ICC World Cup 2019
-
ధోని రనౌట్తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా!
వెస్టిండీస్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్లో ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనికి తోడు సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్ రనౌట్ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్ కవర్స్ దిశగా ఆడాడు. అక్షర్ పటేల్ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్ మేయర్స్ నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్ రనౌట్ను ఎంఎస్ ధోని రనౌట్తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్కప్లో సెమీఫైనల్లో ధోని రనౌట్ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో షాట్ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్ గప్టిల్ అద్బుతమైన డైరెక్ట్ హిట్కు రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ధోని రనౌట్ కావడంతో అభిమానులు గుండె బరువెక్కిపోయింది. ఈ మ్యాచే ధోనికి అంతర్జాతీయంగా ఆఖరి మ్యాచ్గా మారిపోయింది. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా సంజూ శాంసన్ రనౌట్ను ధోని రనౌట్తో పోల్చడంతో అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''ధోని రనౌట్తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్కు ఎండ్కార్డ్ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసినట్లేనా''.. మీ లాజిక్లు తగలయ్యా.. బోలెడు కెరీర్ ఉన్న శాంసన్ ఔట్ను ధోని రనౌట్తో పోల్చకండి.. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/cAl95iDMV7 — No-No-Crix (@Hanji_CricDekho) August 3, 2023 WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 చదవండి: Deodhar Trophy: రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్జోన్ -
మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది
Virender Sehwag Knocks Eoin Morgan.. ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో అశ్విన్- మోర్గాన్ మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. అశ్విన్దే తప్పు అని కొందరు విమర్శిస్తుంటే.. మోర్గాన్ది తప్పంటూ మరికొందరు పేర్కొంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్కు మద్దతిస్తూ మోర్గాన్పై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అశ్విన్- మోర్గాన్ విషయంలో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు. రిషబ్ పంత్- అశ్విన్ జోడి రెండో పరుగు కోసం ప్రయత్నించడమే ఇక్కడ తప్పని.. అందుకే మోర్గాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు. కార్తిక్ కామెంట్స్పై సెహ్వాగ్ స్పందించాడు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది ''అది జూలై 14.. 2019 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఫైనల్ ఓవర్లో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి అదనంగా రెండు పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయడం.. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించడం జరిగిపోయాయి. మోర్గాన్ ప్రకారం న్యాయంగా ఉంటే ఓవర్ త్రోకు పరుగులు తీయకూడదు.. కానీ స్టోక్స్ రన్స్ తీశాడు. దీని ప్రకారం మోర్గాన్ స్టోక్స్కు వ్యతిరేకంగా లార్డ్స్ బయట ధర్నా చేయాలి.. అంతేగాక మోర్గాన్ ఒక కెప్టెన్గా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించాలి.. న్యాయబద్ధంగా న్యూజిలాండ్కు ట్రోఫీ అందించాలి. మరి మోర్గాన్ అప్పుడు అలా ఎందుకు చేయలేదు.. పైగా ఇప్పుడేమో అశ్విన్ను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి'' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2021: ఫామ్లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే On July 14th , 2019 when it ricocheted of Ben Stokes bat in the final over, Mr Morgan sat on a Dharna outside Lord’s and refused to hold the World cup trophy and New Zealand won. Haina ? Bade aaye, ‘doesn’t appreciate’ waale 😂 pic.twitter.com/bTZuzfIY4S — Virender Sehwag (@virendersehwag) September 29, 2021 -
భీకరమైన ఫామ్; మెగా టోర్నీలో 5 సెంచరీలు.. నేటితో రెండేళ్లు
సాక్షి, వెబ్డెస్క్: టీమిండియా ఓపెనర్.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్లో భీకరమైన ఫామ్లో ఉన్నాడు. సెంచరీలు కాదని డబుల్ సెంచరీలను మంచీనీళ్ల ప్రాయంగా మలిచిన రోహిత్ ఆ మెగా టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అప్పటివరకు ఒక ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉండేది. రోహిత్ ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త చరిత్రను సృష్టించాడు. రోహిత్ ఆ రికార్డు సాధించి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా అప్పటి ఆసక్తికర విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. లీగ్ దశలో న భూతో భవిష్యత్తు అనేలా రోహిత్ ఆటతీరు సాగింది. కొడితే భారీ స్కోర్లు ఖాయం అనేలా అతని ఇన్నింగ్స్లు సాగాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై 122* పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 140 పరుగులు, ఇంగ్లండ్పై 102, బంగ్లాదేశ్పై 104 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 103 పరుగులతో శతకం సాధించిన రోహిత్ ఒక మేజర్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్లపై మాత్రం విఫలమైన రోహిత్ ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 57 పరగులు చేశాడు. రోహిత్ జోరుతో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ ఇదే టెంపోనూ కివీస్తో జరిగిన సెమీఫైనల్లో చూపెట్టలేకపోయాడు. ఆ మ్యాచ్లో రోహిత్ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే రోహిత్ ఇదే ప్రపంచకప్లో మరో రికార్డును కూడా సాధించాడు. ఒక్క ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఐదు సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. అంతకముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(673 పరుగులు, 2003 ప్రపంచకప్), ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్( 659 పరుగులు, 2007 ప్రపంచకప్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతేగాక టీమిండియా తరపున సచిన్ తర్వాత ఒక ప్రపంచకప్లో 600 పైచిలుకు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం. -
కొత్త జగజ్జేత అవతరించిన రోజు
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్మెన్, వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్ ఓవర్. అది చాలక బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. క్రికెట్లో వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్ ఫైనల్ అవుతుంది.వన్డేల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్ పోరాటంతో ఆఖరి ఓవర్లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్ వద్ద స్టోక్స్ ఇచ్చిన క్యాచ్ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.(‘గంగూలీలా ధోని చేయలేదు’) ఆరు బంతులు.. 15 పరుగులు ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న బౌల్ట్ తొలి రెండు డెలివరీలను డాట్స్గా మలిచాడు. స్టైక్లో ఉన్న స్టోక్స్ మూడో బంతిని సిక్సర్గా మలిచి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన స్టోక్స్ పరుగు కోసం డైవ్ చేశాడు. ఫీల్డర్ గప్టిల్ శరవేగంగా బంతిని త్రో చేశాడు. అది స్టోక్స్ బ్యాట్ను బలంగా తాకి బౌండరీ దాటింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నివ్వెరపోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఇంగ్లండ్ బ్యాట్స్మన్ మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో స్టోక్స్, జోస్ బట్లర్ కలిసి న్యూజిలాండ్కు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.న్యూజిలాండ్ బ్యాట్స్మన్ జేమ్స్ నీషమ్ ఓ సిక్సర్ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలుస్తుంది. రెండు పరుగుల కోసం ఊపిరి బిగబట్టి చేసిన ప్రయత్నంలో గప్టిల్ రనౌట్ అయ్యాడు. దాంతో న్యూజిలాంట్ టీమ్ నిరాశలో కూరుకుపోయింది.ఇంగ్లండ్ క్రీడాకారుల విజయనాథంతో లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఉర్రూతలూగింది. ఈ మ్యాచ్లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్(26), న్యూజిలాండ్(17)పై గెలుపొందింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో క్రికెట్కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్కు అదే తొలి కప్. -
భారత అభిమానుల గుండె పగిలిన రోజు
ముంబై : 2019.. జూలై 10వ తేది.. ప్రపంచకప్లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్. భారత విజయలక్ష్యం 240 పరుగులు. అప్పటికే టీమిండియా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో క్రీజులో ఉన్న ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలు జట్టును ఓటమి నుంచి తప్పించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇద్దరు కలిపి 7వ వికెట్కు అబేధ్యమైన 116 పరుగులు జోడించారు. కాగా జట్టు స్కోరు 207 పరుగుల వద్ద ఉన్నప్పుడు 77 పరుగులు చేసిన జడేజా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అయినా భారత అభిమానులు ఏ మాత్రం బెదరలేదు .. ఎందుకంటే అప్పటికే ధనాదన్ ధోని క్రీజులో పాతుకుపోయాడు. ధోని ఉన్నాడన్న ధైర్యం అభిమానులను కుంగిపోకుండా చేసింది. 2011 ఫైనల్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని, లార్డ్స్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఉంటుందని అంతా భావించారు.అయితే విజయానికి 24 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ధోని రనౌట్ అయ్యాడు. అంతే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. ఇది నిజమా కాదా అని నిర్థారించుకునేలోపే ధోని పెవిలియన్ బాట పట్టాడు. అప్పటిదాకా ధోని ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగిన అభిమానుల గుండెలు పగిలాయి. టీమిండియాను ఫైనల్లో చూస్తామన్న వారి కలల ఆవిరయ్యాయి. చూస్తుండగానే భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేవలం 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.('కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు') అప్పటిదాకా ధోని మీద అభిమానం ఉన్నవాళ్లు కూడా.. ధోని ఎందుకిలా చేశాడు.. ఒక్క పరుగుతో సరిపెట్టుకుంటే ఫలితం వేరేలా వచ్చి ఉండేది అంటూ దుమ్మెత్తిపోశారు. యాదృదశ్చికమె లేక దురదృష్టమో తెలియదు గాని మహీ చివరిసారిగా మైదానంలో కనిపించింది ఆరోజే. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీ ధరించలేదు.ఈ బాధ భారత్ క్రికెట్తో పాటు అభిమానులను కూడా చాలా కాలం వెంటాడింది. సరిగ్గా ఈ ఘటన జరిగి ఈ రోజుకు ఏడాది. ఐసీసీ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ట్విటర్లో ధోని రనౌట్ వీడియోను షేర్ చేసింది. 'భారత అభిమానుల గుండె పగిలిన సన్నివేశం ఇది' అంటూ క్యాప్షన్ జత చేశారు. WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 కాగా అప్పటి 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా ఆడాల్సి వచ్చింది. జూలై 9, 2019న టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేన్ విలియమ్సన్ సేనను భూవీ, బుమ్రా జోడి కట్టుదిట్టమైన బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టింది. కివీస్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అర్థసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేసింది. మరుసటి రోజు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ విఫలంతో 49.3 ఓవర్లలో 221 పరుగులు వద్ద ఆలౌటైంది. -
'కోపం వచ్చింది.. ఏం చేయలేకపోయా'
ఢిల్లీ : ఇండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మజా ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోనే కాదు బయట కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 2019 ప్రపంచకప్ సందర్భంగా జూన్ 16న మాంచెస్టర్లో పాకిస్తాన్తో లీగ్ మ్యాచ్కు ఒకరోజు ముందు జరిగిన ఘటనను తాజాగా విజయ్శంకర్ భారత్ ఆర్మీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. ' పాక్తో మ్యాచ్కు ఒకరోజు ముందు జట్టు మేనేజ్మెంట్ నా దగ్గరకు వచ్చి రేపటి మ్యాచ్లో నువ్వు ఆడుతున్నావు. సిద్ధంగా ఉండు అని చెప్పడంతో నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత అదే రోజు కొంతమంది ఆటగాళ్లం కాఫీ కోసమని బయటకు వెళ్లాం. అదే సమయానికి అక్కడికి వచ్చిన పాక్ అభిమాని మా వద్దకు వచ్చి ఏవో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా చేస్తుంటే చాలా కోపం వచ్చింది. అయితే చూస్తూ ఊరుకున్నాం తప్ప అతన్ని ఏం చేయలేకపోయాం. భారత్- పాక్కు మ్యాచ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే నాకు మొదటిసారి తెలిసింది ' అని పేర్కొన్నాడు.(అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర) 2019 ప్రపంచకప్కు అప్పటికే మంచి ఫామ్లో ఉన్న అంబటి రాయుడుని కాదని త్రీ డైమన్షనల్ ప్లేయర్ అంటూ విజయ శంకర్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కాగా శిఖర్ ధావన్ గాయం కారణంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్.. ఆ మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్మెంట్ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్ శంకర్ వేశాడు. తాను వేసిన తొలి బంతికి ఇమాముల్ హక్ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్లో సర్ఫరాజ్ వికెట్ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్లతో జరిగిన మ్యాచ్ల్లో తుది జట్టుకు ఎంపికైన విజయ్ అఫ్గాన్తో మ్యాచ్లో 29 పరుగులు, విండీస్తో మ్యాచ్లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే అంతలోనే కాలి బొటనవేలి గాయంతో మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. అప్పటినుంచి ఒకవన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. మొత్తంగా టీమిండియా తరపున 12 వన్డేల్లో 223 పరుగులు, 4 వికెట్లు తీశాడు. -
ప్చ్.. ధోని అలా బ్యాటింగ్ చేసాడేంటి?
హైదరాబాద్: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ తీరును ఇంగ్లీష్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుపట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో ధోని బ్యాటింగ్ వింతగా అనిపించిందన్నాడు. స్టోక్స్ త్వరలో ఆవిష్కరించనున్న 'ఆన్ఫైర్' అనే పుస్తకంలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్లో ధోని, జాదవ్ ఆటలో అసలు ఏ మాత్రం కసి కనిపించలేదన్నాడు. గెలిచే అవకాశం ఉంటే దూకుడుగా ఆడటమై సరైనదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ క్రిజులోకి వచ్చాడు. అప్పుడు అతడి ఆటలో కసి కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా.. సింగిల్స్పైనే ఎక్కువ దృష్టి సారించడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు మేం నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించాలి. కానీ ధోని, జాదవ్ల బ్యాటింగ్ మ్యాచ్ను మా వైపు టర్న్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్, కోహ్లిల బ్యాటింగ్కు కూడా విచిత్రంగా అనిపించింది. 27 ఓవర్ల వరకు క్రీజులో ఉండి 138 పరుగుల భాగస్వామ్యమే నమోదు చేశారు. అయితే మేం బాగా బౌలింగ్ చేశామని తెలుసు. కానీ టీమిండియా బ్యాటింగ్ విచిత్రంగా అనిపించింది. ఇలాంటి సమయంలో అటాకింగ్ చేసి మాపై ఒత్తిడి పెంచాలి. కానీ ఆ విషయంలో రోహిత్-కోహ్లిలు విఫలమయ్యారు. దీంతో విజయవకాశాలు మాకు ఎక్కువయ్యాయి’ అని స్టోక్స్ అనాటి మ్యాచ్కు సంబంధించిన విషయాలను గుర్తుచేశాడు. ఇక ఈ మ్యాచ్లో 31 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: టీ20 ప్రపంచకప్ వాయిదా? రేపు క్లారిటీ! 'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్కే నా ఓటు' -
టీమిండియా ‘సూపర్ఫ్యాన్’ ఇకలేరు
లండన్: గతేడాది జరిగిన వరల్డ్కప్లో టీమిండియా ‘సూపర్ఫ్యాన్’ చారులతా పటేల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భారత్ గెలిచిన ప్రతీ మ్యాచ్లోనూ ఆమె సందడి చేస్తూ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్ను తీసుకొచ్చారు. 87 ఏళ్ల వయసులో చారులా పటేల్ క్రికెట్ మ్యాచ్లకు చూడటానికి స్టేడియానికి వచ్చీ మరీ మ్యాచ్లను వీక్షించారు. అయితే ఇప్పుడు ఆమె ఇకలేరని వార్త క్రికెట్ అభిమానుల్లో విషాదం నింపింది. జనవరి 13వ తేదీ ఉదయం గం. 5.30.నిలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వన్డే వరల్డ్కప్లో టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చారులతా పటేల్ ఒక సెలబ్రెటీగా మారిపోయారు. మ్యాచ్ జరుగుతున్నంతా సేపు అభిమానుల్ని ఉత్సాహ పరుస్తూ ఆమె సందడి చేశారు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆమెతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయం. కాగా తాను భారత క్రికెట్ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నారు. 1983లో కపిల్ సేన ప్రపంచ కప్ను ముద్దాడిన సమయంలో తాను స్టేడియంలోనే ఉన్నానని విషయాన్ని చారులతా పటేల్ ఇది వరకే తెలపడం ఆమెకు క్రికెట్పై ఉన్న ప్రేమకు, ప్రధానంగా భారత జట్టుపై ఉన్న అభిమానానికి నిదర్శనం. భారత సంతతికి చెందిన ఆమె.. పుట్టి పెరిగింది విదేశాల్లోనే. బ్రిటన్కు రాకముందు ఆమె దక్షిణాఫ్రికాలో ఉండేవారు. 1975 నుంచి ఆమె బ్రిటన్లో ఉన్నారు. చిన్నప్పట్నుంచి క్రికెట్కు వీరాభిమాని అయిన చారులతా పటేల్.. భారత్ ఆడే మ్యాచ్లను క్రమం తప్పకుండా టీవీల్లో వీక్షించేవారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘ఈ విషయాన్ని శోకతప్త హృదయాలతో తెలియపరచాల్సి వస్తుంది. మా గ్రాండ్ మదర్ తుది శ్వాస విడిచారు. ఆమె చాలా మంచి మనిషే కాదు.. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కూడా ఆమె సొంతం. ఆమె మా ప్రపంచం’ అని చారులతా పటేల్ ఇన్స్టాగ్రామ్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు పోస్ట్ చేశారు. చారులతా పటేల్ మృతిపై బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. చారులతా ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంది. -
రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2019లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య జరిగిన ఈ ఉద్వేగభరితమైన మ్యాచ్ను ప్రపంచ వ్యాప్తంగా 273 మిలియన్ల మంది టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించగా.. డిజిటల్ వేదికగా 50 మిలియన్ల మంది తిలకించారు. ఈ వివరాలు ఐసీసీ మీడియా అధికారికంగా ప్రకటించింది అంతేకాకుండా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక సెమీఫైనల్ను కూడా ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ను 25.3 మిలియన్ల మంది లైవ్స్ట్రీమింగ్లో వీక్షించారు. ఓవరాల్గా ఈ ప్రపంచకప్ను 1.6 బిలియన్లకు(160 కోట్లు)పైగా క్రికెట్ అభిమానులు ఆదరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్స్, లైవ్, హైలెట్స్ 20,000 గంటలకు పైగా ప్రసారం కావడం విశేషం. గత ప్రపంచకప్తో పోలిస్తే ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీని 38 శాతం మంది అధికంగా తిలకించారని ఐసీసీ తెలిపింది. దీంతో అన్ని విధాల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ విజయవంతమైనట్లు ఐసీసీ ఆనందం వ్యక్తం చేసింది. టోర్నీ ఆరంభంలో పలు మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో అభిమానులకు ప్రపంచకప్పై ఆసక్తి పోయిందని వార్తలు వచ్చాయి. కానీ టోర్నీ నడుస్తున్న కొద్దీ మ్యాచ్లు రసవత్తరంగా జరగడంతో ప్రపంచకప్కు డబుల్ క్రేజ్ ఏర్పడిందని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
అదే అతి పెద్ద పరాభవం: రవిశాస్త్రి
ఆంటిగ్వా: వన్డే వరల్డ్కప్లో టీమిండియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడమే తన గత రెండేళ్ల కోచింగ్ పర్యవేక్షణలో అతి పెద్ద పరాభవమని మరొకసారి ప్రధాన కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆ మెగా టోర్నీలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచినప్పటికీ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. కేవలం 30 నిమిషాల ఆటే తమ నుంచి మ్యాచ్ను లాగేసుకుందని రవిశాస్త్రి అన్నాడు. ‘ 2019 వరల్డ్కప్ లీగ్ దశలో కేవలం ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా టాప్లో నిలిచాం. కానీ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆటే మమ్మల్ని వెనక్కి నెట్టింది. నా గత రెండేళ్ల కోచింగ్ కెరీర్లో అది పెద్ద పరాభవం. ఒక చెడు రోజు, ఒక చెత్త సెషన్ మాకు శాపంగా మారింది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ‘తదపరి రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్షిప్ మొదలైంది. 2021లో టీ20 వరల్డ్కప్ జరుగనుంది. ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మేరకు సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యం’ అని తెలిపాడు. గత వారం టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడా?
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పదవికి ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడు. వరల్డ్కప్లో వెన్నునొప్పి బాధతో సతమతమైన మోర్గాన్.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది. తాజాగా మోర్గాన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి. కెప్టెన్గా కొనసాగాలా.. వద్దా అనేది గత కొన్ని రోజులుగా తనకు ఒక ప్రశ్నగా వేధిస్తుందని, దీనిపై త్వరలోనే కచ్చితమైన నిర్ణయం వెలువరిస్తారనని పేర్కొన్నాడు. ‘నేను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కాస్త సమయం పడుతుంది. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం పెద్ద బాధ్యత. నాకు తప్పుకోవాలని ఉన్నా.. అది చాలా పెద్ద నిర్ణయంగా మారింది. ప్రస్తుత కాలం త్వరగా గడిస్తే పూర్తిగా కోలుకుంటాను. అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. 2021 టీ20 వరల్డ్కప్ వరకూ కెప్టెన్గా కొనసాగితే అది చాలా పెద్ద నిర్ణయమే అవుతుంది. చూద్దాం.. ఏమి జరుగుతుందో?’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఫలితంగా నాలుగు దశాబ్దాల ఇంగ్లండ్ కలను మోర్గాన్ నిజం చేసినట్లయ్యింది. -
ఆ ‘ఓవర్ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో ‘ఓవర్ త్రో’కు ఆరు పరుగులు కేటాయించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ‘ఓవర్ త్రో’కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని తాను ఎంపైర్తో చెప్పినట్టు వచ్చిన కథనాలపై తాజాగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అంపైర్ వద్దకు వెళ్లి.. అదనపు నాలుగు పరుగులు వద్దని కోరినట్టు వచ్చిన కథనాలన్నీ వదంతులేనని అతను తేల్చిచెప్పాడు. బీబీసీ పొడ్క్యాస్ట్లో మాట్లాడిన స్టోక్స్.. గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్తున్నా. నేను ఎంపైర్ వద్దకు వెళ్లి.. అలాంటిదేమీ చెప్పలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ టామ్ లాథమ్ వద్దకు వెళ్లి క్షమాపణ అడిగానని, అలాగే కివీస్ సారథి కేన్ విలియమ్సన్ను క్షమించమని కోరానని వెల్లడించాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్త్రో’ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ దాటగా.. అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు విమర్శించారు కూడా. అయితే, నిజానికి స్టోక్స్.. ఆ ఓవర్త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించడంతోపాటు.. అసలు అదనపు పరుగులు వద్దని స్టోక్స్ వేడుకున్నా అంపైర్లు వినిపించుకోలేదని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ ఈ కథనాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. క్లారిటీ ఇచ్చారు. -
‘బౌండరీ రూల్’ మారుతుందా?
