భారత్ నుంచి షమీ ఒక్కడే | ICC Test and ODI Teams of the Year 2015 announced | Sakshi
Sakshi News home page

భారత్ నుంచి షమీ ఒక్కడే

Published Thu, Dec 3 2015 12:33 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి ఏటా టెస్టులకు, వన్డేలకు జట్లను ప్రకటిస్తుంది.

 2015కు ఐసీసీ జట్ల ప్రకటన
 దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి ఏటా టెస్టులకు, వన్డేలకు జట్లను ప్రకటిస్తుంది. ఏడాది మొత్తం నిలకడగా ఆడిన ఆటగాళ్లకు ఇదో గుర్తింపు. అయితే ఈ ఏడాది ఈ జట్లలో భారత్ నుంచి పేసర్ మొహమ్మద్ షమీకి వన్డే జట్టులో చోటు లభించింది. టెస్టుల్లో అశ్విన్ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ జట్లను ఎంపిక చేస్తుంది. ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది.
 
 ఐసీసీ టెస్టు జట్టు: కుక్ (కెప్టెన్), రూట్, బ్రాడ్ (ఇంగ్లండ్), వార్నర్, స్మిత్, హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), విలియమ్సన్, బౌల్ట్ (న్యూజిలాండ్), సర్ఫరాజ్, యాసిర్ షా, యూనిస్ ఖాన్ (పాకిస్తాన్), అశ్విన్ (12వ ఆటగాడు).

 ఐసీసీ వన్డే జట్టు: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), సంగక్కర, దిల్షాన్ (శ్రీలంక), స్టీవ్ స్మిత్, స్టార్క్ (ఆస్ట్రేలియా), రాస్ టేలర్, బౌల్ట్ (న్యూజిలాండ్), షమీ (భారత్), ముస్తాఫిజుర్ (బంగ్లాదేశ్), రూట్ (12వ ఆటగాడు).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement