HCA
-
శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం.. వీడియో
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha) అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు వరుసగా రెండోసారి వరల్డ్కప్ టైటిల్ను త్రిష అందించింది. ఏడు ఇన్నింగ్స్లలో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా త్రిష నిలిచింది.అంతేకాకుండా బౌలింగ్లోనూ తొమ్మిది వికెట్లతో త్రిష సత్తా చాటింది. ఇక భారత్ వరల్డ్కప్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష సోమవారం ఆర్ద రాత్రి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. స్వదేశానికి చేరుకున్న త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు ద్రితి కేసరి,టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా తమ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో త్రిష మాట్లాడారు."అండర్ 19 వరల్డ్ కప్లో మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్లో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. వరల్డ్కప్ మెగా టోర్నీలో ఆడుతున్నప్పటికి నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్లో నా పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాను అని త్రిష పేర్కొంది.మరోవైపు తన సహచర ప్లేయర్ ద్రితిపై త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. "ద్రితి అద్భుతమైన ప్లేయర్. కానీ జట్టు కూర్పు వల్ల ఆమెకు ఈసారి ఆడే అవకాశం లభించలేదు. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆమె అద్భుతాలు సృష్టిస్తుందని" త్రిష కొనియాడింది.ద్రితి మాట్లాడుతూ.. "తొలుత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడం కాస్త బాధగా అన్పించింది. కానీ రెండు మ్యాచ్ల తర్వాత దేశం కోసమే ఆలోచించాను. భారత్కు వరల్డ్కప్ అందించిన టీమ్లో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో అద్బుతంగా రాణిస్తాన్న నమ్మకం నాకు ఉంది. ఈ టోర్నీలో త్రిష తీవ్రంగా శ్రమించింది" అని చెప్పుకొచ్చారు.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిGongadi Trisha, the Player of the Tournament, of #U19T20WorldCup receives a grand welcome at #Hyderabad Airport.HCA President Jagan Mohan Rao extended a grand welcome to the Women's Under-19 T20 World Cup star cricketers #GongadiTrisha, Drithi Kesari, Head Coach Nooshin and… pic.twitter.com/4P4yup74L4— Surya Reddy (@jsuryareddy) February 4, 2025 -
ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్రైజర్స్కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్లు, లిఫ్ట్లు, లాంజ్లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
Uppal Stadium: టికెట్ ఉన్నా సీటే లేదు!
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్షం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్డేడియంలో సన్రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్లో ఓ అభిమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి టికెట్ ఉన్నా స్టేడియంలో సీటు లభించలేదు. నగరానికి చెందిన జునైద్ అహ్మద్ రూ.4,500 వెచి్చంచి టికెట్ కొన్నాడు. టికెట్లో జే– 66 సీట్ నంబర్ అలాట్ చేశారు. తీరా స్టేడియంలోకి వెళ్లగా జే–65 తర్వాత 67 సీటు ఉండటంతో షాక్ తిన్నాడు. జే–66 సీట్ ఎంత వెతికినా లభించలేదు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చేసేదేమీలేక మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం కారణంగానే తాను 4 గంటల పాటు నిలబడాల్సి వచి్చందని జునైద్ ఆరోపించాడు. ఈ విషయాన్ని న్యాయస్థానం, వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్తానన్నాడు. -
మహిళా క్రికేటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై వేటు
-
భారత్, ఇంగ్లండ్ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి..
హైదరాబాద్లో ఈనెల 25 నుంచి జరగనున్న భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మొత్తం 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భారత జట్టు శనివారమే నగరానికి చేరుకోగా, ఇంగ్లండ్ నేడు అడుగు పెడుతుంది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ
-
హెచ్సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్కు నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్లో పేర్కొంది. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్లకు నో ఛాన్స్ -
హెచ్సీఏలో ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవకతవకలు, అవినీతి, కోర్టు వివాదాలు, పరస్పర ఆరోపణలు, సస్పెన్షన్లు, పర్యవేక్షకుల పరిపాలన తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ ఆధ్వర్యంలో నేడు ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి మొహమ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షుడిగా 2019లో ఎన్నికైన హెచ్సీఏ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది సెపె్టంబర్ 26నే ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా... వేర్వేరు వివాదాలతో అవి వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు జరిగే వరకు రోజూవారీ కార్యకలాపాల కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో మూడు వరల్డ్కప్ మ్యాచ్లు కూడా జరిగాయి. చివరకు అక్టోబర్ 20న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ముందు హెచ్సీఏను ప్రక్షాళన చేసే క్రమంలో 57 క్లబ్లపై నాగేశ్వరరావు నిషేధం విధించారు. దాంతో ఈ క్లబ్లకు ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది. నాలుగు ప్యానెల్లుగా... అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్... ఇలా ఆరు పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. లోధా కమిటీ సిఫారసులు, కొత్త నియమావళి కారణంగా గతంలో కీలక పదవులు నిర్వహించిన సీనియర్లందరూ ఈసారి పోటీలో లేకపోగా, తాము మద్దతునిస్తూ సన్నిహితులను బరిలోకి దించారు. దాంతో ఈసారి ఎక్కువగా కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. నాలుగు వేర్వేరు గ్రూప్లుగా విడిపోయి అభ్యర్థులంతా పోటీ చేస్తున్నారు. అయితే ఫలితం విషయంలో గ్రూప్లతో సంబంధం లేదు. ఒక్కో పదవి కోసం అత్యధిక ఓట్లు సాధించిన వారు ప్యానెల్తో సంబంధం లేకుండా ఎన్నికవుతారు. పోలింగ్ కోసం మొత్తం 173 ఓట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 101 రెగ్యులర్ క్రికెట్ క్లబ్లు కాగా 48 ఇన్స్టిట్యూషన్ క్లబ్లు ఉన్నాయి. 9 జిల్లా క్లబ్లతో పాటు 15 మందికి అంతర్జాతీయ ఆటగాళ్ల హోదాలో ఓటు హక్కు ఉంది. గెలిస్తే తాము హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని చక్కదిద్దుతామని, వివాదాలు లేకుండా నడిపిస్తామని అభ్యర్థులంతా హామీ ఇస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. -
‘హెచ్సీఏ’ కమిటీపై ఉత్తర్వులు ఇవ్వవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు కమిటీకి సంబంధించి దిగువ కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏ కమిటీ రద్దయిన నేపథ్యంలో అసోసియేషన్ కార్యకలాపాలను చక్కదిద్దేందుకు గత ఫిబ్రవరిలో ఎల్. నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే హెచ్సీఏ ఎన్నికల అంశం వ్యవహారం సహా ఇతర అంశాల్లో పలువురు హెచ్సీఏ సభ్యులు పదే పదే వేర్వేరు కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీరి పిటిషన్ల తర్వాత హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. హెచ్సీఏ ప్రస్తుత స్థితికి సంబంధించి సుప్రీంకోర్టులోనే పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై తీర్పు ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. అసలు అలాంటి పిటిషన్లను అనుమతించడమే తప్పని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన చెల్లవని కూడా స్పష్టం చేసిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. -
వరుసగా 2 మ్యాచ్లు కష్టమన్న హెచ్సీఏ.. షెడ్యూల్ మార్పు కుదరదన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్కప్ మరో 45 రోజుల్లో మొదలవనుంది. ఈ దశలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వరుస రోజుల్లో రెండు ప్రపంచకప్ మ్యాచ్ల నిర్వహణ కష్టమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్లకు మార్పు కోరింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మార్పు కుదరదని స్పష్టం చేశారు. నిజానికి మెగా ఈవెంట్ షెడ్యూల్ చాలా ముందుగా విడుదల చేస్తారు. కానీ ఈసారి కేవలం నాలుగు నెలల ముందే జూన్లో ప్రకటించారు. ఇటీవలే షెడ్యూల్లో మార్పులు చేశారు. మళ్లీ మార్పులంటే కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లోనే (ఈ నెల 25న) టికెట్ల విక్రయం కూడా జరగబోతుంది. లాజిస్టిక్ సమస్యలే కాదు... ఇతరత్రా సర్దుబాట్లకు అవకాశాల్లేవని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందువల్లే ఇకపై షెడ్యూల్లో మార్పలుండబోవని స్పష్టం చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ల మధ్య అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్తో ప్రపంచకప్ మొదలవుతుంది. అసలేం జరిగింది? తొలుత ఐసీసీ–బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 9న ఉప్పల్ మైదానంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ల మధ్య మ్యాచ్, 12న పాకిస్తాన్, శ్రీలంకల మధ్య మ్యాచ్లు జరగాలి. అయితే మెగా ఈవెంట్కే హైలైట్గా నిలువనున్న భారత్, పాక్ పోరు అహ్మదాబాద్లో ఒకరోజు ముందుకు (అక్టోబర్ 15 నుంచి 14కు) జరిపారు. దీంతో పాకిస్తాన్కు సరైన విరామం కోసమని పాక్, శ్రీలంక మధ్య 12న జరగాల్సిన మ్యాచ్ను 10న నిర్వహించడమే హెచ్సీఏకు కష్టాలను తెచ్చిపెట్టింది. 9, 10 తేదీల్లో మ్యాచ్లంటే పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీం కోర్టు నియమిత అడ్మిని్రస్టేటర్తో నడుస్తున్న హెచ్సీఏ తెలిపింది. నేను హైదరాబాద్ వేదిక ఇన్చార్జ్గా ఉన్నాను. అక్కడ ఏమైన సమస్యలుంటే పరిష్కరించవచ్చు. కానీ షెడ్యూల్ మార్పు ఒక్క బీసీసీఐ చేతుల్లో ఉండదు. ఐసీసీ, పాల్గొంటున్న జట్లు, ఇతరత్రా సంస్థలు (సదుపాయాలు, లాజిస్టిక్స్) అందర్నీ ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. –బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా -
ఆ విషయంలో ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడా? అందుకే అమెరికాకు వెళ్లలేదా?
ఆర్ఆర్ఆర్ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఆస్కార్ అందుకోవటానికి అడుగు దూరంలో ఉంది. ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వరుసగా గోల్డెన్ గ్లోబ్, లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్...హెచ్.సి.ఏ అవార్డ్స్ అందుకుంది. ఇక హెచ్.సి.ఏ అవార్డ్స్ లో హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్ బెస్ట్ యాక్షన్ మూవీగా అవార్డ్ సొంతం చేసుకుంది. అమెరికాలో రాజమౌళి అండ్ టీమ్ ..హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ ప్యాన్స్ మాత్రం తమ హీరోకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీమ్ ను ఏకి పడేస్తున్నారు..ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హార్ట్ అయ్యాడనే మాట తెరపైకి వచ్చింది ఆర్ఆర్ఆర్ సినిమా బాగుంది. వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరూ ఆదరించారు..ప్రశంసించారు. కానీ ఈ సినిమా విడుదలైనప్పడు నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ పాత్రకే రాజమౌళి ప్రాధాన్యత ఇచ్చాడనే మాట ఎక్కువగా వినిపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్స్ మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఎలివేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వలేదనేది నందమూరి ప్యాన్స్ ఆరోపణ. ఆస్కార్ ఎంట్రీ కోసం జూనియర్ ఎన్టీఆర్...చెర్రీ ....రాజమౌళి అండ్ టీమ్ దాదాపు రెండు నెలలు అమెరికాలో ఉండి చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో హాలీవుడ్ పత్రికలు...ఫిల్మ్ క్రిటిక్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ నటనని ఆకాశానికి ఎత్తేశారు. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేస్ లో ఎన్టీఆర్ ఉంటాడని హాలీవుడ్ మ్యాగజైన్ వైరటీ స్పెషల్ స్టోరీ రాసింది. అలాగే యూఎస్ఏ టుడే పత్రిక కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ ని తెగ పొగిడేసింది. ఇండియా..ఇంటర్ నేషనల్ పత్రికలు కొమరం భీముడు పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తుందని ఊదరగొట్టారు. ఇక రాజమౌళి కూడా ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ ఉంటాడనే హామీ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఆస్కార్ పై ఆశలు పెట్టుకున్నాడట. చివరకి నాటు నాటు సాంగ్ కి మాత్రమే నామినేషన్ దక్కింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పాటు...ఎన్టీఆర్ కూడా బాగా డిస్పాయింట్ అయ్యాడనే మాట బాగా వినిపించింది. ఇక ఆస్కార్ నామినేషన్ దక్కపోయినా...కనీసం ఎన్టీఆర్ కి నేషనల్ బెస్ట్ అవార్డ్ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్...అది కూడా రాలేదు. రాజమౌళి ఆస్కార్ పై పెట్టిన ఫోకస్...కాస్త ఇండియాలో కూడా పెట్టి ఉంటే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఖచ్చితంగా ఎన్టీఆర్ కే వచ్చి ఉండేదని మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు. రీసెంట్ గా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చూసి చెర్రీ యాక్టింగ్ ను తెగ పొగిడాడు. ఈ విషయం తర్వాత ఎన్టీఆర్ బాగా హార్ట్ అనే మాట బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆస్కార్ అవార్డ్ వేడుకకి కూడా అమెరికా వెళ్లటం లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే రామ్ చరణ్ ఒక్కడే అమెరికా వెళ్లిపోయాడనే మాట నెట్టింట ఎక్కువగా వినిపించింది. దీంతో హెచ్సీఏ వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్కు తాము ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉండటం, ఆతర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడంతో ఆయన రాలేదని పేర్కొంది. Dear RRR fans & supporters, We did invite N. T. Rama Rao Jr. to attend the #HCAFilmAwards but he is shooting a new film in India. He will be receiving his awards from us shortly. Thank you for all your love and support. Sincerely, The Hollywood Critics Association — Hollywood Critics Association (@HCAcritics) February 27, 2023 అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆస్కార్ అవార్డ్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతున్నాడు. తన అన్నయ్య తారకరత్న పెద్దకర్మ మార్చి 2న జరగబోతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మార్చి నాలుగైదు తారీఖుల్లో జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలు దేరతాడని తెలిసింది. తన అన్నయ్య తారకరత్నకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఉండాలనుకున్నాడు...అందుకే చెర్రీ తో కలిసి ఎన్టీఆర్ అమెరికా వెళ్లలేదు. ఇలాంటి సమయంలో కుటుంబానికి అండగా ఉండాలనే కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు ఆలస్యంగా యూఎస్ కి బయలుదేరనున్నాడు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి దిగొచ్చిన హాలీవుడ్.. ట్వీట్ వైరల్
ఎన్టీఆర్-రామ్చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతార్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆస్కార్కు కూడా నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ ఇటీవలె గోల్డెన్ గ్లోబ్తో పాటు ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(హెచ్సీఏ)’అవార్డుల్లో ఏకంగా ఐదింటిని సొంతం చేసుకొని తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'ది విమెన్ కింగ్', 'టాప్ గన్ మేవరిక్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. అయితే ఈ అవార్డులు అందుకోవడానికి రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ హాజరయ్యారు.కానీ ఎన్టీఆర్ మాత్రం మిస్ అయ్యారు. అయితే ఈ మొత్తం ఈవెంట్లో రామ్చరణ్ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. అటు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం రామ్చరణ్ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే ఫ్యాన్ వార్కు దారితీసింది. కావాలనే తమ హీరోను దూరం పెట్టారంటూ సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీంతో స్పందించిన హెచ్సీఏ..ఎన్టీఆర్కు తాము ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉండటం, ఆతర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడంతో షూటింగ్ కూడా నిలిపివేశారని తెలిపారు. ఆయన పర్సనల్ కారణాల వల్లే ఈవెంట్కు హాజరుకాలేదని హెచ్సీఏ బదులిచ్చింది. Dear RRR fans & supporters, We did invite N. T. Rama Rao Jr. to attend the #HCAFilmAwards but he is shooting a new film in India. He will be receiving his awards from us shortly. Thank you for all your love and support. Sincerely, The Hollywood Critics Association — Hollywood Critics Association (@HCAcritics) February 27, 2023 He was originally shooting a movie which is why he couldn’t attend. His brother passing happened afterwards and is why he stepped away from the movie. This is what his publicist told us. — Hollywood Critics Association (@HCAcritics) February 27, 2023 -
ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్చరణ్ రికార్డు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులవుతుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. తర్వాత 'ఏబీసీ న్యూస్'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. 'ఆర్ఆర్ఆర్', 'నాటు నాటు' సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. బేవెర్లీ హిల్స్లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లోనూ రామ్ చరణ్ సందడి చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్సీఏ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు. హెచ్సీఏ అవార్డుల్లో ప్రజెంటర్గా 'బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్'ను రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన పక్కన నిలబడటమే అవార్డ్ అని నటి ఏంజెలా చెప్పారు. హాలీవుడ్ సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచారు. Honoured to be representing Indian Cinema at the @HCAcritics 2023 along with @ssrajamouli Garu & @mmkeeravaani Garu. I’m proud of the recognition we received as team @RRRMovie tonight. pic.twitter.com/u44ee2peX5 — Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023 -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
హెచ్సీఏ అస్తవ్యస్తంగా మారింది: మంత్రి శ్రీనివాస్గౌడ్
-
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్కు ముందు షెడ్యూల్కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
మ్యాచ్ నిర్వహణలో మరోసారి బయటపడిన HCA నిర్లక్ష్యం
-
పతనానికి పరాకాష్ట
-
HCA పై మాజీ ప్రెసిడెంట్ వివేక్ ఫైర్
-
అజారుద్దీన్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్
-
అంతా పారదర్శకమే.. టికెట్ల విక్రయాలపై అజహర్ స్పష్టీకరణ
ఉప్పల్/సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అన్ని రకాలుగా పారదర్శకత పాటించామని, తమ వైపునుంచి టికెట్లు బ్లాక్ అయ్యే అవకాశమే లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్లో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో నెలకొన్న గందరగోళంపై ఆయన ఈ మేరకు స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, మ్యాచ్ రోజున ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించాం. ఇందులో నేరుగా హెచ్సీఏ ప్రమేయం లేదు. ఆన్లైన్ టికెట్లను బ్లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పారు. ఆన్లైన్లో 11,450, 3,000 చొప్పున రెండుసార్లు, ఆఫ్లైన్లో 2,100 టికెట్లు విక్రయించామని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్పాన్సర్లు తదితరులకు 6 వేల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే తమ క్లబ్ కార్యదర్శులకూ కాంప్లిమెంటరీలు ఇచ్చామని అజహర్ పేర్కొన్నారు. సజావుగా నిర్వహించేందుకు... హెచ్సీఏలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో సమీక్ష నిర్వహించింది. ఇందులో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఏసీబీ డైరెక్టర్ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ పాల్గొన్నారు. మ్యాచ్ను సజావుగా నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని జస్టిస్ కక్రూ తెలిపారు. మ్యాచ్ను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ హెచ్సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. టి–20 టికెట్లలో భారీ కుంభకోణం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హఫీజ్పేట్: హైదరాబాద్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే టి–20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాలతో క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్ రంగంలోకి దిగి, హెచ్సీఏతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్లో అమ్ముకున్నారన్నారు. మియాపూర్ మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో శుక్రవారం జరిగిన ప్రవాస్ యోజన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం ఓ ఆన్లైన్ సంస్థకు అప్పజెప్పి, అర్ధరాత్రి 10 గం.కు అమ్మకాలు ఓపెన్ చేసి 20 నిమిషాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోయాయనడం విడ్డూరమన్నారు. రూ.800 టికెట్ను బ్లాక్లో రూ.8,000 నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. -
నెగెటివ్ ప్రచారం చేయడం తగదు : అజారుద్దీన్
-
అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
-
నిన్న జరిగినా ఘటనకు మేం బాధ్యులం కాదు
-
కాసేపట్లో HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రెస్ మీట్
-
ఆన్లైన్ బుకింగ్ చేసినవాళ్లకే జింఖానాలోకి ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇవ్వాలని హెస్సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక హెచ్సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది. అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు. ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? -
HCA డకౌట్
-
తొక్కిసలాటకు అజారే బాధ్యత వహించాలి : HCA మాజీ కార్యదర్శి శేషునారాయణ్
-
మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదు : అజారుద్దీన్
-
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
హెచ్సీఏ కీలక నిర్ణయం! రాత్రి 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్తో చర్చల అనంతరం హెచ్సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లను విక్రయించాలని హెచ్సీఏ నిర్ణయించకున్నట్లు సమాచారం . సూమారు 7000 టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు హెచ్సీఏ వర్గాలు పేర్కొన్నాయి. కాగా జింఖానా గ్రౌండ్లో టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో హెచ్సీఏ పేర్కొంది. మరోవైపు ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలపై హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రం భిన్నంగా స్పందించినట్లు సమాచారం. ఓవైపు ఆన్లైన్లో టికెట్లు అని వార్తలు వస్తుంటే.. ఆయన మాత్రం టికెట్లన్నీ అయిపోయాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! -
హెచ్సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
HCA రాజకీయాలు ప్రభుత్వం పై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
లాఠీచార్జ్ కు బాద్యులు ఎవరు ..?
-
హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్లైన్లోకి ఎందుకెళ్లారు?. హెచ్సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
-
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్ సీపీ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్ జోన్ అడిషనల్ సీపీ చౌహాన్ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్లో లైన్లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిస్థితికి హెచ్సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నా హెచ్సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్సీఏ.. తర్వాత ఆఫ్లైన్లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్సీఏ తీరుపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. -
HCA ఘోర వైఫల్యం
-
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్సీఏలో టికెట్ల రగడ
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్య వైఖరిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ– 20 క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. స్టేడియానికి నిత్యం వచ్చిపోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇక్కడ లభించవు జింఖానా గ్రౌండ్లో ఇస్తారని చెప్పి పంపిస్తున్నారు. అక్కడికి వెళితే ఉప్పల్ స్టేడియం వద్దే ఇస్తారంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా అక్కడికీ.. ఇక్కడికీ తిప్పించుకోవడమే తప్ప టికెట్లు మాత్రం ఇవ్వడంలేదని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టికెట్లు విక్రయించకుండా తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అరగంటలోనే అమ్ముడుపోయాయట.. ►టికెట్ల విక్రయం కోసం ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెబుతున్నప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్లో అవి అందుబాటులో లేకపోవడంతో హెచ్సీఏ పరువు దిగజార్చుకుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయినా ఆఫ్లైన్లో అవి లభిస్తాయనే ఆశతో అభిమానులు ఉప్పల్ స్టేడియం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ►ఉప్పల్, రామంతాపూర్, నాచారం, సికింద్రాబాద్, అంబర్పేట, మెహిదీపట్నం, యాదగిరి గుట్ట, ఘట్కేసర్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉదయం నుంచే స్టేడియం గేటు వద్ద తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ఒకానొక దశలో గేట్ దూకి వెళ్లడానికి ప్రయత్నించి.. పోలీసులు అడ్డుకోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. టికెట్లు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానం రాక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్ వద్ద గందరగోళం.. గేటుకు తాళం.. రసూల్పుర: క్రికెట్ మ్యాచ్ టికెట్లు ఇస్తున్నారనే వదంతులతో మంగళవారం సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్ వద్దకు వేలాది మంది క్రీడాభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మైదానం గేటుకు తాళం వేశారు. ఆగ్రహానికి గురైన అభిమానులు గోడ దూకి లోనికి వెళ్లారు. దీంతో సిబ్బంది లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వెళ్లిపోయారు. దీంతో జింఖానా మైదానం పరిసర రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ ఉన్న కొందరు అభిమానులను పంపించివేశారు. గేట్ తీసే వరకు కదిలేది లేదని.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 14 నుంచి టికెట్ల కోసం జింఖానా మైదానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, ఇప్పటికే అవి అమ్ముడుపోయాయని సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. జింఖానా మైదానంలో టికెట్లు ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పడం లేదని విరుచుకుపడ్డారు. చదవండి: మ్యాచ్కు హాజరైన యువరాజ్.. కోహ్లితో మాటామంతీ Situation at hyderabad gymkhana grounds for australia vs india match tickets. #hca #cricket #india #t20 pic.twitter.com/a6FZLy6IuM — Poley_Adiripoley (@poleyadiripoley) September 21, 2022 -
ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం(సెప్టెంబర్ 20) మోహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రెండో టీ20 సెప్టెంబర్ 23న నాగ్పూర్ వేదికగా.. మూడో టీ20 సెప్టెంబర్ 23న హైదరాబాద్లో జరగనుంది. కాగా దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఈ అంతర్జాతీయ మ్యాచ్కు అతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టేడియానికి వెళ్లి మ్యాచ్ను వీక్షించాలనుకున్న అభిమానులుకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్కు కోసం టికెట్ సేల్స్ను హెచ్సీఏ ఆన్లైన్లో సెప్టెంబర్ 15న ప్రారంభించగా.. నిమిషాల్లో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే సెకెండ్ ఫేజ్ టిక్కెట్లు త్వరలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు అయితే ఎటువంటి సేల్ను ప్రారంభించలేదు. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం టికెట్స్ను ఆఫ్లైన్లో జింఖానా గ్రౌండ్లో విక్రయిస్తామని ముందుగా హెచ్సీఏ ప్రకటించింది. అయితే టికెట్స్ కొనుగోలు చేసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. కానీ.. జింఖానా గ్రౌండ్లో టికెట్స్కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియషన్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ టికెట్స్ విషయంలో హెచ్సీఏ గోల్మాల్కు పాల్పడినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవతవకలు జరిగాయి అని హెచ్సీఏపై హెచ్ఆర్సీలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇక టికెట్లపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ హెచ్సీఏ స్పందించకపోవడం గమానార్హం. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
హెచ్సీఏ వివాదం: హైకోర్టులో అజారుద్దీన్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్, జస్టిస్ దీపక్ వర్మ జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్రావు, జస్టిస్ కె.లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం విచారించింది. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
అజార్ వేసిన పరువునష్టం కేసులో టి సి ఏ కార్యదర్శి కోర్టుకు హాజరు
-
సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హెటెన్షన్
-
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్మీట్కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు అంబుడ్స్మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్మన్గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్వర్మకు లేదని పేర్కొంది. దీపక్వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
HCA లో కీలకపరిణామం అపెక్స్ కౌన్సిల్ రద్దు
-
'షోకాజ్ నోటీసుకు జవాబివ్వను.. లీగల్గా తేల్చుకుంటా'
సాక్షి, హైదరాబాద్: హెచ్సీఏలో వివాదం రోజురోజుకు ముదిరి పాకానా పడుతుంది. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ మనోజ్ ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ''తాత్కాలిక ప్రెసిడెంట్ నియామకంపై నేను స్పందించను. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ చేస్తున్నది అక్రమమైన పని. నన్ను ప్రెసిడెంట్ గా తొలగించే అవకాశం అపెక్స్ కమిటీ సభ్యులకు లేదు. అలా తొలగించే అవకాశం ఉంటే... ప్రెసిడెంట్ గా ఉండి నేనే వారిని తొలగించేవాడిని. చాలా ఏళ్ళుగా ఈ సభ్యులు హెచ్సీఏను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలని నేను చూస్తున్నాను. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కావడం ఆ సభ్యులకు ఇష్టం లేదు. నేను లీగల్గానే తేల్చుకుంటాను. ఇప్పటికే వాళ్ల మీద అంబుడ్స్మెన్ కు కంప్లైంట్ చేసాను. అంబుడ్స్మెన్ ఇచ్చే నిర్ణయమే నా తుది నిర్ణయం కూడా..'' అంటూ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
-
హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్సీఏ ఇంకా గాడిన పడలేదు. చదవండి: అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు -
అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఒక డిక్టేటర్లా వ్యవహరిస్తున్నాడని హెచ్సీఏ మాజీ సెక్రటరీ శేష్ నారాయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' హెచ్సీఏను అజారుద్దీన్ భ్రష్టు పట్టిస్తున్నాడు. అజారుద్దీన్కు అందరినీ కలుపుకొనిపోయే తత్వం లేదు. హెచ్సీఏపై బీసీసీఐ కలగజేసుకునే రోజులు వస్తాయి'' అంటూ ఆయన పేర్కొన్నాడు. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. చదవండి: అజహరుద్దీన్పై వేటు! వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్ -
అజహరుద్దీన్పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్జీఎంలో కూడా హెచ్సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
HCA: అజారుద్దీన్ సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హెచ్సీఏకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పు పట్టింది. కాగా అజార్పై ఉన్న కేసులు పెండింగ్లో ఉండడంతో హెచ్సీఏ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్ -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు చాటుకుంది. భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ ఆల్రౌండర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడుకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. స్రవంతి తల్లిదండ్రలు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు వేర్వేరు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు.తన తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తండ్రి కూడా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడని స్రవంతి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్సీఏ ఆమెకు తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సాయం చేసేందుకు ముందుకొచ్చిన హెచ్సీఏకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. తల్లిదండ్రుల చికిత్స కోసం స్రవంతి ఇప్పటికే రూ.16 లక్షలు ఖర్చు చేసిందని, ఆమెకు ఆర్థిక సాయం అవసరమని షట్లర్ గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. ఆమెను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ను కోరింది. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పేషెంట్స్కు సాయం చేస్తున్న క్రికెటర్ హనుమ విహారి.. స్రవంతి కోసం తమవంతు సాయం చేస్తామని ట్వీట్ చేశాడు. (చదవండి:టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం) -
హెచ్సీఏ ఏజీఎంలో మరోసారి రసాభాస
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుడ్స్మన్ అధికారిగా మా అభ్యర్థి కొనసాగుతాడంటే మా అభ్యర్థి కొనసాగుతాడంటూ హెచ్సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్ అజహరుద్దీన్ వర్గం, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గం పరస్పరం మాటల యుద్ధానికి తెరలేపాయి. గత నెల 28న జరిగిన ఏజీఎం గొడవకు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. అజహరుద్దీన్ అధ్యక్షతన మీటింగ్ ఆరంభం కాగా... రిటైర్డ్ జడ్జి దీపక్ వర్మను హెచ్సీఏ కొత్త అంబుడ్స్మన్గా ప్రకటించి... మద్దతు తెలిపే వారు చేతులు పైకి ఎత్తాల్సిందిగా సభ్యులకు సూచించాడు. జాన్ మనోజ్ వర్గం ఇందుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇవేమీ పట్టించుకొని అజహరుద్దీన్ కొత్త అంబుడ్స్మన్గా దీపక్ వర్మ నియామకం పూర్తయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అజహర్ వెళ్లిన అనంతరం ఉపాధ్యక్షుడు మనోజ్ అధ్యక్షతన ఏజీఎం కొనసాగింది. ఈ సమయంలో ఆయన మరో రిటైర్డ్ జడ్జి నిసార్ అహ్మద్ కక్రూను అంబుడ్స్మన్గా ఎన్నుకున్నామని ప్రకటించారు. అయితే అహ్మద్ కక్రూ నియామకం చెల్లదని అజహరుద్దీన్ వ్యాఖ్యానించాడు. -
హెచ్సీఏ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన హెచ్సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కాగా అంబుడ్స్మెన్గా దీపక్వర్మను నియమించాలని అజర్ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజర్ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో వీహెచ్ హనుమంతరావు మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ..'' హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదు.ఆంద్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదు. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి.'' అని మండిపడ్డారు. కాగా తదుపరి హెచ్సీఏ సమావేశం వచ్చే నెల 11న జరిగే అవకాశం ఉంది. -
‘నా ఎంపికను ప్రశ్నించే హక్కు మీకు లేదు’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మను ఎంపిక చేయడంతో అధ్యక్ష, కార్యదర్శి వర్గాల మధ్య వచ్చిన విభేదాల అంకం కీలక మలుపు తీసుకుంది. ఈ విషయంలో కార్యదర్శి విజయానంద్ తదితరులపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్దే పైచేయి అయింది. తమకు తెలీకుండా, తమ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అజహర్ ఏకపక్షంగా అంబుడ్స్మన్ను నియమించారని, అది చెల్లదంటూ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా దీపక్ వర్మ దీనిపై స్పందించారు. అంద రి అనుమతితోనే గత జూన్లోనే తనను ఎంపిక చేసినట్లు, ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హెచ్సీఏ అంబుడ్స్మన్గా బాధ్యతలు కూడా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు వర్మ నేరుగా లేఖ రాశారు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!) తన నియామకాన్ని మళ్లీ ప్రశ్నిస్తే న్యాయపరంగా తగిన చర్య తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ‘హెచ్సీఏ అంబుడ్స్మన్గా బాధ్యతలు చేపట్టాలని కార్యదర్శి విజయానంద్ నాకు స్వయంగా లేఖ రాయడంతో నేను అంగీరిస్తున్నట్లు బదులిచ్చాను. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయాల అవసరం ఉంది కాబట్టి జూన్ 6న జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. పైగా ప్రభుత్వ నిబంధనల కారణంగా ఏజీఎం ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా నన్ను నియమించేసి ఆ తర్వాత అంతా చక్కబడిన తర్వాతైనా అధికారికంగా ఆమోద ముద్ర వేయవచ్చని కూడా అదే సమావేశంలో స్పష్టం చేశారు. దీనికి హాజరైన సభ్యులంతా అంగీకారం తెలిపారే తప్ప ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. అంబుడ్స్మన్గా నా నియమాకంలో ఎలాం టి అక్రమమూ జరగలేదు. అపాయింట్మెంట్ లెటర్పై సంతకం లేకుండా ఉండటం పెద్ద సమస్య కాదు. పైగా నాడు అంగీకారం తెలిపిన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. మళ్లీ దానిని తప్పుగా చూపిస్తూ ఏవైనా లేఖలు రాస్తే వారిపై చర్య తీసుకుంటాం’ అని దీపక్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. వర్మ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ సంఘానికి కూడా అంబుడ్స్మన్గా వ్యవహరిస్తున్నారు. -
నా క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్ : తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రికెట్కు, తనను పరిచయం చేసిన వ్యక్తిని హెచ్సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ‘నా కెరీర్లో మీరందరూ అపారమైన ప్రేమను, మద్దతును చూపించారు. కానీ నా క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? మొట్టమొదటిసారిగా నేను క్రికెట్ బ్యాట్ పట్టేలే చేసింది నా దివంగత మామయ్య మీర్ జైనులాబిదీన్. క్రికెట్కు పరిచయం చేసి నా జీవితాన్నే పూర్తిగా మార్చినందుకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే హైదరాబాద్ వాసి మహ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ క్రీడాకారుడిగా, టీమిండియా కెప్టెన్గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. హైదరాబాద్లో పుట్టి... ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెరిగిన ఈ హైదరాబాదీ, ప్రస్తుతం పొలిటీషియన్గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్సర్గా ఆరోపణలు.. పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ.. పెళ్లి.. మళ్లీ విడాకులు.. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. హెచ్సీఏ అధ్యక్షుడిగా గెలుపు వంటి రకరకాల సవాళ్లు, విజయాలు అజారుద్దీన్ కెరీర్లో కో కొల్లలు. ఇక క్రికెటర్గా తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన అజారుద్దీన్ రికార్డు ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్మన్గా ఇప్పటికీ అజారుద్దీన్ కొనసాగుతున్నాడు. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. -
అజహరుద్దీన్పై ఎఫ్ఐఆర్..
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజహరుద్దీన్తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదయినట్లు తెలుస్తోంది. అజహరుద్దీన్తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని ఔరంగాబాద్కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై అజహరుద్దీన్ స్పందించారు. ఔరంగాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తన లీగల్ టీమ్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అజహరుద్దీన్ పేర్కొన్నారు. -
‘1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు’
హైదరాబాద్: టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20తో ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్తో కలిసి హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ప్రెస్మీట్ నిర్వహించారు. ‘కొత్తగా ఏర్పడిన హెచ్సీఏ నేతృత్వంలో ఇక్కడ ఇది తొలి మ్యాచ్. దాదాపు 40 వేల మంది అభిమానులు మ్యాచ్ హాజరు కావొచ్చు. 1800 మంది పోలీసులతో మ్యాచ్కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం. రేపు బ్లాక్ డే కూడా కావడంతో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ టీం నడుమ భారీ భదత్ర ఉంటుంది. అభిమానులకు పార్కింగ్ సదుపాయం కూడా కలదు. రేపు మెట్రో రైల్ సమయం రాత్రి గం. 1.00ల వరకూ వినియోగించుకోవచ్చు. సిగరెట్లు , ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్ధాలు, పెన్స్, ఫర్ఫ్యూమ్స్ స్టేడియంలోకి నిషేధం. జాతీయ జెండా తప్పా ఇతర ఏ జెండాలు అనుమతించబడవు. షీ టీం బృందాలు కూడా మహిళల రక్షణ కోసం నియమించాం. స్టేడియం మొత్తం సీసీ కెమెరాలు అధీనంలో ఉంటుంది. ఎవరికీ అసౌకర్యం కల్గినా డయల్ 100కి ఫోన్ చేయండి’ అని భాగవత్, అజహర్లు పేర్కొన్నారు. -
అంబటి రాయుడి అంశం తర్వాతే..!
హైదరాబాద్: హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా అంబటి రాయుడి చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహర్ దాటవేత ధోరణి అవలంభించాడు. ఆ విషయాన్ని తర్వాత చూద్దామంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘ నేను ప్రస్తుతం డిసెంబర్ 6వ తేదీన వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య హైదరాబాద్లో జరుగనున్న టీ20 మ్యాచ్పైనే దృష్టి పెట్టా. దానికి సంబంధించి నివేదిక మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తున్నా. (ఇక్కడ చదవండి: ‘అజహర్ స్టాండ్’) హెచ్సీఏలో కరప్షన్ అంశంపై ఏమైనా మాట్లాడాలని అనుకుంటే డిసెంబర్ 6 తర్వాతే చూద్దాం. నేను మ్యాచ్కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నా. దీని కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఒకవేళ వేరే అంశం ఏదైనా ఉంటే అది తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడదాం. మ్యాచ్ను సజావుగా జరపడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ అధ్యక్ష హోదాలో ఇది నా తొలి మ్యాచ్. నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆడటం, హోటల్కు వెళ్లడం మాత్రమే ఉండేది. కానీ అధ్యక్ష హోదా అనేది భిన్నమైన బాధ్యతతో కూడుకున్నది’ అని అజహర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
‘నా అధ్యక్షతన తొలి క్రికెట్ మ్యాచ్ ఇది’
హైదరాబాద్: వచ్చే నెలలో వెస్టిండీస్తో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్లో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం భారత్-వెస్టిండీస్ల తొలి టీ20 ముంబైలో డిసెంబర్ 6వ తేదీన జరగాల్సి ఉండగా, ఆ మ్యాచ్ను హైదరాబాద్కు మార్చారు. అయితే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్ను నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపిందట. ఈ విషయాన్ని అజహర్ స్వయంగా తెలియజేశాడు.(ఇక్కడ చదవండి: తొలి టీ20 వేదిక మారింది..) ‘హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్ను హెచ్సీఏ రిక్వస్ట్ మేరకు 6వ తేదీనే నిర్వహిస్తున్నాం. విండీస్తో టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ హైదరాబాద్లో జరుగనుంది. ఇది హెచ్సీఏలో నా అధ్యక్షతను మొదటి మ్యాచ్. క్రికెట్ అనేది ప్రతిరోజూ నేర్చుకునే గేమ్. క్రికెట్ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సెక్యూరిటితో పాటు ప్రైవేట్ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపటి నుంచి మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి’ అని అజహర్ పేర్కొన్నాడు. -
అజహర్.. వ్యక్తిగతంగా తీసుకోవద్దు: అంబటి రాయుడు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. హెచ్సీఏలో అవినీతే రాజ్యమేలుతోందని, డబ్బుతో అసోసియేషన్ను ప్రభావితం చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయిందంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఐటీ శాఖామంత్రి కేటీఆర్కు సైతం ట్వీట్ చేశాడు. హెచ్సీఏను కాపాడాల్సిన బాధ్యత కేటీఆర్పై ఉందని పేర్కొన్నాడు. హైదరబాద్ కెప్టెన్గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున్నానని పేర్కొన్నాడు. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు అసహనంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడన్నారు. ఈ విషయంపై తిరిగి స్పందించిన రాయుడు.. ‘హాయ్ అజహర్. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంశం మనిద్దరికంటే పెద్దది. హెచ్సీయూలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్ను బాగు చేసేందుకు నీకు దేవుడు అవకాశమిచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తులనుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేస్తే భవిష్యత్తు తరాల క్రికెటర్లను రక్షించినట్లవుతుంది’ అని తాజా పరిణామాలపై అజహర్కు రాయుడు సూచించాడు. -
హెచ్సీఏపై అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకుని హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో తాను వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్రకటించాడు. దీనిలో భాగంగా హెచ్సీఏలో అవినీతిని నిరోధించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్కు) ట్వీట్ చేశారు. ‘హలో కేటీఆర్ సార్. హెచ్సీఏలో తీవ్రంగా ప్రబలిన అవినీతిపై దృష్టి పెట్టండి. అసలు హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో భాగంగా హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అంబటి రాయుడు.. జట్టులో రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాలతో జట్టులో మంచి వాతావరణం లేదన్నాడు. దాంతోనే తాను హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండదలుచుకున్నానని పేర్కొన్నాడు. ‘ నిజాయితీగా చెప్పాలంటే నేను రంజీ ట్రోఫీ ఆడదామనుకున్నా. కానీ ఒక కెప్టెన్గా నేను ఊహించినట్లు జరగడం లేదు. రాజకీయాలు పెరిగిపోయాయి. మంచి క్రికెట్ ఆడే వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ జట్టులో లేదు. నేను హైదరాబాద్ క్రికెట్ జట్టులో సౌకర్యవంతంగా లేను’ అని ఒక ఇంటర్యూలో పేర్కొన్నాడు. Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet. — Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019 -
40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్లో మహబూబ్నగర్ బ్యాట్స్మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగుల భారీస్కోరు సాధించింది. గణేశ్ విజృంభణకు తోడు అబిద్ (69 బంతుల్లో 110; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగాడు. పి. హర్షవర్ధన్ (49; 9 ఫోర్లు), కేశవులు (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో టైటస్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో డబ్ల్యూఎంసీసీ తడబడింది. బుధవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ 49.4 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అక్షయ్ (28), హర్ష (28), శరత్ (28) పరవాలేదనిపించారు. మహబూబ్నగర్ బౌలర్లలో కయ్యుం 3, రుషేంద్ర 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హెచ్సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ అజహరుద్దీన్ తన బాధ్యతలను స్వీకరించారు. సోమవారం హెచ్సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు చేపట్టారు. ఇక వైస్ ప్రెసిడెంట్గా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్. జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్గా అనురాధలు తమ బాధ్యతలను స్వీకరించారు.కొన్ని రోజుల క్రితం హెచ్సీఏ అధ్యక్షుడిగా అజహర్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్ను కూడా గెలిపించుకున్నారు. హెచ్సీఏ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజహర్ మాట్లాడుతూ.. ‘ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాను. హెచ్సీఏ అవినీతి మరకలు తుడిచేసి పూర్వ వైభవం తీసుకొస్తా. జిల్లాల్లో స్టేడియంలు అభివృద్ధి చేస్తా. అన్ని ప్యానల్ను కలుపుకుని వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తా’ అని అన్నారు. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్చంద్కు వచ్చిన మొత్తం ఓట్ల కంటే అజహర్కు వచ్చిన మెజారిటీ ఎక్కువ కావడం ఇక్కడ విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్కుమార్కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. -
హెచ్సీఏలో అజర్ హవా
-
అజహరుద్దీన్.. ఇలా గెలిచెన్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్ను కూడా గెలిపించుకున్నారు. హెచ్సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్చంద్కు వచ్చిన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ మెజారిటీతో అజర్ గెలుపొందడం విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్కుమార్కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు. 227 ఓట్లకు గాను 223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాండ్రా బ్రాన్గాంజా(మహిళా క్రికెటర్), అర్జున్ యాదవ్(ఇండియా సిమెంట్), పి. వెంకటేశ్వర్లు(ఆక్స్ఫర్డ్ బ్లూస్ క్రికెట్ క్లబ్), శ్రీనివాస్ ఆచార్య(ఉస్మానియా మెడికల్ కాలేజీ) ఓటు వేయలేదు. మొత్తం మూడు ఓట్లు(సంయుక్త కార్యదర్శికి రెండు, కౌన్సిలర్కి ఒకటి) చెల్లలేదు. ఫలించిన అజర్ కల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్సీఏలో పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చిన ప్రకాశ్చంద్ను చిత్తుగా ఓడించారు. వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం కూడా అజర్కు కలిసొచ్చింది. కేసీఆర్ను కలుస్తా: అజర్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. టీఆర్ఎస్ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టీఆర్ఎస్లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్తో సహా ప్రగతి భవన్కు వెళ్లి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నట్టు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. కాగా, అజహరుద్దీన్.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హర్షం ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. అజహరుద్దీన్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అభినందనలు తెలిపారు. వి.హనుమంతరావు నేతృత్వంలో గాంధీభవన్ వద్ద బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రేమ్లాల్, అఫ్జలుద్దీన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
హెచ్సీఏ అధ్యక్షుడిగా అజహర్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 223 ఓట్లు పోల్ కాగా, అజహర్కు భారీ స్థాయిలో ఓటింగ్ పడింది. అధ్యక్ష పదవి కోసం అజహరుద్దీన్తో పాటు దిలీప్ కుమార్, ప్రకాష్ చంద్ జైన్లు పోటీ పడ్డారు. అజహర్కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్ జైన్కు 73, దిలీప్ కుమార్కు 3 ఓట్లు పడ్డాయి. అయితే హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్కు వ్యతిరేకంగా ప్రకాష్కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అజహర్ ఘన విజయం సాధించడంతో అతని కల ఫలించినట్లయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అజహరుద్దీన్కు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్ను ఆమోదించలేదు. అయితే హెచ్సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్ విజయం సాధించారు. -
వివేక్కు చుక్కెదురు
హైదరాబాద్: మరోసారి హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్ వేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. శుక్రవారం వివేక్ నామినేషన్ వేసే క్రమంలో సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ఆయన నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్న్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని భావించడంతోనే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. వివేక్కు సంబంధించిన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కేసు ఒకటి సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. దానిపై ఇంకా ఎలాంటి తుది తీర్పు రాకపోవడంతో వివేక్ హెచ్సీఏ ఎన్నికకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్కు లైన్క్లియర్ అయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. -
హెచ్సీఏ అధ్యక్ష బరిలో అజహర్
హైదరాబాద్: రెండేళ్ల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేశారు. ‘ హెచ్సీఏ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. దాంతోనే అధ్యక్ష పదవికి నామినేషన్ వేశా. ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరంఉంది. నాకు విక్రమ్ మాన్ సింగ్తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్ అయూబ్, శివలాల్ యాదవ్లు సహకారం ఉంది’ అని అజహర్ తెలిపారు. కాగా, మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్పీ మాన్ సింగ్ కుమారుడు విక్రమ్ మాన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. గతంలో హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్ను ఆమోదించలేదు. -
కెప్టెన్గా అంబటి రాయుడు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్న తెలుగు తేజం అంబటి రాయుడుకి హైదరాబాద్ క్రికెట్ జట్టు పగ్గాలు అప్పచెప్పారు. తాను మళ్లీ క్రికెట్ ఆడతానంటూ హెచ్సీఏకు రాయుడు లేఖ రాయగా, అందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ సారథ్య బాధ్యతలను రాయుడికి కట్టబెట్టారు. త్వరలో విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న హైదరాబాద్ కెప్టెన్గా రాయుడ్ని నియమిస్తున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. ఈ మేరకు రాయుడు నేతృత్వంలోని జట్టును తాజాగా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తనకు క్రికెట్పై ఆసక్తి తగ్గలేదంటూ రాయుడు.. హెచ్సీఏకు లేఖ రాశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరాడు. అదే సమయంలో తనకు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్లు అండగా నిలిచారంటూ పేర్కొన్నాడు. వీరిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, రాయుడ్ని హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్గా నియమించిన తర్వాత నోయల్ డేవిడ్ స్పందించారు. ‘రాయుడికి ఇంకా ఐదేళ్ల క్రికెట్ మిగిలే ఉంది. దురదృష్టవశాత్తూ వరల్డ్కప్లో ఆడలేకపోయాడు. దాంతో నిరాశ చెందాడు. నేను, లక్ష్మణ్లు రాయుడితో మాట్లాడి అతన్ని ఓదార్చాం. ఫలితంగా అతని రిటైర్మెంట్పై వెనక్కి తగ్గాడు. రాయుడి అనుభవం యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్కు కూడా రాయుడి సేవలు అవసరం’ అని నోయల్ డేవిడ్ తెలిపారు. హైదరాబాద్ విజయ్ హజారే ట్రోఫీ జట్టు ఇదే.. అంబటి రాయుడు(కెప్టెన్), బి సందీప్(వైస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, థాకూర్ వర్మ, రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, మెహిద్ హసన్, సాకేత్ సాయి రామ్, మహ్మద్ సిరాజ్, మిక్కిల్ జైశ్వాల్, మల్లికార్జున్(వికెట్ కీపర్), కార్తీకేయ కాక్, టి రవితేజ, అయా దేవ్ గౌడ్ -
వాళ్లందరికీ థాంక్స్: అంబటి రాయుడు
న్యూఢిల్లీ: తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి తెలుగు తేజం అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. మళ్లీ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మేనేజ్మెంట్తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనిలో భాగంగా హెచ్సీఏకు లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. హెచ్సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. -
మల్లికార్జున్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎ1, ఎ2 డివిజన్ వన్డే లీగ్లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్మన్ జె. మల్లికార్జున్ (138 బంతుల్లో 201 నాటౌట్; 12 ఫోర్లు, 12 సిక్సర్లు) దుమ్మురేపాడు. బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తిస్తూ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మల్లికార్జున్కు తోడు బౌలింగ్లో సాతి్వక్ రెడ్డి (5/38), ఆశిష్ శ్రీవాస్తవ్ (4/27) చెలరేగ డంతో గురువారం రాజుసీసీతో జరిగిన మ్యాచ్లో కేంబ్రిడ్జ్ జట్టు 242 పరుగులతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేంబ్రిడ్జ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆకాశ్ యాదవ్ (127 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజు సీసీని సాతి్వక్ రెడ్డి, ఆశిష్ వణికించారు. వీరిద్దరి ధాటికి రాజు సీసీ 29.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్ల ఫలితాలు వరంగల్ జిల్లా: 163 (హితేశ్ యాదవ్ 3/14, అమోల్ షిండే 4/34), ఆంధ్రా బ్యాంక్: 164/1 (రోడ్రిగ్స్ 52, నీరజ్ బిష్త్ 50 నాటౌట్). ఎంసీసీ: 178/7 (ప్రమోద్ మహాజన్ 84; రవీందర్ 5/44), అవర్స్ సీసీ: 78/7 (శ్రీనివాస్ యాదవ్ 3/20). అగర్వాల్ సీనియర్స్: 152 (వీరేందర్ 62 నాటౌట్; అజీముద్దీన్ 4/63), గౌడ్ ఎలెవన్: 157/3 (హర్ష్ సంక్పాల్ 45, శ్రీకర్ రెడ్డి 49). నిజామాబాద్ జిల్లా: 107 (దుర్గేశ్ 3/25), బీడీఎల్: 108/1 (సింహా 61 నాటౌట్). డెక్కన్ వాండరర్స్: 309 (విశాల్ యాదవ్ 66, నూతన్ కల్యాణ్ 50, షేక్ మాజీద్ 109; అభినవ్ కుమార్ 3/47, చిరంజీవి 5/26), నిజాం కాలేజి: 87 (ఫిరాజుద్దీన్ 6/19). కాంటినెంటల్: 160 (జైదేవ్ గౌడ్ 52; యశ్వంత్ 3/53, అన్వేశ్ 3/22), ఆక్స్ఫర్డ్ బ్లూస్: 44/5 (21 ఓవర్లలో). హైదరాబాద్ బ్లూస్: 278/7 (రుతిక్ యాదవ్ 44, రవి పాండే 110; సుశీక్షిత్ రెడ్డి 3/40), పీకేఎంసీసీ: 190 (అనిరుధ్ కపిల్ గౌడ్ 44, శివ శంకర్ 67; రుతి్వక్ 5/47). డెక్కన్ క్రానికల్: 183 (వరుణ్ గౌడ్ 44, అద్నాన్ 30; జితేందర్ 4/28), ఖల్సా: 63 (అమన్ ఉపాధ్యాయ్ 3/11, విద్యానంద్ రెడ్డి 4/24). ఎలిగెంట్: 223 (దివేశ్ 66, అఫ్జల్ 41), శ్రీ శ్యామ్: 120 (ఇబ్రహీం అలీ 48; సిద్ధార్థ్ 3/29, పి. రాఘవ 5/45). గెలాక్సీ: 84(శ్రవణ్ 3/25, మయాంక్ గుప్తా 3/7), ఎవర్గ్రీన్: 87/1 (రాహుల్ 47). సీసీఓబీ: 267 (షేక్ మొహమ్మద్ 86, అజీజుద్దీన్ 55; రిషిత్ రెడ్డి 3/44, నితిన్ 3/34), బ్రదర్స్ ఎలెవన్: 235 (రిషిత్ రెడ్డి 62, హర్షవర్ధన్ 62; నోమన్ 3/28, అజీజుద్దీన్ 4/48). ఆర్ దయానంద్: 298/3 (బెంజమిన్ 51, షణ్ముఖ 73, రోహిత్ రెడ్డి 77 నాటౌట్, విఘ్నేశ్వర్ 48 నాటౌట్), నల్లగొండ జిల్లా: 140 (మోహిత్ సోని 3/34, బెంజమిన్ 4/25). నేషనల్: 133 (సహేంద్ర మల్లు 30; మెహర్ ప్రసాద్ 4/17), విజయ్ హనుమాన్: 134/6 (శ్రీకర్ రెడ్డి 61 నాటౌట్). డెక్కన్ బ్లూస్: 76 (సయ్యద్ మెహదీ హసన్ 6/9), ఎన్స్కాన్స్: 79/2 (10.2 ఓవర్లలో). సాయిసత్య: 184 (ఇషాన్ శర్మ 48; అశ్వద్ రాజీవ్ 3/26, వెంకటేశ్ 3/31), తెలంగాణ: 187/7 (సూరి 49; విజయ్ ఆకాశ్ 3/35). ఈఎంసీసీ: 258/7 (మెహుల్ భౌమిక్ 104, అసదుద్దీన్ 81), కొసరాజు సీసీ: 100/9. స్పోర్టివ్ సీసీ: 137 (విష్ణు 3/33), హెచ్యూసీసీ: 97/8 (అతుల్ వ్యాస్ 36 నాటౌట్; అశి్వన్ 4/13). కరీంనగర్: 183/9 (రిత్విక్ సూర్య 76; తనయ్ త్యాగరాజన్ 3/27, దివేశ్సింగ్ 3/33), స్పోర్టిం గ్ ఎలెవన్: 184/3 (హిమాలయ్ అగర్వాల్ 89 నాటౌట్, తనయ్ త్యాగరాజన్ 68). పాషా బీడీ: 143/9 ( పంకజ్ 5/22), చీర్ఫుల్ చమ్స్: 144/5 (సాయి కౌశిక్ 60 నాటౌట్; ఫహీమ్ 3/39). -
రిషికేత్ మరో డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఇంటర్ కాలేజి, స్కూల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో జాహ్నవి డిగ్రీ కాలేజి బ్యాట్స్మన్ రిషికేత్ సిసోడియా (135 బంతుల్లో 200; 8 ఫోర్లు, 18 సిక్సర్లు) మరోసారి దుమ్మురేపాడు. మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇటీవలే పేజ్ జూనియర్ కాలేజీతో జరిగిన మ్యాచ్లో అజేయ 291 పరుగులతో విజృంభించిన రిషికేత్ ఐదు రోజుల వ్యవధిలోనే మరో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు. దీంతో భవన్స్ వివేకానంద సైన్స్ కాలేజీతో బుధవారం జరిగిన మ్యాచ్లో జాహ్నవి జట్టు 189 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జాహ్నవి జట్టు రిషికేత్ మెరుపు డబుల్ సెంచరీతో 42 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగుల భారీస్కోరు సాధించింది. అనంతరం భవన్స్ జట్టు 28.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. పి. నితీశ్ రెడ్డి (51) అర్ధసెంచరీతో పోరాడాడు. హర్షవర్ధన్ సింగ్ సెంచరీ బ్యాటింగ్లో హర్షవర్ధన్ సింగ్ (83 బంతుల్లో 102; 11 ఫోర్లు), బౌలింగ్లో అనికేత్ రెడ్డి (4/19) చెలరేగడంతో జాన్సన్ గ్రామర్ స్కూల్ (నాచారం)తో జరిగిన మ్యాచ్లో నిజామాబాద్ జిల్లా 127 పరుగులతో గెలుపొందింది. హర్షవర్ధన్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా 32 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. అజిత్ (30) రాణించాడు. అనంతరం అనికేత్ ధాటికి జాన్స న్ గ్రామర్ స్కూల్ 82 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్ల ఫలితాలు: ∙నల్లగొండ జిల్లా: 149, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్): 39 (రాజీవ్ 4/11, ముజాహిద్ 4/9). ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం): 135 (సాయి కౌశిక్ 60; నారాయణ్ తేజ 3/44), ఖమ్మం జిల్లా: 142/5 (సునీల్ అరవింద్ 31, విశాల్ 40, రాకేశ్ 35). హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్): 203/9 (పృథ్వీ రెడ్డి 37; ఆదిత్య 34; హర్ష సంక్పాల్ 3/34, క్రితిక్ రెడ్డి 3/37), గౌతమ్ జూనియర్ కాలేజి: 138 (క్రితిక్ రెడ్డి 57; ఇబ్రహీం ఖాన్ 4/38, పృథ్వీ రెడ్డి 6/22). ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్: 102 (కుశాల్ అగర్వాల్ 35; ఫర్దీన్ ఫిరోజ్ 3/27), భవన్స్ అరబిందో కాలేజి: 105/1 (ఇషాన్ శర్మ 43, నిశాంత్ 39 నాటౌట్). వరంగల్ జిల్లా: 155 (సుకృత్ 60; జైదేవ్ గౌడ్ 3/40), సర్దార్ పటేల్: 156/4 (జైదేవ్ గౌడ్ 32, అబ్దుల్ అద్నాన్ 47 నాటౌట్). మహబూబ్నగర్ జిల్లా: 284/5 (హర్ష 117, అరుణ్ 48 నాటౌట్), లయోలా డిగ్రీ కాలేజి: 90 (జుబేర్ 3/12, అరుణ్ 3/15). -
నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ నియామకాలు
హైదరాబాద్: హెచ్సీఏలో తాజాగా చేపట్టిన నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్, హెచ్సీఏ ప్రతినిధి శేష్నారాయణ ఈ అంశంపై మాట్లాడారు. ఆదివారం జరిగిన హెచ్సీఏ సమావేశంలో సభాధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి అబద్ధాలతో కూడిన సమాచారాన్ని వెల్లడించారన్నారు. హెచ్సీఏ తరఫున బీసీసీఐ ప్రతినిధిగా వివేక్ పేరును ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించిన సమాచారంలో నిజం లేదని అన్నారు. నిజానికి ఒకసారి అనర్హత వేటు పడిన వ్యక్తిని సిఫార్సు చేయకూడదనే నిబంధన ఉందని ఆయన స్పష్టం చేశారు. పది మంది కుమ్మక్కై ఇలా చేయడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆదివారం నాటి హెచ్సీఏ సమావేశంలో అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ ఎంఎన్ రావు, ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్ను నియమించారు. వీరితో పాటు హెచ్సీఏ నుంచి బీసీసీఐ ప్రతినిధిగా జి.వివేకానందను, జూనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెటింగ్ కమిటీని ఎంపిక చేశారు. ఈ నియామకాలనే తాజాగా అజహరుద్దీన్ బృందం తప్పుబడుతోంది. -
ఆక్స్ఫర్డ్ బ్లూస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్లో భాగంగా మాంచెస్టర్తో జరిగిన మ్యాచ్లో ఆక్స్ఫర్డ్ బ్లూస్ వికెట్ తేడాతో గెలుపొందింది. 234 పరుగుల ఛేదనకు శుక్రవారం బరిలోకి దిగిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ 60.3 ఓవర్లలో 9 వికెట్లకు 238 పరుగులు చేసి గెలుపొందింది. వరుణ్ రెడ్డి (141 బంతుల్లో 121; 17 ఫోర్లు, 6 సిక్స్లు) అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్ కె. అభిలాష్ 7 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు మాంచెస్టర్ 61 ఓవర్లలో 233 పరుగులు చేసింది. సాయి చరణ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్ల ఫలితాలు ∙ఆదిలాబాద్ జిల్లా: 272 (55 ఓవర్లలో), డెక్కన్ వాండరర్స్: 68 (రాకేశ్ గౌడ్ 5/14). ∙నిజామాబాద్ జిల్లా: 118 (వంశీ 56; వెంకట్ 7/24), టీమ్స్పీడ్: 121/2 (కార్తీక్ 31, రిషికేశ్ 33). ∙బాలాజీ సీసీ: 318 (నాయుడు 50, శశాంక్ 52, రోమిత్ 50; శౌనక్ కులకర్ణి 6/69), గెలాక్సీ: 253 (కౌశిక్ రెడ్డి 71, సురేశ్ 50). ∙అవర్స్ సీసీ: 156 (రాహుల్ రెడ్డి 43; నీల్ చక్రవర్తి 6/69), జిందా తిలిస్మాత్తో మ్యాచ్. ∙కరీంనగర్: 266 (అజయ్ 81; రాఘవ 4/52), ఎలిగెంట్: 87 (దివేశ్ 31; సాయితేజ 6/18). ∙అగర్వాల్ సీనియర్: 238 (మొయిజ్ 68, శశిధర్ 76; అతుల్ 5/70), హెచ్యూసీసీ: 175 (హర్ష 3/37). ∙వరంగల్ జిల్లా: 324 (మేరాజ్ 51, జి. పవన్ 74, ఎన్. పవన్ 70), చీర్ఫుట్ చమ్స్: 72 (అజయ్ 8/30). -
ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్లో ఆంధ్రా బ్యాంక్ జట్టు ఇన్నింగ్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్తో గురువారం ముగిసిన మ్యాచ్లో ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ 24 పరుగులతో గెలుపొందింది. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్.... బౌలర్ల ధాటికి 35 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రవితేజ (3/24), హితేశ్ (3/41), నీలేశ్ (3/07) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ జట్టును కుప్పకూల్చారు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్ను 373/9 వద్ద డిక్లేర్ చేయగా... ఇన్కమ్ ట్యాక్స్ 244 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఆకాశ్ భండారికి 14 వికెట్లు... డెక్కన్ క్రానికల్తో జరిగిన మరో మ్యాచ్లో ఎస్బీఐ ప్లేయర్ ఆకాశ్ భండారి ఓవరాల్గా 14 వికెట్లతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 34 పరుగులిచ్చి 7 వికెట్లు దక్కించుకున్న ఆకాశ్... రెండో ఇన్నింగ్స్లోనూ 74 పరుగులిచ్చి మరో 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని దెబ్బకు డెక్కన్ క్రానికల్ జట్టు 103 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ విజృంభించడంతో 26.2 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. సాయి వికాస్ రెడ్డి (51) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 23/0 గురువారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఎస్బీఐ 34 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఎస్బీఐ 197 పరుగులు చేయగా... డెక్కన్ క్రానికల్ 91కే ఆలౌటైంది. దీంతో ఎస్బీఐ జట్టుకు 6 పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్ల ఫలితాలు స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 434 (105.3 ఓవర్లలో), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 329 (తనయ్ త్యాగరాజన్ 4/103), స్పోర్టింగ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 133/7 (సదన్ 3/24). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 295 (91.2 ఓవర్లలో), ఎస్సీఆర్ఎస్ఏ తొలి ఇన్నింగ్స్: 245 (ఎస్సీ మొహంతి 107 నాటౌట్, సురేశ్ 54; అజయ్దేవ్ గౌడ్ 3/50). జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 366/4 డిక్లేర్డ్, ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 204 (బెంజమిన్ థామస్ 50; శ్రవణ్ 4/48, కార్తికేయ 3/66). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 308 (101.5 ఓవర్లలో), ఇండియా సిమెంట్: 290 (శ్రేయస్ వాలా 85, సయ్యద్ అలీ 78; కృష్ణ చరిత్ 4/64, ప్రణీత్ రాజ్ 3/69), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 120/5 (23 ఓవర్లలో). ఎన్స్కాన్స్ తొలి ఇన్నింగ్స్: 380 (90 ఓవర్లలో), హైదరాబాద్ బాట్లింగ్: 245 (60.2 ఓవర్లలో), ఎన్స్కాన్స్ రెండో ఇన్నింగ్స్: 160/6 డిక్లేర్డ్ (సాయివ్రత్ 52), హైదరాబాద్ బాట్లింగ్ రెండో ఇన్నింగ్స్: 296/5 (వినయ్ గౌడ్ 60, రాధాకృష్ణ 90). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 295 (104.2 ఓవర్లలో), జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 314 (ఠాకూర్ తిలక్ వర్మ 89, రవితేజ 52). కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 228 (83 ఓవర్లలో), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 124/3 (శివం తివారీ 53 నాటౌట్). -
ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు
ధర్మశాల: పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా పాకిస్తాన్కు చెందిన 13 మంది క్రికెటర్ల ఫోటోలను హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తొలగించింది. ధర్మశాలలోని మైదానంలో ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, జావెద్ మియాందాద్తో సహా మొత్తం పాక్ ఆటగాళ్ల ఫోటోలను తొలగించాలని మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. 2005లో టీమిండియా పర్యటన నేపథ్యంలో ధర్మశాలలో బోర్డ్ ప్రెసిడెంట్ ఎలవన్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఆటగాళ్ల ఫోటోలను, ఆ మ్యాచ్కు సంబంధించి ఫోటోలను కూడా తొలగించినట్లు హెచ్సీఏ ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి నిరసనగా, అదే విధంగా భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (ఉగ్రదాడి.. పాక్ క్రికెట్కు గట్టిషాక్!) ఇక ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తీసేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని భారత క్రికెటర్లు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ప్రపంచకప్లో రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్తో మ్యాచ్ టీమిండియా ఆడరాదంటూ సీనియర్ ఆటగాడు హర్బజన్ అభిప్రాయపడ్డాడు. ఇక అమరజవాన్ల పిల్లలను తన స్కూల్లో ఉచితంగా చదివిస్తానని వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు రాగా.. మరికొంత మంది ఆటగాళ్లు ఆర్థిక సహాయం అందించారు. బీసీసీఐ కూడా భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. -
చాంపియన్ ఆంధ్రా బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–డివిజన్ వన్డే లీగ్లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి టైటిల్ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం మెరుగ్గా రాణించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తుదిమెట్టుపై బోల్తా పడింది. బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమవడంతో ఆదివారం ఆంధ్రా బ్యాంక్తో జరిగిన ఫైనల్లో ఎస్బీఐ 152 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రా బ్యాంక్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 310 పరుగుల భారీస్కోరు సాధించింది. పీఎస్ చైతన్య రెడ్డి (93 బంతుల్లో 107; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. నీరజ్ బిష్త్ (44 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచాడు. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్కు 72 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నీరజ్ పెవిలియన్ చేరాక అభినవ్ కుమార్ (14)తో నాలుగో వికెట్కు 29 పరుగులు, టి. రవితేజ (37; 2 ఫోర్లు)తో కలిసి 89 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చైతన్య ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 246/5. తర్వాత ఆశిష్ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్), ఖాదిర్ (20; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్ భండారి, టి. సుమన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఎస్బీఐ జట్టు 33.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సయ్యద్ అహ్మద్ ఖాద్రి (34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్లు టి. సుమన్ (9), డానీ ప్రిన్స్ (17), అనూప్ పాయ్ (6), బి. సుమంత్ (0), ఆకాశ్ భండారి (16), అనిరుధ్ సింగ్ (18), కేఎస్కే చైతన్య (22; 4 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఆంధ్రా బ్యాంక్ బౌలర్లలో టి.రవితేజ, అమోల్ షిండే, నీరజ్ బిష్త్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు., , , -
సందీప్, చరణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వన్డే నాకౌట్ చాంపియన్షిప్లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు ముందంజ వేసింది. బ్యాట్స్మెన్ ఎంఎస్ఆర్ చరణ్ (103 బంతుల్లో 138; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), బి. సందీప్ (67 బంతుల్లో 112 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో దుమ్మురేపడంతో సలీమ్నగర్ జట్టుపై బుధవారం 183 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 398 పరుగుల భారీస్కోరు సాధించింది. చరణ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, సందీప్ అజేయ మెరుపు శతకంతో విజృంభిం చాడు. వీరిద్దరికి తోడు అక్షత్ రెడ్డి (53) అర్ధసెంచరీతో జట్టు భారీ స్కోరును అందుకుంది. అనంతరం సలీంనగర్ సీసీ 45 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులే చేసి పరాజయం పాలైంది. మీర్జా బేగ్ (40), ధనుశ్ (40), ఖాలిద్ ఖురేషి (51) పోరాడారు. ఆకాశ్, రిషికేత్ అజేయ శతకాలు కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్మెన్ ఆకాశ్ యాదవ్ (98 బంతుల్లో 114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్లు), రిషికేత్ సిసోడియా (83 బంతుల్లో 102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఉస్మానియా జట్టుతో జరిగిన మ్యాచ్లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కేంబ్రిడ్జ్ ఎలెవన్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 224 పరుగులు చేసింది. అనంతరం ఉస్మానియా జట్టు 24.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. హృదయ్ (42) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో మోహిత్ 3, సాత్విక్ 4 వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్ల ఫలితాలు హైదరాబాద్ బ్లూస్ సీసీ: 88 (సౌరవ్ రాథోడ్ 3/24, యశ్వంత్ రెడ్డి 3/14, కమల్ 4/20), ఎవర్గ్రీన్ సీసీ: 92/1 (విక్రమ్ నాయక్ 34 నాటౌట్, రాహుల్ బుద్ధి 44 నాటౌట్). విజయ్ హనుమాన్ సీసీ: 68 (శుభమ్ 3/11, రంగనాథ్ 4/20), జై హనుమాన్: 72/4 (సూర్యతేజ 31 నాటౌట్). ఎన్స్కాన్స్: 385/4 (సాయివ్రత్ 121, జునైద్ అలీ 56, మెహదీ హసన్ 45, అజర్ 59; విష్ణు 3/42), అగర్వాల్ సీనియర్ సీసీ: 69 (మెహదీ హసన్ 5/23). డెక్కన్ క్రానికల్: 317/3 (యశ్ కపాడియా 143, నితీశ్ 66, సీవీ మిలింద్ 88 నాటౌట్), గ్రీన్ టర్ఫ్: 141/6 (అక్షయ్ 32, కార్తీక్ 33 నాటౌట్). జెమినీ ఫ్రెండ్స్: 248/7 (షేక్ యాసిన్ 109, సాయి ప్రణయ్ 65), మహబూబ్నగర్: 223 (హర్షవర్ధన్ 115; రతన్తేజ 3/41). సాయి సత్య సీసీ: 231/8 (నిఖిల్ యాదవ్ 69), నిజామాబాద్: 232/7 (శ్రీకర్ రెడ్డి 92, లలిత్ యాదవ్ 42).