జొహన్నెస్బర్గ్: అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్కు ఈ మహాత్ముల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చి నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత 2018లో భారత జట్టు అక్కడికి వెళ్లి నాలుగు టెస్టులు ఆడుతుంది. ‘రెండు జట్ల మధ్య సిరీస్కు ఆ మహాత్ముల పేర్లతో ట్రోఫీ ఏర్పాటు చేయాలనే ఆలోచన భారత్ నుంచి వచ్చింది. మేం కూడా సంతోషంగా అంగీకరించాం. అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది’ అని సీఎస్ఏ సీఈ లోర్గాట్ చెప్పారు.
గాంధీ-మండేలా సిరీస్!
Published Thu, Jun 4 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM
Advertisement
Advertisement