బెల్జియం: వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించడానికి భారత మహిళల హాకీ జట్టు ఆశల్ని పదిలంగా ఉంచుకుంది. ప్రపంచ హాకీ లీగ్లో భాగంగా శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 1-0తో జపాన్పై విజయం సాధించింది. భారత క్రీడాకారిణి సవిత ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్నందించింది. ఈ ఈవెంట్లో భారత్ ఐదోస్థానంలో నిలిచింది.