
ఎన్ఎండీసీ జట్టు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఎన్ఎండీసీ జట్టు విజేతగా నిలిచింది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్)లో నిర్వహించిన ఈ డేనైట్ టోర్నమెంట్లో ఆదివారం ఎన్ఎండీసీ, 51 పరుగుల తేడాతో ఐఏఎస్ క్లబ్పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్ఎండీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. తర్వాత 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఐఏఎస్ క్లబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది.