సచిన్‌కు ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు'.. బెస్ట్‌ ప్లేయర్లగా బుమ్రా, మంధాన | Sachin Tendulkar To Get BCCI Lifetime Achievement Award, Check Full List Details Inside | Sakshi
Sakshi News home page

BCCI: సచిన్‌కు ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు'.. బెస్ట్‌ ప్లేయర్లగా బుమ్రా, మంధాన

Published Sat, Feb 1 2025 7:52 AM | Last Updated on Sat, Feb 1 2025 12:07 PM

Sachin Tendulkar to get BCCI Lifetime Achievement Award

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. 

నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్‌కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్‌ తురుపుముక్క సచిన్‌ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 664 మ్యాచ్‌లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్‌లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా క్రికెట్‌ పుటల్లోకెక్కాడు.

బుమ్రాకు పాలీ ఉమ్రిగర్‌..
అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్‌ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్‌ బెస్ట్‌ క్రికెటర్‌’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.

గతేడాది 13 టెస్టుల్లో ఆడిన  బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో భారత స్పీడ్ స్టార్‌ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్‌-2024ను భారత్‌ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.

మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్‌​ క్రికెటర్‌ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ది ఈయర్‌ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.

మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్‌ బెస్ట్‌ క్రికెటర్‌'  అవార్డు వరించింది.  గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.
చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్‌ టీమిండియా వశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement