సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) ప్రొఫెసర్ జయశంకర్ స్మారక హ్యాండ్బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ చింతల్బస్తీలోని రామ్లీలా గ్రౌండ్సలో జరుగుతుంది. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.