హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జి వివేకానంద్,విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం గం.2.00ల వరకూ పోలింగ్ కొనసాగనుంది. కాగా, హైకోర్టు తుది ఉత్తర్వుల తర్వాత మాత్రమే ఫలితాలను వెల్లడిస్తారు.