ICC
-
షకీబ్కు బిగ్ రిలీఫ్.. బౌలింగ్కు లైన్ క్లియర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మేటి ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్కు మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అతని బౌలింగ్ శైలితీరు నియమాలకు లోబడే ఉందని, సందేహాస్పదంగా లేదని సమీక్ష అనంతరం తేలింది. అయితే తన బౌలింగ్ యాక్షన్ను ఎక్కడ సమీక్షించారనే విషయాన్ని షకీబ్ వెల్లడించలేదు.ఇప్పటికే టెస్టులకు, అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్ వన్డే ఫార్మాట్లో, ఫ్రాంచైజీ లీగ్లలో బౌలింగ్ చేసేందుకు మార్గం సుగమం అయింది. గత ఏడాది అక్టోబర్ కాన్పూర్లో భారత్తో జరిగిన రెండో టెస్టు తర్వాత షకీబ్ మళ్లీ బరిలోకి దిగలేదు. గత డిసెంబర్లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడిన సమయంలో షకీబ్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉండటంతో అతడు బౌలింగ్పై నిషేధం విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన షకీబ్ త్వరలో శ్రీలంకతో వన్డే సిరీస్లో పాల్గొనే అవకాశముంది.చదవండి: ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు! -
పాకిస్తాన్ ఆల్రౌండర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. క్రమశిక్షణ అంశంలో అతడి ఖాతాలో మూడు డిమెరిట్ పాయింట్లు జత చేసింది.ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్తో తొలి టీ20 సందర్భంగా ఖుష్దిల్ షా వ్యవహరించిన తీరుకు ఈ మేర కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.32 పరుగులతో టాప్ స్కోరర్గాఈ క్రమంలో మార్చి 16న కివీస్- పాక్ మధ్య తొలి టీ20 జరిగింది. క్రైస్ట్చర్చ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. పాకిస్తాన్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీ తాలుకు వైఫల్యాన్ని కొనసాగిస్తూ పాక్ 91 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్లో ఖుష్దిల్ షా 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక సల్మాన్ ఆఘా బృందం విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి టార్గెట్ను ఊదేసింది. ఇదిలా ఉంటే.. ఖుష్దిల్ షా తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు.అతడిని బలంగా ఢీకొట్టాడుపాక్ ఎనిమిదో ఇన్నింగ్స్లో కివీస్ యువ పేసర్ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్లో వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో ఖుష్దిల్ షా.. ఫౌల్క్స్ను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడు నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది.ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న ఐసీసీ.. ఖుష్దిల్ షాకు గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 సూచిస్తున్న నిబంధనను ఖుష్దిల్ ఉల్లంఘించాడు.అంతర్జాతీయ మ్యాచ్లో ఆటగాళ్లను, సిబ్బంది, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులు.. ఎవరినైనా సరే అనుచిత రీతిలో వారికి ఇబ్బంది కలిగించేలా తాకితే కఠిన చర్యలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా ఖుష్దిల్పై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. తప్పును అంగీకరించిన ఆల్రౌండర్గత 24 నెలల కాలంలో ఇదే ఖుష్దిల్ మొదటి తప్పు కాబట్టి.. ఇంతటితో సరిపెట్టింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు వేన్ నైట్స్, సామ్ నొగస్కి, థర్డ్ అంపైర్ కిమ్ కాటన్, ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ ఫిర్యాదు ఆధారంగా ఈ మేర ఐసీసీ చర్యలు తీసుకుంది. ఖుష్దిల్ సైతం తన తప్పును అంగీకరించాడు. కాగా 30 ఏళ్ల ఖుష్దిల్ షా లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం గల బ్యాటర్. 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటి వరకు 15 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 328, 376 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు, మూడు వికెట్లు తీశాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
రోహిత్... పైపైకి!
దుబాయ్: టీమిండియా కెప్టెన్ ఫైనల్లో చక్కటి ఇన్నింగ్స్తో భారత జట్టుకు మూడోసారి ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్తో జరిగిన తుదిపోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న రోహిత్ రెండు ర్యాంక్లు మెరుగు పర్చుకొని 756 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (784 పాయింట్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టాప్–10లో మొత్తం నలుగురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో 218 పరుగులు చేసి ఆకట్టుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (736 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంక్లో నిలవగా... మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (704 పాయింట్లు) 8వ ర్యాంక్లో స్థిరంగా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 14 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్కు చేరగా... డారిల్ మిషెల్ ఒక స్థానం మెరుగు పర్చుకొని ఆరో ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్ (650 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి భారత్ తరఫున అత్యుత్తమంగా మూడో ర్యాంక్లో నిలిచాడు. రవీంద్ర జడేజా (616 పాయింట్లు) కూడా మూడు స్థానాలు మెరుగు పరుచుకొని పదో ర్యాంక్కు చేరాడు. న్యూజిలాండ్ సారథి సాంట్నర్ (657 పాయింట్లు) రెండో ర్యాంక్కు చేరగా... శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తీక్షణ (680 పాయింట్లు) ‘టాప్’ ప్లేస్లో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా (10వ ర్యాంక్) ఒక్కడే టాప్–10లో కొనసాగుతున్నాడు. -
ఐసీసీ బీసీసీఐ ఆడమన్నట్టల్లా ఆడుతుంది.. విండీస్ దిగ్గజ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడాన్ని పాకిస్తాన్ వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ ఒకే వేదికపై ఆడి లబ్ది పొందిందని కొన్ని భారత వ్యతిరేక శక్తులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రాతినిథ్యమే లేని విండీస్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం మొదలుపెట్టింది. భారత్ దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడటాన్ని విండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ తప్పుబట్టాడు. మిగతా జట్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించి మ్యాచ్లు ఆడితే, టీమిండియా మాత్రం కాలు కదపకుండా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడిందని అన్నాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చినా పాకిస్తాన్ కూడా టీమిండియాతో మ్యాచ్కు దుబాయ్కు వెళ్లిందని గుర్తు చేశాడు. ఇలాంటప్పుడు పాక్ జట్టుకు ఆతిథ్య సౌలభ్యం ఎక్కడ లభించిందని ప్రశ్నించాడు. ఒకే వేదికపై టీమిండియా మ్యాచ్లు షెడ్యూల్ చేసినందుకు ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. బీసీసీఐ ప్రతి కోరికను తీర్చడాన్ని ఐసీసీ మానుకోవాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక (దుబాయ్) విషయంలో ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డాడు. ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడటం ద్వారా టీమిండియా లబ్ది పొందిందని ఆరోపించాడు. ఈ విషయంలో మిగతా జట్లకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇకనైనా ఐసీసీ బీసీసీఐకి సహకరించడం మానుకోవాలని అన్నాడు. 2024 టీ20 వరల్డ్కప్లోనూ ఓ విషయంలో ఐసీసీ బీసీసీఐకి సహకరించిందని నిరాధార ఆరోపణ చేశాడు. టీమిండియా కోసం బీసీసీఐ చేసే ప్రతి అభ్యర్థనను నెరవేర్చకూడదని ఐసీసీకి సూచించాడు. అప్పుడప్పుడైనా బీసీసీఐకి నో చెప్పాలని వ్యంగ్యంగా అన్నాడు. ప్రపంచంలో బీసీసీఐ ధనిక బోర్డు కావడంతో ఐసీసీ వారి చెప్పినట్టల్లా ఆడుతుందని అన్నాడు. తనవరకు ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని ఎద్దేవా చేశాడు. బీసీసీఐ ప్రతి విషయంలో ఐసీసీని శాశిస్తుందని తెలిపాడు. రేపటి రోజుల్లో బీసీసీఐ నో బాల్స్ వద్దు, వైడ్ బాల్స్ వద్దన్నా ఐసీసీ తలూపుతుందని అన్నాడు. బీసీసీఐని తృప్తి పరిచేందుకు ఐసీసీ ఏమైనా చేస్తుందని అన్నాడు. 74 ఏళ్ల ఆండీ రాబర్ట్స్ తొలి మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడింటిలో విండీస్ తొలి రెండు ప్రపంచకప్లను గెలిచింది. 1983 వరల్డ్కప్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో విండీస్ను చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. నేడు రాబర్ట్స్ చేసిన వ్యాఖ్యలు నాటి ప్రపంచకప్ అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుంది. కాగా, రాబర్ట్స్ లేవనెత్తిన విషయాన్నే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా లేవనెత్తాడు. ఒకే వేదికపై ఆడి, ఎలాంటి ప్రయాణ బడలికలు లేకుండా టీమిండియా లబ్ది పొందిందని సోషల్మీడియా వేదికగా ఆరోపించాడు. అయితే ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు అదనంగా ఒరిగిందేమీ లేదని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అనడం విశేషం. ఈ టోర్నీలో భారత్ వేదికతో సంబంధం లేకుండా చాలా బలంగా ఉండిందని అక్రం అన్నాడు. ఈ జట్టుతో భారత్ పాకిస్తాన్లో కూడా గెలిచేదని తెలిపాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్లను దుబాయ్లో అడి అన్నింటా విజయాలు సాధించింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్లో పర్యటించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ టీమిండియా మ్యాచ్లను దుబాయ్కు మార్చింది. -
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
దుబాయ్: వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)... అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ల చాంపియన్లు అవతరిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ‘చాంపియన్స్ ట్రోఫీ’ విజేతలకు మాత్రమే ప్రత్యేకమైన తెలుపురంగు జాకెట్లను అందజేస్తుంది. జెంటిల్మెన్ క్రికెట్లో దర్పానికి, గొప్ప గౌరవానికి ప్రతీకగా ట్రోఫీతో పాటు జాకెట్లను ఇస్తారు. విన్నింగ్ టీమ్ సభ్యులందరూ ఈ వైట్ జాకెట్లు (white jackets) ధరించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలో తెగ హంగామా చేస్తారు. 1998లో బంగ్లాదేశ్లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్ను మినీ ప్రపంచకప్గా అభివర్ణించేవారు. ఇక వైట్ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్ సూట్లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్తో తయారైంది. వినూత్న టెక్చ్సర్, స్ట్రిప్లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లకు మరిన్ని వన్నెలద్దారు డిజైనర్లు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన తాజా టోర్నీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన జాకెట్లను ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అత్యుత్తమ టోర్నీకి నిదర్శనం. క్రికెట్ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఆరంభం నుంచి విశేషాదరణ చూరగొంది’ అని అన్నాడు.చదవండి: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
ఆస్ట్రేలియా స్పిన్నర్కు బిగ్ రిలీఫ్..
ఆ్రస్టేలియా స్పిన్నర్ మాథ్యూ కూనెమన్ బౌలింగ్ శైలి... నిబంధనలకు అనుగుణంగానే ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గత నెలలో శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా కూనెమన్ బౌలింగ్ యాక్షన్పై ఫిర్యాదులు అందగా... బ్రిస్బేన్ వేదికగా ఐసీసీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది.వీటిలో అతడు నిబంధనలకు లోబడే బంతులు వేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ కొనసాగించవచ్చని ఐసీసీ వెల్లడించింది. ‘కూనెమన్ బౌలింగ్ శైలి చట్టబద్ధంగానే ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయవచ్చు’ అని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.దీంతో 28 ఏళ్ల కూనెమన్ బౌలింగ్ యాక్షన్పై కమ్ముకున్న నీలినీడలు వీడిపోయాయి. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 16 వికెట్లు పడగొట్టిన కూనెమన్... ఆస్ట్రేలియా సిరీస్ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ పరీక్ష సమయంలో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కూనెమన్కు పూర్తి మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది జూన్లో ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్లో పర్యటించనుండగా... మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కూనెమన్ అందుబాటులో ఉండనున్నాడు.చదవండి: ఇదేమి సెక్యూరిటీరా బాబు.. మరోసారి మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్ -
టీమిండియాపై SRH కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
-
శుబ్మన్ గిల్ ‘టాప్’ ర్యాంక్ పటిష్టం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు శుబ్మన్ గిల్ తన నంబర్వన్ ర్యాంక్ను మరింత పటిష్టం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో గిల్ 817 రేటింగ్ పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్పై అజేయ సెంచరీ (101 నాటౌట్) చేసిన ఈ పంజాబ్ బ్యాటర్ పాకిస్తాన్తో జరిగిన పోరులో 46 పరుగులు సాధించాడు. దాంతో గిల్ ఖాతాలో 21 రేటింగ్ పాయింట్లు చేరాయి. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 770 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్, బాబర్ ఆజమ్ మధ్య 47 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత కెపె్టన్ రోహిత్ శర్మ (757 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఎలాంటి మార్పు లేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై అజేయ సెంచరీ చేసిన భారత స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్లో నిలిచాడు. భారత్కే చెందిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంక్లో, కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్లో నిలిచాడు. -
CT IND Vs PAK: పాకిస్తాన్కు షాకిచ్చిన ఐసీసీ..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy) తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలింది. కరాచీ వేదికగా కివీస్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు పాక్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 5 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత సమయంలో పాక్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది.దీంతో కొత్త రూల్స్ ప్రకారం.. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాక్ 30-యార్డ్ సర్కిల్లో అదనపు ఫీల్డర్తో ఫీల్డింగ్ చేయవలిసి వచ్చింది. దాంతో పాటుగా ఈ జరిమానా కూడా పాక్ జట్టుపైన పడింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో, షర్ఫుద్దౌలా ఫిర్యాదు మెరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా తన తమ తప్పిదాన్ని రిజ్వాన్ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ కేవలం ఫైన్తోనే సరిపెట్టాడు.తొలి మ్యాచ్లో చిత్తు..కాగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 321 పరుగుల లక్ష్య చేధనలో పాక్ జట్టు 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్ష్బ్యాటర్లలో ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఓ రూర్క్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ రెండు వికెట్లు సాధించాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు.జమాన్ దూరం..కాగా పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్లో జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జమాన్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని ఇమామ్ ఉల్ హక్తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్తో తలపడనుంది.చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు -
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్లూ దుబాయ్లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్లో ప్రధానం కాగా...బౌలింగ్లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
మన ‘చాంపియన్స్’ కసరత్తు షురూ
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు. ప్రాక్టీస్లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్కు ఉపక్రమించాడు.బ్యాటర్లు నెట్స్లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) వార్మప్ మ్యాచ్ల (Warm Up Matches) షెడ్యూల్ను ఐసీసీ (ICC) ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీల మధ్యలో ఈ వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మాత్రమే ఈ వార్మప్ మ్యాచ్లు ఆడుతున్నాయి. బిజీ షెడ్యూల్ దృష్ట్యా భారత్ వార్మప్ మ్యాచ్లు ఆడటం లేదు. ఈ వార్మప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ మూడు టీమ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 14న జరిగే మ్యాచ్లో షాదాబ్ ఖాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ షహీన్స్ ఆఫ్ఘనిస్తాన్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 16న జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఫిబ్రవరి 17న కరాచీలో జరిగే మ్యాచ్లో ముహమ్మద్ హురైరా నేతృత్వంలోని పాకిస్తాన్ షాహీన్స్ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే రోజు దుబాయ్లో జరిగే మ్యాచ్లో మొహమ్మద్ హరీస్ సారథ్యంలోని పాకిస్తాన్ షాహీన్స్ న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. ఈ నాలుగు వార్మప్ మ్యాచ్లు డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అసలు మ్యాచ్లు ఫిబ్రవరి 19న మొదలవుతాయి. ఈ మెగా టోర్నీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.వార్మప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్లు:v ఆఫ్ఘనిస్తాన్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ - షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్ ఫసీ, అరాఫత్ మిన్హాస్, హుస్సేన్ తలత్, జహందాద్ ఖాన్, కాషిఫ్ అలీ, మొహ్సిన్ రియాజ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్ ఖాన్, ముహమ్మద్ అఖ్లక్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధవా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్v దక్షిణాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ - మొహమ్మద్ హురైరా (కెప్టెన్), అమద్ బట్, ఫైసల్ అక్రమ్, హసన్ నవాజ్, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షెహజాద్, మాజ్ సదాకత్, మెహ్రాన్ ముంతాజ్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, సాద్ ఖాన్v బంగ్లాదేశ్, ICC అకాడమీ, దుబాయ్ - మొహమ్మద్ హారిస్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్ సమద్, అలీ రజా, అజాన్ అవైస్, మహ్మద్ వసీమ్ జూనియర్, ముబాసిర్ ఖాన్, మూసా ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సుఫియాన్ మొకిమ్, ఉసామా మీర్. -
శ్రీలంకలో విజృంభించిన ఆసీస్ స్పిన్నర్పై ఫిర్యాదు
సిడ్నీ: శ్రీలంక పర్యటనలో విజృంభించిన ఆ్రస్టేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ (Australia Left Arm Spinner) మ్యాట్ కునేమన్ (Matthew Kuhnemann) బౌలింగ్ శైలిపై (Bowling Action) సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా కునేమన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడి లేదని అంపైర్లు సందేహాలు లేవనెత్తడంతో... ఆసీస్ స్పిన్నర్ బయోమెకానికల్ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన రెండో టెస్టు తర్వాత మ్యాచ్ అధికారుల కునేమన్ బౌలింగ్ అంశాన్ని ఆ్రస్టేలియా జట్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మా ప్లేయర్కు పూర్తి మద్దతు ఇస్తాం’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017లో ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి 100కు పైగా మ్యాచ్లు ఆడిన కునేమన్... ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 5 మ్యాచ్లాడి 25 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శ్రీలంతో సిరీస్లో 28 ఏళ్ల కునేమన్ 17.18 సగటుతో 16 వికెట్లు తీశాడు. కునేమన్ బౌలింగ్పై ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని సీఏ వెల్లడించింది. ఈ నెల ఆఖర్లో బ్రిస్బేన్లో కునేమన్ బయోమెట్రిక్ పరీక్ష చేయించుకోనున్నాడు. అనంతరం ఫలితాలను విశ్లేషణ కోసం ఐసీసీకి పంపనున్నారు. ఒకవేళ కునేమన్ ఈ పరీక్షలో విఫలమైతే అతడిపై సస్పెన్షన్ వేటు పడగనుంది. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.కాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్కు సంబంధించిన అంపైర్ల వివరాలను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్కు రిచర్డ్ కెటిల్బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా వ్యవహరించన్నాడు.టీవీ అంపైర్గా జోయెల్ విల్సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఫిబ్రవరి 23న జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్కు పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్గా మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ వ్యవహరించనున్నారు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు..అయితే భారత్ ఆడే గ్రూపు స్టేజి మ్యాచ్ల అంపైర్ జాబితాలో ఐరెన్ లెగ్ రిచర్డ్ కెటిల్బరో లేకపోవడం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అతడు అంపైర్గా టీమిండియా అభిమానులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో చాలా సార్లు అది రుజువైంది. 2014 నుంచి అతడు అంపైర్గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించలేదు.అంపైర్ల పూర్తి జాబితాపాకిస్థాన్ vsన్యూజిలాండ్, ఫిబ్రవరి 19 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్టీవీ అంపైర్: జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్: అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్బంగ్లాదేశ్ vs భారత్, ఫిబ్రవరి 20 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అడ్రియన్ హోల్డ్స్టాక్, పాల్ రీఫిల్టీవీ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఫోర్త్ అంపైర్: మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 21 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, రోడ్నీ టక్కర్టీవీ అంపైర్: రిచర్డ్ కెటిల్బరో, ఫోర్త్ అంపైర్: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 22 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: జోయెల్ విల్సన్, క్రిస్ గఫానీటీవీ అంపైర్: కుమార్ ధర్మసేన, ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్పాకిస్థాన్ v భారత్, ఫిబ్రవరి 23 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: పాల్ రీఫిల్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ టీవీ అంపైర్: మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్: అడ్రియన్ హోల్డ్స్టాక్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, ఫిబ్రవరి 24 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: అహ్సన్ రజా, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: రోడ్నీ టక్కర్, ఫోర్త్ అంపైర్: జోయెల్ విల్సన్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 25 – రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్బరో, క్రిస్ గఫానీటీవీ అంపైర్: అలెక్స్ వార్ఫ్, ఫోర్త్ అంపైర్: కుమార్ ధర్మసేన, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 26 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, జోయెల్ విల్సన్టీవీ అంపైర్: అహ్సన్ రజా, ఫోర్త్ అంపైర్: రోడ్నీ టక్కర్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెపాకిస్థాన్ vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 27 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్స్టాక్టీవీ అంపైర్: పాల్ రీఫిల్, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 28 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ కెటిల్బరో, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ -
IPL 2025: IPL కప్ మనదేనా?
-
ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో త్రిష
అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్ను వరుసగా రెండోసారి సాధించిన భారత జట్టులోని పలువురు ప్లేయర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్లో చోటు దక్కింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత అమ్మాయిల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన తెలంగాణ స్టార్ ఓపెనర్ గొంగడి త్రిష సహా మొత్తం నలుగురు భారత క్రికెటర్లకు ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో స్థానం లభించింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి కమలిని, లెఫ్టార్మ్ స్పిన్ ద్వయం వైష్ణవి శర్మ, ఆయుశి శుక్లాలు కూడా ఐసీసీ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హార్డ్ హిట్టర్ త్రిష ఈ టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీ సహా 309 పరుగులు చేసింది. లెగ్స్పిన్తో 7 వికెట్లను కూడా పడగొట్టింది. ఆమెతో జోడీగా దిగిన కమలిని 143 పరుగులు చేసింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో కమలిని (50 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. భారత స్పిన్నర్లలో ఆయుశి 14 వికెట్లను చేజిక్కించుకోగా, వైష్ణవి 17 వికెట్లతో టోర్నీలోనే అగ్రస్థానంలో ఉంది. మలేసియాపై ‘హ్యాట్రిక్’తో ఆమె (5/5) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీ: కైలా రేనెకె (కెప్టెన్; దక్షిణాఫ్రికా), జెమ్మా బోతా (దక్షిణాఫ్రికా), త్రిష, కమలిని, ఆయుశి శుక్లా, వైష్ణవి శర్మ (భారత్), డేవినా పెరిన్, కేటీ జోన్స్ (ఇంగ్లండ్), కావొంహె బ్రే (ఆ్రస్టేలియా), చమొది ప్రబొద (శ్రీలంక), పూజ మహతో (నేపాల్), 12వ ప్లేయర్: ఎన్తబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా).చదవండి: అదరగొడుతున్న ‘అభి’ -
సచిన్కు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
మిథాలీ అడుగు జాడల్లోనే...
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష... తన ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రభావం ఉందని వెల్లడించింది. వరల్డ్కప్లో భాగంగా స్కాట్లాండ్తో ‘సూపర్ సిక్స్’ పోరులో 59 బంతులాడి అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష... ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ను చూసి నేర్చుకున్నానని వెల్లడించింది. 2023 మహిళల అండర్–19 ప్రపంచకప్తో పాటు, గతేడాది అండర్–19 ఆసియాకప్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష... తాజా సెంచరీని తండ్రి రామిరెడ్డికి అంకితమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మిథాలీ రాజ్ను చూస్తూ పెరిగాను. ఆమె ఇన్నింగ్స్ను నిర్మించే తీరు నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే చేయాలని ఎప్పటి నుంచో అనుకునే దాన్ని. నా ఆదర్శ క్రికెటర్ మిథాలీ. ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. మొత్తానికి అది స్కాట్లాండ్పై సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. అప్పుడే మొత్తం 20 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు వీలుంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్లో టాస్ ఓడిపోవడంతో ఆ అవకాశం దక్కింది. క్రీజులో ఉన్నప్పుడు వ్యక్తిగత స్కోరును పట్టించుకోను. సహచరులు సంబరాలు చేసుకునేంత వరకు సెంచరీ పూర్తి చేసుకున్నానని గుర్తించలేదు.చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నా. అమ్మానాన్న సహకారం లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’అని త్రిష వెల్లడించింది. తాజా ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న త్రిష... వరుసగా రెండో సారి కప్పు ముద్దాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. -
పాక్ ఎఫెక్ట్..? ఐసీసీ సీఈవో అలార్డీస్ రాజీనామా
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ముందర అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో సీఈవో జెఫ్ అలార్డీస్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అలార్డీస్ రాజీనామాకు ఒక కారణమని ఐసీసీ సభ్యుడొకరు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్లో కాకుండా.. దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల అలార్డీస్ 2012లో జనరల్ మేనేజర్గా ఐసీసీలో చేరాడు. 2021 నవంబరులో ఐసీసీ సీఈవోగా నియమితుడయ్యారు. మరోవైపు ఆయన తప్పుకోవడానికి గల కారణాలు ఐసీసీ పేర్కొనలేదు. అయితే సీఈవోగా అలార్డీస్ అంకితభావంతో పనిచేశాడని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టు పాక్లో కరాచీ, రావల్పిండిలో మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే అక్కడి స్టేడియాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రతిష్టాత్మక ట్రోఫీ నిర్వహణకు పాక్ రెడీనేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాక్ ఎంపికపై ఐసీసీ పైనా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో అలార్డీస్ ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం.మరోవైపు.. ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్లు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ తమ పదవుల నుంచి వైదొలిగారు. -
అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.. ఈ అవార్డు వారికి అంకితం: బుమ్రా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు బుమ్రాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరిచింది. 2024 ఏడాదిలో బుమ్రా 13 టెస్టులు ఆడి ఏకంగా 71 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఒక ఏడాది కాలంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. అంతేకాకుండా గతేడాది అత్యధిక టెస్టు వికెట్లు తీసింది కూడా బుమ్రానే కావడం గమనార్హం.తద్వారా జో రూట్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)లను వెనక్కినెట్టి మరి బుమ్రా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక అవార్డుకు ఎంపికైన తర్వాత తొలిసారి బుమ్రా స్పందించాడు. ఐసీసీ ప్రతిష్టాత్మకు అవార్డు తనకు వరించడం చాలా సంతోషంగా ఉందని జస్ప్రీత్ తెలిపాడు."ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. టెస్ట్ క్రికెట్ ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉండే ఫార్మాట్. అటువంటి ఫార్మాట్లో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం నాకు చాలా ప్రత్యేకం.ఈ అవార్డును నాకు మద్దతుగా నిలిచిన నా సహచరులు, కోచ్లు, అభిమానులకు అంకితమివ్వాలనుకుంటున్నారు. వీరిందరి సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ నూతన ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాను" అని బుమ్రా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి భారత్ ఫాస్ట్ బౌలర్ బుమ్రానే కావడం విశేషం. ఓవరాల్గా ఈ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) ఈ అవార్డు అందుకున్నారు. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఏడాదికి గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది.చదవండి: #Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ? -
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
అర్ష్ దీప్కు అందలం
దుబాయ్: భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. గతేడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 25 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్... 2024లో ఓవరాల్గా 18 మ్యాచ్లాడి 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్కప్లో ఆరంభ ఓవర్లతో పాటు, డెత్ ఓవర్స్లో చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్న అర్ష్ దీప్ ఐసీసీ టి20 టిమ్ ఆఫ్ ద ఇయర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్గా నిలిచిన అర్ష్ దీప్... భారత టి20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. టి20ల్లో ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్... ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2021లో ఐసీసీ ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రవేశపెట్టింది. 2021లో మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)కు ఈ గౌరవం దక్కగా... 2022, 2023లలో సూర్యకుమార్ యాదవ్ (భారత్) గెల్చుకున్నాడు. -
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.ఇక హిట్మ్యాన్తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్డౌన్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.ఇక మిడిలార్డర్లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ రిటైర్మెంట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్కప్-2024 చాంపియన్గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.నో కోహ్లిఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్లు ఆడి 573 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యాది కీలక పాత్రటీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్గా గతేడాది అతడు 17 మ్యాచ్లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్దీప్ సింగ్ 18 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్వికెట్ టేకర్గానిలిచాడు.ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్దీప్ సింగ్(ఇండియా). -
ఐసీసీ టెస్టు జట్టులో బుమ్రా, జడేజా, జైస్వాల్
దుబాయ్: గతేడాది సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్–2024’ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. 11 మందితో కూడిన ఈ జట్టుకు ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను సారథిగా ఎంపిక చేయగా... జట్టులో బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ రూపంలో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ ఎంపిక కాగా... శ్రీలంక నుంచి కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నాడు. 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బుమ్రా... టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కెరీర్లో 20కి లోపు సగటుతో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కిన బుమ్రా... ఇటీవల‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జడేజా గతేడాది 527 పరుగులు చేయడంతో పాటు... 48 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఆసీస్తో సిరీస్లో ప్రధాన ప్లేయర్లంతా విఫలమైన చోట చక్కటి ప్రదర్శన కనబర్చిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... గతేడాది 54.74 సగటుతో 1478 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1556) అగ్రస్థానంలో ఉండగా... జైస్వాల్ రెండో ‘ప్లేస్’లో నిలిచాడు. 23 ఏళ్ల జైస్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది విలియమ్సన్ 1013 పరుగులు చేయగా... శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ 1049 పరుగులు చేశాడు. ఇక పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోపీ’అందించిన ఆసీస్ సారథి కమిన్స్ 2024లో 37 వికెట్లు పడగొట్టడంతో పాటు 306 పరుగులు చేశాడు. మరోవైపు ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’లో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్కూ చోటు దక్కలేదు. గతేడాది భారత జట్టు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడటంతో మన ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించలేదు. వన్డే జట్టుకు శ్రీలంక ప్లేయర్ చరిత అసలంక కెపె్టన్గా ఎంపికయ్యాడు. ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: కమిన్స్ (కెప్టెన్ ; ఆ్రస్టేలియా) యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, బుమ్రా (భారత్), డకెట్, రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (ఇంగ్లండ్), విలియమ్సన్, హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక). -
BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ధరించే జెర్సీ గురించి వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు. తమ ఆటగాళ్లు ధరించే జెర్సీ లోగోలో పాకిస్తాన్ పేరు ఉండటాన్ని బీసీసీఐ వ్యతిరేకించిందన్న వార్తలను కూడా ఈ సందర్భంగా ఖండించాడు.దుబాయ్లో టీమిండియా మ్యాచ్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. ఐసీసీ అనుమతితో తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో పాక్తో పాటు దుబాయ్ కూడా ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక ఈ మెగా ఈవెంట్లో తమ తొలి మ్యాచ్లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీ ఆతిథ్య దేశం పేరు.. అన్ని జట్ల ఆటగాళ్ల జెర్సీలపై ఉంటుంది. అయితే, బీసీసీఐ మాత్రం దాయాది పేరును తమ జెర్సీలపై ముద్రించకుండా ఉండాలని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మా డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంటుందిఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐసీసీ రూపొందించిన అన్ని నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది. జెర్సీ లోగో అంశం సహా అన్నింటినీ మేము ఫాలో అవుతాము. ఏ దశలోనూ ఉద్దేశపూర్వకంగా మేము నిబంధనలను ఉల్లంఘించబోము. కానీ మీడియాలో ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయో.. వారికి వీటి గురించి ఎవరు సమాచారం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఐసీసీ రూల్స్ను అతిక్రమించేందుకు మాకు ఎలాంటి కారణాలు లేవు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పెట్టిన డ్రెస్ కోడ్ను మేము ఫాలో అవుతాం. లోగో కూడా యథాతథంగా ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్లో జరుగుతుంది.ఫిబ్రవరి 5లోగా మైదానాలు రెడీ: పీసీబీఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి రెండు వారాల ముందే స్టేడియంలను సిద్ధం చేసేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పనులు వేగవంతం చేసింది. కరాచీ, లాహోర్ స్టేడియాలలో పునరి్నర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అధునాతన కుర్చీలు, అదనపు సౌకర్యాలతో కూడిన భవనాలు, ఎల్ఈడీ ఫ్లడ్లైట్లు, డిజిటల్ స్కోరు బోర్డులు ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతన్న మైదానాలను వచ్చే నెల 5 వరకు సిద్ధం చేయనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆడనున్న ముక్కోణపు సిరీస్ను ఈ మైదానాల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు మైదానాల పునర్నిర్మాణం కోసం పీసీబీ 12 బిలియన్ పాకిస్తానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. కరాచీ స్టేడియం మేనేజర్ అర్షద్ఖాన్ మాట్లాడుతూ... ‘నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. మిగిలి ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు ఈ నెలాఖరులోగా ముగుస్తాయి. ఫిబ్రవరి 5లోగా అధునాతన మైదానాన్ని పీసీబీకి అందిస్తాం. లాహోర్ స్టేడియంలో కూడా పనులు దాదాపు ముగిశాయి. తాజా మార్పుల్లో అధునాతన సదుపాయాలు కల్పించాం’ అని పేర్కొన్నాడు.చదవండి: రీ ఎంట్రీ ఇస్తా.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్ -
టాప్ ర్యాంక్కు చేరువలో టీమిండియా ఓపెనర్..
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అగ్రస్ధానానికి అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మంధాన రెండో స్ధానానికి చేరుకుంది. ఓ స్ధానం మెరుగుపరుచుకుని రెండో స్ధానానికి మంధాన దూసుకొచ్చింది.ఐర్లాండ్తో సిరీస్లో అద్భుత ప్రదర్శన కారణరంగా స్మృతి ర్యాంక్ మెరుగుపడింది. ఈ భారత వైస్ కెప్టెన్ ఖాతాలో ప్రస్తుతం 738 పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్లో మంధాన అదరగొట్టింది. మూడు మ్యాచ్ల సిరీస్లో స్మృతి ఓ సెంచరీతో పాటు మొత్తంగా 249 పరుగులు చేసింది. కాగా ఐసీసీ మహిళల బ్యాటింగ్ ర్యాకింగ్స్లో భారత్ నుంచి మంధాన ఒక్కరే ఉండడం గమనార్హం.మరోవైపు ఈ ఐరీష్ సిరీస్లో సెంచరీతో కదం తొక్కిన జెమిమా రోడ్రిగ్స్ రెండు స్ధానాలు మెరుగు పరుచుకుని 17వ ర్యాంక్కు చేరుకుంది. అదేవిధంగా ఈ సిరీస్కు దూరమైన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 15వ ర్యాంక్లో కొనసాగుతోంది. ఇక ఆల్రౌండర్ కోటాలో స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ 344 పాయింట్లతో ఆరో స్ధానంలో నిలిచింది.టాప్లో సౌతాఫ్రికా బ్యాటర్..కాగా వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(773) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో మంధాన(738), మూడో స్ధానంలో శ్రీలంక బ్యాటర్ చమిర అతపట్టు(733) మూడో స్ధానంలో ఉన్నారు. మహిళల వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫియా ఎకిల్స్టోన్(770) టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. గార్డెనర్(724), మెగాన్ స్కాట్(696) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు.చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రా ప్రేమ పెళ్లి.. ‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా? -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్కప్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
రాజ్కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
IND vs AUS: సిడ్నీ పిచ్పై ఐసీసీ రేటింగ్..
భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్తో కనిపించిన ఈ పిచ్పై పేస్ బౌలర్లు చెలరేగారు. గ్రౌండ్స్మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్తో ఐసీసీ కితాబునిచ్చింది.సిడ్నీలో ఘోర ఓటమి.. కాగా ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్ను కోల్పోయింది.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న వైట్బాల్ సిరీస్లకు టీమిండియా సిద్దం కానుంది.చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’ -
USA: ‘వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్లో క్రికెట్ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్లోని రంజీ టీమ్లతో మ్యాచ్లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు. -
'అదొక చెత్త నిర్ణయం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్
టెస్టు క్రికెట్కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.విండీస్ గ్రేట్ ఫైర్..కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. దీంతో టెస్టు క్రికెట్కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది' -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్కు మరో షాక్
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ పాకిస్తాన్ మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించబడింది. అలాగే ఐదు డబ్ల్యూటీసీ పాయింట్లు డాక్ చేయబడ్డాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ కథనం మేరకు.. నిర్దేశిత సమయం ముగిసే లోగా పాక్ ఐదు ఓవర్లు వెనుకపడింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయంలోగా ఓవర్ వెనుకపడితే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో ఐదు శాతం కోత విధిస్తారు. అలాగే ఓ డబ్ల్యూటీసీ పాయింట్ డాక్ చేయబడుతుంది. ఐసీసీ విధించిన జరిమానాను పాక్ సారధి షాన్ మసూద్ స్వీకరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో (ఎనిమిది) ఉంది.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది. తాజాగా ముగిసిన రెండో టెస్ట్లో పాక్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా తలో మూడు వికెట్లు తీయగా.. మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్లో పాక్ 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలిగింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. బాబర్ ఆజమ్ (81) వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ అర్ద సెంచరీతో ఆకట్టుకోగా.. మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది.ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్దీప్ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్కప్-2024లోనూ అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్దీప్ సింగ్తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు.ఈ ఏడాది టీ20ల్లో బాబర్ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్గా నిలిచాడు. అదే విధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్లో ఆల్రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 15 ఇన్నింగ్స్లో 539 పరుగులు చేశాడు.బుమ్రాకు నో ఛాన్స్.. కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్కప్లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం. -
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖారారు చేసిటనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'రెవ్స్పోర్ట్జ్' అనే స్పోర్ట్స్ వెబ్ సైట్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.రెవ్స్పోర్ట్జ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే టీమిండియా తమ మొదటి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ తటస్ధ వేదికపై జరుగుతాయి అని సదరు వెబ్సైట్ పేర్కొంది.దాయాదుల పోరు ఎప్పుడంటే?రెవ్స్పోర్ట్జ్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్లను ఆడనుంది. న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2న ఆడనుంది.మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా తమ మ్యాచ్లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికలగా ఆడే అవకాశముంది.కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత మ్యాచ్లు మినహా మిగితా అన్నీ పాక్లోనే జరగనున్నాయి. టీమిండియా ఒకవేళ నాకౌట్స్కు చేరితే ఆ మ్యాచ్లు కూడా తటస్థవేదిక గానే జరగనున్నాయి.చదవండి: VHT 2024: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్లతో -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్లు ఆడే అన్నీ మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్లో భారత్ ఆడాల్సిన మ్యాచ్లు యూఏఈ (దుబాయ్)లో... భారత్లో పాక్ ఆడాల్సిన మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి. -
BCCI: బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం
ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.ప్రధాన ఆదాయ వనరులివేకాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.ఐసీసీ నుంచి సింహభాగంజూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులునిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. చదవండి: ‘త్వరలోనే భారత్కు కోహ్లి గుడ్బై... లండన్లో స్థిరనివాసం’ -
షాకింగ్.. టీ20 ఫార్మాట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటివరకు ఇంకా అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు.అందుకు కారణం బీసీసీఐ-పీసీబీ మధ్య నెలకొన్న విభేదాలే. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు పంపేంచేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది.అందుకు అన్ని క్రికెట్ బోర్డులు అంగీకరించినా, పీసీబీ మాత్రం ససేమీరా అంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహణకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ అందుకు ఒప్పుకోపోతే టోర్నీని పాక్ నుంచి వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీబీ ఓ మెట్టు దిగి వచ్చి హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేందుకు సిద్దమైనట్లు సమాచారం.మరో కొత్త ట్విస్ట్..తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో మరో కొత్త ఆంశం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్కు బదులగా టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం..ఐసీసీ షెడ్యూల్ను ఇంకా ఖారారు చేయకపోవడంతో మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని పెట్టబడుదారులు అవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి కొన్ని రోజులు ఇదే తంతు కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లలో నిర్వహించాలని సదరు స్టేక్హోల్డర్స్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు ఐసీసీ కూడా సముఖంగా ఉన్నట్లు క్రిక్బజ్తో పాటు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే ఫార్మాట్ కంటే టీ20లను ఈజీగా నిర్వహించవచ్చని ఐసీసీ భావిస్తున్నట్లు వినికిడి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్పై గురువారం(డిసెంబర్ 12)ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.చదవండి: IND vs AUS: 'ధోని లాంటి కెప్టెన్ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్' -
విండీస్ పేసర్కు షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అదనంగా జోసఫ్ యొక్క క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది. ఐసీసీ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జోసఫ్ స్పైక్లతో పిచ్పై అడుగు పెట్టకుండా ఉండమని ఫోర్త్ అంపైర్ సూచించాడు. అయితే ఇది పట్టించుకోని జోసఫ్ స్పైక్లతో పిచ్పై అడుగుపెట్టడంతో పాటు అంపైర్ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘణ కిందకు వస్తుంది. జోసఫ్ తన నేరాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తెలిపాడు. జోసఫ్ గత 24 నెలల వ్యవధిలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది రెండో సారి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (113) మెరుపు శతకం బాది విండీస్ను గెలిపించాడు. ఈ సిరీస్లో రెండో వన్డే ఇవాళ (డిసెంబర్ 10) జరుగుతుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. తంజిద్ హసన్(30), లిటన్ దాస్ (1) క్రీజ్లో ఉన్నారు. -
ట్రావిస్ హెడ్, సిరాజ్లకు ఐసీసీ షాక్!?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్ను పెవీలియన్కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.ఐసీసీ సీరియస్..!ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్ -
ఆటను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తా: జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను. మేమంతా స్పష్టమైన విజన్తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్మ్యాప్కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు. అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో జస్ప్రీత్ బుమ్రా
నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ గురువారం (డిసెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. ఈ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ ఉన్నారు. వీరి ముగ్గురూ నవంబర్ మంత్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.జస్ప్రీత్ బుమ్రా..గత నెలలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కివీస్తో సిరీస్ కోల్పోయినప్పటికి బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు.హ్యారీస్ రవూఫ్..ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో పాక్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల సిరీస్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి సిరీస్ను పాక్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కంగారులతో జరిగిన టీ20 సిరీస్లో కూడా అతడు 5 వికెట్లు పడగొట్టాడు.మార్కో జాన్సెన్..భారత్తో జరిగిన టీ20 సిరీస్లో సఫారీ ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ తన ఆల్రౌండ్ స్కిల్స్ను చూపించాడు. బ్యాట్తోనూ బంతితోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి ప్రోటీస్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్లను తటస్థ వేదికలో ఆడనుంది.టీమిండియా ఆడే మ్యాచ్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.ఐసీసీ కొత్త చైర్మెన్గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్లో పీసీబీ హైబ్రిడ్ మోడల్కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.అదేవిధంగా హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
విండీస్ ఆటగాళ్లకు జరిమానా
బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.ఆల్రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్గా వచ్చి స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి టెస్ట్లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది. -
WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, క్రైస్ట్చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది. -
పాకిస్తాన్ తలవంచినట్లే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ–2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తపడింది. ‘హైబ్రిడ్’ మోడల్కు అంగీకరించేది లేదని, మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే నిర్వహిస్తామని చెబుతూ వచి్చన పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నారు. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మేం ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే’ అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా... నఖ్వీ మాటలను బట్టి చేస్తూ ‘హైబ్రిడ్’ మోడల్ ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.. ‘హైబ్రిడ్’ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లు మినహా ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. ఐసీసీ టోరీ్నల విషయంలో తాము ‘సమానత్వం’ కోరుకుంటున్నట్లు నఖ్వీ వెల్లడించారు. దీని ప్రకారం మున్ముందు భారత్లో జరిగే ఐసీసీ టోరీ్నలకు కూడా ‘హైబ్రిడ్’ మోడల్ అమలు చేయాలని పీసీబీ కోరింది. అంటే తాము కూడా ఇకపై భారత్కు వెళ్లి మ్యాచ్లు ఆడమని...తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేసింది. 2026లో టి20 వరల్డ్ కప్, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్లతో పాటు ఆసియా కప్కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో వైపు ఐసీసీ నుంచే తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని, ‘హైబ్రిడ్’కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరగనుంది. పాక్లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండలను నిర్ణయించారు. -
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.పీసీబీకి ఐసీసీ అల్టిమేటంఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్లను దుబాయ్లోనే నిర్వహించాలి.👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్తో పాటు ఫైనల్ మ్యాచ్లను లాహోర్లో నిర్వహించేందుకు పాకిస్తాన్కు అనుమతినివ్వాలి.👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్లు నిర్వహించాలి. చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
‘హైబ్రిడ్’ మోడల్కు అంగీకరించాల్సిందే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్కు చెప్పేసింది. దుబాయ్లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. -
‘పాక్కు మోదీ వెళ్లొచ్చు.. టీమిండియా వెళ్లకూడదా?’
పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో జార్ఖండ్కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. -
‘హైబ్రిడ్’ మోడల్పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్ మోడల్. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోనే నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్ నాకౌట్ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. గత ఏడాది ఆసియా కప్ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్ కప్ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్ మోడల్కు తాము అంగీకరించాలంటే భారత్లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్కు వెళ్లమని పాక్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
నేను చేసిన తప్పేంటో నాకు అర్ధం కావడం లేదు యువరానర్!!
-
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్లో అటు బ్యాట్తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. -
Champions Trophy: పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ మరింత వివాదాస్పదం కాకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే.. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఎనిమిది జట్లువన్డే వరల్డ్కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే, పాక్లో నిర్వహించే ఈ ఐసీసీ ఈవెంట్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోము అంటున్న పాక్అదే విధంగా.. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐసీసీ ఇందుకు సానుకూలంగానే ఉన్నా.. పీసీబీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కావాలంటే ఆతిథ్యమైనా వదులుకుంటాంగానీ.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోమని చెబుతోంది.అత్యుత్సాహం ప్రదర్శించిన పీసీబీఅంతేకాదు.. తమ ప్రభుత్వానిది కూడా ఈ విషయంలో ఇదే వైఖరి అని ఐసీసీకి తేల్చిచెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో పీసీబీ భారత్ను కవ్వించేలా మరో చర్యకు దిగింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్గా ఉన్న ప్రాంతంలో చేస్తామని శుక్రవారం ప్రకటించింది.ముకుతాడు వేసిన ఐసీసీస్కర్దు, హంజా, మజఫర్బాద్లలో ట్రోఫీ టూర్ చేస్తామని అధికారికంగా పీసీబీ వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారగా.. ఐసీసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ను రద్దు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా నవంబరు 16- 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ జరుగనుంది. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు. చదవండి: టచ్లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్ -
పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్యలు.. చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రకటన
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్ను నిర్వహించే ప్రదేశాల పేర్లను పీసీబీ శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.నవంబరు 16న ఇస్లామాబాద్లో‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025.. ట్రోఫీ టూర్ నవంబరు 16న ఇస్లామాబాద్లో మొదలవుతుంది. అదే విధంగా.. స్కర్దు, ముర్రే, హంజా, మజఫర్బాద్లోనూ జరుగుతుంది. సర్ఫరాజ్ అహ్మద్ 2017లో ది ఓవల్ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూడండి. ఈ ట్రోఫీ టూర్ నవంబరు 16- 24 వరకు జరుగుతుంది’’ అని పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.ఇందులో ప్రస్తావించిన స్కర్దు, హంజా, మజఫర్బాద్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాలు అని.. పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదుఈ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీకి తేల్చిచెప్పింది.టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. ఐసీసీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉందనే వార్తలు వినిపించాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ దేశానికి వచ్చాయని.. టీమిండియా కూడా రావాలని పట్టుబడుతోంది. తమ ప్రభుత్వం కూడా ప్రతీ మ్యాచ్ను దేశంలోనే నిర్వహించాలని సూచించిందని..పంతానికి పోతోంది.తటస్థ వేదికపై నిర్వహిస్తారా?ఈ మేరకు ఇలా ఇరు బోర్డుల మధ్య చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయమై విభేదాలు తలెత్తిన వేళ.. పీసీబీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీసీ అంతిమంగా తీసుకునే నిర్ణయంపైనే టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? లేదంటే.. బీసీసీఐ ఈ టోర్నీని బహిష్కరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా గనుక ఈ ఈవెంట్లో ఆడకపోతే పాకిస్తాన్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా భారీగా ఆర్థిక నష్టం తప్పదు.చదవండి: కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్లో పంత్ క్లీన్బౌల్డ్! జైస్వాల్ కూడా..Get ready, Pakistan!The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024 -
ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ ఇక్కడే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వేదిక విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ఆతిథ్యాన్ని అయినా వదులుకుంటాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించబోమని పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కూడా పీసీబీకి మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక్క మ్యాచ్ కూడా దేశం వెలుపల నిర్వహించేందుకు అంగీకరించవద్దని బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పీసీబీ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నీ అంశంలో మా ప్రభుత్వం మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మ్యాచ్ మా దేశంలోనే నిర్వహించాలని చెప్పింది.ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ ఇక్కడేఏ జట్టుకు సంబంధించి అయినా.. ఒక్క మ్యాచ్ కూడా తటస్థ వేదికపై నిర్వహించేందుకు వీలులేదని.. ఇదే తమ వైఖరి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి.. బీసీసీఐ పాకిస్తాన్కు తమ జట్టును పంపలేమన్న విషయాన్ని మాత్రమే ఐసీసీ మాకు తెలియజేసింది.చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను మేము దక్కించుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ వెలుపల ఒక్క మ్యాచ్ నిర్వహించడానికి మేము ఒప్పుకోము’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఒప్పుకోవద్దని పాక్ ప్రభుత్వం పీసీబీకి చెప్పిందని తన యూట్యూబ్ చానెల్గా వెల్లడించాడు.ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యంకాగా వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో.. హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడతామని ఐసీసీకి స్పష్టమైన సమాచారమిచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పీసీబీ పేర్కొన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.మరోవైపు.. బీసీసీఐ సైతం ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టి పాక్లో టోర్నీ ఆడలేమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ.. పాకిస్తాన్ గనుక ఆతిథ్య హక్కులు వదులుకుంటే ఈ మెగా టోర్నీ వేదికను... దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తోంది.పాకిస్తాన్లోనే అంధుల టీ20 ప్రపంచకప్ఇదిలా ఉంటే.. అంధుల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఈసారి పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత అంధుల క్రికెట్ జట్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం కేంద్ర క్రీడా శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు దరఖాస్తు చేసుకుంది.లాహోర్, ముల్తాన్ వేదికలపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు అంధుల ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. 17 సభ్యులు గల భారత జట్టుకు క్రీడాశాఖ తమ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీని జారీ చేసింది. అయితే హోం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో జట్టు నిరీక్షిస్తోంది. భారత ప్రభుత్వం అనుమతించి, అంతా అనుకున్నట్లు జరిగితే వాఘా సరిహద్దు గుండా భారత అంధుల క్రికెట్ జట్టు ఈ నెల 21న పాకిస్తాన్కు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్ -
భారత్ రాదు... నిర్ణయం మీదే!
కరాచీ: వచ్చే ఏడాది పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్కు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్లో ఆడేందుకు భారత్ ససేమిరా అంటోంది. మరోవైపు హైబ్రిడ్ మోడల్ (భారత్ ఆడే మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహణ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో భారత్ మెగా టోర్నీ ఆడే విషయమై ఐసీసీని మరింత స్పష్టత కోరాలని పీసీబీ భావిస్తుండగా... ఐసీసీ నాన్చకుండా తేల్చేసింది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలో... ఫైనల్ పోరు దుబాయ్లో నిర్వహించే హైబ్రిడ్ పద్ధతికే తాము అంగీకరిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమకు స్పష్టం చేసిందని పాక్ బోర్డుకు ఐసీసీ తేల్చిచెప్పింది. భారత్ ఆడే మ్యాచ్లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచి్చంది. ఇక కాదు... కూడదంటే... మీ ఇష్టమని పాక్ బోర్డుకు స్పష్టం చేయడంతో పీసీబీ కినుక వహించింది. నిరసనగా ఆతిథ్య హక్కులు వదిలేసుకోవాలని బోర్డు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. టోర్నీ ఆతిథ్యం నుంచి ఒకవేళ పాక్ తప్పుకుంటే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ఎలాగైనా పాక్లో భారత క్రికెట్ జట్టు అడుగుపెట్టాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్కు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తోంది. ‘హైబ్రిడ్ పద్ధతిలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే ఆలోచన పీసీబీకి లేదు. ప్రస్తుత పరిస్థితిని బోర్డు అంచనా వేస్తోంది. (పాక్) ప్రభుత్వాన్ని సంప్రదించాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది’ అని పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య గడిచిన 16 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీసే జరగడం లేదు. 2008లో ముంబైపై పాక్ ఉగ్రదాడి అనంతరం రాజకీయ, క్రికెట్ బంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నల్లో, చాంపియన్స్ ట్రోఫీల్లోనే తలపడుతున్నాయి. -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్కప్లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు.. ఐసీసీ రద్దు చేయనుందా!?
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీని రద్దు చేసే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఐసీసీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.కాగా ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గోనేందుకు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్తో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.దీంతో భారత్ ఆడే మ్యాచ్లను షెడ్యూల్ చేయడం ఐసీసీకి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నవంబర్ 11న లహోర్లో జరగాల్సిన ఓ మేజర్ ఈవెంట్ను ఐసీసీ రద్దు చేసింది. ఈ ఈవెంట్లో టోర్నీలో పాల్గోనే జట్ల జాతీయ జెండాలతో పాటు షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేయాలని భావించింది. కానీ రద్దు చేయకాగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వంద రోజుల కౌంట్డౌన్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఐసీసీ అధికారి ఒకరూ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు."ఈ టోర్నీలో పాల్గోనే జట్లతో పాటు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్తో కూడా చర్చలు జరుపుతున్నాము. షెడ్యూల్ ఖారారైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాము. ట్రోఫీ టూర్ ఫ్లాగ్, ట్రోఫీని లాంఛ్ చేసేందుకు లహోర్లో ఓ ఈవెంట్ నిర్వహించాలని భావించాము. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.చదవండి: PAK vs AUS: నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్ -
‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై స్పష్టత వచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్కు భారత జట్టు వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. పాక్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చిలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డపై తాము క్రికెట్ ఆడలేమని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తెలియజేసింది. తాము పాకిస్తాన్కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత బోర్డు సమాచారం అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్తో పాటు భారత్కు ప్రత్యరి్థగా ఉండే జట్లు కూడా పాక్ వెలుపల ఉండే వేదికలో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుది. పాక్తో పాటు దేశం బయట మరో వేదికను ఎంచుకొని ‘హైబ్రిడ్ మోడల్’లో టోర్నీని నిర్వహించే ఆలోచనే లేదని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ శుక్రవారం కూడా చెప్పారు. అయితే ఒక్కరోజులో పరిస్థితి అంతా మారిపోయింది. భారత మ్యాచ్లకు యూఏఈ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. తాము సిద్ధమంటూ శ్రీలంక బోర్డు చెబుతున్నా... పాక్ కోణంలో వారికి అనుకూల, సౌకర్యవంతమైన వేదిక కాబట్టి యూఏఈకే మొగ్గు చూపవచ్చు. 2023లో భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు వచ్చి ఆడినా... భారత్ మాత్రం అలాంటిదేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడింది. నేటి నుంచి సరిగ్గా 100 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్కు వస్తారా? లేదా?.. ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భద్రతా కారణాల దృష్ట్యాకాగా 2008 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోగా.. మెగా టోర్నీల్లో మాత్రం దాయాదులు ముఖాముఖి తలపడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది.అప్పుడు శ్రీలంకలోఅయితే, ఆసియా వన్డే కప్-2023 హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. బీసీసీఐ మాత్రం రోహిత్ సేనను అక్కడికి పంపలేదు. తమ మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరగా.. ఆసియా క్రికెట్ మండలి అందుకు అంగీకరించింది. దీంతో టీమిండియా మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి.ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2023 భారత్లో జరుగగా.. పాక్ జట్టు ఇక్కడికి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఘోర ఓటమితో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు తమవే గనుక.. టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ కోరుతోంది. అయితే, బీసీసీఐ నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తాము అడుగులు వేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశాడు.రాతపూర్వక సమాధానం ఇవ్వండిఅయితే, వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఒకవేళ టీమిండియా పాకిస్తాన్కు రాకపోతే మాత్రంఇక టీమిండియా మ్యాచ్లను లాహోర్లో నిర్వహిస్తామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఇప్పటికే చెప్పాడు. ఇదిలా ఉంటే.. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక కోసం ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ నుంచి కొంతమొత్తం పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబరు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
మంచి రోజులు వస్తున్నాయి...
దుబాయ్: మన మహిళల క్రికెట్కు మంచి రోజులు వస్తున్నాయి. గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇకపై క్రమం తప్పకుండా భారత్లో పర్యటించనున్నాయి. 2025–29 సైకిల్కు సంబంధించిన మహిళల భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత జట్టు కీలక ద్వైపాక్షిక సిరీస్లలో తలపడనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ టీమిండియా పర్యటించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని ప్రతి సభ్య దేశం ఇంటా బయటా నాలుగు సిరీస్ల చొప్పున పాల్గొనేలా కొత్త ఎఫ్టీపీని రూపొందించారు. భారత్ మేటి ప్రత్యర్థులతో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్, 11వ సభ్య దేశంగా ఉన్న జింబాబ్వేతోనూ తలపడుతుంది. ఎప్పుడో అరకొరగా జరిగే టెస్టులను ఈ నాలుగేళ్ల సైకిల్లో పెంచారు. సభ్యదేశాలన్నీ మూడు ఫార్మాట్ల సిరీస్లో పాల్గొనేందుకు సమ్మతించాయని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీమ్ ఖాన్ తెలిపారు. దీంతో గత ఎఫ్టీపీతో పోల్చితే తదుపరి సైకిల్లో మహిళల మ్యాచ్లు మూడు ఫార్మాట్లలోనూ గణనీయంగా పెరగనున్నాయి. » కొత్త ఎఫ్టీపీ వచ్చే ఏడాది మేలో మొదలై 2029 ఏప్రిల్తో ముగుస్తుంది. ప్రతి దేశం పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో 2025–29 సైకిల్లో 400 పైచిలుకు అంతర్జాతీయ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో జరిగే 44 వన్డే సిరీస్లలో ఒక్కో సభ్యదేశం మిగతా పది జట్లతో మూడు వన్డేల చొప్పున ఆడుతుంది. అలా 132 వన్డేలు జరుగుతాయి. » మహిళల ఎఫ్టీపీని 2029లో జరిగే వన్డే ప్రపంచకప్కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడున్న 10 జట్లతో పరిమితం కాకుండా ఆ మెగా టోర్నీ 11 జట్లతో జరుగనుంది. 11వ దేశంగా జింబాబ్వే బరిలోకి దిగుతుంది. ఇటీవల జింబాబ్వే మహిళల జట్టుకు శాశ్వత సభ్యదేశం హోదా ఇచ్చారు. » 2026లో ఇంగ్లండ్లో జరగబోయే టి20 ప్రపంచకప్కు ముందు భారత్ అక్కడ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో కలిసి ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. » ఐర్లాండ్లోనూ జరిగే సన్నాహక ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్లు తలపడతాయి. అలాగే భారత ఉపఖండంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్, మరో జట్టుతో కలిసి ముక్కోణపు సిరీస్లో పాల్గొంటుంది. » ఐసీసీ మహిళల చాంపియన్íÙప్లో భాగమైన జింబాబ్వే... వచ్చే నాలుగేళ్ల పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకలతో జరిగే ద్వైపాక్షిక సిరీస్లకు ఆతిథ్యమిస్తుంది. దీంతో పాటు భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో పర్యటిస్తుంది. » అందరికంటే ఆ్రస్టేలియా గరిష్టంగా ద్వైపాక్షిక సిరీస్లలో భాగమవుతుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లాంటి గట్టి ప్రత్యర్థులతో ఇంటా బయటా సిరీస్లు ఆడుతుంది. -
టీమిండియా పాకిస్తాన్కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్
చాంపియన్స్ ట్రోఫీ రూపంలో వచ్చే ఏడాది మరో ఐసీసీ టోర్నీ అభిమానులకు వినోదం పంచనుంది. పాకిస్తాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా పాల్గొంటుందా? లేదా? అన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ సేనను పాకిస్తాన్కు పంపేందుకు సుముఖంగా లేదు.వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదుఈ నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్లు నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు తమ దేశంలో పర్యటించాయి కాబట్టి.. భారత జట్టు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. లాహోర్ వేదికగా టీమిండియా మ్యాచ్లు నిర్వహించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ కూడా ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ కూడా చాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చబోమని స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మెగా టోర్నీలో ఆడకుండా బహిష్కరిస్తే మాత్రం భారీ నష్టం తప్పదు. భారత జట్టు టోర్నమెంట్లో లేకుంటే.. ప్రసార హక్కులు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రారని ఇంగ్లండ్ బోర్డు పెద్దలు సైతం అభిప్రాయపడ్డారు.టీమిండియా పాకిస్తాన్కు వస్తే గనుక..ఈ క్రమంలో పాకిస్తాన్ వన్డే, టీ20 జట్ల కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమ దేశానికి రావాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘పాకిస్తాన్లోని క్రికెట్ అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు అంటే ఎంతో ఇష్టం. తమ దేశంలో భారత క్రికెటర్లు ఆడుతుంటే చూడాలని వారు ఆశపడుతున్నారు.మేము భారత్కు వెళ్లినపుడు అక్కడ మాకు సాదర స్వాగతం లభించింది. అయితే, వాళ్లు చాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి ఇక్కడికి వస్తారో లేదో తెలియదు.. ఒకవేళ వస్తే మాత్రం టీమిండియాకు ఇక్కడ ఘన స్వాగతం లభిస్తుంది’’ అని రిజ్వాన్ పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్ ఆడేందుకు గతేడాది పాక్ జట్టు భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బాబర్ ఆజం ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. పాక్ బోర్డు ఆ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్కు అప్పగించింది. చదవండి: Expensive Players In IPL: ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..! -
బోణీ బాగుండాలి
దుబాయ్: తొమ్మిదో ప్రయత్నంలోనైనా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్ టైటిల్ వేటను నేడు ఆరంభించనుంది. తొలి మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్లలో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ (2020లో) చేరి రన్నరప్గా నిలిచింది. ఈసారి మాత్రం కొత్త చరిత్ర తిరగరాయాలని హర్మన్ప్రీత్ కౌర్ బృందం పట్టుదలతో ఉంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. గత ఏడాది వరల్డ్కప్ సెమీఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ఈసారి కప్తో తిరిగి రావాలంటే శుభారంభం లభించాలి. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించగా... ఇప్పుడు అదే బాటలో తొలిసారి ‘విశ్వ కిరీటం’ దక్కించుకోవాలని హర్మన్ప్రీత్ జట్టు తహతహలాడుతోంది. టి20 ఫార్మాట్లో ప్రపంచకప్ ప్రవేశ పెట్టినప్పటి (2009) నుంచి భారత జట్టులో కొనసాగుతున్న 35 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్... జట్టును ఎలా నడిపిస్తుందనేది ఆసక్తికరం. టాపార్డర్ రాణిస్తేనే! అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం గెలుపు గీత దాటలేకపోతోంది. ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడం, ఆటలో కీలక దశలో పట్టు సడలించడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇటీవల ఆసియా కప్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... శ్రీలంకతో ఫైనల్లో అనూహ్యంగా తడబడి రన్నరప్తో సరిపెట్టుకుంది. దీంతో లోపాలను గుర్తించిన కోచింగ్ బృందం జట్టుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్లేయర్ల ఫిట్నెస్, ఫీల్డింగ్ను మరింత సానబెట్టింది. అదే సమయంలో మానసిక దృఢత్వం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన స్మృతి మంధాన ఆసియా కప్లో అదరగొట్టింది. స్మతి అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఆమెతో పాటు మిగిలిన ప్లేయర్లు సత్తా చాటాల్సిన అవసరముంది. భారత్ను పోలి ఉండే దుబాయ్, షార్జా పిచ్లపై మన స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుంది. దీప్తి శర్మపై భారీ అంచనాలు ఉండగా... శ్రేయాంక, ఆశ శోభన, రాధ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. సమతూకంగా న్యూజిలాండ్... న్యూజిలాండ్ జట్టు అటు అనుభవజ్ఞులు ఇటు యంగ్ ప్లేయర్లతో సమతూకంతో ఉంది. కెపె్టన్ సోఫీ డివైన్, టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సుజీ బేట్స్ (36 మ్యాచ్ల్లో 1066 పరుగులు), లీ తహుహూ, అమెలియా కెర్లతో కివీస్ జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండుసార్లు (2009, 2010) రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఈసారైనా చాంపియన్గా అవతరించాలని భావిస్తోంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోరీ్నలో లీగ్ దశలో ప్రతి జట్టు గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో తలపడనుంది. దీంతో ప్రతి మ్యాచ్ కీలకమే కాగా... లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ శ్రీలంక ఉన్నాయి. దుబాయ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ అమెలియా కెర్ న్యూజిలాండ్ జట్టుకు కీలకం కానుంది. తుది జట్లు (అంచనా) భారత జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రేణుక, రాధ యాదవ్, ఆశ శోభన. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమెలియా కెర్, బ్రూక్ హ్యాలీడే, మ్యాడీ గ్రీన్, ఇజీ గేజ్, కాస్పెరెక్, జెస్ కెర్, లీ తహుహూ, ఈడెన్ కార్సన్, రోస్మేరీ మైర్. 4 న్యూజిలాండ్ జట్టుతో భారత్ ఇప్పటి వరకు 13 టి20 మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్ల్లో గెలిచింది. 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక టి20 ప్రపంచకప్లో రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. చెరో రెండు మ్యాచ్ల్లో గెలిచాయి. గత రెండు ప్రపంచకప్లలో న్యూజిలాండ్పై భారతే గెలిచింది.4/4 భారత జట్టు ఆడిన ఎనిమిది ప్రపంచకప్లలో తొలి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసింది. తర్వాతి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేసింది. తొమ్మిదోసారి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. -
ఎవరిదో కిరీటం!
ధనాధన్ ఫార్మాట్లో విశ్వ కిరీటం కోసం మహిళల క్రికెట్ జట్లు మహా సమరానికి సిద్ధమయ్యాయి. టి20ల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఆస్ట్రేలియా... అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ను ఈసారైనా సొంతం చేసుకునేందుకు భారత్... రెండోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్... అంచనాలను తలకిందులు చేసి సంచలనం సృష్టించాలనే లక్ష్యంతో న్యూజిలాండ్... నేటి నుంచి మొదలయ్యే టి20 ప్రపంచకప్లో బరిలోకి దిగనున్నాయి. 18 రోజుల పాటు సాగనున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్కప్లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా... ఈసారి అస్త్రశ్రస్తాలతో సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత పురుషుల జట్టు ఇటీవల టి20 ప్రపంచకప్ నెగ్గగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా అలాంటి ఆటతీరుతోనే అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు! దుబాయ్: క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల టి20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్కు నేడు తెర లేవనుంది. ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా... తొలిసారి ‘విశ్వ విజేత’ హోదా దక్కించుకోవాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 8 ప్రపంచకప్లలోనూ పాల్గొన్న టీమిండియా ఒక్కసారి (2020లో) రన్నరప్గా నిలిచింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా భారత జట్టు భారీ అంచనాలతో బరిలో దిగనుంది. షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా... ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చారు. పోటీల్లో భాగంగా గురువారం తొలి రోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలి పోరులో స్కాట్లాండ్తో బంగ్లాదేశ్... రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో శ్రీలంక తలపడతాయి. శుక్రవారం న్యూజిలాండ్తో పోరుతో హర్మన్ప్రీత్ బృందం టైటిల్ వేట ప్రారంభించనుంది. ఎదురులేని ఆ్రస్టేలియా 2009లో తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిదిసార్లు ఈ టోర్నీ జరిగింది. ఆ్రస్టేలియా రికార్డు స్థాయిలో ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023లో) విజేతగా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండటం... చివరి బంతి వరకు ఓటమిని ఒప్పుకోని తత్వం ఆస్ట్రేలియా జట్టును మిగిలిన వాటికంటే భిన్నంగా నిలిపింది. ద్వైపాక్షిక సిరీస్ల్లో ఆ్రస్టేలియాపై అడపా దడపా విజయాలు సాధించిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ వంటి జట్లు... వరల్డ్ కప్లో మాత్రం ఆసీస్ ముందు నిలువలేకపోతున్నాయి. గత టోర్నీలో ఆ్రస్టేలియా జట్టుకు మెగ్లానింగ్ సారథ్యం వహించగా... తాజా టోరీ్నలో అలీసా హీలీ జట్టును నడిపించనుంది. ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్గ్రాత్, ఎలీస్ పెరీ, బెత్ మూనీ వంటి ప్లేయర్లతో ఆ్రస్టేలియా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరంతా కలిసి కట్టుగా కదం తొక్కితే ఆసీస్ మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’లో ఉంది. ఇంగ్లండ్ మెరిపించేనా? తొలి మహిళల ప్రపంచకప్లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మరోసారి చాంపియన్ కాలేకపోయింది. మరో మూడుసార్లు (2012, 2014, 2018లో) ఫైనల్కు చేరినా... ఆ్రస్టేలియా అడ్డంకిని అధిగమించ లేకపోయింది. సోఫీ ఎకెల్స్టోన్, కెప్టెన్ హీతర్ నైట్, అలీస్ కాప్సీ, అమీ జోన్స్, నటాలియా బ్రంట్, డానీ వ్యాట్తో కూడిన ఇంగ్లండ్ జట్టు తమదైన రోజున ఎంతటి మేటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలదు. బంగ్లాదేశ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్తో కలిసి ఇంగ్లండ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనుంది. ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేకపోయిన దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలని చూస్తోంది. 2009, 2010లలో రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక ఇటీవల మహిళల ఆసియాకప్లో భారత జట్టుకు షాక్ ఇచ్చి చాంపియన్గా అవతరించిన శ్రీలంక సంచలన ప్రదర్శన కొనసాగించాలని భావిస్తోంది. హర్మన్ సేన సాధించేనా? అంతర్జాతీయ క్రికెట్లో నిలకడైన విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టుకు ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలాగే ఊరిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్ల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమిండియా... మెగా టోర్నీల్లో విజేతగా నిలవలేకపోతోంది. గత ఎనిమిది టోర్నీల్లోనూ పాల్గొన్న భారత్ కేవలం ఒక్కసారి (2020లో) రన్నరప్తో సరిపెట్టుకుంది. భారత్ను పోలి ఉన్న యూఏఈలో టోర్నీ జరుగుతుండటం భారత్కు సానుకూలాంశం. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ప్రపంచకప్లలోనూ ఆడిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై అంచనాల ఒత్తిడి అధికంగా ఉంది. వైస్ కెపె్టన్ స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమష్టిగా సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ఓటమి అనంతరం ప్రత్యేక శిబిరంలో ఫీల్డింగ్, ఫిట్నెస్పై మరింత సాధన చేసిన హర్మన్ ప్రీత్ బృందం ఈ టోర్నీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి! -
టీ20 వరల్డ్కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్వైట్లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
మంచి తరుణం
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారత టాపార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. ఈసారి అందుకు తగ్గ అనుకూలతలు ఉన్నాయని...కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణమని ఆమె వెల్లడించింది. ప్లేయర్లందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న జెమీమా... మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో టీమిండియా సమతూకంగా ఉందని... ఆ్రస్టేలియా వంటి ప్రత్యర్థులపై కూడా విజయాలు సాధించగలమనే నమ్మకముందని పేర్కొంది. రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ పంచుకున్న వివరాలు ఆమె మాటల్లోనే...తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ చేజిక్కించుకోవడానికి భారత జట్టుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద ఘనత ఏదీ లేదు. వరల్డ్కప్ బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టులో ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే. జట్టుకు అవసరమైన సమయంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. నా వరకైతే టీమిండియాకు ఆడే సమయంలో సర్వశక్తుల ఒడ్డేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడమనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్కప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. ప్రత్యేకంగా ఒక బౌలర్ను లక్ష్యంగా చేసుకోలేదు. పరిస్థితులపై పైచేయి సాధించాలనుకుంటున్నా. ఎవరిని బౌలింగ్లో భారీ షాట్లు ఆడాలి... ఎలాంటి బంతులను గౌరవించాలి అనే దానిపై సాధన చేశా. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటా. సమతూకంగా జట్టు... అటు అనుభవజు్ఞలు ఇటు యంగ్ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. రిచా ఘోష్, షఫాలీ వర్మతో పాటు నాకూ గతంలో ఐసీసీ ప్రపంచకప్లు ఆడిన అనుభవం ఉంది. మేము యువ క్రీడాకారిణులమే అయినా... అవసరమైనంత అనుభవం ఉంది. ఇక జట్టులో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రూపంలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారికి ప్రపంచకప్లలో ఆడిన అపార అనుభవం ఉంది.ఆటగాళ్లంతా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాం. జట్టు సమావేశాల్లో ఎక్కువ శాతం చర్చ దీని గురించే జరుగుతుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. వార్మప్ మ్యాచ్లో రాణించడం ఆనందంగా ఉంది. ప్రధాన పోటీలకు ముందు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆటకు నేను అభిమానిని. మొదటిసారి అండర్–19 క్యాంప్లో ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో సోఫీ డివైన్ వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదింది. ఆ సందర్భాన్ని మరవలేను. ఆమె కోసం మా బౌలర్ల వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో పోటీని ఆస్వాదిస్తా... ఈ నెల 13న ఆ్రస్టేలియాతో మ్యాచ్ ఆడనున్నాం. ఆసీస్తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. మెరుగైన ప్రత్యరి్థతో తలపడ్డప్పుడు అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాన్నాళ్లుగా కంగారూ జట్టుతో మ్యాచ్లు ఆడుతున్నాం. ఈసారి మైదానంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తాం. జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఆటను బాగా అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకుంటుంది. అందుకే గొప్ప ప్లేయర్గా ఎదిగింది. అవసరమైనప్పుడు చక్కటి సలహాలు ఇస్తుంది. ఇక కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ పెద్ద మ్యాచ్ల్లో మెరుగ్గా రాణిస్తుంది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడాలో ఆమె ఆట ద్వారా నేర్చుకున్నా. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్లలోనూ హర్మన్ప్రీత్ పాల్గొంది. ఈ టోర్నీ ఆమెకు ఎంత ముఖ్యమో జట్టులో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంతో పాటు ఆమె కోసం కప్పు గెలవాలని అనుకుంటున్నాం. ఆమె ట్రోఫీ చేజిక్కించుకోవడం చూడాలని ఆశిస్తున్నా. -
మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ
దుబాయ్: యూఏఈలో త్వరలోనే జరగబోయే మహిళల టి20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించింది. కేవలం 5 యూఏఈ దిర్హామ్ (రూ. 114)లకే ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అందరు వెచి్చంచగలిగే స్థితిలో టికెట్లను అందుబాటు ధరలో ఉంచాం. ప్రారంభ టికెట్ ఐదు దిర్హామ్లకే కొనుగోలు చేయొచ్చు. అత్యధికంగా ప్రీమియం సీట్ల ధర 40 దిర్హామ్ (రూ. 910)లుగా ఉంది. ఒక వేదికపై ఒకే రోజు రెండు మ్యాచ్లుంటే ఒక టికెట్తోనే ఆ రెండు మ్యాచ్ల్ని వీక్షించవచ్చు’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ అధికారిక వెబ్సైట్తో పాటు, ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయించేందుకు దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 10 దేశాల జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 3 నుంచి యూఏఈలోని రెండు వేదిక (దుబాయ్, షార్జా)ల్లో జరుగుతుంది. -
అందరూ మహిళలే...
నారీ లోకం ప్రపంచకప్ కార్యసిద్ధికి సర్వసైన్యంతో నడుంబిగిస్తోంది. ఆ మెగా ఈవెంట్ను అంతా అతివలే చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు. టాస్ వేయడం, బ్రాడ్కాస్టర్ మైక్తో కెప్టెన్ నిర్ణయమెంటో తెలుసుకోవడం, వ్యాఖ్యతలు, ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ ఇలా ఆది అంతం అంతా మహిళలే చూసుకుంటారు. యూఏఈలో ఇంకొన్ని రోజుల్లోనే జరిగే మహిళల టి20 ప్రపంచకప్ అంతా అతివల మయం కానుంది. దుబాయ్: ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు 11+11 మంది ప్లేయర్లు సరిపోతారు. కానీ ఆటకు ముందు, ఆట నిర్వహణ, ఆట తర్వాత ‘ప్రత్యక్ష ప్రసారాని’కి కంటబడని పనెంతో ఉంటుంది. దీన్ని పదులు, వందల సంఖ్యలో సిబ్బంది కంటికి రెప్పలా కనిపెట్టుకొని మరీ పనిచేస్తారు. టాస్ ప్రతినిధి, పిచ్ వద్ద బ్రాడ్కాస్టర్ తొలి వ్యాఖ్యానం, టీవీ వ్యాఖ్యాతల వాక్చాతుర్యం, అంపైర్లు బంతిని పట్టుకొని మైదానంలోకి దిగడం. తర్వాత ఫీల్డింగ్ జట్టు గుండ్రంగా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని చేసే ప్రతిజ్ఞ... అనంతరం మెల్లిగా ఓపెనర్ల ఆగమనం, సెకన్ల కౌంట్డౌన్తో మ్యాచ్ షురూ! మధ్యలో విరామం... గ్రౌండ్సిబ్బంది పిచ్ను చదును చేయడం, ఆకస్మికంగా వర్షం పడితే కవర్లు పట్టుకొని పదుల సంఖ్యలో మైదానాన్ని కవర్ చేయడం, మ్యాచ్ రిఫరీ పర్యవేక్షణ ఇలా ఓ పెద్ద బృందమే మ్యాచ్ను మనముందుకు తెస్తుంది. క్రికెట్ అంటే ఫోర్, సిక్సర్, అవుట్, డకౌట్, ఎల్బీడబ్ల్యూ మాత్రమే కాదు... అంతకుమించిన శ్రమ, ప్రణాళికాబద్ధమైన నిర్వహణ ఉంటాయి. ఇదివరకే గత టి20 ప్రపంచకప్ బాధ్యతల్ని మహిళల బృందమే నిర్వహించడంతో ఇకపై కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. మొత్తం మీద ఐసీసీ అతివలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... గురుతర బాధ్యతలను కూడా పెట్టింది. తద్వారా ప్రపంచానికి ప్రపంచకప్తో నారీశక్తిని చాటే అవకాశమిచ్చింది. అంపైర్ల జాబితాలో వృందా రాఠి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యూఏఈలో జరిగే మెగా ఈవెంట్ కోసం 13 మంది సభ్యులు గల అధికారిణిల బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురు మ్యాచ్ రిఫరీలుండగా, 10 మంది అంపైర్లున్నారు. భారత్లో జరిగే మ్యాచ్లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవమున్న ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ రిఫరీ మెగా ఈవెంట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురు రిఫరీల్లో చోటు దక్కడం గొప్ప విశేషం. ఈ బృందంలో జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా) ఇతర సభ్యులుగా ఉన్నారు. మరో భారత అధికారిణి వృందా రాఠికి పదిమంది సభ్యులు గల ఐసీసీ ఎమిరేట్స్ అంపైర్ల బృందంలో స్థానం లభించింది. ముక్కోణపు, ద్వైపాక్షిక సిరీస్లో మ్యాచ్ అధికారులు చూపిన నైపుణ్యం, కనబరిచిన ప్రదర్శన ఆధారంగా అర్హతగల అధికారులనే ప్రపంచకప్ నిర్వహణ బృందానికి ఎంపిక చేశాం. వాళ్లంతా తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నాను’ అని ఐసీసీ సీనియర్ మేనేజర్ (అంపైర్లు–రిఫరీలు) సియాన్ ఈసే తెలిపారు.మొత్తం పది జట్లు పోటీపడే ఈ మెగా టోరీ్నలో 23 మ్యాచ్లు నిర్వహిస్తారు. అక్టోబర్ 3న బంగ్లాదేశ్, స్కాట్లాండ్ల మధ్య షార్జాలో జరిగే పోరుతో టోర్నీ షురూ అవుతుంది.ప్ర«దాన టోర్నీకి ముందు ప్రతీ జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ నెల 28 నుంచి సన్నాహక మ్యాచ్లు జరుగుతాయి. అంపైర్ల బృందం: లౌరెన్ అగెన్బ్యాగ్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), సారా దంబయెవానా (జింబాబ్వే), అనా హారిస్ (ఇంగ్లండ్), నిమాలి పెరీరా (శ్రీలంక), క్లెయిర్ పొలోసాక్ (ఆ్రస్టేలియా), వృందా రాఠి (భారత్), స్యు రెడ్ఫెర్న్ (ఇంగ్లండ్), ఎలోయిస్ షెరిడాన్ (ఆ్రస్టేలియా), జాక్వెలిన్ విలియమ్స్ (వెస్టిండీస్). మ్యాచ్ రిఫరీలు: జీఎస్ లక్ష్మి (భారత్), జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా). -
పురుషులతో సమానంగా ప్రైజ్మనీ
దుబాయ్: వచ్చే నెలలో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ విజేతకు భారీ ప్రైజ్మనీ దక్కనుంది. పురుషుల వరల్డ్కప్ విజేతతో సమానంగా... మహిళల ప్రపంచకప్ చాంపియన్కు నగదు బహుమతి ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. దీంతో మహిళల టి20 వరల్డ్ కప్ విజేతకు రూ. 19.60 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. గత ప్రపంచకప్ నగదు బహుమతితో పోల్చుకుంటే... ఇది 134 శాతం ఎక్కువ కావడం విశేషం. 2023లో నిర్వహించిన మహిళల టి20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ రూ. 20.52 కోట్లు (2.45 మిలియన్ అమెరికన్ డాలర్లు) కాగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 66.67 కోట్ల(7,958,080 అమెరికన్ డాలర్లు)కు పెంచారు. దీంతో రానున్న మెగాటోర్నీలో రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. సెమీఫైనల్స్లో ఓడిన రెండు జట్లకు కూడా భారీగా నగదు బహుమతి అందుకోనున్నాయి. ‘వచ్చే నెల జరగనున్న టి20 ప్రపంచకప్ నుంచి మహిళలకూ పురుషులతో సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇది క్రీడా చరిత్రలోనే సరికొత్త నిర్ణయం’అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదే జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.20 కోట్ల నగదు బహుమతి లభించింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. -
పాక్లో ఐసీసీ బృందం పర్యటన: భారత్ మ్యాచ్లు అక్కడేనా?
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి బృందం పాకిస్తాన్లో పర్యటించేందుకు మంగళవారం కరాచీ చేరుకుంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులు గల ఐసీసీ బృందం ఆతిథ్య వేదికల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, కల్పించే సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించనుంది. ఐసీసీ ఈవెంట్ల భద్రతాధికారి, జనరల్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఈ బృందంలో ఉన్నారు. ఈ ఏడాది పిచ్ కన్సల్టెంట్ అండీ అట్కిన్సన్ పాక్లో పర్యటించడం ఇది మూడోసారి. ఈ బృందం ముందుగా కరాచీలో ఉన్న స్టేడియం, ఆటగాళ్లు బస చేసే హోటల్స్ను పరిశీలిస్తుంది. అనంతరం ఇస్లామాబాద్, లాహోర్లకు పయనమవుతుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ లాహోర్లో ఉండటంతో బృందం ప్రత్యేక దృష్టిపెట్టనుంది. ఈ బృందం నివేదిక ఆధారంగా లోటుపాట్లపై చర్చించిన తర్వాత వేదికల మార్పులు చేర్పులు, టోర్నమెంట్ తుది షెడ్యూలు ఖరారు చేస్తారు. -
ఐసీసీ చారిత్రత్మక నిర్ణయం.. రూ.66 కోట్ల ప్రైజ్మనీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్మనీని ఐసీసీ అందజేయనుంది. వచ్చే నెల యూఏఈ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024తో ఈ నిర్ణయాన్ని ఐసీసీ అమలు చేయనుంది. దీంతో టోర్నమెంట్ మొత్తం ప్రైజ్మనీ 7.958 మిలియన్ డాలర్లకు ( భారత కరెన్సీలో రూ.66 కోట్లు). గత టోర్నీలతో పోలిస్తే ఇది 225 శాతం అధికం కావడం విశేషం. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు రూ.19 కోట్ల ప్రైజ్మనీ లభించనుంది. అదేవిధంగా రన్నరప్గా నిలిచిన జట్టు రూ.9 కోట్ల నగదు బహుమతి దక్కించుకోనుంది."ఐసీసీ టోర్నీల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వనున్నాం. మహిళల టీ20 ప్రపంచకప్-2024లో ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని అమలు చేయనున్నాం. క్రీడా చరిత్రలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేసేందుకు మరో అడుగు ముందుకు వేశాము. సమాన ప్రైజ్మనీ అందిస్తున్న క్రీడగా క్రికెట్ నిలిచిందని" ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. -
‘ఒకవేళ టీమిండియా మా దేశానికి రాకపోతే.. అంతే ఇక’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్కు పంపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయాలనైనా కనీసం గౌరవించాలని హితవు పలికాడు.తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి!వన్డే ఫార్మాట్ మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టీమిండియాను అక్కడకు పంపించే పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచ్లకు తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.లాహోర్లోనే రోహిత్ సేన మ్యాచ్లన్నీ!అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం టీమిండియాకు సైతం తమ దేశంలోనే ఆతిథ్యం ఇస్తామని.. టోర్నీ నిర్వహణలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఐసీసీకి చెప్పినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అంతేకాదు.. లాహోర్లోనే రోహిత్ సేన మ్యాచ్లన్నీ నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం టోర్నీ వేదికను మార్చే ఉద్దేశం లేదని చెప్పడం గమనార్హం.ఇకపై పాకిస్తాన్ కూడా అదే పద్ధతిలోఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ ఐసీసీ ఆదేశాలను తప్పక గౌరవించాలి. ఒకవేళ వాళ్లు అలా చేయనట్లయితే.. ఇకపై పాకిస్తాన్ కూడా అదే పద్ధతి అనుసరిస్తుంది.భవిష్యత్తులో ఇండియాలో జరుగబోయే ఈవెంట్లలో పాల్గొనదు. నిజానికి టీమిండియా క్రికెట్ దిగ్గజాలు బీసీసీఐకి సలహాలు ఇవ్వాలి. ఆటను, రాజకీయాలను వేరుగా చూడమని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఆశపడుతున్నారు. అది కేవలం పాకిస్తాన్కు మాత్రమే కాదు.. ఆటకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి టీమిండియా ఇక్కడికి వస్తేనే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీని నిర్వహించేందుకు వివిధ స్టేడియాల్లో పీసీబీ చేపట్టిన మరమ్మత్తు పనులు ఇంకా పూర్తికానేలేదు.చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్ -
వన్డే ప్రపంచకప్తో భారత్కు రూ.11, 637 కోట్ల ఆదాయం..
దుబాయ్: గతేడాది నిర్వహించిన వన్డే ప్రపంచకప్ భారత దేశానికి గణనీయమైన ఆర్ధిక లబ్ధిని చేకూర్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్ ఆర్థికంగా పెద్ద ప్రభావమే చూపిందని, విదేశీ పర్యాటకులతో భారత్లోని ఆతిథ్య రంగం పెద్ద ఎత్తున లాభపడిందని అందులో వివరించింది.గత అక్టోబర్, నవంబర్లో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ రన్నరప్గా నిలిచింది. ‘ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ క్రికెట్కు ఉన్న ఆర్ధిక శక్తి ఎలాంటిదో నిరూపించింది. ఆతిథ్య భారత్ 1.39 బిలియన్ అమెరికా డాలర్ల (రూ.11, 637 కోట్లు) ఆదాయం ఆర్జించేలా చేసింది.ఈ వరల్డ్కప్ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత్కు పోటెత్తారు. ఇలా పర్యాటకుల రాకతో ఆతిథ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్, భోజనం, వసతి, రవాణ, ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది’ అని ఐసీసీ ఆ నివేదికలో పేర్కొంది. టోర్నీ జరిగింత కాలం కొనుగోలు శక్తి పెరిగిందని, టికెట్ల రూపంలోనూ భారీ ఆదాయం వచి్చందని, ఏకంగా 12.50 లక్షల మంది ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్ల్ని చూసేందుకు ఎగబడ్డారని అందులో తెలిపింది.ఐసీసీ ప్రపంచకప్ల చరిత్రలోనే ఇది ఘననీయమైన వృద్ధని, సగటున 75 శాతం ప్రేక్షకుల హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. పర్యాటకులు, దేశీ ప్రేక్షకులకు సేవలందించడం ద్వారా 48 వేల మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాధి పొందారని ఐసీసీ వివరించింది.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్ -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. తొలి ఎడిషన్ అయిన 2021లో సౌథాంప్టన్, రెండో ఎడిషన్ అయిన 2023లో ఓవర్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో టీమిండియా ఫైనల్స్కు చేరుకోగా.. తొలి ఎడిషన్లో న్యూజిలాండ్ చేతిలో, రెండో ఎడిషన్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా అతి సమీపంలో రెండో స్థానంలో ఉంది. అన్నీ ఊహించినట్లుగా జరిగితే ఈ ఎడిషన్ ఫైనల్లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడే అవకాశం ఉంది. -
'మా దేశానికి టీమిండియా రావద్దు'.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఎట్టిపరిస్ధితులలోనూ తమ జట్టును పాక్కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్పగా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.మా దేశానికి రావద్దు..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు."పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు. నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే గౌరవం, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి. టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ఈవెంట్కు లాహోర్లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది. -
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్: టాప్–10లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ను విడుదల చేశారు. టాప్–10లో భారత్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 751 రేటింగ్ పాయింట్లతో ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 740 రేటింగ్ పాయింట్లతో ఏడో ర్యాంక్లో నిలిచాడు. విరాట్ కోహ్లి రెండు స్థానాలు పురోగతి సాధించి 737 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్లో ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 881 పాయింట్లతో తన ‘టాప్ ర్యాంక్’ను నిలబెట్టుకోగా... విలియమ్సన్ (న్యూజిలాండ్; 859 పాయింట్లు) రెండో ర్యాంక్లో, మిచెల్ (న్యూజిలాండ్; 768 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్ను అందుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఆరు స్థానాలు పడిపోయి తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ అశి్వన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 847 పాయింట్లతో హాజల్వుడ్ (ఆ్రస్టేలియా), బుమ్రా (భారత్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
ఐసీసీ పీఠంపై జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఎకగ్రీవమైంది. 35 ఏళ్లకే అత్యున్నత పదవీ బాధ్యతలు దక్కించుకున్న జై షా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్గా కొనసాగుతారు. భారత్ నుంచి ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఐసీసీ సభ్యదేశాలతో కలిసి క్రికెట్కు మరింత విస్తరించడానికి కృషి చేస్తా’అని జై షా పేర్కొన్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాను పలువరు అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్లు రాహుల్ ద్రవిడ్, కుంబ్లే, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా శుభాకాంక్షలు తెలిపారు. ముందున్న సవాళ్లు!ఈ ఏడాది చివర్లో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న జై షా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు రేకెత్తుతుండగా... ఈ అంశంలో జై షా ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది కీలకంగా మారింది. జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్లో జరగాల్సిన ఆసియా కప్ను హైబ్రిడ్ పద్ధతిలో పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు. టీమిండియా ఆడాల్సిన మ్యాచ్లను శ్రీలంకలో జరిగే విధంగా షెడ్యూల్లో మార్పులు చేశారు. మరి ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ భాగం కావడంతో దానికి తగినంత ప్రచారం నిర్వహించడం... రోజు రోజుకు ప్రభ తగ్గుతున్న టెస్టు క్రికెట్కు పూర్వ వైభవం తేవడం... టి20ల ప్రభావంతో ప్రాధాన్యత కోల్పోతున్న వన్డేలను మరింత రసవత్తరంగా మార్చడం ఇలా పలు సవాళ్లు జై షాకు స్వాగతం పలుకుతున్నాయి. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు ఆల్రౌండర్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్లో భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనున్న మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయంతో రన్నరప్తో సరిపెట్టుకున్న భారత జట్టు నుంచి ఉమా ఛెత్రీ తప్ప మిగిలిన ప్లేయర్లందరూ టి20 ప్రపంచకప్నకు ఎంపికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఆసియా కప్ సందర్భంగా వేలికి గాయమైన స్పిన్నర్ శ్రేయాంక పాటిల్తో పాటు మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ యస్తిక భాటియాను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరిద్దరూ ఫిట్నెస్ సాధిస్తేనే యూఏఈకి వెళ్లనున్నారు. టాపార్డర్లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానుండగా... హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. దీప్తి శర్మ, ఆశ శోభన, రాధ యాదవ్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండగా... రేణుక సింగ్, అరుంధతి రెడ్డి పేస్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా పూజ వస్త్రకర్ జట్టులో చోటు దక్కించుకుంది. ‘ఇది సమతూకమైన జట్టు. యస్తిక, శ్రేయాంక గాయాల నుంచి కోలుకొని టోర్నీ ఆరంభానికి సిద్ధమవుతారు’ అని భారత మాజీ కెపె్టన్ డయానా ఎడుల్జీ పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసీస్ అడ్డంకిని అధిగమిస్తేనే! ఐసీసీ టోరీ్నల్లో టైటిల్ నెగ్గలేకపోతున్న భారత జట్టు ఈసారైనా అడ్డంకులు అధిగమించి ముందడుగు వేయాలని భావిస్తోంది. 2020 టోర్నీ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్...తుది పోరులో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తే... అందులో ఆరుసార్లు ఆస్ట్రేలియానే జట్టు విజేతగా నిలిచిందంటే ఆ జట్టు ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి హర్మన్ బృందం చాంపియన్గా నిలవాలంటే ముందుగా లీగ్ దశలో ఆసీస్ను ఓడించాలి. తుది పోరులోనూ ఆ జట్టుపై పైచేయి సాధించాలి. భారత టి 20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక , పూజ , అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక, సజన. ట్రావెలింగ్ రిజర్వ్లు: ఉమా ఛెత్రీ, తనూజ కన్వర్, సైమా ఠాకూర్. -
BCCI: బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడే!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కాబోయే చైర్మన్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే ఈ పదవిని చేపడితే.. బీసీసీఐ సెక్రటరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.తెర మీదకు కొత్త పేరుఇప్పటికే జై షా వారసులుగా ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్లలో ఒకరు జై షా స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రేసులో తాజాగా మరో పేరు తెర మీదకు వచ్చింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పోటీలో ఉన్నట్లు వార్తా సంస్థ దైనిక్ భాస్కర్ వెల్లడించింది. రోహన్ జైట్లీ మరెవరో కాదు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు. రోహన్ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని.. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అతడిని చూడబోతున్నామంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.జై షా ఎన్నిక ఏకగ్రీవమే?మరోవైపు.. ఐసీసీ చైర్మన్గా జై షా ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది. ఐసీసీలోని మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం. ఇక కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కాబట్టి.. కొత్తగా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా జై షా ఇంకో మూడు నెలల పాటు బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగే అవకాశం ఉంది. అప్పటిలోగా అతడి వారసుడి ఎంపిక పూర్తి చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
ఇంద్రా నూయి స్థానంలో ఎవరు?
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తోంది. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న పెప్సికో హెడ్ ఇంద్రా నూయి పదవీ కాలం గత నెలాఖరుతో ముగియగా... ఆమె స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటతో పాటు వ్యాపార రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే కూడా త్వరలోనే పదవీ విరమణ చెందనున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో సమానత్వం, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయగల ఆసక్తి ఉన్న వారిని డైరెక్టర్గా ఎంపిక చేయనున్నాం. కొత్తగా ఎంపికైన మహిళా డైరెక్టర్కు చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే అధికారం ఉంటుంది.ఆటకు మరింత ప్రోత్సాహం అందిచగల వారి కోసం చూస్తున్నాం’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్గా ఎన్నికైన ఇంద్రా నూయి... ఆరేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వర్తించారు. -
ఆ రెండు పిచ్లు అసంతృప్తికరం..!
దుబాయ్: టి20 ప్రపంచకప్లో అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య వెస్టిండీస్లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన టరోబా పిచ్ సంతృప్తికరంగా లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. మెగా టోర్నీ ముగిసిన రెండు నెలల తర్వాత పిచ్లపై ఐసీసీ మంగళవారం నివేదిక విడుదల చేసింది. టరోబా పిచ్తో పాటు.. అమెరికాలో నిర్వహించిన ప్రపంచకప్ తొలి రెండు మ్యాచ్లకు వేదికగా ఉన్న న్యూయార్క్ పిచ్లు కూడా బాగాలేవని ఐసీసీ వెల్లడించింది. తాత్కాలికంగా నిర్మించిన స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్తో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 96 పరుగులకు పరిమితమైంది. అస్థిర బౌన్స్తో ఆ పిచ్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయని అప్పుడే వ్యాఖ్యతలు పేర్కొనగా... తాజాగా ఆ రెండింటిని ఐసీసీ ‘అసంతృప్తికరం’ జాబితాలో చేర్చింది.ఐర్లాండ్, భారత్ మ్యాచ్లో అయితే అనూహ్య బౌన్స్ కారణంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాల బారిన పడ్డారు. అనంతరం బుమ్రా బౌలింగ్లో ఐర్లాండ్ బ్యాటర్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో టి20 ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డ్రాప్–ఇన్ పిచ్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్కు ఐసీసీ మంచి రేటింగ్ ఇచ్చింది. సాధారణంగా పిచ్ల ప్రమాణాలను బట్టి ఐసీసీ ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘సంతృప్తికరం’, ‘అసంతృప్తికరం’, ‘అన్ఫిట్’ రేటింగ్స్ ఇస్తుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్నకు ఆతిథ్యమివ్వగా.. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గి భారత్ చాంపియన్గా నిలిచింది. -
BCCI: ప్రపంచకప్ నిర్వహణకు ‘నో’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ తిరస్కరించింది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, హింసాయుత వాతావరణం వల్ల వేదిక మార్పు అనివార్యమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇచి్చన ఆఫర్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నో చెప్పింది. వచ్చే ఏడాది భారత్లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. దీంతో పాటు ఈ అక్టోబర్ నెల వరకు వర్షాకాలం తీవ్ర స్థాయిలో ఉంటుంది. వరుస వరల్డ్కప్లతో పాటు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ‘మహిళల మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమివ్వాల్సిందిగా ఐసీసీ మమ్మల్ని కోరింది. అయితే ఇది సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పాం’ అని జై షా చెప్పారు. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సిన మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ వేదికలపై దృష్టిసారించింది. శ్రీలంక లేదంటే యూఏఈలలో ఒక వేదికను ఈ నెల 20వ తేదీకల్లా ఖరారు చేసే అవకాశముంది. బంగ్లాలో కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ అమ్మాయిల ప్రపంచకప్ను సురక్షితంగా నిర్వహించడం ఐసీసీకి క్లిష్టతరం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎప్పటికప్పుడు బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి తాజా పరిస్థితులపై రోజూ సమీక్ష చేస్తోంది. బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు త్వరలో భారత్లో పర్యటించాల్సి ఉంది. బంగ్లా ప్రస్తుతం పాకిస్తాన్ టూర్లో ఉంది. అక్కడ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఈ నెల 21న మొదలవుతుంది. అనంతరం వచ్చే నెల భారత పర్యటనలో రెండు టెస్టులతో పాటు మూడు మ్యాచ్ల టి20ల సిరీస్లో బంగ్లాదేశ్ పాల్గొంటుంది. -
టీ20 వరల్డ్కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా?
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు చేరుకున్నారు. ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్లో జరగనున్న మహిళల టీ20 వరల్డ్కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నమెంట్ను ప్రత్యామ్నాయ వేదికపై నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. భారత్, శ్రీలంక, యూఏఈలను బ్యాకప్ ఆప్షన్స్గా ఐసీసీ ఉంచినట్లు సమాచారం."బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆ దేశ భద్రతా ఏజెన్సీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. అక్కడ పరిస్థితిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆటగాళ్లే భద్రత మా ప్రాధన్యత. అందుకోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్దం. ఈ మెగా టోర్నీ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని" ఐసీసీ అధికారి ప్రతినిథి ఒకరు పేర్కొన్నారు. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ఆక్టోబర్ 20 వరకు జరగనుంది. -
జైలులో క్రికెట్.. ఐసీసీ అవార్డు
క్రికెట్ వ్యాప్తికి చొరవ చూపడంతో పాటు గతేడాది (2023) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ "డెవలెప్మెంట్ అవార్డులతో" సత్కరించింది. ఈ అవార్డులను వివిధ విభాగాల్లో మెక్సికో, ఒమన్, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్, స్కాట్లాండ్ దేశాలు గెలుచుకున్నాయి. ఈ అవార్డుల కోసం మొత్తం 21 జట్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఐసీసీ ప్యానెల్ పైన పేర్కొన్న జట్లను ఎంపిక చేసింది.వంద శాతం మహిళల క్రికెట్ను ప్రోత్సహించినందుకు గాను ఒమన్..పురుషుల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పాటు వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించినందుకు గాను నెదర్లాండ్స్..మహిళల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను యూఏఈ..డిజిటల్ మీడియాలో అభిమానులను ఎంగేజ్ చేయడంలో సఫలీకృతమైనందుకు గాను నేపాల్..క్రికెట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను స్కాట్లాండ్..జైలులో ఖైదీల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించినందుకు గాను మెక్సికో దేశాలు ఐసీసీ డెవలప్మెంట్ అవార్డులకు ఎంపికయ్యాయి. -
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటే..? ఆ జట్టుకు లక్కీ ఛాన్స్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమవుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత తమ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విదాల సన్నదమవుతోంది.భద్రతా కారణాల దృష్టా 1996 వన్డే వరల్డ్కప్ తర్వాత పాకిస్తాన్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యమివ్వలేదు. ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్ను కూడా ఐసీసీకి సమర్పించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ ఐసీసీ పరిశీలనలో ఉంది. అయితే ఈ టోర్నీలో భారత పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు తెలియజేసినట్లు సమాచారం.గత ఆసియాకప్ మాదరిగానే హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడాల్సిన మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసీసీని కోరినట్లు వినికిడి.టోర్నీ నుంచి భారత్ వైదొలిగితే..?ఒకవేళ భారత్ చేసిన ఈ ప్రతిపాదనని అంగీకరించకుండా, పాక్లోనే అన్ని మ్యాచ్లను నిర్వహించాలని పీసీబీ పట్టుబడితే ఏంటి పరిస్థితి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హైబ్రిడ్ మోడల్లో కాకుండా పాక్లోనే టోర్నీ మొత్తాన్ని నిర్వహించాలన్న పీసీబీ డిమాండ్ను ఐసీసీ అంగీకరిస్తే.. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాక్కు వెళ్లడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ నుంచి భారత్ వైదొలిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా తప్పుకుంటే శ్రీలంక అర్హత సాధిస్తోంది.భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించగా.. 9వ స్థానంలో నిలిచిన శ్రీలంకకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే భారత్ తప్పుకుంటే శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. -
పాకిస్తాన్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ డిమాండ్ ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్ను ఐసీసీ సమర్పించింది. అయితే ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతడేది ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. పాక్ బదులుగా భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఆసియాకప్-2023 కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇతర దేశాలు పాకిస్తాన్కు వెళ్లి ఆడగా.. భారత్ మాత్రం తమ మ్యాచ్లు అన్నింటిని శ్రీలంకలో ఆడింది."ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లే సూచనలు కన్పించడం లేదు. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ భారత్.. పాక్కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరగనుంది. ఆసియా కప్ మాదిరిగానే భారత్ తమ మ్యాచ్లను యూఏఈ లేదా శ్రీలంకలో ఆడే అవకాశముంది. ఐసీసీ కూడా ప్రస్తుతం ఇదే విషయంపై దృష్టి పెట్టింది. అయితే, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి" అంటూ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2008 అనంతరం పాకిస్థాన్ పర్యటనకు భారత్ ఇప్పటివరకు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా భారత జట్టును పాక్కు బీసీసీఐ పంపడం లేదు. ఇరు జట్ల మధ్య ద్వైఫాక్షిక సిరీస్లు కూడా జరగడం లేదు. -
T20 World Cup 2024: విరాట్ కోహ్లినా మజాకా.. ఆల్టైమ్ రికార్డు
సోషల్మీడియాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కింగ్ సోషల్మీడియాలోని ఏ ప్లాట్ఫాంలో పోస్ట్ పెట్టినా కోట్లల్లో వ్యూస్, లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్కు సంబంధించిన పోస్ట్ ఒకటి ఆల్టైమ్ రికార్డును సెట్ చేసింది.టీమిండియా టీ20 వరల్డ్కప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ సహచరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇన్స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్గా రికార్డు సృష్టించింది. Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024ఈ వీడియోను ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించారు. 9.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఐసీసీ ఇన్స్టా చరిత్రలో ఇది అత్యధిక జనాధరణ పొందిన పోస్ట్గా రికార్డైంది. ఇన్స్టాలో 20 మిలియన్ లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్గా, సెకెండ్ ఏషియన్గా, ప్రపంచంలో ఐదో అథ్లెట్గా విరాట్ రికార్డులు నెలకొల్పాడు.ఐసీసీ ఇన్స్టా వీడియోకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వీడియోలో కోహ్లి ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహింది పాడిన ఆల్టైమ్ హిట్ సాంగ్ "తునుక్ తునుక్ తన్"కు డ్యాన్స్ చేశాడు. కోహ్లికి జతగా అర్ష్దీప్, సిరాజ్, అక్షర్ పటేల్, బుమ్రా, రింకూ సింగ్ చిందులేశారు.VIRAT KOHLI'S INSTAGRAM POST ON T20 WORLD CUP VICTORY NOW HAS 20 MILLION LIKES...!!!! 🇮🇳- King Kohli becomes the first Asian to have 20 Million likes on a Instagram post in the History. 🐐🙌 pic.twitter.com/noofdlRQfP— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్కప్ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. విరాట్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్కప్ విజయానంతరం విరాట్.. సహచరులు రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. కోహ్లి, రోహిత్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
భారత్, శ్రీలంకల వేదికగా టీ20 వరల్డ్కప్ 2026..
దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉరుత్రూలూగించిన టీ20 వరల్డ్కప్-2024 ఘనంగా ముగిసింది. జూన్ 29న బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడింది.తుది పోరులో విజయం సాధించిన భారత్.. ఈ ఏడాది పొట్టి వరల్డ్కప్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈ వరల్డ్కప్ విజయంతో 13 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక వరల్డ్కప్ ముగిసి వారం రోజుల తిరగకుముందే టీ20 వరల్డ్కప్-2026కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. టీ20 వరల్డ్కప్-2026 భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక వచ్చే పొట్టి వరల్డ్కప్కు 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక, రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికాలు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. సూపర్-8కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్నకు క్వాలిఫై అయ్యాయి. అదే విధంగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐసీసీ టీ20 ర్యాంక్స్ ఆధారంగా మరో మూడుజట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్తాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) వచ్చే టీ20 ప్రపంచకప్లో ఆడనున్నాయి. మిగితా 8 జట్లు క్వాలిఫియర్స్ ఆడి అర్హత సాధించనున్నాయి. -
‘సీనియర్లు కొనసాగుతారు’
బ్రిడ్జ్టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్కు పూర్తి స్థాయి కెపె్టన్గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు. టీమిండియా మరింత ఆలస్యంగా...బ్రిడ్జ్టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు. -
ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2024 జట్టు ప్రకటన.. విరాట్కు నో ప్లేస్
ఐసీసీ తమ టీ20 వరల్డ్కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. భారత స్టార్ ఆటగాడు, ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి వరల్డ్కప్ లీడింగ్ రన్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్, వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు. వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలు ముగిసాక ఐసీసీ జట్టును ప్రకటించడం ఆనవాయితీ.వరల్డ్కప్ 2024లో ఐసీసీ జట్టు సభ్యుల ప్రదర్శన..రోహిత్ శర్మ- 257 పరుగులు, సగటు 36.71, స్ట్రయిక్రేట్ 156.7, అర్దసెంచరీలు 3రహ్మానుల్లా గుర్బాజ్- 281 పరుగులు, సగటు 35.12, స్ట్రయిక్రేట్ 124.33, అర్దసెంచరీలు 3పూరన్- 228 పరుగులు, సగటు 38.0, స్ట్రయిక్రేట్ 146.15, అర్దసెంచరీలు 1సూర్యకుమార్ యాదవ్- 199 పరుగులు, సగటు 28.42, స్ట్రయిక్రేట్ 135.37, అర్దసెంచరీలు 2స్టోయినిస్- 169 పరుగులు, స్ట్రయిక్రేట్ 164.07, వికెట్లు 10, ఎకానమీ 8.88హార్దిక్ పాండ్యా- 144 పరుగులు, స్ట్రయిక్రేట్ 151.57, వికెట్లు 11, ఎకానమీ 7.64అక్షర్ పటేల్- 92 పరుగులు, స్ట్రయిక్రేట్ 139.39, వికెట్లు 9, ఎకానమీ 7.86రషీద్ ఖాన్- 14 వికెట్లు, సగటు 12.78, ఎకానమీ 6.17, అత్యుత్తమ ప్రదర్శన 4/17బుమ్రా- 15 వికెట్లు, సగటు 8.26, ఎకానమీ 4.17, అత్యుత్తమ ప్రదర్శన 3/7అర్ష్దీప్ సింగ్- 17 వికెట్లు, సగటు 12.64, ఎకానమీ 7.16, అత్యుత్తమ ప్రదర్శన 4/9ఫజల్హక్ ఫారూఖీ- 17 వికెట్లు, సగటు 9.41, ఎకానమీ 6.31, అత్యుత్తమ ప్రదర్శన 5/912 ఆటగాడు అన్రిచ్ నోర్జే- 15 వికెట్లు, సగటు 13.4, ఎకానమీ 5.74, అత్యుత్తమ ప్రదర్శన 4/7 -
అఫ్గాన్ ఆల్రౌండర్ చీటింగ్.. ఐసీసీ సీరియస్!? రూల్స్ ఇవే
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్ సినిమా థ్రిల్లర్ను తలిపించిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో 8 పరుగులతో తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తొలి సారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఆఫ్గాన్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైంది.అసలేం ఏం జరిగిందంటే?ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే బౌలింగ్లో మాత్రం అఫ్గానిస్తాన్ సత్తాచాటింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వర్షం మొదలయ్యే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలవనుంది.అయితే వర్షం మొదలైనప్పటికి అంపైర్లు మాత్రం ఆ ఓవర్ను ఫినిష్ చేయాలని భావించారు. ఈ క్రమంలో అపట్టికే నాలుగు బంతులు వేసిన నూర్ ఆహ్మద్ను అంపైర్లు ఓవర్ పూర్తి చేయమని ఆదేశించారు.అయితే రెండు బంతలు మిగిలుండడంతో బంగ్లా బ్యాటర్ బౌండరీ బాదితే.. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజవేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్కోచ్ ట్రాట్ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు కన్పించాడు. సరిగ్గా ఆ సమయంలో ఊపందుకోవడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశాడు. ఫిజియో వచ్చి నైబ్ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్లు చేస్తున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?కాగా నైబ్ వ్యవహరాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియస్గా తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా సమయం వృదా చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్లకు ఉంటుంది. కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్లో అంపైర్లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. -
‘డక్వర్త్’ కన్నుమూత
న్యూఢిల్లీ: క్రికెట్లో వానొచ్చినపుడుల్లా వినిపించే డక్వర్త్ లూయిస్ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ కన్నుమూశారు. అయితే ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలువడింది. 84 ఏళ్ల డక్వర్త్ ఈ నెల 21నే వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. కానీ ఓ వెబ్సైట్ ద్వారా మంగళవారం ఆ వార్త వెలుగులోకి వచ్చి0ది. ఇక డీఎల్ విషయానికొస్తే డక్వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి ఆవిష్కరించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి 1997లో అమలు చేసింది. తదనంతరం ఆ్రస్టేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్... డీఎల్కు కొన్ని మార్పుచేర్పులు చేశారు. అప్పటి నుంచి డీఎల్ కాస్త డక్వర్త్–లూయిస్–స్టెర్న్ (డీఎల్ఎస్)గా స్థిరపడింది. క్రికెట్లో వాన ముంచెత్తితే మ్యాచ్ రద్దవుతుంది. వాన పడి ఆగిపోయాక నిర్వహిస్తే, లేదంటే అప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఫలితాన్ని తేల్చాలంటే, లక్ష్యాన్ని సవరించాలంటే డీఎల్ఎస్నే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. -
T20 WC: ఓవరాక్షన్.. బంగ్లాదేశ్ పేసర్కు ఐసీసీ షాక్
బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్కు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి అతడికి గట్టి షాకిచ్చింది.నేపాల్తో మ్యాచ్ సందర్భంగా అతి చేసినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం చేయవద్దని హెచ్చరించింది.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ నేపాల్తో తలపడింది. కింగ్స్టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో నేపాల్ను 21 పరుగుల తేడాతో ఓడించింది.సకీబ్ అద్భుత బౌలింగ్తద్వారా గ్రూప్-డి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది బంగ్లాదేశ్. ఇక కీలక మ్యాచ్లో బంగ్లా గెలుపొందడంలో రైటార్మ్ పేసర్ తంజీమ్ హసన్ సకీబ్(Tanzim Hasan Sakib)కి ప్రధాన పాత్ర. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులిచ్చి.. 4 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.అయితే, ఆట పరంగా ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నా.. నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్తో అనుచితంగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు ఈ 21 ఏళ్ల ఫాస్ట్బౌలర్. రోహిత్ను వెనక్కి నెట్టేశాడునేపాల్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బౌలింగ్ చేస్తున్న తంజీమ్ రోహిత్ పౌడేల్ డిఫెన్స్ షాట్లు ఆడుతుండటంతో సహనం కోల్పోయి అతడి పైకి దూసుకెళ్లాడు.కోపంలో రోహిత్ను వెనక్కి నెట్టేశాడు తంజీమ్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక తంజీమ్ దురుసు ప్రవర్తన పట్ల స్పందించిన ఐసీసీ క్రమశిక్షణ చర్యలకు దిగింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఐసీసీ నిబంధనలోని ఆర్టికల్ 2.12 ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నపుడు సహచర ఆటగాడు, లేదంటే సహాయక సిబ్బంది, అంపైర్, మ్యాచ్ రిఫరీ, ప్రేక్షకులు.. ఇలా ఎవరిపట్లనైనా అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు.తప్పు చేశాడు ఇక రోహిత్ విషయంలో తంజీమ్ సకీబ్ తప్పు చేసినట్లు ఆన్ ఫీల్డ్ అంపైర్లు అషన్ రాజా, సామ్ నొగాస్కి.. థర్డ్ అంపైర్ జయరామన్ మదనగోపాల్, ఫోర్త్ అంపైర్ కుమార్ ధర్మసేన రిపోర్టు ఇవ్వడంతో ఐసీసీ అతడి ఫీజులో 15 శాతం కోత వేసింది.కాగా రోహిత్ పౌడేల్ వికెట్ను తంజీమ్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తంజీమ్కు తనకు మధ్య వివాదం అక్కడితోనే సమసిపోయిందని తెలిపాడు. అదే విధంగా.. తంజీమ్ గొప్పగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ సూపర్-8లో భాగంగా తదుపరి ఆస్ట్రేలియాతో (జూన్ 21) తలపడనుంది.చదవండి: కెప్టెన్సీకి గుడ్ బై.. విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై -
106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం!
న్యూయార్క్: ప్రస్తుత టి20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆ్రస్టేలియా (అడిలైడ్)లో తయారు చేసిన ‘డ్రాప్ ఇన్’ పిచ్లతో న్యూయార్క్లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్తో కలిసి మెగా ఈవెంట్కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. కేవలం ఇక్కడ లీగ్ దశనే జరుగుతుంది. న్యూయార్క్లోని నాసా స్టేడియం 8 మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో–అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్... బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ సహా నాలుగు మ్యాచ్ల్ని ఆడింది. 9న భారత్, పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు. ఇక వేదిక విషయానికొస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఈ స్టేడియం పిచ్ అత్యంత పేలవం. టి20లకు ఏమాత్రం కుదరని పిచ్లపై బ్యాట్ డీలా పడటంతో మెరుపులు, ధనాధన్ లేక టి20 ప్రపంచకప్ మ్యాచ్లే చిన్నబోయేలా చేసింది. క్రికెటర్లు, మాజీలే కాదు... విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్పై దుమ్మెత్తి పోశారు. కొసమెరుపు ఏమిటంతే ఈ నెల 1న బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి 14 (నేటి)తో కాలం చెల్లబోతుంది. -
'Super-8' లో ఆసీస్ భారత్ పోరు.. ముందుగానే ఫిక్స్ ! ఎలా అంటే?
టీ20 వరల్డ్కప్-2024 లీగ్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 17తో లీగ్ దశ మ్యాచ్లు ముగియునున్నాయి. ఇప్పటికే ప్రతీ గ్రూపు నుంచి ఒక్కో జట్టు తమ సూపర్-8 బెర్త్ను ఖారారు చేసుకున్నాయి. ఈ క్రమంలో సూపర్-8 సమీకరణాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ⇒ఈ మెగా టోర్నీలో బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. గ్రూపు-ఏ నుంచి సూపర్-8కు క్వాలిఫై అయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన భారత్ మూడింట కూడా విజయం సాధించి గ్రూపు-ఏ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిచింది. గ్రూపు-ఎ నుంచి మరో సూపర్-8 బెర్త్ కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీ పడతున్నాయి.⇒మరోవైపు నమీబియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా గ్రూపు-బి నుంచి సూపర్ 8 బెర్త్ను ఖారారు చేసుకుంది. ఆసీస్ కూడా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొంది గ్రూపు-బి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. గ్రూపు-బి నుంచి మరో స్ధానం కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు పోటీలో ఉన్నాయి.⇒అదేవిధంగా గురువారం న్యూజిలాండ్ను 13 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్ గ్రూపు-సి సూపర్-8కు అర్హత సాధించింది. విండీస్ కూడా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొంది గ్రూపు-సి పాయింట్ల పట్టికలో తొలి స్ధానంలో ఉంది. గ్రూపు-సి నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సూపర్-8 క్వాలిఫై అవకాశం ఉంది.⇒ఇక చివరగా గ్రూపు-డి నుంచి దక్షిణాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్పై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రోటీస్ తమ సూపర్-8 బెర్త్ను ఖారారు చేసుకుంది. గ్రూపు-డి నుంచి మరో స్ధానం కోసం నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి.సూపర్-8లో ఆసీస్ భారత్ పోరు..సూపర్-8 దశ మ్యాచ్లు జూన్ 19 నుంచి ప్రారంభం కాన్నాయి. కాగా ఈ టోర్నీలో భాగమయ్యే ప్రధాన జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందుగానే సీడింగ్(పొజిషిన్) కేటాయించింది. భారత్(A1), పాకిస్తాన్(A2), ఇంగ్లండ్(B1), ఆస్ట్రేలియా(B2), న్యూజిలాండ్(C1), వెస్టిండీస్(C2), దక్షిణాఫ్రికా(D1), శ్రీలంక(D2)గా ఫిక్స్ చేశారు. అంటే గ్రూపు స్టేజిలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిస్తే చాలు స్థానంతో సంబంధం లేకుండా సీడింగ్ ఆధారంగా ఆయా జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఉదాహరణకు గ్రూపు-ఎలో భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచినప్పటికి ఏ1 గానే సూపర్-8కు క్వాలిఫై అవుతోంది. అదేవిధంగా సీడింగ్ కెటాయించిన జట్ల లీగ్ స్టేజిలో ఇంటిముఖం పడితే.. ఆ గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు ఆయా స్ధానాలను భర్తీ చేస్తాయి. అయితే లీగ్ స్టేజీలో మొత్తం 20 జట్లను మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. గ్రూపు-ఎ, గ్రూపు-బి, గ్రూపు-సి, గ్రూపు-డిగా కేటాయించారు. ప్రతీ గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8ని కూడా ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూపు-1లో ఎ1, బి2, సి1, డి2.. గ్రూపు-2లో ఎ2, బి1, సి2, డి1 జట్లు సూపర్-8 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సమీకరణాలుప్రకారం సూపర్-8 రౌండ్లో జూన్ 23న గ్రూపు-2లో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. అదేవిధంగా జూన్ 24 గ్రూపు-1లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడన్నాయి. సూపర్-8 గ్రూపు 1లో టీమిండియా(ఎ1), ఆస్ట్రేలియా(బి2) జట్లు ఉన్నాయి. అంతకంటే ముందు జూన్ 20న గ్రూపు స్టేజిలో సి1గా నిలిచిన జట్టుతో భారత్ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22న గ్రూపు స్టేజిలో డి2గా నిలిచిన జట్టుతో భారత్ తమ రెండో మ్యాచ్ ఆడనుంది. -
ఐర్లాండ్కు కెనడా షాక్
న్యూయార్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శాశ్వత సభ్య దేశం ఐర్లాండ్ జట్టుకు తొలిసారి టి20 ప్రపంచకప్లో ఆడుతున్న కెనడా జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన పోరులో కెనడా తక్కువ లక్ష్యాన్ని కాపాడుకొని 12 పరుగుల తేడాతో ఐర్లాండ్ను కంగుతినిపించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (14), నవ్నీత్ ధలివాల్ (6) సహా పర్గత్ సింగ్ (18), దిల్ప్రీత్ (7) నిరాశపరిచారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ కిర్టన్ (35 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్లు), మొవ్వ శ్రేయస్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు) రాణించడంతో కెనడా కోలుకుంది. ప్రత్యర్థి బౌలర్లలో క్రెయిగ్ యంగ్, మెకార్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి ఓడిపోయింది. హేలిగెర్ (2/18), గొర్డాన్ (1/13), సిద్ధిఖీ (1/27), జాఫర్ (1/22) సమష్టిగా దెబ్బ కొట్టారు. దీంతో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డాక్రెల్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ అడైర్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా చివరకు ఐర్లాండ్కు ఓటమి తప్పలేదు. -
పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఘోర పరాభవాలు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో నిన్న (జూన్ 6) జరిగిన మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ సూపర్ ఓవర్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పాక్కు ఊహించని షాక్ ఇవ్వడం క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్ ఇంకా షాక్లోనే ఉండిపోయింది. అన్ని విభాగాల్లో తమకంటే పటిష్టంగా ఉన్న పాక్పై యూఎస్ఏ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఐసీసీ టాప్-5 బిగ్గెస్ట్ అప్సెట్స్ (టీ20 వరల్డ్కప్) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్-యూఎస్ఏ మ్యాచే అగ్రస్థానంలో నిలువడం విశేషం. ఈ జాబితాలో మిగతా నాలుగు సంచలనాలు వరుస క్రమంలో ఇలా ఉన్నాయి.2022 ప్రపంచకప్లో ఇంగ్లండ్కు షాకిచ్చిన ఐర్లాండ్2022 ప్రపంచకప్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన నమీబియా2016 ప్రపంచకప్లో వెస్టిండీస్ను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్2009 ప్రపంచకప్లో ఇంగ్లండ్కు ఓడించిన నెదర్లాండ్స్పై పేర్కొన్న మ్యాచ్లను ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి భారీ సంచలనాలుగా పరిగణించింది.ఇదిలా ఉంటే, యూఎస్ఏతో నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పాక్.. ఆతర్వాత బౌలింగ్లోనూ సత్తా చాటలేక చేసిన ఓ మోస్తరు స్కోర్ను కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం తేలిపోయిన పాక్.. తొలుత బౌలింగ్ చేసి 18 పరుగులు సమర్పించుకుంది. అనంతరం ఛేదనలోనూ చేతులెత్తేసి 13 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు.స్కోర్ వివరాలు..పాక్ 159/7 (20)యూఎస్ఏ 159/3 (20)సూపర్ ఓవర్..యూఎస్ఏ 18/1పాక్ 13/1సూపర్ ఓవర్లో యూఎస్ఏ విజయం -
టీ20 వరల్డ్కప్ 2024 ప్రైజ్మనీ: విజేతకు ఇన్ని కోట్లా..?
టీ20 వరల్డ్కప్ 2024 ప్రైజ్మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 3) వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఈసారి రికార్డు స్థాయిలో భారీ పారితోషికం లభించనుంది. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఓవరాల్గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది.టోర్నీ విజేతకు ప్రపంచకప్ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 1.87 కోట్లు లభించనున్నాయి. సెమీస్లో ఓడే రెండు జట్లకు చెరి రూ. 6.54 కోట్లు.. సూపర్-8లో ఇంటిముఖం పట్టే నాలుగు జట్లకు రూ. 3.17 కోట్లు.. 9, 10, 11, 12 స్థానల్లో నిలిచే జట్లకు రూ. 2.5 కోట్లు.. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచే జట్లకు తలో రూ. 1.87 కోట్లు లభించనున్నాయి.ఇదే కాకుండా టోర్నీలో గెలిచే ప్రతి మ్యాచ్కు ఆయా జట్టుకు రూ. 25.8 లక్షల రూపాయలు లభించనున్నాయి. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఈస్థాయిలో పారితోషికం గతంలో ఎన్నడూ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. 28 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్లు జరుగనున్నాయి. వెస్టిండీస్, యూఎస్ఏ దేశాల్లో మొత్తం తొమ్మిది వేదికల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇదో భారీ టోర్నీ. -
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్ సభ్య దేశ లీగ్గా ఎంఎల్సీ గుర్తింపు దక్కించుకుంది. ఎంఎల్సీ రెండో సీజన్ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్సీలో ఈసారి గత సీజన్ కంటే ఎక్కువ మ్యాచ్లు జరుగనున్నాయి. గత సీజన్లో ఆరు జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మట్లో మూడు వారాల పాటు 19 మ్యాచ్లు ఆడగా.. ఈ సీజన్లో అన్నే జట్లు గత సీజన్ కంటే 6 మ్యాచ్లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్గా ఎక్స్ప్యాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంఎల్సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్కు తొలి సీజన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్ను లిస్ట్-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్సీ అరంగేట్ర ఎడిషన్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఛాంపియన్గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్ పోలార్డ్ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో పాటు లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీయాటిల్ ఆర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఎంఎల్సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. క్రికెట్లో లిస్ట్-ఏను వన్డే ఫార్మాట్ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లు కూడా లిస్ట్-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20 క్రికెట్తో పాటు లిస్ట్-ఏ క్రికెట్ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి. -
ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు
జెరూసలెం: యుద్ధ నేరాల కింద తనకు అరెస్టు వారెంట్ ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో ప్రాసిక్యూటర్ చేసిన వాదనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మండిపడ్డారు. అబద్ధాల ఆధారంగా తనపై ఆ వారెంట్ కోరుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయన బుధవారం(మే22) మీడియాతో మాట్లాడారు. గాజాలో ఆకలి కేకలను అడ్డం పెట్టుకుని హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోందన్న వాదనను ఖండించారు. ఆకలి మంటలను ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని గతంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.ఇదే గనుక నిజమైతే దానిని యుద్ధ నేరం కింద పరిగణిస్తామని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐక్యరాజ్యసమితి ఆందోళన సరైనదే అనేందుకు కావాల్సిన ఆధారాలున్నాయని ఐసీసీ ప్రాసిక్యూటర్ల బృందం తాజాగా వెల్లడించింది. -
సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా
-
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
-
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్ 1 నంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్కు సబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో సెకెండ్ సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉండదని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. సాధరణంగా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ గేమ్లకు రిజర్వ్ డే కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ ప్రకారం.. రెండో సెమీఫైనల్కు, ఫైనల్ పోరుకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ సెకెండ్ సెమీఫైనల్కు రిజర్వ్డేను కెటాయించలేదని క్రిక్బజ్ తెలిపింది. అయితే రిజర్వ్ డే బదలుగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ, వెండీస్ క్రికెట్ బోర్డులు కెటాయించినట్లు తెలుస్తోంది. గయానా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫినిష్ కాకపోతే.. మరో నాలుగు గంటల సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే అంపైర్లు మ్యాచ్ను ముగించడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం ఉంటుంది. -
పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్ ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.అవకాశమే లేదుఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.గతంలో ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.బీసీసీఐ స్పందన ఇదేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో రోహిత్ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్తో సరిపెట్టుకుంది.ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్ జరుగనుండటం బాబర్ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్#WATCH | Delhi: On the Champion Trophy to be held in Pakistan next year, BCCI vice-president Rajeev Shukla said, "In the case of the Champion Trophy, we will do whatever the Government of India will tell us to do. We send our team only when the Government of India gives us… pic.twitter.com/TeA3dZ5Twn— ANI (@ANI) May 6, 2024 -
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
ఏప్రిల్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. ఈ లిస్ట్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ పేసర్ షహీన్ అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ ఉన్నారు. వీరిముగ్గురూ ఏప్రిల్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. అఫ్రిది విషయానికి వస్తే.. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లొ అదరగొట్టాడు.ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన షాహీన్.. 8 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అతడిని ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డకు నామినేట్ చేసింది. ఇక నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.. ఒమన్ పర్యటనలో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఒమన్తో టీ20 సిరీస్ను నమీబియా సాధించడంలో ఎరాస్మస్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం సైతం ఏప్రిల్ నెలలో అదరగొట్టాడు. ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్లో వసీం దుమ్ములేపాడు. ఓవరాల్గా ఏప్రిల్ నెలలో వసీం 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. ఇక మహిళలల విభాగంలో శ్రీలం కెప్టెన్ చమరి అతపట్టు, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు రేసులో ఉన్నారు. -
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
మహిళల టీ20 వరల్డ్కప్ 2024 ఎడిషన్ ఫిక్చర్లు, గ్రూప్ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి.గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్, పాక్లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1 ఉండగా.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్ల్లోని జట్లు తమతమ గ్రూప్ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. రెండు సెమీస్లకు, ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డేస్ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్ మైదానాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్లు జరుగనున్నాయి. ఫిక్చర్స్ లాంచింగ్ ప్రోగ్రాంను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ ప్రారంభించారు.దాయాదుల సమరం ఎప్పుడంటే.. పొట్టి ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. ఈ మ్యాచ్కు సిల్హెట్ మైదానం వేదిక కానుంది. భారత్ మ్యాచ్లు అక్లోబర్ 4 (న్యూజిలాండ్), 9 (క్వాలిఫయర్-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.మరోసారి హాట్ ఫేవరెట్గా ఆసీస్..డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్లో ఇంగ్లండ్.. 2016 ఎడిషన్లో వెస్టిండీస్ విజేతలుగా నిలిచాయి. 2016 ఎడిషన్లోనూ ఆసీస్ ఫైనల్ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్ ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఆసీస్ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్ 2020లో ఫైనల్ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. -
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు థామస్పై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అవినీతి నిరోధక నిబంధనలను థామస్ ఉల్లంఘించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. థామస్ కూడా తన నేరాన్ని అంగీకరించినట్లు ఐసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో గతేడాది థామస్పై ఐసీసీ తాత్కాలికంగా సస్సెన్షన్ వేటు వేసింది. అదే విధంగా యూఏఈ, కరీబియన్ లీగ్లో బుకీలు కలిసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు నేరం రుజువు కావడంతో ఐదేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక విండీస్ తరఫున డెవాన్ ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్లు చేశాడు. టెస్ట్ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. -
