ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లీషు టీమ్ ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని సఫారీ జట్టు భావిస్తోంది.