నే వేసిన ఓ ఆఫ్ సైడ్ బంతిని బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో నమీబియా బ్యాటర్ కూడా ఒక్క సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం -
శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా
మహిళల ఆసియాకప్-2022ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైన్లలో విజయం సాధించిన భారత్.. 7వ ఆసియాకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేసింది. సెలబ్రేషన్స్ అదుర్స్ ఇక శ్రీలంకపై అద్భుతవిజయం అనంతరరం భారత జట్టు అమ్మాయిలు వినూత్న రీతిలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మైదానంలోనే పంజాబీ డ్యాన్స్లు, కేరింతలతో ఊర్రూతలూగించారు. కలర్ పేపర్స్ను ఒకరిపై ఒకరు చల్లుకుని భారత క్రికెటర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ఉమెన్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం భారత్ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Post-win vibes, be like 🎉 🙌#TeamIndia | #AsiaCup2022 | #INDvSL pic.twitter.com/LsUG1PxNiO — BCCI Women (@BCCIWomen) October 15, 2022 చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
మహిళల ఆసియా కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
ఛాంపియన్ భారత్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం షెల్లాట్ జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి 7వ ఆసియాకప్ టైటిల్ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక ఆసియాకప్ ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్కు ఫ్రైజ్మనీ రూపంలో ఇరవై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 16లక్షల నాలభై ఎనిమిది వేల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్ను టోర్నీ నిర్వహకులు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు అందజేశారు. అదే విధంగా రన్నరప్గా నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల ముఫ్పై వేలు)ఫ్రైజ్మనీ దక్కింది. ఆసియాకప్-2022లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే జెమిమా రోడ్రిగ్స్(భారత్)- 8 మ్యాచ్ల్లో 217 పరుగులు హర్షిత మాధవి(శ్రీలంక)- 8 మ్యాచ్ల్లో 202 పరుగులు షఫాలీ వర్మ(భారత్)- 6 మ్యాచ్ల్లో-166 పరుగులు సిద్రా అమీన్(పాకిస్తాన్)- 7 మ్యాచ్ల్లో 158 పరుగులు నిదా దార్(పాకిస్తాన్) - 7 మ్యాచ్ల్లో 145 పరుగులు ఆసియాకప్ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు దీప్తి శర్మ(భారత్)- 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు ఇనోక రణావీరా(శ్రీలంక)- 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు రుమనా ఆహ్మద్(బంగ్లాదేశ్)-5 మ్యాచ్ల్లో 10 వికెట్లు ఓమైమా సోహెల్(పాకిస్తాన్)-7 మ్యాచ్ల్లో 10 వికెట్లు ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. దీప్తికి అవార్డు రూపంలో 2000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు లక్షా ఆరవై నాలుగు వేల రూపాయలు) లభించింది. చదవండి: T20 World Cup 2022:టీమిండియాతో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం -
ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 7వ ఆసియాకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో భారత పేసర్ రేణుకా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 3⃣ Overs 1⃣ Maiden 5⃣ Runs 3⃣ Wickets Renuka Thakur put on a stunning show with the ball & bagged the Player of the Match award as #TeamIndia beat Sri Lanka in the #AsiaCup2022 Final. 👏 👏 #INDvSL Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC pic.twitter.com/APPBolypjE — BCCI Women (@BCCIWomen) October 15, 2022 రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: Rohit Sharma Press Meet: వరల్డ్కప్ కంటే అతడి కెరీర్ ముఖ్యం! మాకు ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే.. -
33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మలేషియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. లంక బ్యాటర్లలో రణసింగే(23), ఆతపత్తు(21) పరుగులతో రాణించారు. మలేషియా బౌలర్లలో ఆజ్మీ, హమీజ్ హాసం రెండు వికెట్లు సాధించారు. ఇక 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక స్పిన్నర్లు చెలరేగడంతో మలేషియా కేవలం 33 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో మల్షా షెహానీ నాలుగు వికెట్లతో మలేషియాను దెబ్బతీయగా.. కుమారి, రణవీరా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మలేషియా బ్యాటర్లలో హంటర్ 18 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. చదవండి: John Campbell: వెస్టిండీస్ క్రికెటర్పై నాలుగేళ్ల నిషేధం.. -
Asia Cup Final: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది..!
ఆసియా కప్-2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్, పాక్ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి ఏకంగా టైటిల్ను ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. పాక్ను మట్టికరిపించిన తీరు థ్రిల్లింగ్గా అనిపించిందని ట్వీటాడు. క్రికెట్ లాంటి టీమ్ గేమ్లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు అవసరం లేదని లంకేయులు మరోసారి నిరూపించారని అన్నాడు. టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందని తెలిపాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. I am thrilled at Sri Lanka’s victory this evening. Not because I wanted Pakistan to lose. But because Sri Lanka’s victory reminds us that Team Sports are not about celebrities & superstars but about—yes—Teamwork! #AsiaCup2022Final — anand mahindra (@anandmahindra) September 11, 2022 కాగా, దుబాయ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో పాక్ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో ఆదుకున్నాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
బంగ్లాదేశ్ కొంపముంచిన నో బాల్.. ఒక్కడికే మూడు ఛాన్స్లు!
ఆసియాకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గ్రూప్ 'బి' నుంచి సూపర్-4లో అడుగు పెట్టిన రెండో జట్టుగా శ్రీలంక నిలిచింది . కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మూడు బంతుల్లో 10 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో అఫీఫ్ హొస్సేన్ 39, మెహదీ హసన్- 38 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హాసరంగా, కరుణరత్నే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మధుశంక, తీక్షణ, అసిత ఫెర్నాండో తలా ఒక్కో వికెట్ తీశారు. ఇక 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో నాలుగు బంతులు మిగిలూండగానే చేధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(60) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు కెప్టెన్ దసున్ షనక కూడా 45 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అఖరిలో ఆల్రౌండర్ కరుణరత్నే(16), అసిత ఫెర్నాండో(10) పరుగులు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడిన ఎబాడోత్ హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ రెండు, ముస్తాఫిజుర్, మెహెదీ హసన్ చెరో వికెట్ సాధించారు. బంగ్లాదేశ్కు ఓటమికి కారణాలు ఇవే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్రత్యర్ధి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే బ్యాటింగ్లో అదరగొట్టిన షకీబ్ సేన.. బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా అరంగేట్ర మ్యాచ్ ఆడుతోన్న బంగ్లా బౌలర్ ఎబాడోత్ హొస్సేన్ తన తొలి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టినప్పటకీ . అఖరి రెండు ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించకున్నాడు. హొస్సేన్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. మరోవైపు సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ షకీబ్ కూడా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో కుశాల్ మెండిస్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ రహీమ్ జార విడిచాడు. దీంతో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మెండిస్ బతికిపోయాడు. కొంపముంచిన నో బాల్ ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు ఏకంగా నాలుగు నో బాల్స్ వేశారు. తొలుత శ్రీలంక ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన మెహదీ హసన్ బౌలింగ్లో మెండీస్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వికెట్ సెలబ్రేషన్స్లో బంగ్లా ఆటగాళ్లు మునిగి తేలిపోయారు. అయితే ఆ బంతిని అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో బంగ్లా ఆటగాళ్ల ఆనందం కొద్ది క్షణాల్లోనే ఆవిరైపోయింది. మళ్లీ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మెండిస్ బతికిపోయాడు. అదే విధంగా 8వ ఓవర్ వేసిన ఎబాడోత్ హొస్సేన్ బౌలింగ్లో మెండిస్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్లడంతో వికెట్ కీపర్ క్యాచ్కు అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. కాగా బంగ్లా జట్టుకు ఇంకా రివ్యూలు మిగిలిన్నప్పటికీ షకీబ్ మెగ్గు చూపలేదు. అయితే రిప్లేలో బంతి క్లియర్గా మెండిస్ గ్లౌవ్కు తాకి రహీమ్ చేతికి వెళ్లింది. దీంతో ముచ్చటగా మూడో సారి కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి మెండిస్ తప్పించుకున్నాడు. కాగా శ్రీలంక విన్నింగ్స్ రన్ కూడా నో బాల్ రూపంలో రావడం గమనార్హం. Srilanka players doing Naagin dance after winning the match against Bangladesh 😂😂#SLvsBAN pic.twitter.com/lPcvbVzVp6 — ClockTower🏳️🌈 (@Clocktower45) September 1, 2022 Karma will always hit Bangladesh for their past bad behaviour against their opponent teams#AsiaCupT20 #SLvsBAN #INDvsPAK pic.twitter.com/JZbVowVmRp — 🇮🇳🤝🇮🇱🤝🇷🇺 (@Praneet98344061) September 1, 2022 చదవండి: టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్ సిరీస్ నుంచి స్టార్ పేసర్ ఔట్ -
'ఇదేం చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా'
ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్ తొలి మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో బంతి పాతుమ్ నిస్సంక బ్యాట్కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్తో పాటు వికెట్ కీపర్ కూడా క్యాచ్కు అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వెంటనే ఔట్ అని వేలు పైకిత్తాడు. ఈ క్రమంలో నిస్సంక నాన్ స్ట్రైకింగ్లో ఉన్న గుణతిలకతో చర్చించి రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో బ్యాట్ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి బ్యాట్కు తాకినట్లు కన్పించింది అంటూ ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాటర్తో పాటు డగౌట్లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఇదేం చెత్త అంపైరింగ్రా.. కళ్లు కనిపించడం లేదా" అంటూ కామెంట్ చేశాడు. Can't even ask 'Out or not out' 😵💫 Pathum Nissanka at the receiving end of a shocker in #AsiaCup2022 #SLvAFG #AsiaCup pic.twitter.com/e47XDC6Kwi — CricXtasy (@CricXtasy) August 27, 2022 Sri lanka dedicating this scorecard to their father india (Source: Daniel Alexander)#AFGvSL #AsiaCup2022 pic.twitter.com/dDpyDxIZ8E — YouAreWrong (@huihui_____) August 27, 2022 #AFGvSL #AsiaCup2022 Third Umpire taking decision on Pathum Nissanka's Dismissal: pic.twitter.com/HSZ2AY7ghD — Vichitra.Duniya 🌏 (@vichitra_duniya) August 27, 2022 -
ఆసీస్తో రెండో టెస్టు.. నిలకడగా ఆడుతోన్న శ్రీలంక..!
ఆస్ట్రేలియాతో గాలెలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే (86; 10 ఫోర్లు), కుశాల్ మెండిస్ (84 బ్యాటింగ్; 9 ఫోర్లు) రాణించారు. అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మిత్(145), మార్నస్ లబుషేన్(104) పరుగులతో రాణించారు. ఇక అరంగేట్రం మ్యాచ్లోనే శ్రీలంక యువ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. చదవండి: ENG vs IND: టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్.. తొలి భారత ఆటగాడిగా..! -
18 నెలల తర్వాత సెంచరీ చేసిన స్మిత్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతడి 18 నెలల నిరీక్షణకు తెరపడింది. ఈ మ్యాచ్లో 193 బంతుల్లో అతడు శతకాన్ని సాధించాడు. ఇక తన టెస్టు కెరీర్లో స్మిత్కు ఇది 28వ సెంచరీ. 2021లో భారత్తో జరిగిన సిడ్నీ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లో స్మిత్ తన చివరి సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(109), కారీ(16) పరుగులతో ఉన్నారు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్( 5), ఉస్మాన్ ఖవాజా(37) రాణించక పోవడంతో 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్కి 134 పరుగుల భాగస్వామ్యంతో జట్టును అదుకున్నారు. ఈ క్రమంలో విదేశీ గడ్డపై తొలి సెంచరీను లబుషేన్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 104 పరుగులు సాధించిన లబుషేన్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్లో ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో జయసూర్య మూడు వికెట్లు, రజితా, మెండీస్ తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs ZIM: ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా..! This is Steve Smith 28'th century moment pic.twitter.com/gxJXKAV9a5 — Hammered Truth 🇦🇺🦘 (@hammered_truth7) July 8, 2022 -
తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. ఆస్ట్రేలియా ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 5 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. అంతకు ముందు శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లయాన్, హెడ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశారు. శ్రీలంక బ్యాటర్లలో కరుణ రత్నే 23 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 313/8 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను మొదలపెట్టిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా109 పరుగుల అధిక్యం సాధించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్లు మధ్య అఖరి టెస్టు జూలై8న గాలే వేదికగా ప్రారంభం కానుంది. చదవండి: SL Vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..! -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్కు కొవిడ్ పాజిటివ్..!
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కొవిడ్ బారిన పడడంతో టెస్టు మధ్యలో తప్పుకున్నాడు. అతడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. ఇక మాథ్యూస్ స్థానంలో ఓషద ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మాథ్యూస్ 71 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఏంజెలో మాథ్యూస్కు కోవిడ్ పాజిటివ్గా నిర్దారణైంది. "గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీ-జెన్ పరీక్షలో అతడికి పాజిటివ్గా తేలింది. మిగిలిన ఆటగాళ్లకు నెగిటివ్గా తేలింది. మాథ్యూస్ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 109 పరుగుల అధిక్యం లభించింది. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైంది. చదవండి: SL vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..! 🔴 Angelo Mathews tested positive for Covid-19. He was found to be positive during a Rapid Anti-Gen Test Conducted on the player. The test was done, as the player was feeling unwell. He has been isolated from the rest of the team members and is following covid-19 protocols. pic.twitter.com/6fUBT7D04z — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 1, 2022 -
శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్: 313/8
గాలేలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (77), ఉస్మాన్ ఖాజా (71) అర్ధసెంచరీలు సాధించగా, అలెక్స్ క్యారీ (45) రాణించాడు. రమేశ్ మెండిస్ 4 వికెట్లు పడగొట్టగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం 101 పరుగులు ముందంజలో ఉంది. చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్ తొలి పోరు.. -
శ్రీలంకపై ప్రకృతి ప్రకోపం.. వర్ష బీభత్సం ధాటికి అతలాకుతలమైన క్రికెట్ స్టేడియం
ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకపై ప్రకృతి సైతం పగబట్టింది. ఇవాళ (జూన్ 30) ఉదయం కురిసిన భారీ వర్షం దెబ్బకు లంకలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సం ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వర్ష ప్రభావం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్పై కూడా చూపింది. There's more cleaning up to do off the field than on it this morning... if anyone can get this ground ready for play it's the Galle team #SLvAUSpic.twitter.com/iklKta7xfM— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) June 30, 2022 వర్షం ధాటికి ఈ మ్యాచ్కు వేదిక అయిన గాలే స్టేడియం అతలాకుతలమైంది. తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రారంభమైన గాలివాన దెబ్బకు ఓ స్టాండ్ రూఫ్ కూలిపోవడంతో పాటు స్టేడియం మొత్తం చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ఫలితంగా రెండో రోజు ఆట దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈదురుగాలుల ధాటికి రూఫ్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే, వర్షం పూర్తిగా ఆగిపోయాక లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. 98/3 ఓవర్నైట్ స్కోర్ వద్ద ప్రారంభమైన రెండు రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి 101 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ఓవర్నైట్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (71), కెమరూన్ గ్రీన్ (77) అర్ధసెంచరీతో రాణించారు. అలెక్స్ క్యారీ (45) పర్వాలేదనిపించాడు. కమిన్స్ (26), లయన్ (8) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లయన్ 5 వికెట్లతో చెలరేగాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో! -
ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..!
భారత మహిళల జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా నేడు(జూన్ 23)న ప్రారంభమైంది. అయితే భారత్-శ్రీలంక మ్యాచ్లను ప్రసారం చేసేందుకు ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా ముందుకు రాలేదు. ఈ విషయంపై బీసీసీఐ సైతం పత్యేక చొరవ తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. ఇదేనా మహిళల క్రికెట్ అభివృధ్ది అంటూ బీసీసీఐపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్ల రికార్డు ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే.ఇక మ్యాచ్ల ప్రసారంపై బీసీసీఐ ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. శ్రీలంక క్రికెట్ మాత్రం తమ అభిమానులు వీక్షించేందుకు పలు వేదికలను ఏర్పాటు చేసింది. "శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్లను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్, డైలాగ్ టెలివిజన్, ఛానల్ వన్ ఎన్ఈ లో వీక్షించొచ్చు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. India Women Tour of Sri Lanka 2022, 3 T20Is & 3 ODIs, from 23rd June to 7th July. 👀 Catch the action LIVE on Sri Lanka Cricket YOUTUBE and ThePapare platforms ⬇️#SLvIND #SLWomens pic.twitter.com/3uP4chbFFR — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 22, 2022 ముందుకు వచ్చిన ఫ్యాన్కోడ్ ఇక చివరగా భారత్- శ్రీలంక మ్యాచ్లను ప్రసారం చేసేందుకు డిజిటల్ ఫ్లాట్ఫామ్ ఫ్యాన్కోడ్ ముందుకు వచ్చింది. ఫ్రీగా తమ వెబ్, యాప్ వేదికల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక వుమెన్స్ టూర్ ప్రసారం చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఫ్యాన్కోడ్ వెల్లడించింది. The wait is finally over! And we've got something better in store!🤩 How will the Women in Blue fare against the Sri Lankan lionesses on their home soil?🤔 Watch all the action FOR FREE from @BCCIWomen tour of @OfficialSLC LIVE on #FanCode👉https://t.co/324zYTfups . .#SLvIND pic.twitter.com/iUyaenWM3f — FanCode (@FanCode) June 22, 2022 -
ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. కాగా స్క్వేర్-లెగ్లో అంపైర్గా ఉన్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తను ఫీల్డర్ కాదని అంపైర్ అని గ్రహించి అఖరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అంపైర్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధర్మసేన ఇప్పుడు అంపైర్గా కాదు శ్రీలంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: IND vs ENG 5th Test: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్కు..! Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy — Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022 -
ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..!
కొలంబో: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 2013 తర్వాత ఆసీస్పై శ్రీలంక వరుసగా రెండు వన్డేల్లో నెగ్గడం ఇదే ప్రథమం. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఫించ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (70 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం శ్రీలంక 48.3 ఓవర్లలో 4 వికెట్లకు 292 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ నిసాంక (137; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ చేయగా... కుశాల్ మెండిస్ (87 రిటైర్డ్ హర్ట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో లంక 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్ ఖాతాలో అరుదైన రికార్డు -
శ్రీలంకతో రెండో వన్డే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో రెండో వన్డే ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్లు మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నారు. పల్లెకెల్లె వేదికగా జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ గాయపడ్డారు. ఇప్పటికే మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, సీన్ అబాట్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యారు. తాజాగా ఈ జాబితాలో స్టోయినిస్,అగర్ కూడా చేరారు. ఇక వీరిద్దరి స్థానంలో ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్ జట్టులోకి రానున్నారు. కాగా తొలి వన్డేలో స్టోయినిస్ 44 పరుగులతో రాణించగా.. అగర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో శ్రీలంకపై ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే పల్లెకెల్లె వేదికగా గురువారం జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
శ్రీలంకతో తొలి వన్డే.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ మార్ష్ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యారు. ఇక టీ20 సిరీస్కు దూరమైన స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి టీ20లో ఆసీస్ ఆనూహ్యంగా ఓటమి చెందింది. అఖరి మూడు ఓవర్లలో 59 పరుగులను ఛేజ్ చేసి శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శ్రీలంకతో తొలి వన్డేకి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st Odi): ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ కారీ, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జో రిచర్డ్సన్, జోష్ హేజిల్వుడ్. చదవండి: IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్ -
శ్రీలంకతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మిచిల్ మార్ష్ గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్ దూరమయ్యాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్ 14న జరగనుంది. మరోవైపు శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ , డేవిడ్ వార్నర్ చదవండి: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..! -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..!
పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అఖరి టీ20లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో గెలిపొందింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అఖరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. చదవండి: IND vs SA: 'అతడొక యంగ్ కెప్టెన్.. రానున్న మ్యాచ్ల్లో అద్భుతంగా రాణిస్తాడు' Highlights of last 3 overs#Shanaka#SLvAUS#AUSvsSL https://t.co/YlidfL0Qyp pic.twitter.com/2hPuNfNoTE — Ankit Chaudhary (@Ankit_Sihag_) June 12, 2022 -
3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..!
పల్లెకెలె: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.5 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. తొలి రెండు మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా 2–1తో సిరీస్ను సొంతం చేసుకుంది. చదవండి: IND vs SA T20 Series: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Hero of the match! 💪 What a knock by Dasun Shanaka 💥#SLvAUS #CheerForLions pic.twitter.com/n8ug04rQvh — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 11, 2022 -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు 21 మంది సభ్యలతో కూడిన తమ జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో శ్రీలంక తలపడనుంది. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో అఖరి మ్యాచ్ శనివారం పల్లెకెలె వేదికగా జరగనుంది. శ్రీలంక జట్టు: దసున్ షనక, పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్స, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, అసిత, రమేశ్ తుషార మ, అసిత, రమేశ్ తుషార మ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్ చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం -
దురదృష్టమంటే మెండిస్దే.. బంతిని కొట్టబోయి పొరపాటున..!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన రిచర్డ్సన్ బౌలింగ్లో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి మెండీస్ ప్రయత్నించాడు. అయితే ఫుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన మెండిస్ తన బ్యాట్తో బెయిల్స్ని పడగొట్టాడు. దీని ఫలితంగా మెండిస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో హిట్ వికెట్గా ఔటైన 20 ఆటగాడిగా మెండిస్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! Kusal Mendis Hit Wicket 36(36*) pic.twitter.com/ASwAial22l — Six Cricket (@Six6Cricket) June 8, 2022 -
శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్వెల్ మాయ చేస్తాడా..?
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్వుడ్లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. ఆసీస్–శ్రీలంక మధ్య జరిగే మూడు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లకు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st T20I) ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, జోష్ హాజిల్వుడ్. శ్రీలంక జట్టు దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, కుసల్ మెండిస్, భానుక రాజపక్స(వికెట్ కీపర్), దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, లహిరు మధుశంక, ప్రవేణ్ శంకన్, ప్రవేణ్ శంకన్, కసున్ రజిత, జయవిక్రమ, నువానీడు ఫెర్నాండో, మతీషా పతిరన, నువాన్ తుషార చదవండి: 'హార్ధిక్ పాండ్యా ఇద్దరి ఆటగాళ్లతో సమానం.. అయితే వన్డేల్లో మాత్రం ఆడకూడదు' -
తొలి బంతికే వికెట్ తీసిన జూనియర్ మలింగ.. వీడియో వైరల్
ఐపీఎల్లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పతిరనా డెబ్యూ చేశాడు. అయితే తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. జూనియర్ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా తన వేసిన తొలి బంతికే వికెట్ సాధించడం విశేషం. శుభ్మాన్ గిల్ను పతిరనా ఎల్బీడబ్ల్యూ చేశాడు. అచ్చం శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ లాగే పతిరనా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రుత్రాజ్ గైక్వాడ్ 53 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు, రషీద్ ఖాన్, జోషప్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. ఇక 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా(67) పరుగులతో రాణించాడు. చదవండి: IPL 2022: 'వారిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి వస్తారు' A dream debut for Matheesha Pathirana 😍#MatheeshaPathirana #CSKvsGT #IPL2022 pic.twitter.com/D0bZn42fo5 — Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) May 15, 2022 -
శ్రీలంకతో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్కు గుడ్ న్యూస్..!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మే 15న ఛటోగ్రామ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మే9 న అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత షకీబ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐషోలేషన్లో ఉన్నాడు. అయితే అతడికి తాజాగా నిర్వహించిన పరీక్షలలో నెగిటివ్గా తేలింది. ఇక షకీబ్ చివర సారిగా 2021లో పాకిస్తాన్పై ఆడాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్లకు వ్యక్తిగత కారణాలతో షకీబ్ దూరమయ్యాడు. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు: మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్ ఖాన్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ కుమార్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహెదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్ చౌద్యుల్, ఎబాడోత్ హుస్సేన్ చౌదుల్, హసన్ సోహన్, రెజౌర్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం చదవండి: Ben Stokes: వైరల్గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య -
'బంగ్లాదేశ్ ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ ఆడే ఆలోచన లేదు'
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తమ జాతీయ జట్టుపై విమర్శలు గుప్పించాడు. తమ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ ఆడే ఆలోచన లేదని అతడు తెలిపాడు. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్.. ఘోర పరాభావం మూటకట్టుకుంది. రెండు టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక మే 15 నుంచి శ్రీలంకతో స్వదేశంలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. టెస్టుల్లో మా జట్టు ఎందుకు ఇలా ఆడుతుందో నాకు ఆర్ధం కావడం లేదు. గత ఐదు టెస్టుల్లో ఇదే పరిస్ధితి కన్పిస్తోంది. సిరీస్ తొలి టెస్టులో జట్టు గట్టి పోటీ ఇస్తుంది. కానీ రెండో టెస్టులో చిత్తుగా ఓడి పోతున్నాం. స్వదేశంలో పాకిస్థాన్తో జరిగిన సిరీస్లో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో కూడా ఇలాగే జరిగింది. మా జట్టు ఆటగాళ్లు దీశీవాళీ టోర్నీల్లో ఎక్కువగా పాల్గొనరు. అదే విధంగా వారికి టెస్టు క్రికెట్ ఆడే ఆలోచనే లేదు. ఇప్పుడు అంతర్జాతీయ షెడ్యూల్తో బిజీగా ఉన్నాం. వారిని దేశవాళీ క్రికెట్ ఆడేలా చేయలేము. లేదంటే దేశీయ క్రికెట్ను కొన్ని రోజులు వాయిదా వేయాలి" అని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కాన్వేకు పెళ్లి వర్కౌట్ అయినట్లుంది.. మొయిన్ అలీ ఫన్నీ కామెంట్ -
శ్రీలంకకు మరో భారీ షాక్.. ఆసియా కప్ 2022 వేదిక మార్పు...!
ఆసియా కప్ 2022 శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ను మరో చోటుకు తరలించాలని ఐసీసీ యోచిస్తోన్నట్లు సమచారం. ఆదివారం(ఏప్రిల్ 17) దుబాయ్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) త్రైమాసిక సమావేశంలో" వేదిక మార్పుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటికే ఈటోర్నీకి అర్హత సాదించగా.. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ తర్వాత మరో జట్టు చేరుతుంది. ఇక చివరగా ఆసియా టీ20 కప్ 2016లో బంగ్లాదేశ్లో జరిగింది. చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్.. 98 మీటర్ల భారీ సిక్సర్.. వీడియో వైరల్ -
టీమిండియాతో రెండో టెస్టు.. శ్రీలంకకు మరో బిగ్ షాక్!
టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంకకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీరా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అధిక పని భారం కారణంగా చమీరాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మోకాలి గాయంతో బాధ పడుతున్న అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి పనిభారాన్ని తగ్గించాలని వైద్య బృందం శ్రీలంక క్రికెట్ బోర్డుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు చమీరాను కేవలం వైట్-బాల్ క్రికెట్లో మాత్రమే ఆడించాలని కూడా వైద్య బృందం సూచించినట్లు సమాచారం. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కూడా చమీరా దూరమయ్యాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. ఇందులో భారత్ ఇన్నింగ్స్ అండ్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా చమీరాను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు ఆటగాడు పథుమ్ నిసాంక కూడా దూరం కానున్నాడు. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
తొలి టెస్టు కోసం భారత్, శ్రీలంక జట్ల సాధన
-
కెప్టెన్గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ కారణంగానే రోహిత్ జట్టులో ఉన్నడాని, కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ కారణంగా జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్నాడు. "కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత మాత్రమే. రోహిత్ బ్యాటింగ్పై పట్టును కోల్పోకూడదు. జట్టును నడిసించే అదనపు బాధ్యత కారణంగా కెప్టెన్లు బ్యాటింగ్లో రాణించలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోహిత్ విషయంలో ఇది జరగకూడదు. రోహిత్కు కెప్టెన్గా ఇది ప్రారంభ దశ మాత్రమే. జట్టుకు తన బ్యాటింగ్ ఎంతో అవసరమో అతడు గ్రహించాలి. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ ప్రదర్శన చాలా కీలకం. అక్కడి గ్రౌండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ప్రత్యర్ధి జట్టులో అత్యత్తుమ బౌలర్లు ఉంటారు. కాబట్టి వారిని ఎదుర్కొని రోహిత్ ఈ మెగా టోర్నమెంట్లో రాణించాలి" అని సబా కరీమ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం -
భారత్, శ్రీలంక రెండో టీ20.. మ్యాచ్ జరిగేనా!
స్వదేశంలో టీమిండియా మరో టీ20 సిరీస్పై కన్నేసింది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో శనివారం భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో టీ20లో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే భారత్- శ్రీలంక రెండో టీ20కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. గత మూడు రోజులుగా ధర్మశాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. శనివారం వర్షం పడే అవకాశాలు కేవలం 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్షం పడి మైదానం చిత్తడిగా మారింది. దీంతో పిచ్పై గ్రౌండ్ స్టాప్ కవర్లు వేసి ఉంచారు. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్ను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోలేదు. భారత్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా / కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్ శ్రీలంక జట్టు (అంచనా): దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లాహిరు కూమార -
'ఇషాన్ కిషన్ బాగా ఆడాడు.. కానీ ఇది సరిపోదు'
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. అదే విధంగా దోని, పంత్కు సాధ్యం కాని రికార్డును కిషన్ సాధించాడు. 89 పరుగులు చేసిన కిషన్.. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన తొలి భారత భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. టీ20ల్లో కిషన్కు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్లో కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే ఇది మొదటి మ్యాచ్ మాత్రమే. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో అతడు అంతగా రాణించలేదు. ఈడెన్లో పేస్ బౌలింగ్కు కిషన్ ఇబ్బంది పడ్డాడు. లక్నోలో పిచ్ బ్యాటర్లకు అనూకూలించింది. కానీ కిషన్ ఆడిన డ్రైవ్, పుల్ షాట్లు అద్భుతమైనవి. అయితే ముఖ్యంగా అతడి బ్యాటింగ్లో నిలకడ కావాలి. అతడు నిలకడగా ప్రదర్శన చేస్తే కచ్చితంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అదే విధంగా అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: 'కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు' -
46 మ్యాచ్లు.. 196 వికెట్లు.. ఏకంగా భారత జట్టులోకి ఏంట్రీ.. ఎవరీ సౌరభ్ కుమార్ ?
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉత్తర్ ప్రదేశ్ ఆల్ రౌండర్ సౌరభ్ కుమార్ను సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో టెస్ట్లకు ఎంపిక చేసింది. 28 ఏళ్ల సౌరభ్ కుమార్ భారత జట్టు తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అనూహ్యంగా భారత జట్టులోకి ఏంట్రీ ఇస్తున్న సౌరభ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు. సౌరభ్ ఇప్పటి వరకు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరభ్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్లు ఆడిన సౌరభ్.. 196 వికెట్లు పడగొట్టాడు. ఈ లెప్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.. గత ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత-ఏ జట్టులో భాగమై ఉన్నాడు. అదే విధంగా గతఏడాది జరగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను సౌరభ్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఇక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన అతడు 44 వికెట్లతో పాటు, 285 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో కుల్ధీప్ యాదవ్తో కలిసి ఎనిమిదో వికెట్కు 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్ చదవండి: Ind Vs SL: శ్రీలంకతో సిరీస్లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం -
శ్రీలంకతో సిరీస్లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటన చేసింది. ఈ సిరీస్ లకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొత్తం 18 మంది ఆటగాళ్లను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదే విధంగా భారత టెస్ట్ కెప్టెన్గా రోహిత్ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్కు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్కి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ భారత తరుపున టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే విధంగా సంజు శాంసన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరో వైపు గాయం కారణంగా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో సిరీస్లకు దూరమయ్యారు. ఇక గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇక విండీస్తో సిరీస్కు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్పీత్ర్ బూమ్రా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక టెస్టు జట్టు విషయానికి వస్తే.. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాటర్లు రహానే, పుజారాలపై సెలెక్టర్లు వేటు వేశారు. అదే విధంగా ఉత్తర ప్రదేశ్ స్పిన్నర్ సౌరభ్ కూమార్ టెస్టుల్లో భారత తరుపున అరంగేట్రం చేయనున్నాడు. భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్ భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్ -
ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా!
Ranji Trophy 2021-22: టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. ముంబైతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ముంబై బౌలర్ మోహిత్ అవస్తీ బౌలింగ్లో పుజారా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పుజారాకి భారత జట్టులో చోటు దక్కడం ఇప్పటికే కష్టంగా మారింది. మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు మరి కొద్దిరోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో పుజారా డకౌట్ కావడం.. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలను మరింత దెబ్బతీశాయి. ఇక పుజారా 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడిన పుజారా 521 పరుగులు చేశాడు. అయితే అప్పటి నుంచి పుజారా తన ఫామ్ను కోల్పోయాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 27 టెస్టులాడిన పుజారా కేవలం 1287 పరుగుల మాత్రమే చేశాడు. లీడ్స్లో ఇంగ్లండ్పై అత్యధికంగా 91 పరుగులు పుజారా సాధించాడు. చదవండి: Ind Vs Wi 2nd T20: రోహిత్ ఆగ్రహం... అసహనంతో బంతిని తన్నిన హిట్మ్యాన్.. పాపం భువీ! -
శ్రీలంకతో టీ20 సిరీస్.. విరాట్ కోహ్లి దూరం.. కారణం అదేనా?
Former Indian skipper Virat Kohli: గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగే సిరీస్లో జడేజా తిరిగి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. కాగా నేషనల్ క్రికెట్ అకాడమీలోని పునరావాస కేంద్రంలో గత కొంత కాలంగా జడేజా శిక్షణ పొందుతున్నాడు. అయితే ఇప్పటికే భారత్- శ్రీలంక తొలి టీ20 వేదిక అయిన లక్నోకు జడేజా చేరుకుని ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. జడేజాతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. జడేజా, బుమ్రా ఇద్దరూ వేర్వేరు కారణాల వల్ల వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే శ్రీలంకతో టీ20 సిరీస్కు కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అంతగా ఫామ్లో లేని కోహ్లి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీ20 సిరీస్ అనంతరం జరిగే టెస్ట్ సిరీస్కు కోహ్లి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు వన్డేల్లో మొత్తం కోహ్లి 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇక విండీస్తో జరిగిన తొలి టీ20లోను కేవలం 17 పరుగులు మాత్రమే చేసి విరాట్ పెవిలియన్కు చేరాడు. చదవండి: Ind VS Wi 2nd T20: వరుసగా 8, 18, 0, 17.. కనీసం ఈ మ్యాచ్లోనైనా! -
అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్బై..
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దిల్రువాన్ పెరీరా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పెరీరా రిటైర్మెంట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ద్రువీకరించింది. "శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్రువాన్ పెరీరా, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు" అని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అంతర్జాతీయ క్రికెట్కి గుడ్బై చెప్పిన పెరీరా.. దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు. ఇప్పటి వరకు శ్రీలంక తరుపున 43 టెస్టు మ్యాచ్లు ఆడిన దిల్రువాన్ పెరీరా 161 వికెట్లు తీశాడు. కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్లో 10 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన ఏకైక శ్రీలంక ఆటగాడిగా దిల్రువాన్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. అదే విధంగా 13 వన్డేలు, 3 టీ20లు ఆడిన దిల్రువాన్.. వరుసగా 13, 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 800 వికెట్లు తీశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరుపున దిల్రువాన్ ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022: 'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్' -
ఆ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేత.. మళ్లీ క్రికెట్ ఆడొచ్చు
శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఎత్తివేసింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ మీడియా సమావేశంలో ద్రువీకరించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్తో, జాతీయ జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉంటారని బోర్డ్ పేర్కొంది. కాగా గత ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లు డిక్వెల్లా, గుణతిలక, మెండిస్ బయో బబుల్ను ఉల్లంఘించి బయట తిరుగుతూ కనిపించారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సిరీయస్గా తీసుకున్న శ్రీలంక క్రికెట్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. "ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు బోర్డు వాళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సెలింగ్ ఒక డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించాం. డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
10 ఫోర్లు, 4సిక్స్లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్!
లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్21న దంబుల్లా జెయింట్సతో జరిగిన క్వాలిఫైయర్ 2లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లో అవిష్క ఫెర్నాండో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జాఫ్నా కింగ్స్కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో 122 పరుగల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్ 40 బంతుల్లో 70 పరుగలు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవరల్లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమైంది. కాగా అఖరిలో 75 పరగులతో దంబుల్లా బౌలర్ కరుణరత్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకుండా పోయింది. ఇక జాఫ్నా కింగ్స్ బౌలర్లలో సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షణ, పెరెరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా డిసెంబర్23న ఫైనల్లో గాలె గ్లాడియటర్స్తో జాఫ్నా కింగ్స్ తలపడనుంది. చదవండి: ఆ టీమిండియా బ్యాటర్కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ -
క్రికెటర్లకు షాకిచ్చిన బోర్డు... అలా జరగనట్లయితే జీతాల్లో కోత!
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ జట్టు ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జట్టు ఆటగాళ్లంతా ఫిట్నెస్పై దృష్టిసారించాలని, లేక పోతే వాళ్ల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం.. ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్నికేవలం 8.10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ రన్ పూర్తిచేసే సమయం 8:55 దాటితే సదరు ఆటగాడిని సెలెక్షన్కు పరిగణించరు. 8:35 నుంచి 8:55 నిమిషాల్లో పూర్తి చేస్తే వాళ్ల జీతాల్లో కోత విధిస్తారు. ఇక వచ్చే ఏడాదిలో మొత్తంగా నాలుగు సార్లు యోయో టెస్ట్లను శ్రీలంక నిర్వహించనుంది. తొలి ఫిట్నెస్ టెస్ట్ జనవరి7న జరగనుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రవేశ పెట్టిన కొత్త రూల్స్ జనవరి 2022 నుంచి అమలులోకి రానున్నాయి. "ఇకపై ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్ని 8.10 నిమిషాలలోపు పూర్తి చేయాలి. ఆటగాళ్లు తమ ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఫిట్నెస్లో లోపాలను అసలు మేము సహించం" అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక శ్రీలంక జట్టు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్లో పర్యటించనుంది. ఇక శ్రీలంక పురుషుల సీనియర్ జట్టుకు కన్సల్టింగ్ కోచ్గా మహేల జయవర్దనే ఇటీవల ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Bhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్! -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్కు కీలక పదవి..
కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Sri Lanka Cricket wishes to announce the appointment of former Sri Lanka Captain Mahela Jayawardena as the ‘Consultant Coach’ for the National Teams, effective 1st January 2022. READ:https://t.co/8Kry3xwm62 #LKA #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 13, 2021 కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే.. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్ -
విధ్వంసం సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
వెస్టిండీస్ను క్లీన్స్వీప్ చేసిన శ్రీలంక..
గాలే: వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆతిథ్య శ్రీలంక క్లీన్స్వీప్ చేసింది. రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో ఘనవిజయం సాధించి సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 56.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా (5/35), రమేశ్ మెండిస్ (5/66) కరీబియన్ జట్టును పడగొట్టేశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 328/8తో ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ను 121.4 ఓవర్లలో 345/9 వద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డిసిల్వా (155 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు. ధనంజయకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రమేశ్ మెండిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IND Vs NZ: ఒకే ఒక్కడు 6వికెట్లు.. భారత్పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్.. -
పాపం వెస్టిండీస్.. ఘోర ఓటమి
గాలే: వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో గెలుపొందింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ లంక స్పిన్నర్ల ధాటికి నిలబడలేక 160 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు రమేశ్ మెండిస్ 5 వికెట్లు, లసిత్ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. చదవండి: ‘చాంపియన్’తో సమరానికి సై అంతకు ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటై 156 పరుగుల ఆధిక్యం కోల్పోయిం ది. శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్లకు 191 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కరుణరత్నే (83), మాథ్యూస్ (69) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్ -
దురదృష్టమంటే ధనంజయ డి సిల్వాదే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..
Dhananjaya de Silva gets out hit wicket in a hilarious manner: గాలే వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా దురదృష్టకర రీతిలో తన వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్లో కనిపించాడు. అయితే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్లో.. రెండో బంతిని డి సిల్వా ఢిపెన్స్ ఆడగా అది ఎడ్జ్ తీసుకుని స్టంప్స్ను తాకబోయింది. చదవండి: Rohit Sharma- Ashwin: అశ్విన్పై రోహిత్ ప్రశంసలు.. కెప్టెన్కు అటాకింగ్ ఆప్షన్ అంటూ.. ఈ క్రమంలో బంతిని స్టంప్కు తగలకుండా డి సిల్వా ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్తో బెయిల్స్ని పడగొట్టాడు. దీని ఫలితంగా ధనంజయ డి సిల్వా హిట్ వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. కాగా టెస్టుల్లో హిట్ వికెట్గా వెనుదిరగడం అతడికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్ క్రికెట్లో రెండు సార్లు హిట్ వికెట్గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా ధనంజయ డి సిల్వా నిలిచాడు. చదవండి: Lendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్గా ఎవరంటే..? Here's the moment Dhananjaya de Silva becomes the second Sri Lankan to hit his own wickets twice in Test cricket. #SLvWI pic.twitter.com/DyGShkaByE — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 22, 2021 -
SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలె: వెస్టిండీస్తో ఆదివారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్లో శ్రీలంక క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగులు సాధించింది. కెప్టెన్, ఓపెనర్ దిముత్ కరుణరత్నే (265 బంతుల్లో 132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు.దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. 2021లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. కాగా మరో ఓపెనర్ పథుమ్ నిసాంక (140 బంతుల్లో 56; 7 ఫోర్లు)తో కలిసి కరుణరత్నే తొలి వికెట్కు 139 పరుగులు జోడించి లంకకు శుభారంభం ఇచ్చాడు. కరుణరత్నే టెస్టు కెరీర్లో ఇది 13వ సెంచరీ. నిసాంక అవుటయ్యాక ఒషాడా ఫెర్నాండో (3), మాథ్యూస్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం కరుణరత్నేతో ధనంజయ డిసిల్వా (77 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు. చదవండి: IND Vs NZ: పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు.. -
శ్రీలంక కోచ్గా మహేల జయవర్ధనే!
Mahela Jayawardene in Srilanka Coaching staff: శ్రీలంక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్ తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు కన్సల్టెంట్ కోచ్లుగా ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. “మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు, ది హండ్రెడ్ లీగ్లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్ కోచ్గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు -
T20 World Cup 2021: లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్
లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్..70 పరుగుల తేడాతో ఘన విజయం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ లంక బౌలర్ల ధాటికి 101 పరుగులకే కుప్పకూలింది. మహీశ్ తీక్షణ 3 వికెట్లతో విజృంభించగా.. కరుణరత్నే, లహిరు కుమార చెరో 2 వికెట్లు.. చమీరా, హసరంగ తలో వికెట్ పడగొట్టి ఐర్లాండ్ను ఆలౌట్ చేశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ(41), కర్టిస్ కాంఫర్(24) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఈ విజయంతో శ్రీలంక సూపర్-12 స్టేజ్ బెర్తు ఖరారు చేసుకుంది. ఐర్లాండ్ టార్గెట్ 172.. 5 ఓవర్ల తర్వాత 33/3 172 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్కు లంక బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. తొలి ఓవర్లో కరుణరత్నే.. కెవిన్ ఓ బ్రయాన్(5)ను, 3వ ఓవర్లో తీక్షణ.. పాల్ స్టిర్లింగ్(7)ను, 5వ ఓవర్లో హసరంగ.. గ్యారెత్ డెలానీ(2)ని ఔట్ చేశారు. 5 ఓవర్ల తర్వాత ఐర్లాండ్ స్కోర్ 33/3. హసరంగ, నిస్సంక అర్ధ శతకాలు.. ఐర్లాండ్ టార్గెట్ 172 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను వనిందు హసరంగ(47 బంతుల్లో 71; 10 ఫోర్లు, సిక్స్), పథుమ్ నిస్సంక(47 బంతుల్లో 61; 3 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్ దసున్ శనక(11 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడడంతో నిర్ణీత ఓవర్ల ముగిసే సరికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ అదైర్ 2, పాల్ స్టిర్లింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక జట్టును వనిందు హసరంగ(33 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్), పథుమ్ నిస్సంక(25 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఐర్లాండ్ బౌలర్లు జాషువా లిటిల్(2/4), పాల్ స్టిర్లింగ్(1/4) ధాటికి శ్రీలంక జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో గోల్డెన్ డక్గా వెనుదిరగగా.. దినేశ్ చండీమాల్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. 1.4 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 8/3. క్రీజ్లో వనిందు హసరంగ, పథుమ్ నిస్సంక(2) ఉన్నారు. అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-ఏ మ్యాచ్లో శ్రీలంక, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు: శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాథుమ్ నిషంక, దినేశ్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లాహిరు కుమార. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఒబ్రెయిన్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), గరేత్ డిలనీ, కర్టిస్ కాంపర్, హ్యారి టెక్టార్, నీల్ రాక్(వికెట్ కీపర్), సిమీ సింగ్, మార్క్ అదేర్, క్రెయిగ్ యంగ్, జోషువా లిటిల్. -
2 ప్రపంచకప్లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్
David Wiese Played For Two Nations In Consecutive World Cups: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో నమీబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వీస్ చరిత్ర సృష్టించాడు. వరుస ప్రపంచకప్లలో రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. 2016 ప్రపంచకప్లో జన్మస్థలమైన దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన వీస్.. ప్రస్తుత వరల్డ్కప్లో తన తండ్రి స్వస్థలమైన నమీబియా తరఫున ఆడుతున్నాడు. 36 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన వీస్.. 2013లో దక్షిణాఫ్రికా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేసి 6 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరఫున 3 మ్యాచ్లు ఆడిన వీస్.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2019లో నమీబియా టీ20 ప్రపంచకప్కు క్వాలిఫై కావడంలో కీలకపాత్ర పోషించిన వీస్.. నాటి నుంచి ఆ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం(అక్టోబర్ 18) శ్రీలంకతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో బరిలోకి దిగిన అతను.. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో లంక బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 96 పరుగులకే ఆలౌట్ కాగా.. శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో అన్నీ అనుకూలించి నమీబియా సూపర్ 12 స్టేజ్కి చేరితే.. అక్కడ దక్షిణాఫ్రికాతో తలపడే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు.. -
T20 World Cup 2021: పసికూన నమీబియాపై శ్రీలంక సూపర్ విక్టరీ
పసికూన నమీబియాపై శ్రీలంక సూపర్ విక్టరీ నమీబియా నిర్ధేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు ఆరంభంలో తడబడినప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో(28 బంతుల్లో 30 నాటౌట్; 2 సిక్సర్లు), భానుక రాజపక్స(27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా శ్రీలంక 7 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించింది. నమీబియా బౌలర్లలో స్మిట్, బెర్నార్డ్, రూబెన్ ట్రంపెల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు: నమీబియా 96 ఆలౌట్.. శ్రీలంక 100/3 లంక బౌలర్ల ధాటికి 96 పరుగులకే కుప్పకూలిన నమీబియా లంక బౌలర్లంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో పసికూన నమీబియా విలవిలలాడింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేక 19.3 ఓవర్లలో 96 పరుగులకే చాపచుట్టేసింది. నమీబియా జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ను చేయగలిగారు. వారిలో క్రెయిగ్ విలియమ్స్(29) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో తీక్షణ 3 వికెట్లు.. లహీరు కుమార, హసరంగ చెరో రెండు వికెట్లు.. చమీరా, కరుణరత్నే తలో వికెట్ పడగొట్టారు. 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 54/2 లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 54/2గా ఉంది. క్రీజ్లో క్రెయిగ్ విలియమ్స్(15), గెర్హార్డ్(15) ఉన్నారు. మహీశ్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న లంక బౌలర్లు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన నమీబియా జట్టుకు లంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహీశ్ తీక్షణ పసికూనపై చెలరేగి బౌలింగ్ చేస్తూ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్లో బార్డ్(7)ను పెవిలియన్కు పంపిన తీక్షణ.. ఆరో ఓవర్లో జేన్ గ్రీన్(8)ను కూడా ఔట్ చేశాడు. 6 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 30/2. క్రీజ్లో క్రెయిగ్ విలియమ్స్(9), గెర్హార్డ్ ఉన్నారు. అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-ఏ మ్యాచ్లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు: శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాథుమ్ నిషంక, దినేశ్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లాహిరు కుమార. నమీబియా: స్టీఫెన్ బార్డ్, జానే గ్రీన్, క్రెయిగ్ విలియమ్స్, గెర్హాడ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీజ్, జేజే స్మిత్, జాన్ ఫ్రిలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ షోల్ట్. -
శ్రీలంక క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ మృతి..
Sri Lanka First Test Captain Bandula Warnapura Passed Away: శ్రీలంక టెస్ట్ జట్టుకు తొట్ట తొలి సారధిగా వ్యవహరించిన బందుల వర్ణపుర(68) సోమవారం మృతి చెందాడు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల అతను మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 1982 ఫిబ్రవరిలో కొలొంబొ వేదికగా ఇంగ్లండ్తో శ్రీలంక ఆడిన తొలి టెస్ట్కు కెప్టెన్గా వ్యవహరించిన వర్ణపుర.. శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్గా, తొలి పరుగు చేసిన ఆటగాడిగా.. అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ మొత్తంలో 4 టెస్ట్లు, 12 వన్డేలు ఆడిన అతను.. 1975 ప్రపంచకప్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. రిటైర్మెంట్ అనంతరం అతను శ్రీలంక కోచ్గా కూడా వ్యవహరించాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్రౌండర్