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్ క్రికెట్ ఆసోషియేషన్ బుధవారం ప్రకటించనుంది. ఈ టోర్నీలో నేపాల్ జట్టుకు రోహిత్ పాడెల్ నాయకత్వం వహించనున్నాడు. ఎటువంటి అంచనాలకు తావనివ్వకుండా అందరూ ఊహించిన జట్టునే నేపాల్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవల ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు నేపాల్ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది. కాగా ఐసీసీ టీ20 వరల్డ్కప్కు నేపాల్ అర్హత సాధించడం ఇది రెండో సారి. అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగిన 2014 టీ20 ప్రపంచకప్లో నేపాల్ తొలిసారి ఆడింది. ఇక నేపాల్ వరల్డ్కప్ జట్టులో సోంపాల్ కమీ, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కెసి వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.కాగా ఇటీవల నేపాల్ జట్టు అద్బుతమైన ప్రదర్శలను కనబరిస్తోంది. నేపాల్ ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతోంది.ఇక ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఒమన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నేపాల్ వరల్డ్కప్ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ. -
Oman T20 WC Squad: టీ20 వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన ఒమన్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఒమన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ అకిబ్ ఇలియాస్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకు తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన జీషన్ మక్సూద్పై వేటు వేసిన ఒమన్ క్రికెట్.. ఆ బాధ్యతలను ఇలియాస్ అప్పగించింది. ఇలియస్ గత కొంత కాలంగా ఒమన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఏసీసీ ప్రీమియర్ కప్లో అదరగొట్టిన ఆటగాళ్లకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మక్సూద్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.అయితే మరో సీనియర్ ఆటగాడు జతీందర్ సింగ్కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జతీందర్ సింగ్కు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటుక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తుది జట్లుఅకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్ కీపర్), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (వికెట్ కీపర్), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్.రిజర్వ్లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా -
India T20 WC Squad: ప్రపంచకప్ వేటకు సిద్ధం
టి20 ప్రపంచకప్ సమరాన్ని గెలిచేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి అనుభవాన్నే నమ్ముకుంది. ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్తో కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నా... సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఫామ్ గొప్పగా లేకున్నా... అంతర్జాతీయ మ్యాచ్లలో ఇప్పటికే ఎంతో కొంత ప్రభావం చూపించిన వారిపైనే కమిటీ విశ్వాసం ఉంచింది. గత టి20 వరల్డ్ కప్లో ఆడిన 9 మందికి ఈసారి మళ్లీ అవకాశం కర్నీచింది. అందుకే వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ దాదాపుగా అంచనాలకు తగినట్లుగానే సాగింది. ఒకరిద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త ఆశ్చర్యకర నిర్ణయాలు కనిపించినా... మొత్తంగా అర్హత కలిగిన వారికే అమెరికా–వెస్టిండీస్ వీసా లభించింది. గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత పూర్తిగా కుర్రాళ్లతో టి20ల్లో బోర్డు కొత్త ప్రయోగాలు చేసినా... తర్వాతి మెగా టోర్నీకి వచ్చేసరికి మళ్లీ తమ పాత ప్రణాళికకే కట్టుబడటం చెప్పుకోదగ్గ అంశం. అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ టి20 ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ వరుసగా రెండో టి20 ప్రపంచకప్లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండగా... 2022లో ఆ్రస్టేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్లో ఆడిన వారిలో 9 మంది ఈసారీ టీమిండియా చాన్స్ దక్కించుకున్నారు. గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్రౌండర్లు ఉన్నారు. మరో నలుగురు ఆటగాళ్లను ‘రిజర్వ్’లుగా కూడా ఎంపిక చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్లో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 9, 12, 15 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల 21న ముందుగా కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు అమెరికాకు బయల్దేరుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్‡్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్. ఐపీఎల్ ప్రదర్శనతోనే... జట్టు ఎంపికలో తాజా ఐపీఎల్ ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవునని, కాదని కూడా సమాధానం వస్తుంది. చెన్నై తరఫున మిడిలార్డర్లో సిక్సర్లతో చెలరేగిపోతున్న శివమ్ దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు దక్కింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రయిక్రేట్తో 350 పరుగులు సాధించాడు. భారత్కు ఆడిన 21 టి20ల్లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్లో రాణిస్తున్న రిషభ్ పంత్ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లీగ్లో అతను 158.58 స్ట్రయిక్రేట్తో 398 పరుగులు చేశాడు. అయితే పరుగులకంటే పూర్తి ఫిట్గా పంత్ కనిపించడం కూడా సానుకూలాంశంగా మారింది. మరోవైపు రెండో వికెట్ కీపర్గా కేరళకు చెందిన సంజూ సామ్సన్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్ను సమర్థంగా నడిపించడంతో పాటు 161.08 స్ట్రయిక్రేట్తో సామ్సన్ 385 పరుగులు సాధించాడు. ఎవరు... ఎందుకు... ఎలా? 2022 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన ఆడిన జట్టుతో పోలిస్తే రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, అర్‡్షదీప్, చహల్, బుమ్రా (టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్నాడు) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. 2021, 2022లో వరల్డ్ కప్లలో ఆడిన జట్టులో దాదాపు అదే టాప్–6 ఇప్పుడు కూడా మళ్లీ ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ స్థానంలో యశస్వి రావడం మినహా ఎలాంటి మార్పూ లేదు. యశస్వి ఈ సీజన్ ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి అవకాశం దక్కింది. బ్యాటింగ్లో ఇప్పుడు కావాల్సిన ‘ఫైర్’ లేదని ఎన్ని విమర్శలు వస్తున్నా అగ్రశ్రేణి బ్యాటర్లుగా రోహిత్, కోహ్లిల స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాదు. సూర్యకుమార్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఆల్రౌండ్ నైపుణ్యం అతనికి కలిసొచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరమే. హార్దిక్ మళ్లీ... ఇటీవల ఆటలో వైఫల్యాలతో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్కు ఆడకపోయినా అతనిపై నమ్మకముంచారు. ఐపీఎల్లోనూ విఫలమైనా... అతని తరహాలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానం కోసం ప్రత్యామ్నాయం లేక ఎంపిక చేయక తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ ఎన్నో కొన్ని ఓవర్లు వేస్తుండటం వల్ల కూడా అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. నలుగురు స్పిన్నర్లతో... అమెరికాలో తొలిసారి వరల్డ్ కప్ జరుగుతుండంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్లు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే స్పిన్కు అవకాశం ఉంటే తమ అన్ని అస్త్రాలను వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్లతో పాటు కుల్దీప్, యుజువేంద్ర చహల్లు జట్టులో ఉన్నారు. కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్లో ఉండగా... గత రెండు సిరీస్లలో భారత జట్టులో చోటు దక్కించుకోని చహల్ పునరాగమనం చేసి తొలిసారి టి20 వరల్డ్కప్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా అర్‡్షదీప్, సిరాజ్లను ఎంపిక చేశారు. ఈ ఫార్మాట్లో గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఐపీఎల్లోనూ పెద్దగా రాణించలేకపోతున్నా... ప్రస్తుత స్థితిలో అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్కు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడే చాన్స్ లభించింది. లెఫ్టార్మ్ పేసర్ కావడమే అర్‡్షదీప్ బలం. కొంత కాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అర్‡్షదీప్ను సెలక్టర్లు మళ్లీ నమ్మారు. గత వరల్డ్ కప్లో సెమీస్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ టి20 ఆడని రాహుల్ను తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రయిక్రేట్ కూడా అంతంత మాత్రమే. రాహుల్ తరహాలోనే శుబ్మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. పాపం రింకూ సింగ్... వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అన్ని రకాలుగా చర్చకు దారి తీసిన విషయం రింకూ సింగ్ను ఎంపిక చేయకపోవడం. విధ్వంసకర బ్యాటింగ్తో గత ఏడాది ఐపీఎల్ నుంచి అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిలార్డర్లో ఫినిషర్గా సత్తా చాటాడు.భారత్ తరఫున లభించిన పరిమిత అవకాశాల్లో (11 ఇన్నింగ్స్లు) ఏకంగా 176.23 స్ట్రయిక్ రేట్, 89 సగటుతో పరుగులు సాధించాడు. కానీ చివరకు వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ చాన్స్ లభించలేదు. ఈసారి ఐపీఎల్లో గొప్పగా ఆడకపోవడం వాస్తవమే అయినా కోల్కతా టాపార్డర్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 9 మ్యాచ్లలో కేవలం 82 బంతులే ఆడే చాన్స్ దక్కింది. మిడిలార్డర్లో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చలో రింకూపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హార్దిక్ను తప్పించాల్సి వచ్చినా... దూబే బౌలింగ్ ఎంతో కొంత ఉపయోగపడగలదని సెలక్టర్లు భావించారు. రోహిత్ శర్మవయసు: 37 ఆడిన టి20లు: 151 చేసిన పరుగులు: 3974 అత్యధిక స్కోరు: 121 నాటౌట్ సెంచరీలు: 5 అర్ధ సెంచరీలు: 29 స్ట్రయిక్రేట్: 139.97 ఆడిన టి20 ప్రపంచకప్లు: 8 విరాట్ కోహ్లి వయసు: 35 ఆడిన టి20లు: 117 చేసిన పరుగులు: 4037 అత్యధిక స్కోరు: 122 నాటౌట్ సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 37 స్ట్రయిక్రేట్: 138.15 ఆడిన టి20 ప్రపంచకప్లు: 5సూర్యకుమార్వయసు: 33 ఆడిన టి20లు: 60 చేసిన పరుగులు: 2141 అత్యధిక స్కోరు: 117 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 17 స్ట్రయిక్రేట్: 171.55 ఆడిన టి20 ప్రపంచకప్లు: 2 హార్దిక్ పాండ్యా వయసు: 30 ఆడిన టి20లు: 92 చేసిన పరుగులు: 1348 అత్యధిక స్కోరు: 71 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్రేట్: 139.88 తీసిన వికెట్లు: 73 ఆడిన టి20 ప్రపంచకప్లు: 3 రిషభ్ పంత్ వయసు: 26 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 987 అత్యధిక స్కోరు: 65 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్రేట్: 126.37 ఆడిన టి20 ప్రపంచకప్లు: 2 శివమ్ దూబే వయసు: 30 ఆడిన టి20లు: 21 చేసిన పరుగులు: 276 అత్యధిక స్కోరు: 63 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 తీసిన వికెట్లు: 8 స్ట్రయిక్రేట్: 145.26 ఇదే తొలి టి20 వరల్డ్కప్ అర్‡్షదీప్ సింగ్వయసు: 25 ఆడిన టి20లు: 44 తీసిన వికెట్లు: 62 ఉత్తమ బౌలింగ్: 4/37 ఆడిన టి20 ప్రపంచకప్లు: 1 యుజువేంద్ర చహల్ వయసు: 33 ఆడిన టి20లు: 80 తీసిన వికెట్లు: 96 ఉత్తమ బౌలింగ్: 6/25 ఇదే తొలి టి20 వరల్డ్కప్ కుల్దీప్ యాదవ్ వయసు: 29 ఆడిన టి20లు: 35 తీసిన వికెట్లు: 59 ఉత్తమ బౌలింగ్: 5/17 ఇదే తొలి టి20 వరల్డ్కప్ రవీంద్ర జడేజావయసు: 35 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 480 అత్యధిక స్కోరు: 46 నాటౌట్ స్ట్రయిక్రేట్: 125.32 తీసిన వికెట్లు: 53 ఆడిన టి20 ప్రపంచకప్లు: 5 సంజూ సామ్సన్ యశస్వి జైస్వాల్ వయసు: 22 ఆడిన టి20లు: 17 చేసిన పరుగులు: 502 అత్యధిక స్కోరు: 100 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 4 స్ట్రయిక్రేట్: 161.93 ఇదే తొలి టి20 వరల్డ్కప్ జస్ప్రీత్ బుమ్రావయసు: 30 ఆడిన టి20లు: 62 తీసిన వికెట్లు: 74 ఉత్తమ బౌలింగ్: 3/11 ఆడిన టి20 ప్రపంచకప్లు: 2 మొహమ్మద్ సిరాజ్ వయసు: 30 ఆడిన టి20లు: 10 తీసిన వికెట్లు: 12 ఉత్తమ బౌలింగ్: 4/17 ఇదే తొలి టి20 వరల్డ్కప్ అక్షర్ పటేల్ వయసు: 30; ఆడిన టి20లు: 52 చేసిన పరుగులు: 361 తీసిన వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్: 3/9 ఇదే తొలి టి20 వరల్డ్కప్ -
T20 WC 2024: యువరాజ్ సింగ్కు కీలక బాధ్యతలు
టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ 2024కు రాయబారిగా నియమించింది. యువరాజ్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఎనిమిది సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఉసేన్ బోల్ట్తో కలిసి పొట్టి ప్రపంచకప్కు అంబాసిడర్గా వ్యవహరిస్తాడని ఐసీసీ ప్రకటించింది. Who will make it to India’s squad for the ICC Men’s #T20WorldCup 2024? 🤔Event Ambassador @Yuvstrong12 has some exciting prospects on his list 👀https://t.co/YlDetOGdYs— T20 World Cup (@T20WorldCup) April 26, 2024 మెగా టోర్నీలో భాగంగా జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో సహా యుఎస్ఏలో జరిగే మొత్తం మ్యాచ్ల ప్రమోషన్ బాధ్యతలను యువరాజ్కు అప్పజెప్పింది. టీ20 వరల్డ్కప్కు ఐసీసీ రాయబారిగా ఎంపిక కావడంపై యువరాజ్ స్పందిస్తూ.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం వంటి మరుపురాని జ్ఞాపకాలు పొట్టి ప్రపంచకప్తో ముడిపడి ఉన్నాయి.ఇలాంటి మెగా ఈవెంట్లో మరోసారి భాగం కావడం నా అదృష్టం. వరల్డ్కప్ రాయబారిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్పై యువీ స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రపంచంలో జరుగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామమంగా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్రౌండర్గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్రౌండర్గా పేరుంది. -
నితిన్ మీనన్ కొనసాగింపు
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ అంపైర్ల ప్యానెల్లో వరుసగా ఐదో ఏడాది తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇండోర్కు చెందిన నితిన్ తొలిసారి 2020లో ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా ఐసీసీ ఆయన సేవల్ని గుర్తించి ఎలైట్ ప్యానెల్లో కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా మరోసారి పొడిగింపు లభించింది. ఓవరాల్గా అత్యున్నత అంపైర్ల ప్యానెల్కు ఎంపికైన మూడో భారత అంపైర్ మీనన్. గతంలో ఎస్. రవి, మాజీ స్పిన్నర్ ఎస్. వెంకటరాఘవన్లు ఎలైట్ క్లబ్లో ఉండేవారు. రవి 33 టెస్టు మ్యాచ్లకు ఫీల్డ్ అంపైర్గా సేవలందించగా, వెంకటరాఘవన్ ఏకంగా 73 టెస్టులకు (అన్ని ఫార్మాట్లలో 125 మ్యాచ్లు) అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం 12 మంది సభ్యులు గల ఈ ఎలైట్ క్లబ్లో భారత్ నుంచి 40 ఏళ్ల నితిన్ మీనన్ ఒక్కరే ఉన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన 122 అంతర్జాతీయ మ్యాచ్లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్కు చెందిన షర్ఫుద్దౌలా షాహిద్కు కొత్తగా ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కింది. బంగ్లా తరఫున ఈ అర్హత సాధించిన తొలి అంపైర్గా ఆయన గుర్తింపు పొందారు. ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్ను తొలగించారు. 2003 నుంచి సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టి20లు, 15 మహిళల టి20లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పునరి్నర్మాణ ప్రక్రియలో భాగంగానే ఆయన్ని తప్పించామని, ఇతరత్రా కారణాల్లేవని ఐసీసీ తెలిపింది. -
‘టాప్’ ర్యాంక్లోనే సూర్యకుమార్
గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఐర్లాండ్తో జరిగిన టి20 సిరీస్లో రాణించిన రషీద్ ఖాన్ నాలుగు స్థానాలు ఎగబాకి పదో ర్యాంక్కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 4వ ర్యాంక్లో ఉన్నాడు. -
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా హసరంగ ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్ను బలవంతంగా లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్లో హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్ సందర్భంగా కూడా గత సిరీస్లో (ఆఫ్ఘనిస్తాన్) చేసిన తప్పిదాల కారణంగా అతను సస్పెండయ్యాడు. 26 ఏళ్ల హసరంగ తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2021లో ఆడాడు. అతను కేవలం నాలుగు టెస్ట్ల్లోనే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్ల్లో హసరంగకు మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ ఫార్మాట్లో అతను కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు హసరంగా తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. -
T20I: అఫ్గనిస్తాన్కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన
ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ ఏడాది ఆగష్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసీస్- అఫ్గన్ మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అఫ్గనిస్తాన్లో పరిస్థితుల దృష్ట్యా యూఏఈలో అఫ్గన్ ఈ సిరీస్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. కారణం ఇదే ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్ ప్రభుత్వం మహిళలు, బాలికల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందన్న కారణంతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా 2021లోనూ సీఏ ఇదే కారణంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టును రద్దు చేసింది. అఫ్గనిస్తాన్లో రోజురోజుకూ బాలికలు, మహిళల పరిస్థితి దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అఫ్గన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు హైస్కూల్కు వెళ్లకుండా, మహిళలు ఉన్నత విద్యనభ్యసించకుండా, ఉద్యోగాలు చేయకుండా కఠిన నిబంధనలు విధించిందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వుమెన్ టీ20 వరల్డ్కప్ ఈవెంట్కు ఫుల్ మెంబర్ జట్లలో అఫ్గనిస్తాన్(మహిళలు క్రికెట్ ఆడకూడదనే నిబంధన) ఒక్కటే హాజరు కాలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించామన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చివరగా అప్పుడే కాగా చివరగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా ముంబైలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ తలపడ్డాయి. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్ క్రికెట్ బోర్డు పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీఈఓ గాఫ్ అలార్డిస్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఫుల్ మెంబర్కు తాము మద్దతుగా నిలవకతప్పదని పేర్కొన్నారు. చదవండి: Rohit Sharma: రోహిత్ క్రీజులో ఉన్నంతవరకే ముంబైకి మా మద్దతు! వీడియో An update to our Aussie men's team schedule ⬇️ CA will continue its commitment to the participation of women and girls cricket around the world and will work closely with the ICC and the Afghanistan Cricket Board to resume bilateral matches in the future. pic.twitter.com/OIO5PLjle5 — Cricket Australia (@CricketAus) March 19, 2024 -
సెమీస్కు చేరువలో ఆంధ్ర..
ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్ను దెబ్బ తీశారు. -
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్ల సస్పెన్షన్తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
బుమ్రా నంబర్వన్
దుబాయ్: భారత్ నుంచి ఎంతోమంది పేస్ బౌలర్లు టెస్టుల్లో పలుమార్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరించారు. కానీ ఏనాడూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే ఆ లోటును తీరుస్తూ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని అందుకున్న తొలి భారతీయ పేస్ బౌలర్గా అవతరించాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో 30 ఏళ్ల బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి ఈ ఫార్మాట్లో టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా తన పేస్ పదునుతో తొమ్మిది వికెట్లు (6/45; 3/46) పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం గెల్చుకున్నాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 881 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గత ర్యాంకింగ్స్లో ‘టాప్’ ర్యాంక్లో ఉన్న భారత స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాలు పడిపోయి 841 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ 851 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి నలుగురు బౌలర్లు మాత్రమే ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్లో నిలిచారు. గతంలో భారత స్పిన్నర్లు బిషన్సింగ్ బేడీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించగా... పేస్ బౌలర్ రూపంలో బుమ్రా తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడిన బుమ్రా 155 వికెట్లు తీసుకున్నాడు. తాజా టాప్ ర్యాంక్తో బుమ్రా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ నంబర్వన్గా నిలిచిన తొలి బౌలర్గా గుర్తింపు పొందాడు. బుమ్రా 2017 నవంబర్ 4న తొలిసారి టి20 ఫార్మాట్లో... 2018 ఫిబ్రవరి 4న తొలిసారి వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో ఆరో ర్యాంక్లో, టి20ల్లో వందో ర్యాంక్లో ఉన్నాడు. మరోవైపు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్లో నిలిచాడు. తదుపరి టెస్టులకూ దూరం! న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ కోహ్లి ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. అయితే తదుపరి మూడు టెస్టులకూ కోహ్లి సేవలు జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్కోట్లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో జరగుతుంది. తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. -
అశ్విన్ టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ ఒక స్థానం పురోగతి సాధించి 851 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో నిలువగా... స్పిన్నర్ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఆరో ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 729 పాయింట్లతో 12వ ర్యాంక్లో నిలిచాడు. టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అశ్విన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
బుమ్రా బిహేవియర్ పై ఐసీసీ వార్నింగ్
-
శ్రీలంక క్రికెట్కు భారీ ఊరట
శ్రీలంక క్రికెట్కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ జట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. సభ్య దేశంగా ఉండి బాధ్యతల ఉల్లంఘణకు పాల్పడటంతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించని ఐసీసీ నవంబర్ 10న శ్రీలంక క్రికెట్ బోర్డుపై (ఎస్ఎల్సీ) నిషేధాన్ని విధించింది. లంక క్రికెట్ బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయి, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో పావుగా మారి అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆ దేశ ఆడిటర్ జనరల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎస్ఎల్సీపై నిషేధం విధించింది. వన్డే వరల్డ్కప్ 2023 అనంతరం షమ్మీ సిల్వ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ఎస్ఎల్సీపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో జరగాల్సిన అండర్-19 వరల్డ్కప్ 2024 సౌతాఫ్రికాకు తరలించబడింది. బోర్డు రద్దు అనంతరం రెండు నెలలపాటు పరిస్థితిని సమీక్షించిన ఐసీసీ తాజాగా సమావేశమై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఎస్ఎల్సీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాన్ను ఎత్తి వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. -
బెస్ట్ వన్ డే టీంను ప్రకటించిన ఐసీసీ
-
టీమిండియాతో మ్యాచ్లో ఓవరాక్షన్.. స్టార్ క్రికెటర్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
అండర్-19 వరల్డ్కప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్ మరుఫ్ మృధా ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లను మరుఫ్ మృధా అసభ్యపదజాలంతో దూషించాడు. అయితే ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్గా తీసుకుంది. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు అతడిని ఐసీసీ మందలించింది. ఐసీసీ ఆర్టికల్ 2.5 ప్రకారం.. బ్యాటర్ ఔటైనప్పుడు సదరు క్రికెటర్ను అవమానపరిచడం గానీ, అసభ్యపదజాలాన్ని ఊపయెగించకూడదు. ఈ నేపథ్యంలోనే మరుఫ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023 ఏడాదికిగాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా సూర్య భాయ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సూర్య అందుకోవడం వరుసగా రెండో సారి కావడం విశేషం. తద్వారా టీ20 ఫార్మాట్లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా మిస్టర్ 360 నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్జాని (ఉగాండా), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్) అవార్డు కోసం పోటీపడ్డారు. కానీ వీళ్లందరిలో సూర్య వైపే ఐసీసీ మొగ్గు చూపింది. 2023 ఏడాదిలో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్లో 48 సగటుతో 733 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా అంతకుముందు 2022 ఏడాదిలోనూ ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా సూర్యకుమార్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ అవార్డును ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తుంది. 2021లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. మరోవైపు 2023 ఏడాదికి గాను ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. ఇక సూర్య ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. -
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్కీపర్ బ్యాటర్గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్గా సూర్య భాయ్
ఐసీసీ 2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఇవాళ (జనవరి 22) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఎంపిక కాగా.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లి, రోహిత్లను విస్మరించిన ఐసీసీ అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వికి జతగా ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ను ఓపెనర్గా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్డౌన్లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఆల్రౌండర్ల కోటా జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండ ప్లేయర్ అల్పేష్ రంజనీ, స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే)లను ఎంపిక చేసింది. ఐసీసీ ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం. -
కేప్టౌన్ పిచ్పై ‘అసంతృప్తి’
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగిన కేప్టౌన్లోని న్యూలాండ్స్ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్లో వాడిన పిచ్ సంతృప్తికరంగా లేదని అభిప్రాయ పడింది. ఈ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందించారు. దీని ప్రకారం న్యూలాండ్స్ పిచ్కు ఒక డీ మెరిట్ రేటింగ్ ఇచ్చారు. -
రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. కేప్టౌన్ పిచ్పై ఐసీసీ సీరియస్
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం కన్న ఈ మ్యాచ్కు ఉపయెగించిన పిచ్ ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా కేప్టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. ఈ పిచ్పై పేసర్లు పండగ చేసుకున్నారు. ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ మ్యాచ్లో ఉపయోగించిన పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పిచ్పై ఇరు జట్ల కెప్టెన్లు డీన్ ఎల్గర్, రోహిత్ శర్మ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీసీ సీరియస్.. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కేప్టౌన్లోని న్యూలాండ్స్ పిచ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో టెస్టుకు ఉపయోగించిన పిచ్ నాసిరకంగా ఉందని ఐసీసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్ను మందలిస్తూ న్యూలాండ్స్ పిచ్కు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ నివేదిక ప్రకారం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. "న్యూలాండ్స్లోని పిచ్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి భయంకరంగా బౌన్స్ అయింది. షాట్లు ఆడేందుకు చాలా కష్టమైంది. బౌన్స్ కారణంగానే వికెట్లు కూడా ఎక్కువగా నేలకూలాయి" అని బ్రాడ్ పేర్కొన్నారు. చదవండి: ENG vs IND: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!? -
మాల్దీవుల బాయ్కాట్కు పిలుపు
భారత్పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవ్స్–ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపిచ్చింది. భారతప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు సహించబోమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇందుకు నిరసనగా మాల్దీవ్స్ను బాయ్కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. ఇదీ చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. -
రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు అనంతరం క్రికెట్ పిచ్లపైన రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్ ఘూటు వాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కామెంట్స్ను సీరియస్గా తీసుకున్న ఐసీసీ.. హిట్మ్యాన్పై చర్యలకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రోహిత్ ఏమన్నాడంటే? కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ క్రమంలో పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ మాట్లాడుతూ.. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్టౌన్లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు సిద్దమవుతోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల క్రికెట్ సెలక్షన్ కమిటీలు తమ జట్లను ప్రకటించాయి. చదవండి: IND Vs AFG: టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్ -
క్రికెట్లో కొత్త రూల్.. బ్యాటర్లకు గుడ్న్యూస్
కొత్త ఏడాది ఆరంభంలో బ్యాటర్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ గుడ్న్యూస్ అందించింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు వికెట్ కీపర్ స్టంపింగ్కు అప్పీలు చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫర్ చేసేవారు. థర్డ్ అంపైర్ తొలుత క్యాచ్(ఆల్ట్రా ఎడ్జ్)ను చెక్ చేసి.. ఆ తర్వాత స్టంప్ ఔటా కాదాన్నది పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడించేవాడు. అయితే ఇకపై ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్లో మరి కన్పించదు. ఐసీసీ కొత్త రూల్ ప్రకారం.. ఫీల్డ్ అంపైర్లు స్టంపౌట్కు రిఫర్ చేస్తే, థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్ను మాత్రమే చెక్ చేయాలి. అంతే తప్ప బంతి బ్యాట్కు తాకిందా లేదన్నది పరీశిలించాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ జట్లు పాత నిబంధనను ఎక్కువ ఊపయోగించకోవడంతో ఐసీసీ ఈ తరహా మార్పులు చేసింది. ఈ రూల్ గతేడాది డిసెంబర్ 12 నుంచే అమలు లోకి వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్కు ఈ బాధ మర్చిపోకముందే మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్రేట్ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్ ఫీజ్లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది. కనీస ఓవర్ రేట్ను మెయింటైన్ చేయడంలో విఫలం కావడంతో టీమిండియాపై ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్పై భారీ ప్రభావం చూపింది. పెనాల్టీకి ముందు భారత్ 16 పాయింట్లు మరియు 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్ ర్యాంక్ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది. మరోవైపు భారత్పై అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకోగా.. రెండో టెస్ట్లోనూ పాక్ను మట్టికరిపించడంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, కేవలం మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో విరాట్తో పాటు కేవలం శుభ్మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్ను భారత్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. -
శ్రీలంక క్రికెట్లో కీలక పరిణామం.. సెలక్షన్ కమిటీ ఛైర్మెన్గా మాజీ కెప్టెన్
శ్రీలంక క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్ కమిటీని ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఏర్పాటు చేశారు. కొత్త కమిటీ నియామకం తక్షణమే అమలు వస్తోందని ఫెర్నాండో బుదవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ సెలక్షన్ కమిటీకి శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్గా ఎంపికయ్యాడు. ఈ కమిటీలో తరంగతో పాటు మాజీ ఆటగాళ్లు అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. ఉపుల్ తరంగ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ రెండేళ్ల పాటు శ్రీలంక జట్టు ఎంపికలో కీలకం కానుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగే సిరీస్కు జట్టు ఎంపికతో లంక కొత్త సెలక్షన్ కమిటీ ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా శ్రీలంక క్రికెట్లో ఉపుల్ తరంగాకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఓపెనర్గా తన జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఓవరాల్గా తరంగ మూడు ఫార్మాట్లలో శ్రీలంక తరపున 9వేలకు పైగా పరుగలు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి లంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. అయితే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐసీసీ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని ఐసీసీ సస్పెండ్ చేసింది. అనంతరం ఐసీసీ లంక క్రికెట్ పై కొన్ని ఆంక్షలను సడలించడంతో ఆ జట్టు యధావిధిగా ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు గ్రీన్ సిగ్నిల్ లభించింది. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్పై వేటు! తిలక్కు బై బై? -
మీర్పుర్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ
మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆసక్తికర రూలింగ్ ఇచ్చింది. మీర్పుర్ పిచ్ (షేర్ ఏ బంగ్లా స్టేడియం, ఢాకా) అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ల పిచ్ కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పిచ్ నాసిరకంగా తయారు చేయబడిందని, పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యిందని, దీని వల్ల ఇరు జట్ల బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మ్యాచ్ రిఫరి డేవిడ్ బూన్ తన నివేదికలో పేర్కొన్నాడు. ప్రమాదకరమైన పిచ్ను తయారు చేసినందుకుగాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అక్షింతలు వేసిన ఐసీసీ.. మీర్పుర్ పిచ్కు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రిఫరి బూన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో మ్యాచ్లో పర్యాటక న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో న్యూజిలాండ్ 1-1తో సిరీస్ను సమం చేసుకుంది. బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని మీర్పుర్ పిచ్పై కివీస్ బౌలర్లు ఒకింత లబ్ది పొందారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 172, రెండో ఇన్నింగ్స్లో 144 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యాన్ని (180 ఆలౌట్) పొంది, రెండో ఇన్నింగ్స్లో (139/6) అతి కష్టంమీద బంగ్లా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయినప్పటికీ స్పిన్నర్లకు అత్యధిక వికెట్లు లభించడం విశేషం. -
అండర్ 19 వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్ 2024 షెడ్యూల్ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 11) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్లు ఆడనుంది. జనవరి 19న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు తలపడనున్నాయి. 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించడిన ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా జట్లు.. గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. కాగా, తొలుత ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐసీసీ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. -
క్రికెట్లో కొత్త రూల్.. రేపటి నుంచే అమల్లోకి..!
పరిమిత ఓవర్ల క్రికెట్కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూనే ఈ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా అడుగులు వేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. డిసెంబర్ 12 నుంచి పొట్టి ఫార్మాట్లో కొత్త రూల్ను అమల్లోకి తేనుంది. విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి ఐసీసీ "స్టాప్ క్లాక్" అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్కు ఓవర్కు మధ్య అధిక సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ.. ఈ ఫార్మాట్లలో మరింత వేగం పెంచేందుకు ఓవర్కు ఓవర్కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్ను దించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
వన్డే వరల్డ్కప్ ఫైనల్ పిచ్కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే?
వన్డే ప్రపంచకప్-2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో భారత్ను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా ఆసీస్ నిలిచింది. ఈ మెగా టోర్నీలో వరుసగా పది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మొట్టుపై బోల్తా పడింది. ఇక ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ఫైనల్, సెమీఫైనల్ కు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. కాగా ఫైనల్ మ్యాచ్ పిచ్పై టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండడంతో ఆసీస్కు బ్యాటింగ్ సులభమైంది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ పిచ్ కు గుడ్ రేటింగ్ దక్కింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ రేటింగ్ ఇచ్చారు. అయితే రెండో సెమీఫైనల్కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ పిచ్కు కూడా ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. లో స్కోరింగ్ థ్రిల్లర్లో ఆసీస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ వచ్చింది. చదవండి: IPL 2024-Mohammed Shami: గుజరాత్ టైటాన్స్కు షమీ గుడ్బై..? -
సిక్స్తో మ్యాచ్ ఫినిష్.. అయినా రింకూ సిక్సర్ ఎందుకు కౌంట్ కాలేదు..?
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. విశాఖపట్నం వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టీ20లో రికార్డు విజయం సాధించిన భారత జట్టు.. వరల్డ్కప్ ఫైనల్ల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లల్లో జోష్ ఇంగ్లీష్ మెరుపు సెంచరీ (50 బంతుల్లో 110)తో చెలరేగాడు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(80), ఇషాన్ కిషన్(58), రింకూ సింగ్(22) అద్బుత ఇన్నింగ్స్లతో భారత్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో భారత విజయం సాధించినప్పటికీ ఆఖరి ఓవర్లో కాస్త గందరగోళం నెలకొంది. సీన్ అబాట్ వేసిన ఆఖరి ఓవర్లో భారత విజయానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్ట్రైక్లో ఉన్న రింకూ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. దీంతో భారత విజయ సమీకరణం.. 5 బంతుల్లో 3 పరుగులుగా మారింది. అనంతరం రెండో బంతికి బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తర్వాత మూడు బంతుల్లో వరుసగగా ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారు. అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ కాగా.. బిష్ణోయ్, అర్ష్దీప్ రింకూకు స్ట్రైక్ ఇచ్చే క్రమంలో రనౌటయ్యారు. దీంతో ఆఖరి బంతికి భారత విజయాన్ని ఒక్క పరుగు అవసరమ్వగా.. రింకూ సింగ్ సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే రింకూ ఆఖరి బంతికి కొట్టిన సిక్సర్ కౌంట్ కాలేదు. భారత్ విజయం సాధించినప్పటికీ.. అతడి వ్యక్తిగత స్కోర్లో కూడా ఆ సిక్సర్ జమ కాలేదు. రింకూ సిక్సర్ ఎందుకు కౌంట్ కాలేదు..? అయితే ఐసీసీ మెన్స్ టీ20 నిబంధనల ప్రకారం.. 16.1, 16.2 లేదంటే 16.3.1 క్లాజుల ప్రకారం.. మ్యాచ్ ముగిసే సమయంలో.. ఫలితం తేలుతున్న క్రమంలో తర్వాత ఏం జరిగిందన్న విషయంతో సంబంధం ఉండదు. అయితే, ఐసీసీ నిబంధనల్లో ఉన్న మరో క్లాజు 41.17.2(పెనాల్టీ పరుగులు) విషయంలో మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఇక్కడ టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్లో రింకూ సిక్సర్ కొట్టగానే భారత డగౌట్ సంబరాల్లో మునిగి తేలిపోయింది. కానీ చివరి బంతి వేసే క్రమంలో ఆసీస్ పేసర్ అబాట్ ఓవర్ స్టెప్ చేశాడు. దీంతో థర్డ్ అంపైర్ కాస్త లేట్గా నో బాల్గా ప్రకటించాడు. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం.. అంటే మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత.. ఫలితం ఖరారైన సందర్భంలో వచ్చే పరుగులను పరిగణనలోకి తీసుకోరు. అంటే ఛేజింగ్లో ఏ జట్టు విజయానికైనా కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైనప్పుడు.. బ్యాటర్ సిక్స్ కొట్టినా ఎక్స్ట్రాస్ రూపంలో వచ్చే రన్ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని చెప్పవచ్చు. ఉదాహరణకు జట్టు గెలుపుకు ఒక్క పరుగు అవసరమైనప్పుడు.. బౌలర్ నో బాల్గా సంధించిన బంతిని బ్యాటర్ బౌండరీ గానీ రన్స్ తీసినా కౌంట్ చేయరు. ఎందుకంటే.. నోబాల్ రూపంలో వచ్చే పరుగుతో మ్యాచ్ ఫలితం తేలిపోతుంది. రింకూ సింగ్ సిక్స్ విషయంలో ఇదే జరిగింది. అదే భారత్ విజయానికి ఒకటి కంటే ఎక్కువ పరుగులు అవసరమైతే.. రింకూ సింగ్ కొట్టిన సిక్స్ను పరిగణనలోకి తీసుకునేవారు. చదవండి: IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!? -
విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ..
వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించినందుకు శామ్యూల్స్పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్లో ఆరేళ్ల పాటు అతడు పాల్గోడదని ఐసీసీ సృష్టం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ హెచ్ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ గురువారం దృవీకరించారు. "శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు, ఆ సమయంలో అతను అనేక అవినీతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అవినీతి నిరోధక కోడ్ ప్రకారం తన బాధ్యతలు ఎంటో అతడికి కచ్చితంగా తెలుసు. అతడు ఇప్పుడు రిటైర్ అయినప్పటికీ.. ఈ నేరాలు జరిగినప్పుడు అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాబట్టి అతడిపై ఆరేళ్ల పాటు నిషేదం విధించడం జరిగింది. రూల్స్ను అతిక్రమించిన వారికి ఇదే సరైన శిక్ష" అని అలెక్స్ మార్షల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏం జరిగిందంటే? కాగా 2019లో అబుదాబీ టీ10 లీగ్లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్ను ఉల్లంఘించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2021 సెప్టెంబర్లో ఐసీసీ మొత్తం నాలుగు అభియోగాలు మోపింది. ఈ లీగ్ సమయంలో అతడు బయట వ్యక్తుల నుంచి గిఫ్ట్లు తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. వీటిపై విచారణ జరిపిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు 2023 ఆగస్టులో శామ్యూల్స్ను దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ అతడిపై వేటు వేసింది. ఈ నిషేధం నవంబర్11 నుంచి అమల్లోకి రానుంది. కాగా శామ్యూల్స్ వెస్టిండీస్ తరపున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 T20 మ్యాచ్లు ఆడాడు. అతడు తన అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులతో పాటు 152 వికెట్లు పడగొట్టాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్ను వెస్టిండీస్ సొంత చేసుకోవడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. . రెండు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లోనూ శామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: IND Vs AUS 1st T20: ఆసీస్తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..? -
ఇకపై క్రికెట్లో కొత్త రూల్.. అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో కొత్త రూల్ను ప్రవేశపెట్టనుంది. "స్టాప్ క్లాక్" పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. ఐసీసీ కొత్తగా ఓవర్కు ఓవర్కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్ టైమ్గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్లో నిన్న (నవంబర్ 21) జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు. -
శ్రీలంక క్రికెట్కు మరో షాక్.. ఐసీసీ నిషేధం అమలవుతుండగానే..!
శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం అమలవుతుండగానే ఐసీసీ మరో ఝలక్ ఇచ్చింది. లంక బోర్డుపై నిషేధాన్ని కారణంగా చూపుతూ అక్కడ జరగాల్సిన ఈవెంట్ను ఐసీసీ మరో దేశానికి మార్చింది. వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్–19 పురుషుల ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్లో నిన్న (నవంబర్ 21) జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. గతంలో (2020) సౌతాఫ్రికా అండర్–19 వరల్డ్కప్ను విజయవంతంగా నిర్వహించినందుకు మరోసారి ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. వేదిక మార్పు అంశాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు ఇదివరకే తెలియజేసినట్లు పేర్కొన్నాడు. కాగా, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే రద్దు చేసిన విషయం తెలిసిందే. బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. -
ట్రాన్స్జెండర్స్కు అర్హత లేదు
అహ్మదాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు, గౌరవం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయిలు పూర్తిగా అమ్మాయిల హోదా పొందినప్పటికీ అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆడేందుకు అర్హత లభించదని మంగళవారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది నెలల సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు తర్వాతే ఈ విధాన నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈఓ జెఫ్ అలర్డైస్ తెలిపారు. అయితే దేశవాళీ క్రికెట్లో ట్రాన్స్జెండర్స్ను ఆడించే విషయమై ఆయా సభ్యదేశాలకే నిర్ణయాధికారం కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సెపె్టంబర్లో అంతర్జాతీయ క్రికెట్లో తొలి ‘ట్రాన్స్జెండర్’గా కెనడాకు చెందిన 29 ఏళ్ల డానిల్ మెక్గహే గుర్తింపు పొందింది. 2024 టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించేందుకు నిర్వహించిన అమెరికన్ క్వాలిఫయర్ టోర్నీలో ఆమె కెనడా జట్టు తరఫున ఆరు మ్యాచ్లు ఆడి 118 పరుగులు సాధించింది. డానిల్ మెక్గహే కెనడా జాతీయ జట్టు తరఫున ఇప్పటికే కొన్ని మ్యాచ్లు ఆడినా వాటికి అంతర్జాతీయ హోదా లేదు. డానిల్ ఆ్రస్టేలియాలో పుట్టి మూడేళ్ల క్రితం కెనడాకు వలస వచ్చింది. 2020లో పురుషుడి నుంచి స్త్రీగా మారేందుకు సిద్ధమైన ఆమె 2021లో వైద్యపరంగా పూర్తి స్థాయిలో మహిళగా మారింది. ట్రాన్స్జెండర్స్కు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ నిబంధనలు మార్చింది. మరోవైపు మ్యాచ్ అధికారులు, అంపైర్లకు ఇకపై లింగబేధం లేకుండా పురుష అంపైర్లతో సమానంగా మహిళా అంపైర్లకు వేతన భత్యాలు ఇస్తారు. -
ఆల్ టైమ్ హై రికార్డు సెట్ చేసిన 2023 వరల్డ్కప్
2023 వన్డే ప్రపంచకప్ హాజరు విషయంలో ఆల్టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈ ఎడిషన్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్కప్గా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రపంచకప్కు 1,250,307 మంది హాజరైనట్లు ఐసీసీ ప్రకటించింది. 13 వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో ఇదే అత్యధిక హాజరు కలిగిన వరల్డ్కప్గా రికార్డైంది. ఇందులో ఒక్క ఫైనల్ మ్యాచ్కే లక్ష మంది వరకు ప్రేక్షకులు హాజరయ్యారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 92453 మంది హాజరయ్యారు. ఇదిలా ఉంటే, నవంబర్ 19న జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. రికార్డు స్థాయిలో ప్రేక్షకుల బ్రహ్మరథం భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్ను రికార్డుస్థాయిలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. పది జట్లు పోటీపడిన ఈ మెగా ఈవెంట్ 48 మ్యాచ్లను 12,50,307 మంది ప్రేక్షకులు చూశారని ఐసీసీ ధ్రువీకరించింది. అంటే సగటున ఒక్కో మ్యాచ్కు 26000 మంది హాజరైనట్లు తెలిపింది. ఆసీస్, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 2015 వన్డే ప్రపంచకప్ను 10,16,420 మంది వీక్షించి రికార్డు సృష్టించగా... దీన్ని తాజా ప్రపంచకప్ బద్దలుకొట్టింది. -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడనుంది. -
CWC 2023: బంగ్లాదేశ్కు లక్కీ ఛాన్స్
వన్డే వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. బుధవారం (నవంబర్ 15) జరుగబోయే తొలి సెమీఫైనల్లో (ముంబై) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్కతా) సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన 8 జట్లు ఏవంటే..? వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిసిన అనంతరం టాప్-8లో నిలిచే జట్లే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయా స్థానాల్లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ బెర్త్ ముందుగానే ఖరారైంది. బంగ్లాదేశ్కు లక్కీ ఛాన్స్.. శ్రీలంకకు నిరాశ పాయింట్ల పట్టికలో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు నిరాశ ఎదురు కాగా.. ఈ జట్లతో సమానంగా వరల్డ్కప్లో రెండే మ్యాచ్లు గెలిచిన బంగ్లాదేశ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. 2002 ఎడిషన్ ఛాంపియన్ అయిన శ్రీలంక ప్రస్తుత వరల్డ్కప్లో పేలవ ప్రదర్శనతో ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కోల్పోవడంతో పాటు ఐసీసీ బ్యాన్కు కూడా ఎదుర్కొంటుంది. ఆపసోపాలు పడి అర్హత సాధించిన ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రస్తుత వరల్డ్కప్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని తుది దశ లీగ్ మ్యాచ్ల వరకు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండింది. అయితే ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకి ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ను ఖరారు చేసుకుంది. పాపం నెదర్లాండ్స్.. ప్రస్తుత వరల్డ్కప్లో తమకంటే చాలా రెట్లు పటిష్టమైన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ మిగతా మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించలేకపోయింది. వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్లకు నో ఛాన్స్.. 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయిన ఐసీసీ ఫుల్ టైమ్ సభ్య దేశాలైన వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత కోల్పోయాయి. ఐసీసీ పెట్టిన మెలిక కారణంగా ఈ జట్లకు చుక్కెదురైంది. -
ICC: శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..
దుబాయ్: శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది. భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు. అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం. -
గెలుపు జోష్లో ఉన్న పాకిస్తాన్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
వన్డే ప్రపంచకప్-2023 కీలక మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించిన పాకిస్తాన్కు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి పాకిస్తాన్ తమ కోటా ఓవర్ల కంటే రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్ విధించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ కోత విధుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్పై డక్వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. ఈ విజయంతో పాక్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్వర్త్ లూయిస్ లెక్కల ప్రకారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ 21 పరుగులు ముందంజలో ఉంది. దీంతో పాక్ను విజేతగా నిర్ణయించారు. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెప్టెన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. -
‘టాప్’ ర్యాంక్లో షాహిన్ అఫ్రిది
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది తొలిసారి టాప్ ర్యాంక్ను అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో షాహిన్ అఫ్రిది 673 పాయింట్లతో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. హాజల్వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ నుంచి రెండో ర్యాంక్కు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో షాహిన్ 16 వికెట్లు పడగొట్టి ఆడమ్ జంపా (ఆ్రస్టేలియా), మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వన్డే ఫార్మాట్లో ఏకకాలంలో బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ క్రికెటర్లు నంబర్వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. -
రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషిద్ ఖాన్కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్ టాటా కొట్టిపారేశారు. గత వారం ప్రపంచకప్లో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్పై పంజా విసిరింది. పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్గాన్ క్రికెటర్ రషిద్ ఖాన్ ఇండియన్ ఫ్లాగ్ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్ ఖాన్కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్ టాటా..రషిద్ ఖాన్కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players. I have no connection to cricket whatsoever Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official… — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 ఆ కథనాల్ని రతన్ టాటా ఖండించారు. తనకు క్రికెట్తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్కి రివార్డ్ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన అధికారిక ప్లాట్ఫారమ్ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్ టాటా నెటిజన్లను కోరారు. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై..