జింఖానా, న్యూస్లైన్: కల్నల్ సీకే నాయుడు అండర్-25 టోర్నమెంట్లో హైదరాబాద్ ‘ఎ’ జట్టు తొలిఇన్నింగ్స్లో 114 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో నిమేష్ రెడ్డి సెంచరీతో కదంతొక్కడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.
ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో బుధవారం మూడో రోజు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 82.4 ఓవర్లలో 276 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్ సాకేత్ సాయిరామ్ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడిచేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చే సింది. నిమేష్ రెడ్డి (107; 16 ఫోర్లు; 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా, రోహిత్ నాయుడు 30 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. విదర్భ బౌలర్ సార్వతే రెండు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హైదరాబాద్ ప్రస్తుతం 286 పరుగులు ముందంజలో ఉంది.
పటిష్టస్థితిలో హైదరాబాద్
Published Thu, Oct 31 2013 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM
Advertisement
Advertisement