దుబాయ్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో గెలుపును నిర్ణయించడం సరికాదని పలువురు క్రికెట్ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఎట్టకేలకు ఐసీసీ దిగివచ్చింది. ఈ రూల్ ఎంతవరకూ సమంజసం అనే దానిపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది.దీనిలో భాగంగా బౌండరీల లెక్కించే నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిర్వహించే తదుపరి సమావేశంలో ఈ నిబంధనపై చర్చించనున్నారు. సమావేశం వచ్చే ఏడాది త్రైమాసికంలో జరగుతుందని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ తెలిపారు. ‘మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నారు. సూపర్ ఓవర్లో కూడా పరుగులు సమం అయితే బౌండరీల లెక్కతో గెలుపును ప్రకటిస్తారు. ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20లీగ్ల్లోనూ దాదాపుగా ఇదే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీ క్రికెట్లో ఒకే తరహాలో సూపర్ ఓవర్ నిబంధనలు ఉండాలి. దీనిపై ప్రత్యామ్నాయాలు ఉంటే అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ పరిశీలిస్తుంది’ అని జియోఫ్ పేర్కొన్నారు. మరి బౌండరీ రూల్ మారుతుందో.. లేదో చూడాలి. -
ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ
దుబాయ్ : ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్త్రో వివాదాస్పదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) స్పందించింది. ఈ విషయంలో అంపైర్ కుమార ధర్మసేనది ఏ మాత్రం తప్పులేదని వెనకేసుకొచ్చింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠకర ఫైనల్ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓవర్త్రో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఖరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్లడం.. ఫీల్డ్ అంపైర్ ధర్మసేన 6 పరుగులివ్వడం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఐదు పరుగులు ఇవ్వాలని ధర్మసేన అత్యుత్సాహంతో 6 పరుగులిచ్చి న్యూజిలాండ్ ఓటమికి కారణమయ్యాడని అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ధర్మసేన తన తప్పును అంగీకరించాడు. కానీ తన నిర్ణయం పట్ల పశ్చాతాపం మాత్రం వ్యక్తం చేయనన్నాడు. ఇక తాజాగా ఈ వివాదంపై ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జియోఫ్ అలార్డిస్ స్పందించాడు. ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ల తప్పేం లేదన్నాడు. ‘ ఆ రోజు ఫీల్డ్ అంపైర్లు సరైన విధానంలోనే నిర్ణయం ప్రకటించారు. ఫీల్డర్ త్రో వేసే సమయానికి బ్యాట్స్మన్ ఇద్దరు ఒకరినొకరు దాటారని భావించి, పద్దతి ప్రకారం చర్చించుకునే ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో బ్యాట్స్మెన్ ఒకరినొకరు దాటారా? లేరా? అనే నిబంధనపై వారికి అవగాహన ఉండటం గొప్ప విషయం. కానీ ఆ పరిస్థితులు థర్డ్ అంపైర్ను సమీక్ష కోరే అవకాశాన్ని ఇవ్వవు. ఇక ఫీల్డ్ అంపైర్లు తుది నిర్ణయం ప్రకటించాక, అది తప్పని మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోలేడు’ అని చెప్పుకొచ్చారు. -
‘పెయిన్ కిల్లర్స్తోనే ప్రపంచకప్ ఆడాను’
లండన్ : ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసి ఇంగ్లండ్కు విజయాన్నందించాడు. ఆడిన తొలి ప్రపంచకప్లోనే జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిన మెగా టైటిల్ను అందించాడు. అయితే ఈ టోర్నీ ఆద్యాంతం పక్కటెముకల నొప్పితో విలపించినట్లు ఆర్చర్ ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. పెయిన్ కిల్లర్లు లేనిదే ఆడలేని పరిస్థితి ఏర్పడిందని తన బాధను వెల్లడించాడు. విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదని, జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. అఫ్గానిస్తాన్ మ్యాచ్లో ఈ నొప్పి మరింత తీవ్రమైందని కానీ అప్పటికే జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉందన్నాడు. ‘తీవ్ర నొప్పితో విలవిలలాడాను. అదృష్టవశాత్తు ఆ నొప్పి నుంచి త్వరగానే కోలుకున్నాను. కానీ అది వర్ణించలేని బాధ. అఫ్గాన్ మ్యాచ్ అనంతరం పెయిన్ కిల్లర్స్ లేనిదే ఆడలేని పరిస్థితి నెలకొంది. కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదు.’ అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ అద్భుత ప్రదర్శనతో యాషెస్ టెస్ట్ సిరీస్ ఎంపికైన ఈ యువ పేసర్.. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. -
‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’
రావల్పిండి : తాజా ప్రపంచకప్లో పాకిస్తాన్ ఓటమిని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనను, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వైఫల్యాలను వేలెత్తి చూపుతూ నిందిస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ పాక్ సారథి సర్ఫరాజ్పై మరోసారి నిప్పులు చెరిగాడు. బుధవారం తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్ట్ చేసిన అక్తర్.. పాక్ జట్టుకు సారథిని మార్చే సమయం వచ్చిందంటూ పేర్కొన్నాడు. అయితే సర్ఫరాజ్ను జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదన్నాడు. అతడి కీపింగ్, బ్యాటింగ్ పాక్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. సర్ఫరాజ్ స్థానంలో వన్డే, టీ20లకు హారీస్ సోహైల్ను, టెస్టులకు బాబర్ అజమ్ను సారథులుగా ఎంపిక చేయాలని సూచించాడు. ‘సర్ఫరాజ్ స్వతహాగా సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే బెటర్. కెప్టెన్సీ నుంచి తప్పుకొని బ్యాటింగ్, కీపింగ్పై దృష్టి పెడితే అతడికి, పాక్ క్రికెట్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచకప్లో పాక్ సారథిగా సర్ఫరాజ్ తేలిపోయాడు. యువకులకు సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బెటర్. హారీస్ సోహైల్(వన్డే, టీ20), బాబర్ అజమ్(టెస్టు)లకు సారథ్య బాధ్యతలను అప్పంగించాలి’అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఇక గతంలో కూడా సర్ఫరాజ్ ‘తెలివితక్కువ సారథి’అంటూ వ్యాఖ్యానించాడు. ఇక పాక్ జట్టును త్వరలోనే అన్ని విధాల సెట్ చేస్తానని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆర్చర్.. టైమ్ మిషన్ ఉందా ఏందీ?
ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్లు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని కలిగించాయి. తాజాగా ఐర్లాండ్తో నాలుగు రోజుల టెస్ట్ సందర్భంగా కూడా మరోసారి అతని పాత ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. 2013లో చేసిన ట్వీట్లలో ఆర్చర్ చెప్పినట్లు ఇప్పుడు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘6 బంతులు16 పరుగులు’ అని చేసిన ట్వీట్ ప్రపంచకప్ అనంతరం చర్చకు దారీ తీసింది. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే 2014లో లార్డ్స్కు వెళ్తున్నాం.. 2015లో సూపర్ ఓవర్ను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేశాడు. ఇవి కూడా ప్రపంచకప్ ఫైనల్ పరిస్థితులనే తలపించాయి. 2015లో ‘ఐర్లాండ్ లుకింగ్ గుడ్’ అని చేసిన ట్వీట్ మరోసారి ఈ తరహా చర్చకు దారితీసింది. బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 85 పరుగులకే కుప్పకూల్చింది. అయితే ఇది ఊహించే ఆర్చర్ 2015లో ట్వీట్ చేశాడా? అని అభిమానులు మళ్లీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్ను క్రికెట్ ఐర్లాండ్ రీట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఆర్చర్ నీ దగ్గర ఏమైనా టైం మిషన్ ఉందా? అని ఒకరు.. ‘ఆర్చర్ జ్యోతిష్యం చెప్పరాదు’ అని మరొకరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఇంగ్లండ్కు షాకిచ్చిన ఐర్లాండ్) :) https://t.co/hSPNT9iv9v — Cricket Ireland (@Irelandcricket) July 24, 2019 -
అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి
న్యూఢిల్లీ : కెరీర్లోని వైఫల్యాలు, ఎదురుదెబ్బలే తనను మరింత రాటుదేలేలా చేసాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. ప్రపంచకప్ ఓటమి అనంతరం టైమ్స్ నౌకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ.. వైఫల్యాలే తనను మనిషిగా మెరుగుపర్చాయని చెప్పుకొచ్చాడు. ‘నా జీవితంలోనే వైఫల్యాలు, ఎదురుదెబ్బలతోనే చాలా నేర్చుకున్నాను. వీటి నుంచి స్పూర్తిపొందడమే కాకుండా ఓ మనిషిగా కూడా మెరుగయ్యాను. విజయాల కంటే వైఫల్యాల ప్రాముఖ్యతను నాకు అర్థమయ్యేలా చేసిన సందర్భాలు కూడా ఇవే. కావాల్సిందేదో తెలుసుకునేలా.. ప్రణాళికలు రచించుకునేలా చేసాయి. అలాగే మద్దతుగా ఉండే వ్యక్తులు ఎవరు? తప్పుకునేవారు ఎవరని కూడా తెలియజేసాయి. మనం ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని కుంగదీస్తాయి. ప్రతీ ఒక్కరు బాగా ఆడుతున్నా మనం ఆడలేకపోతాం. మనం ఏ తప్పు చేయలేదని మనకు తెలుస్తోంది. కానీ తోటి ఆటగాళ్లు మాత్రం మనల్ని మించిపోతారు. ఇలాంటి విషయాలు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఒకొక్కసారి ఓడిపోవడం జరుగుతుంది. సాధారణంగా మనం పొరపాట్లు చేసినప్పుడు.. దాన్ని ఎత్తి చూపితే.. పెద్దగా పట్టించుకోం. కానీ మనం ఒక మంచి ప్లేయర్ అయ్యాక ఏమైనా తప్పులు ఎత్తి చూపితే వాటిని తట్టుకోలేం. అలాంటివాటికోసం ఆలోచిస్తూ... వాటి నుంచి తొందరగా బయటపడలేం’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్లో వరుస 5 హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న కోహ్లి కీలక సెమీస్లో చేతులెత్తేయడం.. మిగతా బ్యాట్స్మెన్ కూడా రాణించకపోవడంతో భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటకు సిద్ధమైన భారత్.. ప్రపంచకప్ ఓటమి నుంచి కోలుకోని ఈ సిరీస్లో రాణించాలని భావిస్తోంది. -
నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్
ఇంగ్లండ్తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తన జీవితంలోనే ఓ దుర్దినమని, అద్భుతం కూడా అని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తెలిపాడు. యాక్షన్ థ్రిల్లర్ను తలపించిన మెగా ఫైనల్ టై కావడం... అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే. అయితే గెలుపు ముంగిట నిలిచి దురదృష్టంతో కివీస్ టైటిల్ అందుకోకపోవడంలో గప్టిల్ది కాదనలేని పరోక్షపాత్ర. ఆద్యాంతం ఆకట్టుకున్న ఈ ఫైనల్ అనంతరం ఎక్కడా మాట్లాడని గప్టిల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘లార్డ్స్లో ఫైనల్ మ్యాచ్ జరిగి వారం పూర్తైందని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నా క్రికెట్ జీవితంలో అది ఓ అద్భుతమైన దినం, అత్యంత దుర్దినంగా కూడా భావిస్తున్నాను. ఎన్నో విభిన్నమైన భావోద్వేగాలకు వేదికగా ఆ మ్యాచ్ నిలిచింది. కానీ న్యూజిలాండ్ తరఫున, గొప్ప సహచరులతో ఆడటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదో అద్భుతం.’ అని గప్టిల్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నాడు. View this post on Instagram Hard to believe it’s been a week since that incredible Final at Lords. I think it was both the best and worst day of my cricketing life! So many different emotions, but mainly proud to represent New Zealand and play for the @blackcapsnz alongside a great group of mates. Thank you to everyone for all your support, it has been amazing. 🇳🇿 A post shared by Martin Guptill (@martyguptill31) on Jul 22, 2019 at 1:11pm PDT టైటిల్ అందకుండా న్యూజిలాండ్ను దురదృష్టం గప్టిల్ రూపంలో వెంటాడింది. కివీస్ డెత్ బౌలర్లు ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ను భారీ షాట్లు కొట్టకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. ఈ సమయంలో గప్టిల్ విసిరిన బంతి నేరుగా బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్కు 6 పరుగులు ఇచ్చారు. ఇది మ్యాచ్ టై కి దారితీసింది. వాస్తవానికి ఇందులో గప్టిల్, స్టోక్స్ తప్పేం లేదు. ఇక సూపర్ ఓవర్లో కూడా మళ్లీ గప్టిల్ రూపంలోనే న్యూజిలాండ్ దురదృష్టం వెంటాడింది. చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన సమయంలో గప్టిల్ రనౌట్ కావడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడం అలా జరిగిపోయింది. ఈ రెండింటిలోను గప్టిల్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికి పరోక్ష పాత్ర కాదనలేనిది. ఇక ఈ మెగాటోర్నీలో గప్టిల్ తనస్థాయి దగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. 10 మ్యాచ్ల్లో కేవలం 186 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. -
‘ఇక పాక్ క్రికెట్ జట్టును నేను సెట్ చేస్తా’
వాషింగ్టన్: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రక్షాళనకు నడుంబిగించారు. స్వతహాగా క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్.. వచ్చే వరల్డ్కప్ నాటికి పాక్ జట్టును మేటి జట్టుగా తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాక్ క్రికెట్ జట్టు వరల్డ్కప్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్కప్కు పాక్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్ క్రికెట్ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్ చేస్తా. పాక్ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్ అయ్యా’ అని పేర్కొన్నారు. వరల్డ్కప్లో పాకిస్తాన్ జట్టు ఐదో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే తన ప్రస్థానాన్ని ముగించింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ నిలకడలేమి ఆ జట్టు నాకౌట్ ఆశల్నిదూరం చేసింది. కివీస్తో సమానంగా 11 పాయింట్లు సాధించినప్పటికీ రన్రేట్ ఆధారంగా పాక్ వెనుకబడిపోయింది. ప్రధానంగా వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమి ఎదుర్కోవడం ఆ జట్టు సెమీస్ అవకాశాల్ని దూరం చేసింది. -
ఓడితే బ్యాట్ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్ క్రికెటర్
లండన్ : ప్రపంచకప్ ఫైనల్లో ఓడితే మళ్లీ క్రికెట్ ఆడకపోయేవాడినని, బ్యాట్ పట్టుకోవడానికి కూడా ధైర్యం చేయకపోయేవాడినని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ తెలిపాడు. మ్యాచ్కు ముందు ఓటమి భయం తనని వెంటాడిందని, ఓడితే మళ్లీ ఏ ముఖం పెట్టుకొని క్రికెట్ ఆడాలని తనలో తాను కుమిలిపోయానన్నాడు. ఈ పరిస్థితిని ఇంగ్లండ్ జట్టు సైకాలజిస్ట్ డేవిడ్ యంగ్కు వివరించి సమాధానాలు తెలుసుకున్నానని డైలీమెయిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ బాధ నాకు తెలుసు.. ‘ప్రపంచకప్ ఫైనల్ ముందు మొత్తం 8 ఫైనల్ మ్యాచ్లు ఆడాను. ఇందులో 7 మ్యాచ్ల్లో ఓటమే ఎదురైంది. ఈ ఓడిన మ్యాచ్ల్లో ఇంగ్లండ్ తరఫున ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2016 ఫైనల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇతర జట్టు టైటిల్ అందుకుంటుంటే చూస్తు ఉండటం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ వర్ణాతీతం. అలాంటిది మళ్లీ పునరావృతం కావద్దని, పశ్చాతాపానికి గురికావద్దని గట్టిగా అనునుకున్నా. ఆ దేవుడిని ప్రార్థించా. భయమెందుకంటే.. ఓటమి భయం ఎందుకు వెంటాడిందంటే.. మళ్లీ క్రికెట్ ఎలా ఆడాలో నాకు తెలియదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్ ఫైనల్ ఆడే అవకాశం వస్తుంది. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఎంత అనుకున్నా.. ఆ క్షణం భయపడుతూనే ఉన్నా. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం తట్టుకోలేకపోయేవాడిని. చాలా రోజుల వరకు బ్యాట్ కూడా పట్టుకోకపోదును. అద్భుత ప్రదర్శన కనబరుస్తామని, జట్టును గెలిపించే సత్తా ఉందని మాకు తెలుసు. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితేనే ఎలా? అనే సందేహమే నన్ను తీవ్రంగా వేధించింది.’ అని బట్లర్ చెప్పుకొచ్చాడు. ఇక టోర్నీ మధ్యలో వరుస ఓటములు ఎదురైనప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందన్నాడు. హాట్ ఫేవరేట్కు దిగిన తమ జట్టు వరుస ఓటములతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొన్నప్పుడు కూడా భయమేసిందన్నాడు. బెయిర్స్టో గాయం కూడా కలవరపాటుకు గురిచేసిందని, గప్టిల్ను రనౌట్ చేయడం.. సూపర్ ఓవర్ టై కావడం.. తమ విజయం ఖాయామని తెలవడం.. మేం వేసిన గంతులు.. ఆస్వాదించిన ఆ క్షణాలు.. అద్భుతమని బట్లర్ చెప్పుకొచ్చాడు. -
సచిన్ సూచనకు ఓటేసిన బౌలింగ్ కోచ్
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో ‘బౌండరీలు’ ఆధారంగా ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. దీనిలో భాగంగా ఈ రూల్ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ సూచనలు కూడా చేశారు. మెగా ఫైట్లో విజేతను తేల్చేక్రమంలో సూపర్ ఓవర్ సైతం టైగా ముగిస్తే, మరొక సూపర్ ఓవర్ను వేయిస్తే బాగుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి తాజాగా భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మద్దతు ప్రకటించాడు. వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. సచిన్ సూచించిన మరొక సూపర్ ఓవర్ సూచనతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపాడు. ‘ అసలు అత్యధిక బౌండరీల గెలిచిన జట్టు విజేత అనే నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. విజేతను నిర్ణయించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ బౌండరీల ఆధారంగా జట్టును గెలిచినట్లు ప్రకటించేకంటే, వికెట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం సమంజసంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అదే సమయంలో మరొక సూపర్ ఓవర్తో విజేతను తేల్చినా ఫర్వాలేదు’ అని భరత్ అరుణ్ తెలిపాడు. ఇక ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్లో ‘టాప్’లో నిలిచిన జట్టుకు మరొక అవకాశం ఉంటే బాగుంటుందన్నాడు. ఇందుకు ఐపీఎల్ తరహా నిబంధనను తీసుకురావాలని పేర్కొన్నాడు. -
నాది నిర్ణయలోపమే
కొలంబో: ప్రపంచకప్ ఫైనల్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ఓవర్త్రోకు ఆరు పరుగులు ఇవ్వడంపై తానేమీ చింతించట్లేదని ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన (శ్రీలంక) స్పష్టం చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆరు పరుగులు కేటాయించడం తన నిర్ణయ లోపమేనని ఒప్పుకున్న ధర్మసేన ఆ సమయంలో అదే సరైనదిగా తోచిందని అన్నారు. ‘ఓవర్త్రోకు ఐదుకు బదులు ఆరు పరుగులు ఇవ్వడం నా నిర్ణయ లోపమే. అది ఇప్పుడు టీవీ రీప్లేలు చూస్తే తెలుస్తోంది. కానీ ఆ సమయంలో మైదానంలో ఉన్నపుడు అది సముచితంగా అనిపించింది. నిర్ణీత సమయంలో తీసుకున్న నా నిర్ణయాన్ని ఐసీసీ అప్పుడు ప్రశంసించింది కూడా. ఇప్పుడు దాని గురించి నాకు చింత లేదు’ అని ధర్మసేన వివరించారు. లైగ్ అంపైర్ మారిస్ ఎరాస్మస్తో చర్చించాకే ఆరు పరుగులు కేటాయించానని ధర్మసేన తెలిపారు. -
నేను పొరపాటు చేశా: వరల్డ్కప్ ఫైనల్ అంపైర్
దుబాయ్: వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో ఓవర్ త్రో విషయంలో తాను పొరపాటు చేశానని ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన ఒప్పుకున్నాడు. బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలిన బంతి ఓవర్ త్రోగా బౌండరీకి వెళ్లడంతో దానికి ఆరు పరుగులు ఇవ్వడం తాను చేసిన పొరపాటని, ఇందుకు చింతిస్తున్నానని అన్నాడు. దీనిపై మ్యాచ్ అధికారులతో పాటు ఫీల్డ్లోనే ఉన్న మరొక అంపైర్ ఎరాస్మస్తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు. ‘నేను తప్పిదం చేసిన విషయాన్ని అంగీకరిస్తున్నా. మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ రిప్లేలో చూస్తే నేను చేసిన పొరపాటు తెలిసింది. ఇందుకు నేను చాలా చింతిస్తున్నా. ఇక్కడ క్షమాపణలు కోరడానికి కూడా అర్హుడిని కానేమో. ఆ మ్యాచ్కు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత అది ఆరు పరుగులుగా ప్రకటించా. లెగ్ అంపైర్ ఎరాస్మస్తో కూడా చర్చించా. బ్యాట్స్మన్ రెండో పరుగును పూర్తి చేశాడని అంతా భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దాన్ని మ్యాచ్ అధికారులు రిప్లేలో చూడకపోవడంతో పొరపాటు జరిగింది’ అని ధర్మసేన పేర్కొన్నాడు. వరల్డ్కప్ తుది సమరంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులే చేసింది. గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ దాటగా అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. స్టోక్స్ రెండు పరుగు పూర్తి చేయకుండానే బంతి అతని బ్యాట్ తగిలి బౌండరీకి వెళ్లింది. వాస్తవానికి దానికి 5 పరుగులే ఇవ్వాలి. అయితే ఆ బౌండరీతో కలిపి మొత్తంగా ఆరు పరుగులు ఇచ్చారు. దాంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. కాగా, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ను చాంపియన్గా ప్రకటించారు. -
ఓవర్త్రో నిబంధనలపై సమీక్ష!
ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ఓవర్త్రో నిబంధనలపై సమీక్ష జరిపే యోచనలో మరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్సీసీ) ఉన్నట్లు ‘దిసండే టైమ్స్’ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో అనూహ్యంగా ఓవర్త్రో ద్వారా లభించిన పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నిబంధనలపై సమీక్ష జరిపి అవసరమైతే మార్చాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎమ్సీసీ సబ్ కమిటీ భావిస్తోందని ఆ కథనం వెల్లడించింది. ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిన బంతి అనూహ్యంగా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అంపైర్లు ఇంగ్లండ్కు 6 పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం 5 పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని, మాజీ అంపైర్లు, ఆటగాళ్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓవర్త్రో నిబంధనలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఎమ్సీసీ భావిస్తోంది. -
ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్
ఇటీవల ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని న్యూజిలాండ్ జట్టు దిగమింగుకోలేకపోయింది. తమ శక్తివంచన లేకుండా పోరాడి.. అద్భుతంగా ఆడినా.. ఆ జట్టును పరాజయం వెక్కిరించింది. దీనిని ఓటమి అనడం కంటే.. ఐసీసీ చెత్త రూల్స్ వల్లే ఇలా జరిగిందని పేర్కొనడం మంచిదని, ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లూ విజయం సాధించాయని చాలా మంది మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. తాజాగా ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై స్పందించాడు. టైమ్స్ మ్యాగజీన్తో ఆయన మాట్లాడుతూ.. ఫైనల్ ఫలితం తమకు కూడా కష్టంగానే అనిపించిందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జట్టును టెక్నికల్గా విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల స్కోరు సమమైనప్పుడు.. ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సబబు కాదని మోర్గాన్ తేల్చి చెప్పాడు. ’ ఇరు జట్లు సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు. నేను ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం వాస్తవమే కానీ, ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదేనని నేను అనను. ఇక, ఓడిపోవడమనేది చాలా కష్టమైన విషయం’ అని చెప్పాడు. ఫైనల్ తర్వాత న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్తో అనేక సార్లు మాట్లాడానని, కానీ ఇది ఎలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఈ ఫలితంపై తాము ఓ నిర్ధారణకు రాలేకపోయామని చెప్పారు. -
ఆ విషయంలో సచిన్ లాగే ధోనికి కూడా..
న్యూఢిల్లీ : ప్రస్తుతం టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడని బీసీసీఐ మాజీ కార్యదర్శి, మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే అభిప్రాయపడ్డాడు. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడిన ధోనికి రిటైర్మెంట్ విషయంలో పూర్తి స్వేచ్చనివ్వాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సంజయ్ మాట్లాడుతూ...‘ నా దృష్టిలో ధోని గొప్ప ఆటగాడు. తను దేశం కోసం ఆడాడు. ఒక వికెట్కీపర్ బ్యాట్స్మెన్గా ధోని స్థానాన్ని భర్తీ చేయగల, అతడికి ప్రత్యామ్నాయం కాగల ఆటగాడు ప్రస్తుత జట్టులో లేడు. ఇక రిటైర్మెంట్ గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకోగల పరిణతి ధోనికి ఉంది. తన భవిష్యత్ ప్రణాళికల గురించి సెలక్టర్లు అతడితో మాట్లాడితే బాగుంటుంది. రిటైర్మెంట్కు ముందు సచిన్ టెండూల్కర్ విషయంలో సెలక్టర్లు ఎలా వ్యవహరించారో ధోని విషయంలో కూడా అదే పంథా అనుసరించాలి. ధోని నుంచి ఎటువంటి ప్రదర్శన ఆశిస్తున్నారో అతడికి వివరించాలి’ అని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు కూడా అలాగే అంటే ఎలా? వరల్డ్కప్ సెమీస్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ధోని రనౌట్ కావడం గురించి సంజయ్ ప్రస్తావిస్తూ...‘ జట్టు ప్రయోజనాలకు, పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచకప్లో ధోని శక్తి మేరకు రాణించాడు. సెమీ ఫైనల్లో కూడా అతడు వ్యూహాత్మకంగానే మైదానంలోకి దిగాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దీంతో తమ కెరీర్లో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేని ఆటగాళ్లు కూడా అతడిని విమర్శిస్తున్నారు. ఈ ఒక్క కారణంగా ధోని ఆట ముగియాలనుకోవడం సరైంది కాదు. అయినా ధోని విలువ వారికి తెలియకపోయినా భవిష్యత్ తరం ఆటగాళ్లు మాత్రం ఈ విషయాన్ని తప్పక గుర్తిస్తారు. నిజానికి 38 ఏళ్ల వయస్సులో కూడా కెరీర్ అత్యున్నత స్థాయి ప్రదర్శన అతడి నుంచి ఆశించడం సరైంది కాదేమో. ఇక యువ ఆటగాడు రిషభ్ పంత్ ప్రపంచకప్ మొదటి మ్యాచ్ నుంచి జట్టుతో ఉండి ఉంటే బాగుండేది. ధోని నుంచి వికెట్ కీపింగ్ పాఠాలు నేర్చుకునేవాడు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇక ఆదివారం వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
‘మా వాడు క్రికెట్ను ఏలుతాడు’
లండన్ : జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ అభిమానులకు తప్ప మిగతా ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తి. కానీ ఇప్పుడు అతడి పేరు విశ్వమంతా మారుమోగుతోంది. అదృష్టం కొద్ది జట్టులోకి వచ్చి ఏకంగా తన జట్టుకు తొలిసారి ప్రపంచకప్నే అందించాడు. ప్రపంచకప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో అనూహ్యంగా సూపర్ ఓవర్ వేసి ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించిన ఆర్చర్పై అతడి తండ్రి ఫ్రాంక్ ఆర్చర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏదో ఒక రోజు ఆర్చర్ క్రికెట్ను ఏలుతాడని పేర్నొన్నాడు. ఇక తన కొడుకుపై నమ్మకంతో సూపర్ ఓవర్ అవకాశం ఇచ్చిన సారథి ఇయాన్ మోర్గాన్ను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఆడేది తొలి ప్రపంచకప్, అంతకుముందు ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. అయినా సూపర్ ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా జట్టును జగజ్జేతగా నిలిపాడు. దేశం గర్వించేలా చేశాడు. జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సూపర్ ఓవర్లో నీషమ్ సిక్సర్ కొట్టిన వెంటనే ఏ బౌలర్ అయినా ఆత్మరక్షణలోకి పడతాడు. కానీ, ఆర్చర్ మాత్రం దానిని అధిగమించాడు. గొప్ప ఆటగాళ్ళు మాత్రమే అలా చేయగలరు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కే దక్కుతుంది. అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి చెల్లించాడు. ఆర్చర్ ఆట ఇప్పుడే ప్రారంభమైంది. క్రికెట్కు మైఖెల్ జోర్డాన్(దిగ్గజ బాస్కెట్ బాల్ ఆటగాడు) అవుతావని అనేవాడిని. బాస్కెట్ బాల్ను జోర్డాన్ శాసించినట్టు.. ఆర్చర్ ఏదో ఒక రోజు క్రికెట్ను ఏలుతాడు’అంటూ ఫ్రాంక్ ఆర్చర్ ఉద్వేగంగా పేర్కొన్నాడు. -
‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’
ముంబై : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనే లేదని అతడి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే స్పష్టం చేశాడు. ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అరుణ్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శుక్రవారం అరుణ్ మాట్లాడుతూ.. ‘ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన ధోనికి లేదు. అతడు వ్యక్తిగతంగా కంటే జట్టు ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ ఓ గొప్ప ఆటగాడి భవిష్యత్పై ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం’అంటూ పేర్కొన్నాడు. ఇక ఆదివారం వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ప్రపంచకప్లో బెస్ట్ ఫినిషర్గా విఫలమైన ధోనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్కు ధోని వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. -
యువీ చాలెంజ్.. బ్యాట్ పట్టిన ధావన్
ముంబై: గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి అర్దంతరంగా తప్పుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని ధావన్.. యువరాజ్ సింగ్ విసిరిన చాలెంజ్ కోసం బ్యాట్ పట్టి విజయం సాధించాడు. యువీ విసిరిన ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’ను ధావన్ స్వీకరించాడు. చాలెంజ్లో భాగంగా తనదైన శైలిలో బ్యాట్తో బంతిని బాటిల్ను కొట్టి క్యాప్ను కిందపడేశాడు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. ‘యువీ.. ఇది నా బాటిల్ క్యాప్ చాలెంజ్. గాయం తర్వాత తొలిసారి బ్యాట్ పట్టాను. చాలా ఆనందంగా ఉంది’అంటూ వీడియో కింద పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధావన్ బ్యాటింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయాన్ని లెక్క చేయకుండా శతకాన్ని సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే గాయం నుంచి కోలుకోవడానికి ఐదారు వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలపడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో రెచ్చిపోయే ధావన్ ప్రపంచకప్లో లేకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జట్టులో సీనియర్ లెఫ్టాండ్ బ్యాట్స్మన్ లేని లోటు స్పష్టంగా తెలిసింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెస్టిండీస్ పర్యటనకు కూడా ధావన్కు విశ్రాంతినిచ్చారు. -
ఐసీసీకి కివీస్ కోచ్ విన్నపం
లండన్ : ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని న్యూజిలాండ్ ఇప్పట్లో మరిచిపోయేలా లేదు. ఆటగాళ్లతో పాటు అభిమానులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఐసీసీ నిబంధనలే ఇంగ్లండ్కు ప్రపంచకప్ను అందించిందని క్రికెట్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడంపై ఐసీసీని తప్పుపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం కూడా మరో సూపర్ ఓవర్ ఆడించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ ఐసీసీ ముందుకు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చాడు. ‘ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో విజేతను బౌండరీల ఆధారంగా ప్రకటించడం సమంజసం కాదు. ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించండి. ఏడు వారాలుగా ప్రపంచకప్ కోసం మా ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్లో ఇలా ఓడిపోవడం మా ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐసీసీ తన నిబంధనలను మార్చుకుంటే మంచిది’అంటూ స్టీడ్ ఐసీసీకి విన్నవించాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం చెత్త నిర్ణయం అంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడిన విషయం తెలిసిందే. -
సూపర్ ఓవర్ టెన్షన్.. ప్రాణాలు వదిలిన కోచ్
ఆక్లాండ్: వన్డే ప్రపంచకప్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. అతడి చిన్ననాటి కోచ్, ఆక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ డేవిడ్ జేమ్స్ గొర్డాన్ మరణించాడు. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే సూపర్ ఓవర్లో రెండో బంతిని నీషమ్ సిక్సర్ కొట్టిన సమయంలోనే జేమ్స్ గొర్డాన్ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. ‘గొర్డాన్ తుదిశ్వాస విడిచారని సూపర్ ఓవర్ జరుగుతుండగా నర్స్ వచ్చి మాతో చెప్పారు. నీషమ్ సిక్సర్ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు. గొర్డాన్ మృతికి నీషమ్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్ జేమ్స్ గొర్డాన్.. నా హైస్కూల్ టీచర్, కోచ్, స్నేహితుడు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్లో 25 ఏళ్లుపైగా టీచర్గా పనిచేసిన డేవిడ్ జేమ్స్ గొర్డాన్ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్, హాకీ నేర్పించారు. నీషమ్, ఫెర్గూసన్లతో పాటు చాలా మంది హైస్కూల్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు. (చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్) -
స్టోక్స్ ఆ పరుగులు వద్దన్నాడట!
లండన్: ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్త్రో’ పాత్ర కూడా ఉంది. గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ దాటగా అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు దీనిపై విమర్శించారు కూడా. అయితే ఇప్పుడు స్టోక్స్ టెస్టు జట్టు సహచరుడు, సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కొత్త అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఓవర్త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని స్టోక్స్ అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించాడు. ‘బ్యాట్స్మన్ పరుగు తీసే సమయంలో త్రో అతనికి తగిలి మైదానంలో బంతి ఎక్కడికైనా వెళితే పరుగు తీయకుండా ఆగిపోవడం క్రికెట్లో నైతిక నియమం. కానీ బంతి బౌండరీ దాటితే ఎవరేమీ చేయలేరు. నాలుగు పరుగులు ఇవ్వాల్సిందే. నిజానికి మ్యాచ్ తర్వాత స్టోక్స్ అంపైర్ వద్దకు వెళ్లి ఆ నాలుగు పరుగులు తీసేయండి. మాకు అవసరం లేదని చెప్పాడు. తాను తప్పు చేసినట్లు కూడా అతను మైకేల్ వాన్తో అన్నట్లు తెలిసింది. అయితే అదంతా నిబంధనల ప్రకారమే జరిగింది’ అని అండర్సన్ మద్దతు పలికాడు. ఓవర్ త్రో బౌండరీ చేరగానే తన తప్పేమీ లేదన్నట్లుగా చేతులెత్తి చూపించిన స్టోక్స్... దీనిపై విలియమ్సన్కు క్షమాపణ చెప్పానని మాత్రం మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. అందులో అంపైర్ల ప్రస్తావన లేదు కాబట్టి అండర్సన్ వ్యాఖ్యలో నిజమెంత అనేది సందేహమే! -
ప్రపంచకప్ ఎఫెక్ట్: రాయ్ తొలిసారి
లండన్ : ప్రపంచకప్-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్. అంతేకాకుండా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బుధవారం ఐర్లాండ్తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో 28 ఏళ్ల రాయ్ను సెలక్టర్లు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అన్నీ కుదిరితే ఐర్లాండ్పై టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి సారి ప్రపంచకప్ అందుకోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఇంగ్లండ్.. ఈ అపూర్వ విజయానికి యాషెస్ కూడా తోడుకావాలని భావిస్తోంది. దీంతో యాషెస్కు ముందు ఈ టెస్టును వార్మప్గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. దానిలో భాగంగా రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని అనుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్లను పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ టెస్టు జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్. -
‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ టోర్నీలో లీగ్ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించడాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే తమ దేశ ఆటగాళ్ల తీరు, ప్రదర్శనపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పాక్ మాజీ సారథి వకార్ యూనిస్ పలువురు సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూనే మరోవైపు బోర్డు నిర్ణయాలపై నిప్పులు చెరిగాడు. కొందరు సీనియర్ ఆటగాళ్లు వారి స్వార్థం కోసం ఇంకా క్రికెట్ ఆడుతున్నారని విమర్శించాడు. ఆటగాళ్ల ఫిట్నెస్పై బోర్డు ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావటం లేదని మండిపడ్డాడు. ‘ప్రపంచకప్లో పాక్ ఓటమికి ప్రధాన కారణం మెరుగైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం. ఫిట్నెస్, ఫామ్, ఇతర విషయాల్లో రాజీ పడటం సెలక్టర్లు చేసే పెద్ద పొరపాటు. తాజాగా ప్రపంచకప్కు పాక్ జట్టు ఎంపికే గందరగోళంగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడాలనే కోరికతో కొందరు సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలు చేసి జట్టులో చోటు దక్కించుకున్నారు. వాళ్లను వాళ్లు మోసం చేసుకోవడమే కాదు పాక్ క్రికెట్ జట్టును నాశనం చేశారు. ఇప్పటివరకు మీరు ఆడింది చాలు వెళ్లిపోతే మంచిది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఓడిపోయిన ప్రతీసారి పాక్ క్రికెట్ బోర్డు ఒకే ఫార్ములాను పాటిస్తుంది. కోచింగ్ బృందాన్ని, సెలక్టర్లను మార్చుతుంది. అంతేకానీ దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకరావడం, ఆటగాళ్ల ఫిట్నెస్పై దృష్టిపెట్టాలనే కనీస ఆలోచన చేయదు. బోర్డు ఆలోచన మారనంత వరకు.. ప్రపంచకప్లో పాక్ ప్రదర్శన మారదు. అవసరమనుకుంటే సీనియర్ ఆటగాళ్ల సూచనలను తీసుకుని పాక్ క్రికెట్ను బతికించండి’అంటూ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. -
స్టోక్స్ వద్దన్నా.. అంపైర్లు వింటేగా
లండన్: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ‘బెన్ స్టోక్స్.. ఓవర్త్రో’పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్ గెలిచిందని లేకుంటే న్యూజిలాండ్ చేతిలో ప్రపంచకప్ ఉండేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఓవర్త్రోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆఖరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్లడంతో అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. అయితే స్టోక్స్ అంపైర్ల దగ్గరికి వెళ్లి అదనపు పరుగులు ఇంగ్లండ్కు అవసరం లేదని వారించాడు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అంటూ వారు సర్దిచెప్పారు. అంపైర్ల నిర్ణయంపై స్టోక్స్ కూడా అసహనం వ్యక్తం చేశాడు’అంటూ అండర్సన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘ఆరు’ఇవ్వడం తప్పే.. ఇక అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం పెద్ద వివాదస్పదమైంది. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. 19.8 నిబంధన మేరకు ఓవర్త్రో ద్వారా బౌండరీ లభించినప్పుడు ఆ పరుగులతో పాటు ఫీల్డర్ యాక్షన్ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్మెన్ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి. అయితే ఇక్కడ బెన్స్టోక్స్, ఆదిల్ రషీద్లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్ బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. కాగా, ఓవర్త్రోపై న్యూజిలాండ్ ఆటగాళ్లకు, సారథి విలియమ్సన్కు బెన్ స్టోక్స్ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. కావాలని చేయలేదని, అనుకోకుండా జరిగిందని పేర్కొన్నాడు. -
‘బౌండరీ’కి బదులు రెండో సూపర్
న్యూఢిల్లీ: బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి. తాజాగా ముగిసిన వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సమానంగా ఆడినప్పటికీ ఇంగ్లీషు టీమ్ను విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మ్యాచ్ల్లో ఫలితం రాబట్టేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బౌండరీ విధానంతో ఫలితం తేల్చకుండా మరో సూపర్ ఓవర్ ఆడించివుంటే బాగుండేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఫైనల్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ఫుట్బాల్లో ఫలితం తేలకపోతే అదనపు సమయం ఇస్తారని గుర్తుచేశాడు. బౌండరీ నింబధనను రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ కూడా తప్పుబట్టారు. ప్రపంచకప్లో నాకౌట్ విధానంలోనూ మార్పులు చేయాల్సిన అవసరముందని సచిన్ అభిప్రాపడ్డాడు. ఐపీఎల్ తరహాలో టాప్ నిలిచిన జట్టుకు నాకౌట్లో ఓడితే మరొక అవకాశం కల్పించాలని సూచించాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఎంఎస్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపిస్తే బాగుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ తర్వాత క్రీజ్లో రావాల్సిందని పేర్కొన్నాడు. -
విలియమ్సన్పై రవిశాస్త్రి ప్రశంసలు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్పై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్ చేజారినప్పటికీ కివీస్ కెప్టెన్ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్ టైటిల్ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ‘బౌండరీ’ నిబంధనతో ప్రపంచకప్ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయినా విలియమ్సన్ ఒక్క మాట కూడా తూలకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. పీడకల కన్నట్లుగా అనిపించిందని, ఈ తరహాలో పరాజయం పాలవుతామని ఊహించలేదని అన్నాడే తప్పా ఆగ్రహించలేదు. బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నామని నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అద్భుతంగా జరిగిందని, అందరూ దానిని బాగా ఆస్వాదించారని పేర్కొన్నాడు. ఫలితం తమకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఎవరిపైనా విమర్శలు చేయకుండా హుందాగా ప్రవర్తించాడు. -
ఆ ‘స్పెషల్’ జాబితాలో రోహిత్శర్మ
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్-5 బ్యాట్స్మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన హిట్మ్యాన్ 81 సగటుతో పరుగులు చేశాడు. అయితే, సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో రోహిత్ కృషి వృధా అయింది. తాజాగా ఐసీసీ.. తన ట్విటర్ పేజీలో టాప్-5 స్పెషల్ బ్యాట్స్మెన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్ వార్నర్, మూడోస్థానంలో షకీబుల్ హసన్, నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్, ఐదో స్థానంలో జోయి రూట్ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్ లీగ్ దశలోనే తన పోరాటాన్ని ముగించినప్పటికీ.. ఆ జట్టు తరఫున అద్భుతంగా ఆడిన షకీబుల్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ జోయి రూట్ 556 పరుగులు చేశాడు. -
ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఫేస్ యాప్’ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక నెటిజన్.. భారత క్రికెట్ జట్టు సభ్యులు కడు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో.. ఈ యాప్ ద్వారా రూపొందించి.. ట్విటర్లో షేర్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తదితరులు వృద్ధాప్యంలోనూ విభిన్నమైన లుక్తో కనిపించి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఫేస్యాప్ ద్వారా టీమిండియా క్రికెటర్ల రూపురేఖల్ని మార్చి.. వయోవృద్ధులుగా మలిచిన ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కితకితలు పెట్టిస్తున్నాయి. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ భారత జట్టుకు, టీమిండియా అభిమానులకు ఒకింత నిరాశనే మిగిల్చింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా.. సెమీఫైనల్లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో ధోనీ, రవీంద్ర జడేజాలు రాణించినా.. చివరిదశలో ధోనీ రన్నౌట్ కావడంతో భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఒకింత బాధలో ఉన్న భారత క్రికెట్ ప్రేమికుల్ని.. టీమిండియా క్రికెటర్ల ఓల్డ్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఆ బాధను దూరం చేసి.. కొంత ఆనందాన్ని పంచుతోంది. Ladies and Gentlemen presenting you the some faces of 2053 World Cup Winning Team 🥇 😏🤣🤣#FaceApp #faceappchallenge #MSDhoni #DhoniForever #TeamIndia #CWC19 #worldcup pic.twitter.com/RQM15a15qN — Mansi Singh (@MansiSingh99) July 16, 2019 -
ప్రధానితో ప్రపంచకప్ విజేత
లండన్ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ను గెలుచుకున్న ఇంగ్లండ్ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి టైటిల్ గెలిచిన మోర్గాన్ సేన మంగళవారం దేశ ప్రధాని థెరెసా మే ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10 డౌనింగ్ స్ట్రీట్లోని ప్రధాని అధికారిక కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ ప్రజలు క్రికెట్పై మళ్లీ ప్రేమను పెంచుకునేలా మీరు చేశారు. ఫైనల్ మ్యాచ్ను అత్యుత్తమ క్రీడా ఘట్టాల్లో ఒకటిగా చెప్పగలను. ఇరు జట్ల అద్భుతమైన ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలగలిసి ఒక థ్రిల్లర్ను మనకు అందించాయి. ఇంత గొప్ప టోర్నీకి ఇది సరైన ముగింపు. మన దేశాన్ని క్రీడల్లో ప్రముఖంగా నిలిపిన అందరికీ అభినందనలు’ అని ఈ సందర్భంగా ప్రధాని థెరెసా వ్యాఖ్యానించారు. కార్యాలయ గార్డెన్స్లో జరిగిన ‘షాంపేన్ రిసెప్షన్’లో క్రికెటర్లు ప్రధానితో సరదాగా కబుర్లు చెబుతూ తమ గెలుపును ఆస్వాదించడం విశేషం. -
‘అప్పుడు సిక్స్తోనే సమాధానం ఉండేది’
లండన్: వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఓవర్ త్రో అయిన బంతికి ఇంగ్లండ్కు ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే రావాల్సి ఉందని, ఆ విషయంలో అంపైర్లు తప్పు చేశారని మాజీ అంపైర్ సైమన్ టఫెల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఫీల్డర్ బంతి విసరకముందే బ్యాట్స్మెన్ ఒకరినొకరు దాటితే ఆ పరుగును లెక్కించాలని, కానీ బెన్స్టోక్స్, అదిల్ రషీద్ రెండో పరుగు తీయకముందే ఫీల్డర్ బంతిని విసిరాడని తెలిపారు. అప్పుడు ఐదు పరుగులే లెక్కించి అదిల్ రషీద్ను బ్యాటింగ్ చెయ్యాల్సి ఉండేదని ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని టఫెల్ తప్పుబట్టారు. ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ ఆష్లీ గిల్స్ మీడియాతో మాట్లాడుతూ.. టఫెల్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘మీరొక విషయంపై చర్చించాలి.. ఆఖరి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తుండగా బెన్స్టోక్స్ చివరి బంతి ఆడేటప్పుడు బంతి లెగ్ స్టంప్ మీద ఫుల్టాస్ పడింది. ఆ సమయంలో స్టోక్స్ రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే బంతిని స్టేడియం బయటకు పంపేవాడు. అవి మాకు అవసరమైన పరుగులు కాబట్టి స్టోక్స్ కూల్గానే ఆడాడు. ఒకవేళ ఆఖరి బంతి లక్ష్యం ఇంకా ఎక్కువ ఉంటే స్టోక్స్ సిక్స్తోనే సమాధానం చెప్పేవాడు. మేం ఇప్పుడు వరల్డ్ చాంపియన్స్. కప్పు మాకే వచ్చింది’ అని ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించారు. -
వారి నిర్ణయమే ఫైనల్: ఐసీసీ
దుబాయ్: ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిరాకరించింది. మైదానంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. ఆదివారం ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ సస్పన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్టాస్ను డీప్ మిడ్వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చి అతని బ్యాట్కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి అంపైర్ ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ పిచ్పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఐసీసీ ముందు మీడియా ప్రస్తావించగా.. మాట్లాడటానికి నిరాకరించింది.‘ నిబంధనలపై అంపైర్లుకు ఉన్న అవగాహన మేరకు మైదానంలో వారు నిర్ణయాలు తీసుకుంటారు. అలా తీసుకున్న ఏ నిర్ణయాలపైనా అయినా నిబంధనల ప్రకారం మేం మాట్లాడలేం’ అని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
సచిన్ వరల్డ్కప్ జట్టు ఇదే..
న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ. వరల్డ్కప్కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఎలెవన్ జట్లను ప్రకటించగా, తాజాగా తన వరల్డ్కప్ ఎలెవన్ జట్టు ఇదేనంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్ నుంచి చోటు కల్పించాడు. ఇక ఇంగ్లండ్ నుంచి బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టోలను ఎంపిక చేసిన సచిన్.. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్ నుంచి మిచెల్ స్టార్క్ను మాత్రమే తన అత్యుత్తమ వరల్డ్కప్ ఎలెవన్ జట్టులో చోటిచ్చాడు. కాగా, సచిన్ జట్టులో ఎంఎస్ ధోనికి చోటు దక్కకపోవడం గమనార్హం. 2019 క్రికెట్ వరల్డ్కప్ సచిన్ ఎలెవన్ ఇదే.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్ స్టో(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, బుమ్రా, జోఫ్రా ఆర్చర్ -
ఐసీసీ రూల్పై ‘బిగ్’ పంచ్!
న్యూఢిల్లీ: వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్’ ను పాటించడంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పంచ్ల వర్షం కురిపించారు. ఇప్పటికే ఈ విధానంపై పలువురు విస్మయం వ్యక్తం చేయగా, ఆ జాబితాలో ఇప్పుడు బిగ్ బీ కూడా చేరిపోయారు. తన ట్వీటర్ అకౌంట్లో ఐసీసీ అవలంభించిన విధానాన్ని కడిగిపారేశారు. ‘నీ వద్ద రెండు వేల రూపాయిలు ఉన్నాయనుకుందాం. నా వద్ద రెండు వేల రూపాయిలు నోటు ఒకటే ఉంటే, అప్పుడు నీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉన్నాయి. అప్పుడు ఎవరు ధనికులు అవుతారు ఐసీసీ. మీ లెక్కన నాలుగు ఐదు వందల నోట్లు ఉన్న వాడే ధనికుడు అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు. ఐసీసీ రూల్స్పై బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ సైతం ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ‘ఎంఎస్ ధోని గ్లౌవ్స్ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్ ఓవర్ రూల్స్ మార్చుకుంటే బాగుంటుంది’ అని చురకలంటించారు. న్యూజిలాండ్తో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ అత్యధిక బౌండరీల ఆధారంగా చాంపియన్గా నిలిచింది. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండు టై కావడంతో విజేతను తేల్చేందుకు బౌండరీ రూల్ను అవలంభించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. T 3227 - आपके पास 2000 रूपये, मेरे पास भी 2000 रुपये, आपके पास 2000 का एक नोट, मेरे पास 500 के 4 ... कौन ज्यादा अमीर??? ICC - जिसके पास 500 के 4 नोट वो ज्यादा रईस.. #Iccrules😂😂🤣🤣 प्रणाम गुरुदेव Ef~NS — Amitabh Bachchan (@SrBachchan) 15 July 2019 -
ఓవర్త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!
లండన్: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ చాంపియన్గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం రేపిన తుది పోరులో ఇంగ్లండ్ బౌండరీల ఆధారంగా విశ్వ విజేత అయ్యింది. సూపర్ ఓవర్కు ముందు ఇంగ్లండ్ టార్గెట్ను ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్లో నాల్గో బంతి ఓవర్త్రో రూపంలో బౌండరీని దాటింది. ఆ బంతి స్టోక్స్ బ్యాట్కు తగిలి మరీ ‘ఫోర్’గా మల్లడంతో ఇంగ్లండ్కు మొత్తంగా ఆరు పరుగులు వచ్చాయి. దాంతోనే మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది.. లేకపోతే కివీసే కప్ను సాధించే అవకాశం ఉండేది. ఇది పెద్ద చర్చకే దారి తీసినా యావత్ ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు, క్రికెటర్లకు కొత్త పండగనే తెచ్చింది. ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్ను నాటింగ్హామ్ షైర్ కౌంటీ జట్టు సభ్యులతో కలిస వీక్షిస్తున్న బ్రాడ్ ఉబ్బితబ్బి అయిపోయాడు. చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేస్తూ మురిసిపోయాడు. ఈ ఘటనను నాటింగ్హామ్ షైర్ సభ్యుడైన భారత క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ వీడియో తీశాడు. దీన్ని తన ట్వీటర్ పేజీలో పోస్ట్ చేసిన బ్రాడ్.. మ్యాచ్కు ఇదే అత్యంత కీలకమైన క్షణం అంటూ పేర్కొన్నాడు. ఆ ఓవర్ త్రో కారణంగా ఆరు పరుగులు రావడంతో ఎట్టకేలకు ఊపిరి తీసుకున్నాం. ఈ తరహా సందర్భాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపాడు. Videos of emotion from #CWC19Final, we all must have them?! @ashwinravi99 captured the @TrentBridge changing room when, at the most crucial point of the match, a 1 in a million deflection went for ‘6’. Breathtaking, never seen anything like it. I ♥️ Cricket @englandcricket pic.twitter.com/dYBetXKzyX — Stuart Broad (@StuartBroad8) 15 July 2019 -
ఆ సలహానే పని చేసింది: ఆర్చర్
లండన్: వన్డే వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్ కప్ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు ఒకటైతే, అంపైరింగ్ నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. కివీస్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భాగంగా 49 ఓవర్ నాల్గో బంతిని స్టోక్స్ లాంగాన్ మీదుగా భారీ షాట్ కొట్టగా బౌండరీకి కొన్ని అంగుళాల ముందు బౌల్ట్ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడంలో విఫలమై బౌండరీ లైన్ తొక్కాడు. దాంతో ఔట్ కాస్తా సిక్స్ అయిపోయింది. ఇక చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్కు ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఫలితంగా సూపర్ ఓవర్ ఇంగ్లండ్ 15 పరుగులు చేస్తే, కివీస్ కూడా అన్నే పరుగులు స్కోరును సమం చేసింది. కాకపోతే బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఇదిలా ఉంచితే, సూపర్ ఓవర్ను తనకు ఇవ్వడంపై ఒకింత ఆందోళనకు గురైనట్లు జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. ‘ నేను సూపర్ ఓవర్ వేయడానికి వెళ్లే ముందు స్టోక్స్ వచ్చి కూల్గా ఉండమని చెప్పాడు. నువ్వు గెలుపు-ఓటములు గురించి పట్టించుకోకు. అదేమే నీ ప్రతిభను తగ్గించదు అని ధైర్యం ఇచ్చాడు. ఆ సలహాతోనే నేను స్వేచ్ఛగా బౌలింగ్ వేశా. అదే సమయంలో జో రూట్ కూడా వచ్చి కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాడు. నాపై ప్రతీ ఒక్కరూ నమ్మకం ఉంచడంతోనే నేను బౌలింగ్ను నియంత్రణతో వేశా. నేను ఒకటే అనుకున్నా. ఒకవేళ మేము ఓటమి పాలైతే ప్రపంచం అక్కడితో ఆగిపోదు అనే విషయం నాకు తెలుసు’ ఆర్చర్ తెలిపాడు. ఇక నా రెండు నెలల ఇంగ్లండ్ కెరీర్లో ఇదే అత్యుత్తమమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్కు జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఒకటైతే, వరల్డ్కప్లో జట్టులోకి రావడం, వరల్డ్కప్లో ఆడటం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నాడు. -
అంతా పీడకలలా అనిపిస్తోంది
లండన్: ప్రపంచ కప్ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ఫైనల్ మరుసటి రోజు దీనిపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారంగా స్పందించాడు. ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చూస్తే పీడకల కన్నట్లుగా అనిపించింది. మా ఆటగాళ్లంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. మ్యాచ్లో ఈ తరహాలో ఓడటం ఏదోలా ఉంది’ అని విలియమ్సన్ తన బాధను వ్యక్తీకరించాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్... బౌండరీల లెక్క నిబంధనపై ఆచితూచి స్పందించాడు. ‘బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించడం సరైందా అంటే నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గానీ నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని గానీ అసలెప్పుడూ ఊహించలేదు. ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు ఇంత కష్టపడిన తర్వాత బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు’ అని అతను వ్యాఖ్యానించాడు. అయితే ఇంత జరిగినా అతను ఈ నిబంధనను విమర్శించడానికి ఇష్టపడకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ‘నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇలాంటి నిబంధనతో మ్యాచ్ ఫలితం తేల్చాల్సి వస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు. స్టోక్స్ బ్యాట్కు తగిలి ఓవర్త్రో వెళ్లడం కూడా అలాంటిదే. ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’ అని విలియమ్సన్ చెప్పడం విశేషం. ఫైనల్ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ విలియమ్సన్... ‘ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు’ అని విలియమ్సన్ స్పష్టం చేశాడు. -
వీధి రౌడీలా కాదు హీరోలా...
లండన్: బెన్ స్టోక్స్ అంటే అందరికీ రెండే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి మ్యాచ్ను చేజార్చిన వైనం... ఆ తర్వాత నైట్ క్లబ్ వద్ద ఒక వ్యక్తిని చితక్కొట్టిన ఘటన... కానీ ఇప్పుడు అతను ఒకేసారి ఈ రెండింటినీ మరచిపోయే ఘనతను సాధించాడు. ‘వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందుంటుంది’ అని మెగా టోర్నీకి ముందు చెప్పిన స్టోక్స్ చివరకు దానిని నిజం చేసి చూపించాడు. ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించి ఒకరకంగా అతను పాపపరిహారం చేసుకున్నాడు. టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన స్టోక్స్... ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ అపూర్వం. క్లిష్టపరిస్థితుల్లో అజేయంగా 84 పరుగులు చేసిన స్టోక్స్ చరిత్రలో నిలిచిపోయాడు. ‘నాకు మాటలు రావడం లేదు. ఇక్కడికి చేరేందుకు గత నాలుగేళ్లుగా పడ్డ శ్రమ, ఇప్పుడు ప్రపంచ చాంపియన్లుగా నిలవడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఫైనల్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో పుట్టి 12 ఏళ్ల వయసులో ఇంగ్లండ్కు వలస వెళ్లిన స్టోక్స్... ఇప్పుడు ఫైనల్లో కివీస్పైనే చెలరేగడం విశేషం. ‘న్యూజిలాండ్తో మ్యాచ్ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే. అది గొప్ప జట్టు మాత్రమే కాదు. అందులో చాలా మంది మంచివాళ్లున్నారు. నా ఓవర్త్రో సిక్సర్ తర్వాత విలియమ్సన్కు నేను క్షమాపణ చెప్పా’ అని మ్యాచ్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కష్టకాలంలో జట్టు సహచరులు తనకు, తన కుటుంబానికి అండగా నిలవడం వల్లే మళ్లీ కోలుకొని ఇక్కడి వరకు రాగలిగాలని 28 ఏళ్ల స్టోక్స్ భావోద్వేగంతో చెప్పాడు. ఇప్పుడెవరికీ అతని నాలుగు సిక్సర్లు గానీ బ్రిస్టల్లో గొడవ కానీ గుర్తుకు రావు. ఇంగ్లండ్ చరిత్రలో గొప్ప ఆల్రౌండర్గా నిలిచిపోయిన ఇయాన్ బోథమ్ సహా మరెందరికో సాధ్యం కాని రీతిలో విశ్వ విజయంలో భాగమైన స్టోక్స్ ఇప్పుడు వారందరికీ సూపర్ హీరో మాత్రమే. -
అదృష్టం మా వైపు ఉంది!
లండన్: ప్రపంచ కప్ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. నాలుగేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిదని మ్యాచ్ తర్వాత అతను వ్యాఖ్యానించాడు. ‘మేం గెలుపు గీత దాటడం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాతో పాటు జట్టు సభ్యులందరూ ఒక ప్రణాళిక ప్రకారం అంకితభావంతో కష్టపడ్డాం. ఈ గెలుపు ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి కూడా మాపై అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేయడం సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించిన నిబంధనపై మోర్గాన్ జాగ్రత్తగా స్పందించాడు. ‘ఇప్పుడు అమలు చేసిన పద్ధతి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఏది మెరుగైందో నిర్ణయించవచ్చు. టోర్నీ నిబంధనలు చాలా కాలం క్రితమే రూపొందించారు. వాటిపై మన నియంత్రణ ఉండదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టీకరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్పై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ‘స్టోక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను మానవాతీతుడిలా ఆడి జట్టు గెలుపు భారాన్ని సమర్థంగా మోశాడు. బట్లర్ ఔటైన తర్వాత చివరి వరుస బ్యాట్స్మెన్తో అతను ఇన్నింగ్స్ నడిపించడం అసాధారణం’ అని మోర్గాన్ చెప్పాడు. ‘అల్లా కూడా మాతోనే’... మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్ కాగా... అన్ని కలిసి రావడంపై అక్కడ ‘ఐరిష్ లక్’ పేరుతో బాగా ప్రాచుర్యంలో సామెత ఉంది. ‘ఐరిష్ లక్’ వెంట నడిచిందా అంటూ అడిగిన ప్రశ్నపై మోర్గాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నా సహచరుడు ఆదిల్ రషీద్తో మాట్లాడినప్పుడు అల్లా ఈ రోజు మనతో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి నేను కూడా అల్లా మా జట్టుకు అండగా నిలిచాడని నమ్ముతున్నా. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో వేర్వేరు సంప్రదాయాలు, నేపథ్యాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కానీ ఆటకు వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం’ అని అతను విశ్లేషించాడు. భారత్లో జరిగే 2023 ప్రపంచకప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం విశ్వ విజేతగా ఆనందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు మోర్గాన్ చెప్పాడు. 6 కాదు 5 పరుగులు ఇవ్వాల్సింది! ఓవర్త్రోపై మాజీ అంపైర్ టఫెల్ అభిప్రాయం లండన్: ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్టాస్ను డీప్ మిడ్వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చినా... అతని బ్యాట్కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ పిచ్పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ‘బౌండరీ’పై విమర్శల బాదుడు! ప్రపంచ కప్ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల లెక్కతో తేల్చడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిని అత్యంత చెత్త నిబంధనగా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విరుచుకుపడ్డారు. దీనికంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయ పడగా, ఇలాంటి నిబంధనలు మార్చేయాలని మరికొందరు సూచించారు. ఫైనల్ మ్యాచ్లో బౌండరీ పరంగా చూస్తే 26–17 తేడాతో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ నెగ్గింది. ‘క్రికెట్లో కొన్ని నిబంధనలపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ –రోహిత్ శర్మ ‘అద్భుతంగా సాగిన మ్యాచ్లో ఫలితాన్ని బౌండరీల తేడాతో నిర్ణయించడం ఏమిటో అర్థం కాలేదు. అతి చెత్త నిబంధన ఇది. ‘టై’గా ప్రకటిస్తే బాగుండేది’ –గౌతం గంభీర్ ‘బౌండరీ నిబంధనకు నేను కూడా మద్దతివ్వను. కానీ రూల్స్ అంటే రూల్సే. ఎట్టకేలకు కప్ గెలిచిన ఇంగ్లండ్కు అభినందనలు’ –యువరాజ్ సింగ్ ‘అసలు ఎంత బాగా పని చేస్తున్నారో...అసలు ఐసీసీ అనేదే పెద్ద జోక్’ –స్కాట్ స్టయిరిస్ ‘ఐసీసీ నిబంధన వల్ల ఇంగ్లండ్ కప్ గెలవడం అసలే మాత్రం ఊహించలేనిది. ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది’ –బిషన్ సింగ్ బేడి ‘డక్వర్త్ లూయిస్ నిబంధన పరుగులు, వికెట్లపై ఆధారపడి ఉంది. కానీ ఫైనల్ ఫలితం మాత్రం బౌండరీల లెక్క ప్రకారం తీసుకుంటారా’ –డీన్ జోన్స్ ‘నా దృష్టిలో ఇలా విజేతను నిర్ణయించడం దుర్మార్గమైన పద్ధతి. ఇది మారాల్సిందే’ –బ్రెట్ లీ ‘చాలా బాధగా ఉంది. మేం మోసపోయినట్లనిపిస్తోంది. పిచ్చి నిబంధన. ఇది కూడా టాస్ వేసి విజేతను నిర్ణయించడంలాంటిదే’ –డియాన్ నాష్ ‘క్రూరత్వం’ –స్టీఫెన్ ఫ్లెమింగ్ -
ప్రపంచకప్ ఫైనల్పై స్పందించిన కోహ్లి
న్యూఢిల్లీ : క్రికెట్ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చిన ఈ మ్యాచ్ ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. కోహ్లి మాత్రం నిబంధనల జోలికి పోకుండా ఇరు జట్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఇరు జట్లు అద్బుత పోరాటాన్ని కనబర్చాయి. ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు’ అంటూ సాధాసీధాగా ట్వీట్ చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై కావడంతో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ను విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌండరీల నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గంభీర్లు ఈ నిబంధనను తప్పుబట్టగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ తరహా నిబంధనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. Great show by both the teams in the #CWC19Finals yesterday. Congratulations @englandcricket. 👍🏼 — Virat Kohli (@imVkohli) July 15, 2019 I don’t agree with that rule ! But rules are rules congratulations to England on finally winning the World Cup , my heart goes out for the kiwis they fought till the end 😥. Great game an epic final !!!! #CWC19Final — yuvraj singh (@YUVSTRONG12) July 14, 2019 -
వన్డేలకు రోహిత్.. టెస్ట్లకు కోహ్లి!
ముంబై : చెత్త బ్యాటింగ్ సెలక్షన్, మిడిలార్డర్ వైఫల్యం, ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్య సమస్యగానే మిగలడం ప్రపంచకప్లో భారత్ నిష్క్రమణకు కారణమయ్యాయి. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన.. న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో తడబడి కోట్లాది ప్రజల ఆశలను సమాధి చేసింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో భారత జట్టులో గ్రూప్ తగదాలు నెలకొన్నాయని, కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను సీరియస్గా తీసుకున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కోహ్లి కెప్టెన్సీని టెస్ట్ ఫార్మట్కు పరిమితం చేసి.. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్శర్మకు అప్పగించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రపంచకప్ నేర్పిన గుణపాఠాలతో భారత్ తదుపరి ప్రపంచకప్ సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగించి, టెస్టుల్లో కోహ్లిని కొనసాగించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ‘వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి రోహిత్కిదే సరైన సమయం. ప్రస్తుత కెప్టెన్, మేనేజ్మెంట్కు అందరి మద్దతు ఉంది. కానీ, తదుపరి ప్రపంచకప్కు ప్రణాళికలు రచించుకోవాలి. అందుకోసం పాత వ్యూహాలు, ప్రణాళికలను పక్కన పెట్టాలి. జట్టులో కొన్ని విషయాల్లో మార్పు అవసరమని మనందరికి తెలుసు. లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్సీకి రోహితే సరైనవాడు’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. ‘ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే సమయం వచ్చేసిందా? నేనైతే.. రోహితే 2023 ప్రపంచకప్కు సారథ్యం వహించాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. ఇక ఇద్దరు కెప్టెన్ల డిమాండ్ ఇప్పుడే రాలేదు. ఆసియాకప్, నిదహాస్ టోర్నీల్లో రోహిత్సేన విజయం సాధించినప్పుడే ఈ వాదన తెరపైకి వచ్చింది. రోహిత్ సారథ్య రికార్డు కోహ్లి కన్నా మెరుగ్గా ఉండటంతో ఈ డిమాండ్ వ్యక్తమైంది. ప్రపంచకప్లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ సమావేశంలో ఇద్దరు కెప్టెన్ల అంశం చర్చకు రానుంది. -
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు
దుబాయ్ : ఐసీసీ ప్రపంచకప్ 2019 టీమ్ ఆఫ్ ది టోర్నీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటుదక్కలేదు. ప్రపంచకప్ సంగ్రామం ముగియడంతో 12 మంది సభ్యులతో కూడిన టోర్నీ ఉత్తమ జట్టును సోమవారం ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లే అవకాశం దక్కించుకోగా.. అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి నలుగురికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్ తరఫున ఒక్కరు ఎంపికయ్యారు. భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రాకుల మాత్రమే చోటుదక్కింది. ఇక ఈ మెగా జట్టు కెప్టెన్గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ను ఎంపిక చేయగా.. వికెట్ కీపర్గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్ టోర్నీ ప్రదర్శన ఆధారంగానే ఈ జట్టును ఎంపిక చేయడంతో భారత కెప్టెన్కు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ 5 సెంచరీలతో చెలరేగి పరుగుల జాబితాలో టోర్నీ టాపర్గా నిలవగా.. 18 వికెట్లతో బుమ్రా రాణించాడు. ఇక 12వ ఆటగాడిగా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్బౌల్ట్ను ఎంపిక చేశారు. ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, జాసన్ రాయ్ (ఓపెనర్స్), జోరూట్, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, ఫెర్గ్సన్, జస్ప్రిత్ బుమ్రా. 12వ ఆటగాడు: ట్రెంట్ బౌల్ట్ -
క్రికెట్ రూల్స్పై దృష్టి సారించాల్సిందే: రోహిత్
ముంబై : ప్రపంచకప్ ఫైనల్ ఫలితంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఐసీసీ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఉన్న ఈ రూల్స్ను మార్చాల్సిందేనని పట్టుబడుతోంది. ఇప్పటికే డక్వర్త్ లూయిస్ పద్దతిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. తాజా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంతో సూపర్ ఓవర్ నిబంధన చర్చనీయాంశమైంది. న్యూజిలాండ్-ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ టై కావడంతో సూపర్ ఓవర్ నిబంధన ప్రకారం బౌండరీలు ఎక్కువ సాధించిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఇరు జట్లు సమాన పోరాట ప్రతిభను కనబర్చని స్థితిలో కేవలం బౌండరీలనే ప్రతిపాదికగా తీసుకొని విజేతగా ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బౌండరీలకన్నా సింగిల్స్ తీస్తూ పరుగులు చేయడమే అసలైన క్రికెట్ అని, అలాంటిది ఎక్కువ బౌండరీలు చేసిన జట్టును ఎలా విజేతగా ప్రకటిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడం ఏ మాత్రం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు మద్దతుగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, వైస్ కెప్టెన్ రోహిత్శర్మలు ట్వీట్ చేశారు. ఈ బౌండరీల నిబందన చెత్తదని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. క్రికెట్లోని కొన్ని రూల్స్పై సీరియస్గా దృష్టిసారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. Some rules in cricket definitely needs a serious look in. — Rohit Sharma (@ImRo45) July 15, 2019 -
‘ధోని రనౌట్ పాపమే చుట్టుకుంది’
విశ్వవేదికపై గెలుపు ముంగిట న్యూజిలాండ్ బొక్కబోర్లపడటానికి ఆ జట్టు చేసుకున్న కర్మే కారణమని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు. భారత్తో జరిగిన సెమీస్ పోరులో కివీస్ చేసిన తప్పుకు ఫలితమే ప్రపంచకప్ ఫైనల్ ఓటమని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని రనౌట్ను ప్రస్తావిస్తూ ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. ఆ మ్యాచ్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకి, ధోని రనౌట్తో భారత పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. అయితే తుది సమరంలో మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్ ఆఖరు బంతికి రెండో పరుగు తీస్తూ గప్టిల్ రనౌటవ్వడం అంతా కర్మ సిద్దాంత ఫలితమేనని #Karma యాష్ట్యాగ్తో నిందిస్తున్నారు. అయితే ధోని రనౌట్ విషయంలో కివీస్ నిబంధనలకు విరుద్ధంగా ఫీల్డింగ్ పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. మూడో పవర్ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ సమయంలో కివీస్ ఆరుగురు ఫీల్డర్లను పెట్టిందని ప్రచారం జరిగింది. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోని కూడా పరుగు కోసం ప్రయత్నించివాడు కాదన్నది అభిమానుల ఉద్దేశం. ఇదే విషయాన్ని ప్రస్తవిస్తూ ఈ పాపమే గప్టిల్, కివీస్కు చుట్టుకుందని మండిపడుతున్నారు. What's active on twitter?#Karma Seriously...... Seems kindergartners active on twiiter!!!!!!!!!! pic.twitter.com/qfYhxirhzN — Bivek Chandak (@ChandakBivek) July 15, 2019 -
ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్ తండ్రి
ఓ తండ్రిగా గర్వపడుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ ఓటమి తనను తీవ్రంగా నిరాశపరించిందని వరల్డ్కప్ మ్యాచ్ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్స్టోక్స్ తండ్రి గెరార్డ్ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠ పోరులో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ తొలిసారి కప్ను ముద్దాడటంలో ఆ జట్టు ఆల్ రౌండర్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం తన కారణంగా జట్టు టీ 20 వరల్డ్కప్లో ట్రోఫీని చేజార్చుకుందన్న అపరాధ భావనను ఆదివారం నాటి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన ద్వారా స్టోక్స్ చెరిపేసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి సహచరులు వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోవడమే కాక సూపర్ ఓవర్లో సైతం సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును చాంపియన్గా నిలపడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించిన లార్డ్స్ మైదానంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి చెరిగిపోని ఙ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. బెన్ స్టోక్స్ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్కప్ ట్విటర్ అకౌంట్లో అతడిని ఆకాశానికి ఎత్తేసింది. ఈ క్రమంలో స్టోక్స్ తండ్రి గెరార్డ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఓ వైపు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూనే.. మరోవైపు కివీస్ ఓటమి తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశాడు. ‘ న్యూజిలాండ్లో అత్యధిక మంది చేత ద్వేషింపబడే తండ్రిని నేనేమో. బ్లాక్ క్యాప్స్ ఓటమి నన్నెంతో నిరాశకు గురిచేసింది. ట్రోఫీ లేకుండా వెనుదిరగడం నిజంగా సిగ్గుచేటు. గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా తన జట్టును గెలిపించిన స్టోక్స్ తండ్రిగా ఆనందంలో తేలియాడుతున్నా.ఏదేమైనా స్టోక్స్ కఠిన శ్రమకు ఈ మ్యాచ్తో ప్రతిఫలం లభించినట్లైంది. కానీ న్యూజిలాండ్ సపోర్టర్గా తీవ్ర నైరాశ్యంలో ఉన్నా’ అని వ్యాఖ్యానించాడు. కాగా స్టోక్స్ న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో జన్మించాడన్న సంగతి తెలిసిందే. అతడికి పన్నెండేళ్లు వచ్చేనాటికి స్టోక్స్ కుటుంబం నార్తర్న్ ఇంగ్లండ్కు షిఫ్ట్ అయ్యింది. రగ్బీ లీగ్ కోచింగ్ కాంట్రాక్ట్ నిమిత్తం అతడి తండ్రి గెరార్డ్ కుటుంబంతో సహా కంబ్రియాకు వచ్చి స్థిరపడ్డారు. ఇక అక్కడే క్రికెట్లో ఓనమాలు దిద్దిన స్టోక్స్ ఆల్ రౌండర్గా ఎదిగాడు. -
ఆర్చర్కు సూపర్ పవర్ ఉందా?
లండన్: నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్ వరల్డ్కప్ గెలవడం ఒకటైతే, ఆ దేశ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పడు హాట్ టాపిక్గా మారడం మరొకటి. అది కూడా ఎంతలా అంటే ఆర్చర్కు సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అనేంతగా అభిమానుల్లో ఆసక్తికి దారి తీసింది. 2013లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అందులో 16 పరుగులు, 6 బంతులు అని ఉండటమే చర్చనీయాంశమైంది. తాజా వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన తుది పోరులో భాగంగా ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది. అంటే న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరొక సందర్భంలో అంటే ఏడాది వ్యవధిలో ఆర్చర్ మరో ట్వీట్ చేశాడు. ‘ మేము లార్డ్స్కు వెళ్లాలనుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు. 2015లో మరొక ట్వీట్ చేస్తూ అందులో ‘సూపర్ ఓవర్ను పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నాడు. ఆర్చర్ చేసిన ఒకనాటి ట్వీట్లు ఇప్పటి వరల్డ్కప్కు దాదాపు సరిపోలడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ ఆర్చర్ భవిష్యత్తుకు అతనే జ్యోతిష్కుడు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘కాలజ్ఞాని, నిజమైన దేవుడు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘కలలు నిజం అంటే ఇదే. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. నీలో సూపర్ నేచురల్ పవర్ ఉంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు తాజా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారడం, అందుకు అభిమానుల్ని అనూహ్య మద్దతు లభించడం విశేషం. ఒక ఈ వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు ఆర్చర్. 2019 వరల్డ్కప్ సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా నమోదైంది. -
ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?
లార్డ్స్: విశ్వవేదికపై ఇంగ్లండ్ విజయం సాధించింది అనకంటే న్యూజిలాండ్ దురదృష్టమే గెలిపించిందని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ తరహా ఫలితం వెలువడలేదు. న్యూజిలాండ్ దురదృష్టం కాకపోతే.. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండు టై కావడం ఏంటి.. గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్లడం ఏంటి.. బౌల్ట్ క్యాచ్ పట్టుకోని బౌండరీ లైన్ తొక్కడం ఏంటి. ఇదంతా చూస్తే ఈసారి కప్ ఇంగ్లండ్కే రాసినట్టుంది. ఆఖరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్లడం.. అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం ఇప్పుడు వివాదస్పదమైంది. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. 19.8 నిబంధన మేరకు ఓవర్త్రో ద్వారా బౌండరీ లభించినప్పుడు ఆ పరుగులతో పాటు ఫీల్డర్ యాక్షన్ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్మెన్ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి. అయితే ఇక్కడ బెన్స్టోక్స్, ఆదిల్ రషీద్లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్ బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. వాస్తవానికి ఈ పరుగులే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. 5 పరుగులు కనుక ఇచ్చి ఉంటే ఇంగ్లండ్ విజయానికి రెండు బంతుల్లో 4 పరుగలు చేయాల్సి వచ్చేది. న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలిచేంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అంపైర్లు ఘోర తప్పిదం చేశారని ఆస్ట్రేలియా మాజీ అంపైర్, ఐదు సార్లు ఐసీసీ బెస్ట్ అంపైర్గా నిచిన సైమన్ టఫెల్ అన్నారు. ‘ఇది అంపైర్ల తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ఇంగ్లండ్కు ఇవ్వాల్సింది ఐదు పరుగులే. ఆ ఉత్కంఠ స్థితిల్లో బ్యాట్స్మెన్ పరుగును పూర్తిచేశారని అంపైర్లు భావించారు. కానీ రెండో పరుగు పూర్తి కాలేదు. టీవీ రిప్లేలో ఈ విషయం స్పష్టమైంది’ అని తెలిపారు. -
బౌండరీలు కూడా సమానమైతే?
లార్డ్స్ : నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రపంచకప్ మహాసంగ్రామం ముగిసింది. క్రికెట్ పుట్టినింటికే విశ్వకానుక చేరింది. 45 రోజుల ఆట ఏడున్నర గంటల్లో తేలకపోయినా 4 నిమిషాల్లో మెరిసి మురిసింది. తృటిలో టైటిల్ చేజార్చుకున్న న్యూజిలాండ్ మాత్రం అభిమానుల మనుసులను గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమానిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అయితే చివరకు బౌండరీలు మ్యాచ్ ఫలితం తేల్చగా.. కివీస్ను మాత్రం నిరాశ పరిచాయి. ఈ తుదిపోరులో ఇంగ్లండ్ సూపర్ ఓవర్తో కలుపుకొని 26 బౌండరీలు బాదగా.. కివీస్ మాత్రం 17 బౌండరీలే సాధించింది. దీంతో విశ్వవిజేతగా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ నిలిచింది. సూపర్ ఓవర్ టై అయితే ప్రధానమ్యాచ్, సూపర్ ఓవర్ మొత్తం బౌండరీలు లెక్కించి.. ఎక్కవ బౌండరీలు చేసిన జట్టును విజేతగా ప్రకటించారు. మరీ ఆ బౌండరీలు కూడా టై అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతి అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం ఈ పరిస్థితి కనుక ఏర్పడితే.. కేవలం ప్రధాన మ్యాచ్ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. ఒకవేళ అవి కూడా సమానమైతే.. సూపర్ ఓవర్ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన పరుగులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ రన్స్ చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఊదాహారణకు... బంతులు తొలి జట్టు రెండో జట్టు 6వ బంతి 4 4 5వ బంతి 3 2 4వ బంతి 6 4 3వ బంతి 1 2 2వ బంతి 1 2 1వ బంతి 1 2 ఇక్కడ తొలి జట్టు చివరి బంతికి 4 పరుగులు సాధించగా.. రెండో జట్టు కూడా అంతే పరుగులు చేసింది. ఐదో బంతికి తొలి జట్టు 3 పరుగులు చేయగా.. రెండో జట్టు మాత్రం 2 పరుగులే చేసింది. రెండో జట్టు కన్నా ఒక పరుగు ఎక్కువ చేసింది కనుక సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం తొలి జట్టే విజేత అవుతోంది. -
అనూహ్యంగా వచ్చాడు.. టాప్ లేపాడు!
లండన్: జోఫ్రా ఆర్చర్.. వరల్డ్కప్కు ఇంగ్లండ్ ముందుగా ప్రకటించిన జాబితాలో ఈ పేరు లేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే గాయపడితే ఆర్చర్కు అనూహ్యంగా చోటు దక్కింది. వెస్టిండీస్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడి, ఆపై ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించడం ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం. ప్రధానంగా ఇంగ్లిష్ కౌంటీల్లో సత్తాచాటడంతో ఆర్చర్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే వరకూ ఈ క్రికెటర్ పేరు ఎవరికీ పెద్దగా కూడా తెలియదు. అయితే ఐపీఎల్లో ఫర్వాలేదనిపించినా, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టులో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ వరల్డ్కప్కు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు. ఏది ఏమైనా ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నా ఆ జట్టు అంచనాల్ని నిజం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్ పాత్ర పోషిస్తూ వరల్డ్కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అదే సమయంలో ఒక వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. 2019 సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున అత్యధికం. అదే సమయంలో మార్క్ వుడ్(18) రెండో స్థానంలో నిలిచాడు. ఒక వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున అత్యధి వికెట్లు సాధించిన జాబితాలో ఆర్చర్, మార్క్ వుడ్ల తర్వాత స్థానాల్లో క్రిస్ వోక్స్(16 వికెట్లు, 2019 వరల్డ్కప్), ఇయాన్ బోథమ్(16 వికెట్లు, 1992 వరల్డ్కప్), ఆండ్రూ ఫ్లింటాఫ్(14 వికెట్లు, 2007 వరల్డ్కప్)లు ఉన్నారు. -
బెన్ స్టోక్స్కు అంత సీన్ లేదు!
లండన్: ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్కప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రధాన పాత్ర పోషించాడు. మెగా ఫైట్లో న్యూజిలాండ్ నిర్దేశించిన 242 లక్ష్య ఛేదనలో స్టోక్స్ అజేయంగా 84 పరుగులు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో కూడా స్టోక్స్ ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేశాడు. మరొకవైపు బట్లర్ 7 పరుగులు చేశాడు. కాగా, సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయగా మళ్లీ మ్యాచ్ టై అయ్యింది. అయితే మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విశ్వ విజేతగా అవతరించింది. అయితే బెన్ స్టోక్స్ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్కప్ ట్వీటర్ అకౌంట్లో పేర్కొంది. ఇంతవరకూ బాగానే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో స్టోక్స్ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇది భారత అభిమానులకు కోపం తెప్పించింది. ప్రధానంగా ఈ ట్వీట్పై సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు బెన్ స్టోక్స్కు అంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. ‘ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో తెలుసా’ అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ సచిన్తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్ లెజెండ్, ఎవరు ఎన్ని చేసినా సచిన్ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం’ అంటూ మరొకరూ విమర్శించారు. ‘ ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్ టైమ్ గ్రేట్ అనేది అర్థమవుతుంది కదా’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. అసలు బెన్ స్టోక్స్కు అంత సీన్ లేదు. ఇలా పోస్ట్ చేసిన వాడ్ని చెప్పుతో కొట్టాలి’ అంటూ మరొక అభిమాని మండిపడ్డాఢు. -
మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్ ఆవేదన
లండన్: వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. .ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్ టై కాగా, ఆపై నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టైగానే ముగిసింది. దీంతో బౌండరీలను( సూపర్ ఓవర్తో సహా ఫోర్లు, సిక్సర్లు) లెక్కలోకి తీసుకున్న ఇంగ్లండ్నే వరల్డ్ చాంపియన్గా ప్రకటించారు. ఇది ఆతిథ్య ఇంగ్లండ్కు అనుకూలంగా మారగా, గెలుపు తలుపు వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆవేదన మాత్రం వర్ణనాతీతం. కప్పు ఇంగ్లండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుట్టెడు దుఖంలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్( జిమ్మీ నీషమ్గా కూడా పిలుస్తారు) ట్వీటర్లో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్కు అభినందనలు తెలియజేశాడు నీషమ్. జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు సైతం నీషమ్ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు... ఎవరూ మరిచిపోలేరని అండగా నిలుస్తున్నారు. Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy. — Jimmy Neesham (@JimmyNeesh) 15 July 2019 -
డీఆర్ఎస్ లేకుంటే బలైపోయేవారే..!
లండన్: ప్రపంచ క్రికెట్లో డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)ని ప్రవేశపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లే అయ్యింది. ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు నేటికీ ఉన్నప్పటికీ దీని వల్ల క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయనే చెప్పాలి. డీఆర్ఎస్లో హాక్ ఐ (బాల్ ట్రాకింట్ టెక్నాలజీ), హాట్ స్పాట్(బ్యాట్కు బంతి ఎడ్జ్ తీసుకుందా అనే కోణాన్ని పరిశీలించడం), స్నికో మీటర్(బంతి బ్యాట్కు లేదా ప్యాడ్కు తగిలిందా గుర్తించడానికి వాడే టెక్నాలజీ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో అసలు క్రికెటర్ ఔటా, కాదా అనే విషయంపై థర్డ్ అంపైర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్ అంపైర్కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్లో ఒక జట్టు తమ ఇన్నింగ్స్ను ఆరంభించిన క్రమంలో ఒక రివ్యూనే ఉంటుంది. దాన్ని ఎక్కడ, ఎలా వాడుకోవాలనేది అక్కడ ఉండే పరిస్థితిపైనే ఉంటుంది. ఒకసారి రివ్యూకు కోల్పోతే మళ్లీ చాన్స్ ఉండదు. అదే సమయంలో రివ్యూకు సక్సెస్ అయితే అది అలానే ఉంటుంది. మరొకవైపు థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్కే వదిలేసిన క్రమంలో కూడా రివ్యూకు వెళ్లిన జట్టు దాన్ని నిలబెట్టుకుంటుంది. కాగా, ఆదివారంతో ముగిసిన వన్డే వరల్డ్కప్లో డీఆర్ఎస్ది కూడా ప్రముఖ పాత్రనే చెప్పాలి. నిజంగా డీఆర్ఎస్ లేకుంటే మెగా టోర్నీ కూడా పేలవంగా ముగిసే అవకాశంతో పాటు ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసేది. ఈ వరల్డ్కప్లో ఫీల్డ్ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్ఎస్లో తప్పుగా తేలిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇలా అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్ అలన్ కెటల్బారో(ఇంగ్లండ్ అంపైర్) మొదటి స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్కప్లో రిచర్డ్ అలన్ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్ఎస్లో తప్పుగా తేలగా, ఆ తర్వాత వరుసలో క్రిస్టోఫర్ గాఫనీ(న్యూజిలాండ్ అంపైర్), పాల్ విల్సన్(ఆస్ట్రేలియా అంపైర్), రుచిర పలియాగురుజే( శ్రీలంక అంపైర్), కుమార ధర్మసేన(శ్రీలంక అంపైర్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో నాలుగు అంపైరింగ్ తప్పిదాలు చేశారు. ఆసీస్తో సెమీస్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఇలానే బలైపోయాడు. కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్ పెవిలియన్ వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్కు రివ్యూ లేకపోవడంతో రాయ్ ఇక చేసేదేమీ లేకపోయింది. ఇదొక ఉదాహరణే అయినా, ఇంకా ఇటువంటివి చాలనే ఉన్నాయి. డీఆర్ఎస్ విధానం ఉండగానే ఇన్ని తప్పిదాలు జరిగితే.. అసలు అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి లేకుంటే మాత్రం అధిక సంఖ్యలో ఆటగాళ్లు కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు బలైపోయేవారనేది కాదనలేని సత్యం. -
ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!
క్రికెట్కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ కల నెరవేరింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను ఓడించి ఇంగ్లండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 44 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి టైటిల్ను సాధించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్కు చేరిన కివీస్ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై.. ఇంటిదారి పట్టిన భారత జట్టు కూడా ఫైనల్ ఫలితాల అనంతరం ఒకింత నిరాశ చెంది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచకప్లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్ మాత్రమే. ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నప్పటికీ.. ఆ జట్టు ప్రస్తుత టోర్నమెంటులో మూడు పరాజయాలు చవిచూసింది. లీగ్ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా నాకౌట్ దశలో కివీస్ చేతిలో ఓడి.. ఫైనల్కు చేరకుండానే తన ప్రస్థానం ముగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్లో ఈ రెండు పరాజయాలు మినహా కోహ్లి సేన ఏడు విజయాలు సాధించింది. ఇక, విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిది విజయాలు సాధించగా.. మూడు ఓటములు చవిచూసింది. ఆస్ట్రేలియా ఏడు విజయాలు, మూడు పరాజయాలు చవిచూడగా.. రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ ఐదు విజయాలు, మూడు పరాజయాలు, శ్రీలంక మూడు విజయాలు, నాలుగు పరాజయాలు, దక్షిణాఫ్రికా మూడు విజయాలు, ఐదు పరాజయాలు, బంగ్లాదేశ్ మూడు విజయాలు, ఐదు పరాజయాలు నమోదుచేసుకోగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న వెస్టిండీస్ రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. ఇక, అండర్డాగ్గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయకుండా.. మొత్తం 9 పరాజయాలు మూటగట్టుకొని.. చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
టామ్ లాథమ్ నయా రికార్డు
లండన్: న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్కప్లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్ కీపర్గా నిలిచాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మెగా ఫైట్లో లాథమ్ మూడు క్యాచ్లను అందుకున్నాడు. ఫలితంగా ఒకే వరల్డ్కప్లో అత్యధిక మందిని పెవిలియన్కు పంపిన కీపర్గా ఆడమ్ గిల్ క్రిస్ట్(ఆస్ట్రేలియా) సరసన చేరిపోయాడు. ఈ వరల్డ్కప్లో లాథమ్ 21 ఔట్లలో భాగస్వామ్యమైతే, అంతకుముందు 2003 వరల్డ్కప్లో గిల్ క్రిస్ట్ కూడా సరిగ్గా 21 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ జాబితాలో గిల్ క్రిస్ట్, లాథమ్ల తర్వాత స్థానాల్లో అలెక్స్ క్యారీ(20, 2019 వరల్డ్కప్), కుమార సంగక్కరా(17, 2003 వరల్డ్కప్)లు ఉన్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్లో జేసన్ రాయ్, జో రూట్, క్రిస్ వోక్స్ క్యాచ్లను లాథమ్ అందుకున్నాడు.ఇరు జట్ల మధ్య జరిగిన తుది పోరులో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్తో పాటు, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఓవరాల్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. -
హీరో.. విలన్.. గప్టిలే!
లండన్: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఎంఎస్ ధోనీని రనౌట్ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్ గతినే మార్చేశాడు కివీస్ ఆటగాడు మార్టిన్ గఫ్టిల్. ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ టీమిండియా గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, మార్టిన్ గప్టిల్ విసిరిన బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్కు ధోని రనౌట్గా వెనుదిరిగాడు. టీమిండియా ఓడిపోయింది. అయితే, ఇది ఇక్కడితో ముగియలేదు. సేమ్ సీన్ ఫైనల్ మ్యాచ్లోనూ పునరావృతమైంది. అదీ కూడా గఫ్టిల్కే. సెమీఫైనల్ మ్యాచ్లో రెండు పరుగు తీయబోయిన ధోనీ.. గఫ్టిల్ సూపర్ త్రోకు రన్నౌట్ అయ్యాడు. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఓవర్ చివరి బంతికి రెండో పరుగు తీయబోయి గఫ్టిల్ రనౌట్గా వెనుదిరగడంతో విశ్వకప్ ఇంగ్లండ్ వశమైంది. ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ చివరి బంతిని బాదిన గఫ్టిల్ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేశాడు. విజయం కోసం కావాల్సిన రెండో బంతి కోసం.. అతను ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్ నుంచి నేరుగా బంతిని అందుకున్న జోస్ బట్లర్ వికెట్లను గిరాటేశాడు. దీంతో గఫ్టిల్ రన్నౌట్ అయ్యాడు. ధోనీ రన్నౌట్ భారత్ ఫైనల్కు చేరకుండా అడ్డుకోగా.. గఫ్టిల్ రనౌట్ కివీస్ జట్టుకు వరల్డ్ కప్ను దూరం చేసింది. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో అతను విసిరిన బంతి అనుకోకుండా స్టోక్స్ బ్యాటుకు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లండ్ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఇదీ కూడా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. (చదవండి: నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్లో కీలక మలుపు) గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. -
జీవితాంతం కేన్కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్
లండన్ : వరల్డ్కప్ 2019 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యద్భుత పోరు. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమాని ఊహకందని విషయం. అయితే మ్యాచ్ను టైగా మార్చింది మాత్రం ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ ఓవర్లో ఇంగ్లాండ్ మూడు బంతుల్లో 9 పరుగులు చేయాలి. కప్పు గెలవడానికి న్యూజిలాండ్కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు. ఆ బంతిని స్టోక్స్ ఫోర్ కొట్టాలని చూశాడు. బంతి గప్తిల్కు దొరికింది. త్రో విసిరాడు.. క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది. ఆరు పరుగులొచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్ బ్యాటుకు తాకకపోయి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కప్పు న్యూజిలాండ్ను వరించేదేమో. కానీ త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లండ్కు కలిసి వచ్చాయి. ఇంగ్లండ్ విజయం తర్వాత బెన్ స్టోక్స్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ప్రకటించారు. అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను అన్నాడు . ఇది తాను కావాలని చేసింది కాదని.. బాల్ అలా అనుకోకుండా తన బ్యాట్ను తాకిందన్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందన్నాడు. ఇందుకు కేన్కు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు. అయితే ఈ గెలుపు కోసమే తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని.. ఎన్నో మాటలు పడిందన్నాడు స్టోక్స్. చివరకూ తాము అనుకున్నది సాధించామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరోటి ఉంటుందని తాను భావించడం లేదన్నాడు స్టోక్స్. -
‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’
లండన్ : నరాలు తెగే ఉత్కంఠత మధ్య.. క్రికెట్ పుట్టినింటికే ప్రపంచకప్ చేరింది. మ్యాచ్, సూపర్ ఓవర్ టైగా మారినప్పటికి.. సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ వరుసగా రెండో సారి రన్నరప్గా నిలిచింది. న్యూజిలాండ్ ఓటమితో కివీస్ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందారు. ఓటమిపై న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ.. ‘విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ టీంకు ధన్యవాదాలు. మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పిచ్లు మేం అనుకున్నదాని కంటే భిన్నంగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ టైగా మారడం వెనక చాలా కారణాలున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం. మ్యాచ్ టైగా మారటంతో మా ఆటగాళ్లు తీవ్రంగా కలత చెందారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అన్నారు. ‘ఇది కేవలం ఒక్క ఎక్స్ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదు. మ్యాచ్ మొత్తం మీద జరిగిన ప్రతి చిన్న విషయం కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్ ఫోర్ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్ త్రో విసిరాడు. అయితే క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ అన్నారు విలియమ్సన్. -
నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్లో కీలక మలుపు
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. విశ్వకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడం.. సూపర్ ఓవర్కు వెళ్లడం.. సూపర్ కూడా టై కావడం ఇదే తొలిసారి. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపుతూ.. చూసే ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టి.. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్కు గురిచేసిన ఫైనల్ మ్యాచ్.. ఆద్యంతం రోమాంఛితంగా సాగింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా వీక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. నిజానికి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. ఇరుజట్లు వీరోచితంగా పోరాడాయి. ప్రపంచకప్ను ఒడిసిపట్టేందుకు తమ శాయశక్తులు ఒడ్డాయి. సమ ఉజ్జీలుగా కనిపించిన ఇరుజట్లు చివరి బంతి వరకు సింహాల్లా పోరాడాయి. ఫలితం మ్యాచ్ టై కావడమే.. కాకుండా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టు వీరోచితంగా పోరాడినా.. ఆ జట్టుకు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. ముఖ్యంగా 50 ఓవర్లో జరిగిన ఓ అరుదైన, అద్భుత ఘటన కివీస్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం. ఈ దశలో కివీస్ విజయానికి అడ్డుగోడలా ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ నిలబడ్డాడు. చివరి ఓవర్లో మొదటి రెండు బంతులు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్ సిక్సర్గా మలిచాడు. మరో మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి ఓ అద్భుతం చోటుచేసుకొని.. మ్యాచ్ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని డీప్లోకి తరలించిన స్టోక్స్.. రెండు పరుగులు తీశాడు. అయితే, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్ గఫ్టిల్ విసిరిన బంతి.. నేరుగా స్టోక్స్ బ్యాట్కు తగిలి.. బౌండరీ దిశగా దూసుకుపోయింది. నమ్మశక్యం కాని ఈ పరిణామంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. నిజానికి ఇందులో స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదు. రెండో పరుగు తీస్తున్న సమయంలో అతను బంతిని చూడనేలేదు. కానీ గఫ్టిల్ విసిరిన బంతి నేరుగా వచ్చి స్టోక్స్ బ్యాటుకు తగిలింది. ఇలా ఈ బంతికి అనూహ్యంగా ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం వరించేది. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి.. ఇద్దరు రన్నౌట్ కావడంతో ఇంగ్లండ్ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది. మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా కావడం.. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించడం తెలిసిందే. -
ఇంగ్లాండ్ అలా గెలిచిందట.!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూత లూగించింది. న్యూజిలాండ్కు గెలుపు ఖాయమనుకుంటున్న దశలో 49వ ఓవర్ మొత్తం మ్యాచ్ను మలుపు తిప్పింది. ముఖ్యంగా ఓవర్ త్రో ఇంగ్లాండ్ జట్టుకు అనూహ్యంగా పరుగులు తోడవడం కీలక పరిణామం. చివరికి టై అవ్వడం, సూపర్ ఓవర్, రెండోసారి కూడా టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలవడం తెలిసిన సంగతే. ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులు ఇంకా అమోమయం తేరుకోకముందే ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చింది. ఏం జరుగుతోందో అర్ధమయ్యలోపే ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించింది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త చరిత్రగా విశ్లేషకులు భావిస్తుండగా, సోషల్ మీడియాలో పలు సందేహాలు, న్యూజిలాండ్పై తీవ్ర సానుభూతి వ్యక్తమైంది. నైతికంగా న్యూజిలాండ్దే గెలుపు అని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఏ రన్ అవుట్తో అయితే ధోనిని పెవిలియన్కు పంపారో.. న్యూజిలాండ్ కూడా అదే రనౌట్తో రన్నరప్గా నిలిచిందని మరికొందరు కమెంట్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ షేర్ చేసిన వీడియో వైరలవుతోంది. రెండుసార్లు టై అయిన మ్యాచ్లో ఇంగ్లాండ్ విజేత ఎలా అయిందో తెలుపుతూ వెన్నెల కిశోర్, బాలాజీ కలిపి ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నితిన్ హీరోగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో పరిమళగా నటిస్తున్న వెన్నెల కిషోర్ షూటింగ్ బ్రేక్లో ఈ వీడియోను తీసినట్టు ట్వీట్ చేశారు. In the mean time #Bheeshma Night shoot on hold for a moment.. pic.twitter.com/hrhvhRf6PP — vennela kishore (@vennelakishore) July 14, 2019 కాగా ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసి అల్ ఔట్ అయింది. అయినా కూడా ఆఖరి బంతికి ఒక పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్ణయం తీసుకోగా ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ (సూపర్ ఓవర్)మాత్రమే కొట్టింది. దీంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారు. చదవండి :ప్రపంచ కల నెరవేరింది -
సారీ న్యూజిలాండ్...
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్ ఫైనల్లో పాత రూల్స్ అమల్లో ఉంటే ఇంగ్లండ్–న్యూజిలాండ్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. కానీ ఈ మ్యాచ్లో కివీస్ ఓడిపోయిందంటే సగటు క్రికెట్ అభిమాని కూడా దానిని తమ పరాజయంగా భావిస్తున్నాడు. స్టోక్స్ బ్యాట్ను తాకి పోయిన 6 పరుగుల ఓవర్త్రో దురదృష్టమో, గప్టిల్ గ్రహచారం బాగా లేని రోజు కావడమో కానీ విలియమ్సన్ సేన విలపించాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఆట తర్వాత కూడా బౌండరీ లెక్కల త్రాసుతో ఇంగ్లండ్ పైచేయి కావడం బలవంతంగా కివీ రెక్కలు విరిచేసినట్లయింది. వరుసగా రెండోసారి కూడా న్యూజిలాండ్ను ఫైనల్ మ్యాచ్లో ఓటమి వెంటాడింది. అయితే ఆ జట్టు గొప్పతనాన్ని ఈ మ్యాచ్ ఫలితం తగ్గించలేదు. ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా, దూషణలకు పాల్పడకుండా కూడా ప్రపంచ కప్లో గొప్ప విజయాలు సాధించవచ్చని ఆ జట్టు నిరూపించింది. కివీస్ క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదానంలో వారి ప్రవర్తన. తమదైన ఆటను ఆడుకుంటూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంలో వారికి వారే సాటి. ఫెయిర్ ప్లే అవార్డు అంటూ ఎప్పుడిచ్చినా ఈ మర్యాద రామన్నల బృందానికే దక్కడం పరమ రొటీన్. ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టంను మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అందరికంటే అతి తక్కువగా ఒకే ఒకసారి శిక్షకు గురైన జట్టు న్యూజిలాండ్. వారి ఆట ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇది చాలు. ఏ టోర్నీలో బరిలోకి దిగినా వారిని ‘అండర్డాగ్’గానే చూడడం అందరికీ అలవాటైపోయింది. డాగ్ ఏదైనా అసలైన రోజు కరవడం ముఖ్యం అని స్వయంగా విలియమ్సన్ చెప్పినట్లు రెండు అసలు మ్యాచ్లలో కివీస్ సత్తా చాటింది. సెమీస్లోనే భారత్ ముందు అసలు కివీస్ను ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు. కానీ అద్భుత వ్యూహంతో ఆ జట్టు అనూహ్య విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరుకే పరిమితమైనా... పట్టుదలతో ఆడి టీమిండియాను నిలవరించగలిగింది. ఫైనల్లో కూడా నాలుగు ఇంగ్లండ్ వికెట్లు తీసిన తర్వాత విజయానికి బాటలు వేసుకున్న ఆ జట్టు అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. కెప్టెన్గా తొలి ప్రపంచ కప్లో బ్యాట్స్మన్గానూ తనదైన ముద్ర వేసిన విలియమ్సన్కు దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్ల నుంచి ఎక్కువ మద్దతు లభించలేదు. అదే చివరి పోరులో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేందుకు కారణమైంది. విలియమ్సన్ 82.57 సగటుతో ఏకంగా 578 పరుగులు చేయగా... రెండో స్థానంలో నిలిచిన టేలర్ మూడు అర్ధ సెంచరీలతో 350 పరుగులకే పరిమితమయ్యాడు. గత వరల్డ్కప్లో డబుల్ సెంచరీ సహా హీరోగా నిలిచిన గప్టిల్ ఘోర వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 10 ఇన్నింగ్స్లలో కలిపి అతను 186 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కివీస్ ఇక్కడి వరకు రాగలిగిందంటే పేస్ బౌలింగ్ త్రయమే కారణం. ఫెర్గూసన్ (21), బౌల్ట్ (17), హెన్రీ (14) కలిపి 52 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్కు ఐదుకు మించి పరుగులు ఇవ్వలేదంటే ఎంత నియంత్రణతో బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. 232 పరుగులు చేసిన నీషమ్ కూడా 15 వికెట్లతో అండగా నిలిచాడు. అయితే చివరకు బ్యాటింగ్ వైఫల్యమే కివీస్కు గొప్ప అవకాశాన్ని దూరం చేసింది. అఫ్గానిస్తాన్ మినహా టోర్నీలో 300 దాటని ఏకైక జట్టు న్యూజిలాండే. ఫలితంగా కివీస్ బృందం టైటిల్ కాకుండా మరోసారి హృదయాలు గెలుచుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్వన్గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్కప్లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్లో తమ చేతిలో చిత్తయిన కివీస్పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్నే ఓడించిన న్యూజిలాండ్ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్మన్గా కంటే కెప్టెన్గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్తో దూకుడు చూపిన గప్టిల్ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్లో రూట్కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్గా స్టోక్స్కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్వైట్ వరుసగా నాలుగు సిక్స్లు బాది వెస్టిండీస్కు కప్ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్ను ఓదార్చుతున్న నీషమ్ -
ప్రపంచకప్ 2019: పుట్టినింటికే చేరింది
ప్రపంచకప్ ఫైనల్ పోరు ఎలా ఉండాలని అభిమాని కోరకుంటాడో అంతకుమించి జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ. ఇరుజట్ల మధ్య దోబుచులాడిన విజయం. చివరికి క్రికెట్ పుట్టినింటికే ప్రపంచకప్ చేరింది. కాదు ఇంగ్లండ్ గెలుచుకుంది. మొదట ఇరు జట్ల స్కోర్లు సమం. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్లోనూ అదే ఫలితం. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ రెండు బౌండరీలు కొట్టగా.. కివీస్ ఒకే ఒక సిక్సర్ కొట్టింది. దీంతో జగజ్జేతగా ఇంగ్లండ్ నిలిచింది. పాపం వరుసగా రెండో సారి కూడా న్యూజిలాండ్కు రిక్త హస్తమే మిగిలింది. ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే ఏకైక కారణం బెన్ స్టోక్స్. మిడిలార్డర్ బలంగా ఉంటేనే ఏ మెగా టోర్నీనైనా గెలువచ్చని తాజా ప్రపంచకప్ మరోసారి నిరూపించింది. 2011 ప్రపంచకప్లో యువరాజ్, రైనా.. 2015 ప్రపంచకప్లో స్టీవ్ స్మిత్, క్లార్క్.. 2019 ప్రపంచకప్లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లు తమ జట్లు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా జరిగిన ప్రపంచకప్లో బెన్ స్టోక్స్ అద్వితీయమైన ఆటతో జట్టుకు అపూర్వ విజయాలను అందించాడు. కీలక ఫైనల్ మ్యాచ్లో అందరూ విఫలమైనా తానోక్కడే చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లండన్ : తొలుత ఇరుజట్ల స్కోర్లు సమం. అనంతరం సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం అయ్యాయి. అయితే సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి ప్రపంచకప్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఇంత థ్రిల్లింగ్గా సాగింది. తొలుత కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 241 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా ఇరు జట్లు సమంగానే స్కోర్లు నమోదు చేశాయి. ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం జట్టుకు అద్భుత విజయాలను అందించిన కేన్ విలియమ్సన్కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడింది. ఎంతటి భారీ స్కోర్లనైనా అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్లో 242 పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడింద. కివీస్ అద్భుత బౌలింగ్తో పాటు కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బెన్ స్టోక్స్ (84 నాటౌట్; 98 బంతుల్లో, 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు చివరి వరకు ఉండి కివీస్ను ప్రతిఘటించాడు. స్టోక్స్కు తోడుగా బట్లర్(59; 60 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నీషమ్, ఫెర్గుసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో నికోలస్(55), లాథమ్(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. విలియమ్సన్(30) ఫర్వాలేదనిపించాడు. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి కివీస్ను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ఫ్లంకెట్లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఫైనల్ అప్డేట్స్: విశ్వవిజేతగా ఇంగ్లండ్
లండన్ : నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరికి ఇంగ్లండ్నే విజయం వరించింది. తొలుత స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్లో కూడా ఇరుజట్ల స్కోర్ సమం కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్తో ఫలితం తేలనుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ బౌల్ వేసిన ఓవర్లో 15 పరుగులు సాధించింది. స్టోక్స్, బట్లర్లు బౌల్ట్ బౌలింగ్ల్ ఎదురుదాడికి దిగారు. దీంతో అవలీలగా 15 పరుగులు రాబట్టారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్తో ఫలితం తేలనుంది. కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఇంగ్లండ్ 14 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. నరాలు తెగే ఉత్కంఠ. విజయం ఇరువురి జట్ల మధ్య దోబుచూలాడుతోంది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 15 పరుగులు సాధించాలి. క్రీజులో బెన్ స్టోక్స్(70), రషీద్(0)లు ఉన్నారు. విజయం ఇరువురి మధ్య దోబుచులాడుతోంది. ఇంగ్లండ్ ఆశలన్నీ స్టోక్స్పైనే ఉన్నాయి. కీలకసమయంలో స్వల్ప వ్యవధిలో ఇంగ్లండ్ రెండు వికెట్లను చేజార్చుకుంది. బట్లర్(55), వోక్స్(2)లు వెంటవెంటే ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్ విజయావకాశాలు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్పైనే ఉన్నాయి. ఇంగ్లండ్కు షాక్. కీలక సమయంలో జోస్ బట్లర్(59) ఔటయ్యాడు. ఫెర్గుసన్ బౌలింగ్లో బట్లర్ భారీ షాట్ ఆడాడు. అయితే టిమ్ సౌథీ కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో బట్లర్ వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్కు 110 పరుగుల భాగస్మామ్యానికి తెరపడింది. స్టోక్స్(51), వోక్స్(1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బట్లర్లు కీలక సమయంలో తామేంటో నిరూపించుకున్నారు ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో వీర్దిదరూ అర్దసెంచరీలతో ఆకట్టుకున్నారు. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్ను బట్లర్-స్టోక్స్లు ఆదుకున్నారు. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వికెట్ కీపర్ బట్లర్ల సూపర్ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ విజయం వైపు అడుగులు వేస్తోంది. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్ను ఈ జంట ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్కు ఇప్పటికే 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 60 బంతుల్లో 72 పరుగులు సాధించాలి. ఇప్పటికైతే ఇరుజట్లకు విజయావకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గుసన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో ఇయాన్ మోర్గాన్(9) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 24 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్(5), బట్లర్(2) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యంపైనే ఇంగ్లండ్ విజయావకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ మూడో వికెట్ను చేజార్చుకుంది. ఫెర్గుసన్ బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్న బెయిర్ స్టో(36) దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. దీంతో 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రాయ్(17), రూట్(7)లు తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్(8), స్టోక్స్(1)లు ఉన్నారు. ఆరంభంలోనే జాసన్ రాయ్ వికెట్ కోల్పోవడంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ జోయ్ రూట్, బెయిర్ స్టోలు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. బెయిర్ స్టో (20; 36 బంతుల్లో), రూట్(3; 22 బంతుల్లో)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్కు షాక్.. రాయ్ ఔట్ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్(17)ను మ్యాట్ హెన్రీ ఔట్ చేశాడు. దీంతో 28 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. రాయ్ అవుటవ్వడంతో రూట్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం బెయిర్ స్టో 14 పరుగులతో, రూట్ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. తొలి బంతికే రివ్యూ తీసుకున్న కివీస్ తొలి బంతికే రివ్యూ తీసుకుని న్యూజిలాండ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే అదృష్టం కలిసొచ్చింది. ట్రెంట్బోల్ట్ వేసిన తొలి ఓవర్ తొలి బంతి జాసన్ రాయ్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. కివీస్ రివ్యూకి వెళ్లగా అంపైర్ కాల్ వచ్చింది. దీంతో రాయ్ బతికిపోయాడు. ఇంగ్లండ్ లక్ష్యం 242 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. బ్యాట్స్మెన్ వైఫల్యంతో సాదారణ స్కోర్కే పరిమితమైంది. హెన్రీ నికోలస్(55), టామ్ లాథమ్(47) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఫ్లంకెట్లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఏడో వికెట్ను కోల్పోయింది. టామ్ లాథమ్(47)ను క్రిస్ వోక్స్ స్లోబాల్తో బోల్తా కొట్టించాడు. దీంతో చివరి వరకు ఉండి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందిస్తాడునుకున్న లాథమ్ కూడా ఔట్ కావడంతో కివీస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. న్యూజిలాండ్ ఆరో వికెట్ను చేజార్చుకుంది. ప్రధాన బ్యాట్స్మెన్ దారిలోనే గ్రాండ్హోమ్(16)కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆరో వికెట్కు 46 పరుగులు జోడించిన అనంతరం గ్రాండ్హోమ్ను క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. పోరాడుతున్న లాథమ్ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ టామ్ లాథమ్ ఆకట్టుకుంటున్నాడు. హెన్నీ నికోలస్ మినహా ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమైన చోట లాథమ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లాథమ్(41)తో పాటు గ్రాండ్హోమ్(13) క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన కివీస్ ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ను కోల్పోయింది. జేమ్స్ నీషమ్(19)ను ఫ్లంకెట్ ఔట్ చేయడంతో 173 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 70 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను పడగొట్టిన ఇంగ్లండ్ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ప్రస్తుతం టామ్ లాథమ్(23)తో పాటు గ్రాండ్ హోమ్(4) క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఫ్లంకెట్ మూడు వికెట్లతో రాణించగా..వుడ్, వోక్స్లు తలో వికెట్ పడగొట్టారు. టేలర్ ఔట్ ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్ నాల్గో వికెట్ను కోల్పోయింది. కివీస్ స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా రాస్ టేలర్(15) పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 34 ఓవర్ తొలి బంతికి టేలర్ ఔటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో టేలర్ ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. లాథమ్(11), జేమ్స్ నీషమ్(0)లు క్రీజ్లో ఉన్నారు. నికోలస్ ఔట్ ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్దసెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న నికోలస్(55)ను ప్లంకెట్ బౌల్డ్ చేశాడు. ఇప్పటికే విలియమ్సన్ను ఔట్ చేసిన ప్లంకెట్.. నికోలస్ను కూడా ఔట్చేసి కివీస్ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కివీస్ 27 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో టేలర్(6), లాథమ్(0)లు ఉన్నారు. నికోలస్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో హెన్రీ నికోలస్ అర్దసెంచరీ సాధించాడు. 71 బంతుల్లో నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మార్టిన్ గప్టిల్(19), విలియమ్సన్(30)లు నిరాశపరిచినప్పటికీ నికోలస్ బాధ్యతాయుతంగా ఆడాడు. తొలి వికెట్కు 29, పరుగులు రెండో వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. విలియమ్సన్ ఔట్ ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్కు భారీ షాక్ తగిలింది. సారథి విలియమ్సన్(30)ను ఫ్లంకెట్ను ఔట్ చేసి కివీస్ను కష్టాల్లో పడేశాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో కివీస్ బ్యాటింగ్కు వెన్నెముకలా నిలిచిన విలియమ్సన్ స్వల్పస్కోర్కే వెనుదిరగడం కివీస్ ఎదురుదెబ్బే. ఇక సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఇన్నింగ్స్పైనే కివీస్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం కివీస్ 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నికోలస్ 46 పరుగులతో, టేలర్ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. అర్దసెంచరీ భాగస్వామ్యం ఓపెనర్ హెన్రీ నికోలస్తో కలిసి కేన్ విలియమ్సన్ రెండో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 29 పరుగులకే మార్టిన్ గప్టిల్(19) వికెట్ కోల్పోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. అయితే ఈ తరుణంలో నికోలస్తో కలిసి విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కివీస్ 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. నికోలస్ 40 పరుగులతో, విలియమ్సన్ 24పరుగులతో క్రీజులో ఉన్నారు. విలియమ్సన్ రికార్డు ఫైనల్ మ్యాచ్లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ రికార్డు సాధించాడు. ఒక ప్రపంచకప్లో కెప్టెన్గా అత్యధిక పరుగులు సాధించిన శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దనే(548, 2007 ప్రపంచకప్లో) రికార్డును విలియమ్సన్ తాజాగా బద్దలుకొట్టాడు. కివీస్ 15 ఓవర్లు 63/1 ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 27 పరుగులతో, విలియమ్సన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్ వోక్స్ బౌలింగ్లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో విలియమ్సన్, నికోలస్లు ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ 10 ఓవర్లలో 33/1 ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 10 పరుగులతో, విలియమ్సన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్ వోక్స్ బౌలింగ్లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్ కీలక వికెట్ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్కు ఓపెనర్లు ఆదిరే ఆరంభాన్ని అందించలేదు. గప్టిల్ ఔట్.. ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్కు ఆదిలోనే షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్ కీలక వికెట్ను కోల్పోయింది. గప్టిల్ ఔటవ్వడంతో విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. సిక్సర్, ఫోర్తో మెరిసిన గప్టిల్ ఇప్పటివరకు ప్రపంచకప్లో మెరవని మార్టన్ గప్టిల్ ఫైనల్ మ్యాచ్లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్సర్, ఒక ఫోర్తో ఆకట్టుకున్నాడు. దీంతో గప్టిల్ ఫామ్లోకి వచ్చాడని కివీస్ అభిమానులు ఆనందపడుతున్నారు. రివ్యూతో బతికిపోయిన నికోలస్ ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో రివ్యూతో న్యూజిలాండ్ ఓపెనర్ నికోలస్ బతికిపోయాడు. వోక్స్ వేసిన మూడో ఓవర్ మూడో బంతి నికోలస్ ప్యాడ్లకు తగిలడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ధర్మసేన ఔట్గా ప్రకటించాడు. దీంతో నికోలస్ రివ్యూకు వెళ్లాడు. బంతి వికెట్ను మిస్ అవుతుండటంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. వైడ్తో ఫైనల్ మ్యాచ్ పారంభం వైడ్తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్ తొలి బంతి వైడ్ కావడంతో న్యూజిలాండ్కు అదనంగా ఒక పరుగు లభించింది. ఇక టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో మార్టిన్ గప్టిల్, నికోలస్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కప్ కొట్టాల్సిన మ్యాచ్లో మార్గిన్ గప్టిల్ రాణించాలని కివీస్ కోరుకుంటుంది. అతడి రాణిస్తే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కివీస్ ఆరాటపడుతోంది. ఈసారి వన్డే వరల్డ్కప్లో కొత్త చాంపియన్ అవతరించబోతోంది. ఒకటి అందరూ టైటిల్ ఫేవరెట్గా పేర్కొన్న జట్టు ఇంగ్లండ్ కాగా టోర్నీ మధ్యలో కొంత తడబాటుకు గురైనా.. ఆ తర్వాత అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్. ఈ రెండు జట్లు మెగా టైటిల్ పోరులో తలపడుతున్నాయి. క్రికెట్కు పుట్టినిల్లయినా.. ఒకటికి మూడు సార్లు ఫైనల్ చేరినా.. ఇప్పటిదాకా ప్రపంచకప్ కల తీరని జట్టు ఇంగ్లండ్ది. ఇంకొకటి పెద్దగా అంచనాల్లే కుండా బరిలోకి దిగి.. లీగ్ దశలో డక్కామొక్కీలు తిని.. కష్టం మీద నాకౌట్కు చేరి.. సెమీస్లో బలమైన భారత జట్టుకు షాకిచ్చి ఫైనల్లో అడుగుపెట్టిన కివీస్. ప్రపంచ కప్లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసే ఆ జట్టుకు.. టైటిల్ మాత్రం అందని ద్రాక్షే. ఒకసారి ఫైనల్ ఆడింది. కానీ కప్పు అందలేదు. మరికొద్ది గంటల్లో ఇరు జట్ల దశాబ్దాల నిరీక్షణకు ఆదివారం తెరపడబోతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తుది సమరంలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్ల బలాబలాలు చూస్తే న్యూజిలాండ్ కన్నా ఇంగ్లండ్ కొన్ని మెట్లు పైనే ఉంది. బ్యాటింగ్ ఆ జట్టుకు ప్రధాన బలం. జేసన్ రాయ్, బెయిర్స్టో, రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్.. ఇలా భీకరమైన లైనప్ ఉందా జట్టుకు. లీగ్ దశ మధ్యలో తడబాటుకు గురైనప్పటికీ.. నాకౌట్ అవకాశాలు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బాధ్యత తీసుకున్నారు. చివరి మూడు మ్యాచ్ల్లో అదరగొట్టారు. న్యూజిలాండ్కు బ్యాటింగే సమస్యగా ఉంది. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్ బ్యాట్స్మన్ గప్తిల్ టోర్నీ మొత్తంలో 167 పరుగులే చేశాడు. కివీస్ ఫైనల్ వరకు వచ్చిందంటే అది కెప్టెన్ విలియమ్సన్ పోరాట ఫలితమే. మిడిలార్డర్లో టేలర్, నీషమ్ ఓ మోస్తరుగా రాణిస్తున్నారు. బౌలింగ్లో న్యూజిలాండ్దే పైచేయి. బౌల్ట్, హెన్రీ, ఫెర్గూసన్, శాంట్నర్ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సెమీస్లో హెన్రీ, బౌల్ట్, శాంట్నర్ ఎలా విజృంభించారో తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లు టోర్నీ ఆరంభంలో సాధారణంగా కనిపించారు కానీ.. తర్వాత పుంజుకున్నారు. ఆర్చర్, వోక్స్, రషీద్ మంచి ఫామ్లోనే ఉన్నారు. ఏది ఏమైనా ఇరు జట్లు తొలిసారి వరల్డ్కప్ను సాధించడానికి శాయశక్తుల పోరాడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో ఆసక్తికర సమరం ఖాయం. -
మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత
లండన్: న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్కప్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్కప్లో హెన్రీ మొదటి పవర్ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు సాధించాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్ పోరులో భాగంగా జేసన్ రాయ్ వికెట్ను సాధించడం ద్వారా హెన్రీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో భాగంగా ఆరో ఓవర్ నాల్గో బంతికి రాయ్ను పెవిలియన్కు పంపాడు. ఈ జాబితాలో కాట్రెల్(వెస్టిండీస్), జోఫ్రా ఆర్చర్( ఇంగ్లండ్), క్రిస్ వోక్స్( ఇంగ్లండ్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ( ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు) కివీస్ నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 28 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఆరంభం నుంచి కివీస్ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడిన రాయ్.. హెన్రీకి చిక్కాడు. ఆపై జానీ బెయిర్ స్టోకు లైఫ్ లభించింది. బెయిర్ స్టో ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను గ్రాండ్ హోమ్ వదిలేశాడు. -
ఇంగ్లండ్ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?
లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో జరుగుతున్న తుది పోరులో న్యూజిలాండ్ 242 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. హెన్రీ నికోలస్(55; 77 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, టామ్ లాథమ్(47; 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్(30; 53 బంతుల్లో 2 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గప్టిల్(19) మరోసారి నిరాశపరిచాడు. ఆ తరుణంలో నికోలస్తో కెప్టెన్ విలియమ్సన్ జత కలిశాడు. వీరిద్దరూ 74 పరుగులు సాధించిన తర్వాత విలియమ్సన్ రెండో వికెట్గా ఔటయ్యాడు. ప్లంకెట్ బౌలింగ్లో కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. (ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు) దాంతో 103 పరుగుల వద్ద రెండో వికెట్ను నష్టపోయింది. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో నికోలస్ మూడో వికెట్గా ఔట్ కాగా, రాస్ టేలర్(15) విఫలమయ్యాడు. కాగా, లాథమ్ ఆదుకోవడంతో కివీస్ గాడిలో పడింది. ఈ క్రమంలోనే నీషమ్తో కలిసి 32 పరుగులు జత చేసిన లాథమ్.. గ్రాండ్ హోమ్తో కలిసి 46 పరుగులు భాగస్వామ్యం సాధించాడు. కాగా, 48.3 ఓవర్లలో కివీస్ స్కోరు 232 పరుగుల వద్ద లాథమ్ ఏడో వికెట్గా ఔట్ కాగా, ఆ తర్వాత 9 పరుగుల్ని మాత్రమే వచ్చాయి. దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ప్లంకెట్లు తలో మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్లు చెరో వికెట్ తీశారు. మరి కివీస్ నిర్దేశించిన సాధారణ టార్గెట్ను ఇంగ్లండ్ ఛేదిస్తుందా.. లేక చతికిలబడుతుందా అనేది చూడాలి. -
కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు
లండన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త వరల్డ్ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్కప్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్గా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో తుది పోరులో విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో తన పరుగుల ఖాతాను తెరవడం ద్వారా విలియమ్సన్ అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. 2007 వరల్డ్కప్లో జయవర్థనే 548 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటివరకూ వన్డే వరల్డ్కప్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్సీ రికార్డు. దాన్ని తాజాగా విలియమ్సన్ సవరిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించాడు. 2019 వరల్డ్కప్లో విలియమ్సన్ సాధించిన పరుగులు 578. ఈ జాబితాలో విలియమ్సన్, జయవర్థనే తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్(539 పరుగులు, 2007), అరోన్ ఫించ్(507 పరుగులు, 2019), ఏబీ డివిలియర్స్( 482 పరుగులు, 2015)లు ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 465 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్కప్లో భారత్ ఫైనల్కు చేరే క్రమంలో గంగూలీ ఈ పరుగులు చేశాడు. -
ఇంకా ధోని గురించి ఎందుకు?
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని ఇప్పటికే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కోరగా, తాజాగా రచయిత జావెద్ అక్తర్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్కప్ సెమీస్లో టీమిండియా ఓటమితో ధోని రిటైర్మెంట్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్లోనే భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు. ‘ ధోని గేమ్ను అర్థం చేసుకునే తీరు భారత్కు ఎంతో ఉపయోగం. ధోని ఒక నమ్మదగిన ఆటగాడు. భారత క్రికెట్ జట్టుకు ధోని ఎంతో విలువైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా అతను ఆడాల్సిన క్రికెట్ చాలా ఉంది. ఇంకా ధోని గురించి, అతని రిటైర్మెంట్ గురించి మాట్లాడతారెందుకు’ అని జావెద్ అక్తర్ ప్రశ్నించారు. అంతకుముందు లతా మంగేష్కర్ కూడా ధోని రిటైర్మెంట్కు సంబంధించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ..‘ధోని జీ. మీరు రిటైర్ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అని ట్వీట్ చేశారు. -
ఇలా అయితే ఎలా?: యువరాజ్ సింగ్
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్లోనే ముగించడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెదవి విప్పాడు. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్లే టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలమైందన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో నాణ్యమైన బ్యాట్స్మన్ లేకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఈ స్థానాన్ని ఎంత త్వరగా భర్తీ చేస్తే.. అంత మంచిదని చెప్పారు. ఓ మంచి బ్యాట్స్మెన్తో ఈ స్థానాన్ని భర్తీ చేయకపోతే.. బ్యాటింగ్ లైనప్ మరింత బలహీనపడే ప్రమదం ఉందన్నాడు. సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం పట్ల యువరాజ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడిని తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమని యువీ వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్లో నాలుగో స్థానం అత్యంత కీలకమైనదని యువరాజ్ సింగ్ అన్నాడు. దీన్ని భర్తీ చేసుకోకపోతే.. దాని ప్రభావం బ్యాటింగ్ లైనప్ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుని- నాలుగో నంబర్ స్థానాన్ని అతనితో భర్తీ చేయించి ఉండాల్సిందని చెప్పాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం తనను షాక్కు గురి చేసిందని అన్నాడు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ అయినా ఈ స్థానంలో బ్యాటింగ్కు దిగి విఫలమైతే.. అతణ్ని పక్కనపెడుతున్నారని, అది సరైన పద్ధతి కాదన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాల్గో స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించాడు. టీమిండియాలో నాలుగో నంబర్ స్థానం మ్యూజికల్ ఛైర్లా మారిందని యువరాజ్ సింగ్ విమర్శించాడు. నాలుగైదు మ్యాచ్ల్లో విఫలమైన తరువాత అంబటి రాయుడు న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో రాణించాడని, మళ్లీ అతణ్ని తప్పించారని మండిపడ్డాడు. తాజాగా రిషబ్ పంత్ను నాలుగో స్థానంలో ఆడిస్తున్నప్పటికీ.. అతను ఎన్నాళ్లు ఆ స్థానంలో ఉంటాడో తెలియదని అన్నాడు. నాలుగో స్థానంలో ఆడగలడన్న నమ్మకం ఉంచిన ఓ ఆటగాడిని మళ్లీ, మళ్లీ తొలగించడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పాడు. దీనివల్ల ఆ ఆటగాడు తనపై తాను విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. -
‘జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ జరిగిన వరల్డ్కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో టీమిండియాను విజయం అంచున నిలబెట్టాడు. 92/6తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడినప్పుడు ధోని అండగా జడ్డూ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 77 రన్స్ చేసి టీమ్ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ, హెన్రీ బౌలింగ్లో భారీషాట్ ఆడే క్రమంలో జడేజా అవుటవడంతో భారత్ 18 రన్స్తో ఓడింది. కానీ, జట్టు స్వల్ప తేడాతో ఓడడంతో జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా తెలిపారు. ఈ పరాజయంతో జడేజా గుండె పగిలినంత పనైందని అతడి భార్య రివాబా చెప్పారు. ‘సెమీస్లో ఓటమి తర్వాత జడ్డూను ఓదార్చలేకపోయాం. నేను అవుట్ కాకుండా ఉండుంటే తప్పకుండా గెలిచే వాళ్లమని పదేపదే చెబుతూ ఎంతో బాధపడ్డాడు. జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’రివాబా తెలిపారు. -
‘మదర్’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..!
న్యూఢిలీ : టీమిండియా యార్కర్కింగ్, స్పీడ్గన్ జస్ప్రీత్ బుమ్రా ఆటకే కాదు.. విభిన్నమైన అతని బౌలింగ్ శైలికి కోట్లాది మంది అభిమానులున్నారు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ బుమ్రా భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తక్కువ లెంగ్త్ తీసుకుని వేగంగా బంతులు విసిరే బుమ్రా బౌలింగ్ను ఓ క్రికెట్ వీరాభిమాని తల్లి అనుకరించారు. ఆమె మిమిక్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘యువత మాదిరిగానే.. పెద్దవాళ్లు కూడా ప్రపంచకప్లో బుమ్రా బౌలింగ్కు ఫిదా అయ్యారు. అందుకే మా అమ్మ అతని బౌలింగ్ శైలిని అనుకరించారు’అని ఓ అభిమాని ట్విటర్లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇది వైరల్ అయింది. పెద్దావిడ బౌలింగ్ అనుకరణకు బుమ్రా ఫిదా అయ్యాడు. ‘మీ ఉత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నింది’అని రిప్లై ఇచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మూడేళ్లకాలంలోనే బుమ్రా టాప్ బౌలర్గా మారాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఇక తాజా ప్రపంచకప్లో 9 మ్యాచ్లాడి 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జట్టు విజయాల్లో ‘రోహిత్కు సమానంగా బుమ్రా’ కీలక పాత్ర పోషించాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొనడం గమనార్హం. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. Just like the rest of us, the mothership was so impressed with Bumrah's performance in the world cup, that she decided to mimic his run-up. 😂😂😍 pic.twitter.com/bJYGUqzJvd — Shanta Sakkubai (@himsini) July 13, 2019 -
విశ్వ కిరీటం... పుట్టింటికా? కివీ గూటికా?
ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది రంజైన మ్యాచ్లతో ఆట రక్తి కట్టింది ఇప్పుడిక ప్రపంచ కప్ ఆఖరి అంకం 46వ రోజున 48వ మ్యాచ్తో ముగింపు వన్డే కిరీటం ఎవరిదో తేలిపోయే సందర్భం రానున్న నాలుగేళ్లకు రారాజు పట్టాభిషేకం దూకుడైన ఇంగ్లండ్... నిబ్బరంగా న్యూజిలాండ్ జగజ్జేత హోదా పుట్టింటికి దక్కుతుందా? రెక్కలు కట్టుకుని కివీస్ గూటిలో వాలుతుందా? క్రికెట్ మక్కా లార్డ్స్లో... అందమైన బాల్కనీ నుంచి... సగర్వంగా కప్ను చూపే కెప్టెన్ ఎవరో? మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర తర్వాత తెరపైకి ‘సరికొత్త విజేత’ అభిమానులూ... ఆస్వాదించండి! లండన్: వన్డే క్రికెట్లో 23 ఏళ్ల తర్వాత సరికొత్త చాంపియన్ ఆవిర్భావానికి 12వ ప్రపంచ కప్ వేదిక కాబోతోంది. తొలిసారి జగజ్జేతగా నిలిచేందుకు లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ తుది సమరంలో తలపడనున్నాయి. మ్యాచ్లో ఎవరు గెలిచినా అది వారి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోనుంది. ఇరు జట్ల బలాబలాల ప్రకారం చూస్తే ఈ ఫైనల్ను బ్యాటింగ్, పేస్ బౌలింగ్ మధ్య పోటీగా పేర్కొనవచ్చు. దూకుడైన ఆటతో పైచేయి సాధించడం ఇంగ్లండ్ వ్యూహం కాగా... నెమ్మదిగా పట్టు బిగించే స్వభావం న్యూజిలాండ్ది. మరి అంతిమ పోరులో ఎవరి ప్రణాళికలు విజయవంతం అవుతాయో చూడాలి? మార్పుల్లేకుండానే! అత్యంత కీలక మ్యాచ్ కాబట్టి రెండు జట్లు తాము సెమీఫైనల్లో ఆడిన తుది పదకొండు మందితోనే ఫైనల్లో దిగే వీలుంది. పైకి కనిపించకున్నా అటు ఇటు ఒకరిద్దరు ఆటగాళ్లే కీలకం. జేసన్ రాయ్, రూట్ను త్వరగా ఔట్ చేస్తే ఆతిథ్య జట్టు పరోక్షంగానైనా ఆత్మరక్షణలో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో విధ్వంసక జాస్ బట్లర్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదవాల్సి ఉంటుంది. అనంతరం కెప్టెన్ మోర్గాన్, ఆల్రౌండర్ స్టోక్స్ బాధ్యతలు తీసుకుంటారు. ఇక విలియమ్సన్, రాస్ టేలర్ తేలిపోతే న్యూజిలాండ్ పని ఖతం. అసలే ఆ జట్టు ఓపెనర్లు గప్టిల్, నికోల్స్ పేలవ ఫామ్తో సతమతం అవుతోంది. లాథమ్, గ్రాండ్హోమ్, నీషమ్ అదనపు పరుగులు జోడించగలరు తప్ప పరిస్థితిని అమాంతం మార్చలేరు. మొత్తమ్మీద చూస్తే బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంతో ఉన్నందున ఇంగ్లండ్కు ఫేవరెట్ మార్కులు ఎక్కువగా పడతాయి. బ్యాటింగ్లో బలహీనంగా ఉన్నా టోర్నీలో కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకుని గెలిచినందున కివీస్ను తేలిగ్గా తీసుకోలేం. చరిత్ర బాటలో ఈ ఇద్దరు ఐర్లాండ్ జాతీయుడైన మోర్గాన్ ఇంగ్లండ్ తరఫున ఆడటమే అనూహ్యం అనుకుంటే, కెప్టెన్గానూ ఎదిగి, ఇప్పుడు ప్రపంచ కప్ సాధించే వరకు తీసుకొచ్చాడు. గాటింగ్, గూచ్ వంటి మహామహులకు సాధ్యం కాని ఈ చిరకాల స్వప్నాన్ని గనుక నెరవేరిస్తే మోర్గాన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటు విలియమ్సన్కూ అంతే స్థాయిలో ఖ్యాతి దక్కుతుంది. మార్టిన్ క్రో, బ్రెండన్ మెకల్లమ్ వంటి తమ దేశ దిగ్గజాలకు త్రుటిలో చేజారిన కప్ను సాధిస్తే... ఇప్పటికే ప్రపంచ శ్రేణి బ్యాట్స్మన్గా పేరున్న అతడు వ్యక్తిగతంగా మరో మెట్టెక్కుతాడు. నాలుగోసారి... రెండోసారి.... ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ ఆడటం ఇది నాలుగోసారి. 1979, 87, 92లలో ఆ జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. న్యూజిలాండ్ 2015 కప్ రన్నరప్. చిత్రమేమంటే ఇంగ్లండ్ ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఫైనల్. కివీస్ తరఫున గత ఫైనల్ మ్యాచ్ ఆడిన గప్టిల్, విలియమ్సన్, టేలర్, బౌల్ట్, హెన్రీ ఈసారీ బరిలో దిగనున్నారు. అటో గోడ.. ఇటో గోడ ఇరు జట్లలో అంత తొందరగా బద్దలు కొట్టలేనంతటి రెండు బ్యాటింగ్ గోడలున్నాయి. అవే విలియమ్సన్ , రూట్ (549 పరుగులు). పోటాపోటీగా రాణించిన ఈ ఇద్దరూ సమవయస్కులే. ఒకే తరహా బ్యాటింగ్ శైలి వారే. తమ జట్ల విజయాల్లో కీలకంగా మారినవారే. ఎలాంటి సందర్భంలోనైనా ఇన్నింగ్స్లు నిర్మించగలవారే. ఫైనల్లో ఎవరు తమ పాత్ర సమర్థంగా పోషిస్తారో చూద్దాం. వీరి సమరం ఆసక్తికరం రాయ్, బెయిర్స్టో x బౌల్ట్, హెన్రీ జేసన్ రాయ్ (426 పరుగులు), బెయిర్స్టో (496 పరుగులు)... టోర్నీలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జంట. గాయంతో రాయ్ దూరమైతే ఓ దశలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నది జట్టు. అప్పుడు బెయిర్స్టో ఒంటరివాడైనట్లు కనిపించాడు. భారత్తో మ్యాచ్లో రాయ్ పునరాగమనంతో ఈ జోడీ మళ్లీ తడాఖా చూపుతోంది. ఫైనల్లో వీరికి న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్ (17 వికెట్లు), హెన్రీ (13 వికెట్లు) అడ్డుకట్ట వేస్తే ఇంగ్లండ్కు ముకుతాడు పడినట్లే. కచ్చితమైన లెంగ్త్లో బౌలింగ్ చేసే ఈ జోడీకి మరో పేసర్ లాకీ ఫెర్గూసన్ (18 వికెట్లు) తోడైతే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు. విలియమ్సన్, టేలర్ X ఆర్చర్, వోక్స్ న్యూజిలాండ్ ఫైనల్కు చేరిందంటే అది కెప్టెన్ విలియమ్సన్ (548 పరుగులు) విశేష రాణింపు, రాస్ టేలర్ (335 పరుగులు) నిలకడతోనే. భారత్తో జరిగిన సెమీస్లో వీరి అర్ధ సెంచరీలే ఈ విషయాన్ని చాటుతాయి. ఈ ఇద్దరికీ ఇంగ్లండ్ పేసర్లు ఆర్చర్ (19 వికెట్లు), వోక్స్ (13 వికెట్లు) నుంచి సవాల్ ఎదురవడం ఖాయం. మూడో పేసర్ మార్క్ వుడ్ (17 వికెట్లు) కూడా తక్కువేం కాదు. కేన్–టేలర్ జోడీ... వీరిని కాచుకొని క్రీజులో నిలదొక్కుకుంటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. స్పిన్నర్లూ ఉన్నారోయ్... బ్యాటింగ్కు అనుకూలమైనా, పేసర్లు పండుగ చేసుకుంటున్నా ఈ కప్లో స్పిన్నర్లూ అంతోఇంతో ప్రభావం చూపారు. అలాంటివారిలో ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్, 11 వికెట్లు), సాన్ట్నర్ (న్యూజిలాండ్, 6 వికెట్లు) ముఖ్యులు. స్పిన్ను సమర్థంగా ఆడే భారత్ను సెమీస్లో సాన్ట్నర్ కట్టి పడేశాడు. రషీద్... ఆస్ట్రేలియాపై నిర్ణయాత్మక ప్రదర్శన కనబర్చాడు. ఇక ఫైనల్స్లో అవసరమైన సందర్భంలో వీరు ఎలాంటి పాత్ర పోషిస్తారో? తుది జట్లు (అంచనా) ఇంగ్లండ్: జేసన్ రాయ్, బెయిర్స్టో, రూట్, మోర్గాన్ (కెప్టెన్), స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్. న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, నీషమ్, లాథమ్, గ్రాండ్హోమ్, సాన్ట్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్. పిచ్, వాతావరణం శనివారం వరకు పిచ్పై సన్నటి పొరలా పచ్చిక ఉంది. వేడి ప్రభావంతో ఆదివారం మ్యాచ్ సమయానికి అది ఎండిపోవచ్చు. తద్వారా సహజ స్వభావంతో బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుంది. పిచ్ను పరిశీలించిన మోర్గాన్ మ్యాచ్ మొదలయ్యే వేళకు ఓ అంచనాకు రావొచ్చని అన్నాడు. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఫైనల్కూ రిజర్వ్ డే ఉంది. ఆదివారం వర్షం వల్ల అంతరాయం కలిగి ఫలితం రాకపోతే సోమవారం కొనసాగిస్తారు. ఒకవేళ ఫైనల్ ‘టై’ అయితే ‘సూపర్ ఓవర్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ముఖాముఖిలో పోటాపోటీ... ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 90 మ్యాచ్లు జరిగాయి. న్యూజిలాండ్ 43 మ్యాచ్లు, ఇంగ్లండ్ 41 గెలిచాయి. రెండు ‘టై’ కాగా, నాలుగింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్లో 9 సార్లు ఎదురుపడగా ఐదుసార్లు కివీస్, నాలుగుసార్లు ఇంగ్లండ్ నెగ్గాయి. -
లాడ్డ్స్లో లడాయి
-
‘కప్ గెలిచి.. తలెత్తుకునేలా చేయండి’
లండన్: సెమీస్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ సగర్వంగా అడుగుపెట్టింది. క్రికెట్ విశ్వసమరంలో నాలుగోసారి ఫైనల్కు చేరిన ఇంగ్లండ్ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందేనని కృతనిశ్చయంతో ఉంది. ఇక 27 ఏళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్కు చేరడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతోషం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఫైనల్కు ఆల్ ద బెస్ట్ చెబుతూ వినూత్నంగా ఓ వీడియోను క్రియేట్ చేసి తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూపరులను తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇప్పటివరకు ప్రపంచకప్లో ఇంగ్లండ్ తరుపున ప్రాతినిథ్యం వహించిన 101 మంది ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియాలో ఇయాన్ బోథమ్, గ్రాహమ్ గూచ్, ఆండ్రూ స్ట్రాస్, నాసిర్ హుస్సెన్ వంటి ఇంగ్లండ్ దిగ్గజాలు ‘కమాన్ ఇంగ్లండ్’ అంటూ ప్రపంచకప్లో తమ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. ‘101 మంది ఇంగ్లండ్ క్రికెటర్లు మీకంటే ముందు ప్రపంచకప్ గెలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు చరిత్రను సృష్టించే అవకాశం మీకు వచ్చింది. దేశం కోసం ప్రపంచకప్ గెలిచి గర్వించేలా చేయండి’అంటూ ఇయాన్ బోథమ్ పేర్కొన్నాడు. ‘కేవలం ఒక్క ఇంగ్లండ్ జట్టు మాత్రమే మూడు సార్లూ ఫైనల్కు చేరి ప్రపంచకప్ గెలవకుండా ఉంది. ఓడిపోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే ఇప్పటివరకు మోర్గాన్ సేన అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. ఫైనల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పోరాడండి. ఆదివారం మ్యాచ్కు ఆల్ ద బెస్ట్’అంటూ గ్రాహమ్ గూచ్ వ్యాఖ్యానించాడు. ‘పేరుకే క్రికెట్ పుట్టినిల్లు.. కానీ ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్ గెలవలేదు.. ఈ సారి గెలిచి తలెత్తుకునేలా చేయండి’అంటూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 💪 This will get you going 🏴 101 players have gone before our current World Cup squad 🗣 They have all sent in their messages for the lads 🏆 COME ON ENGLAND 🎥 via @PCA 👏#CWC19 #WeAreEngland pic.twitter.com/x4PxSM0kjr — England Cricket (@englandcricket) July 13, 2019 -
ఇదొక చెత్త ప్రదర్శన: పాంటింగ్
బర్మింగ్హామ్: వన్డే వరల్డ్కప్లో ఆసీస్ జట్టు ఒకే ఒక్క చెత్త ప్రదర్శనతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణకు కారణమైందని ఆ దేశ మాజీ కెప్టెన్, అసిస్టెంట్ కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. అత్యంత కీలక సమయంలో తమ ఆటగాళ్లు చేతులెత్తేశారని విమర్శించాడు. ఇప్పటివరకూ జరిగిన వరల్డ్కప్లు పరంగా చూస్తే తమ జట్టు అత్యంత చెత్త ప్రదర్శనగా ఇది నిలుస్తుందన్నాడు. జట్టు పరంగా తాము సమతూకంగా ఉన్నప్పటికీ కీలక సమయంలో ఆటగాళ్లంతా సమిష్టిగా విఫలం కావడమే సెమీస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ వరల్డ్కప్ బరిలోకి మేము ఒక బలమైన జట్టుగా దిగాం. ప్రతీ మ్యాచ్కు అందుకు తగిన ప్రణాళికలు రచించుకుంటూ సిద్ధమయ్యాం. కానీ సెమీస్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాం. ఇది మా జట్టు అత్యంత చెత్త ప్రదర్శన. ఇంగ్లండ్ 50 ఓవర్ల క్రికెట్లో చాలా ఎత్తులో ఉంది. వారికి వరల్డ్కప్ను సాధించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఫైనల్లో ఏమీ చేస్తారో చూడాలి. ఒకవేళ వరల్డ్కప్ను ఇంగ్లండ్ సాధిస్తే అది యాషెస్ సిరీస్పై కూడా కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అదే ఊపును వారు యాషెస్ సిరీస్లో కొనసాగిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. -
‘మరీ ఇంత సింపుల్గానా.. గ్రేట్’
లండన్: మీడియా హడావుడి లేదు. అభిమానుల తాకిడి లేదు. ఒంటరిగా.. ప్రశాంతంగా, ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా సాధారణ రైలు ప్రయాణం చేశాడు ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్. ప్రపంచకప్ సెమీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం బర్మింగ్హామ్కు మోర్గాన్ సాధారణ వ్యక్తిలా చేరుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ పీక్స్థాయిలో ఉండగా అందులోనూ ఇంగ్లండ్ను సెమీస్కు చేర్చిన సారథి అంత సింపుల్గా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం మోర్గాన్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్ చేస్తున్నారు. ‘మరీ ఇంత సింపుల్గానా.. గ్రేట్’, ‘ఇంగ్లండ్కు తొలిసారి కప్ అందించే సారథిని ఎవరూ గుర్తుపట్టలేదా..చిత్రంగా ఉందే?’, ‘మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లండ్ తలరాతే మారిపోయింది.. కానీ గుర్తింపే రాలేదు’అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కూడా తనకు ప్రైవేట్గా బతకడమంటేనే ఇష్టమని పేర్కొన్నాడు. భారత్లో సెలబ్రిటీగా జీవించడం చాలా కష్టమని.. ఎక్కువ ఫ్రీడమ్ ఉండదన్నాడు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా అనుష్కతో కలిసి విదేశాలకు పయనమవుతానని వివరించాడు. ఇక ప్రపంచకప్లో భాగంగా ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ తలపడనుంది. ఫైనల్లో ఆతిథ్య జట్టు గెలిస్తే ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించిన తొలి సారథిగా మోర్గాన్ రికార్డు సృష్టిస్తాడు. -
ఇక టీమిండియా కెప్టెన్ రోహితేనా?
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో అది విరాట్ కోహ్లి కెప్టెన్సీపై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. లీగ్ దశలో విశేషంగా ఆకట్టుకున్న టీమిండియా.. నాకౌట్ సమరానికి వచ్చేసరికి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే అదే సమయంలో కోహ్లి, రోహిత్ శర్మలు రెండు వర్గాలు విడిపోయారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటివరకూ కోహ్లి కెప్టెన్సీ గురించి ఎవరూ మాట్లాడకపోయినా, తాజాగా భారత మాజీ టెస్టు క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. ‘ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే సమయం వచ్చేసిందా’ అంటూ ట్వీట్ చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా సరైన వాడంటూ పేర్కొన్నాడు. మరో అడుగు ముందుకేసిన జాఫర్.. 2023 వన్డే వరల్డ్కప్లో రోహిత్ను టీమిండియా కెప్టెన్గా చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు.(ఇక్కడ చదవండి: భారత క్రికెట్ జట్టులో గ్రూపు తగాదాలు?) ఇక అధిక సంఖ్యలో భారత క్రికెట్ అభిమానులు కూడా రోహిత్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలంటూ అభిప్రాయపడుతున్నారు. సెమీస్లో టీమిండియా ఓటమి యావత్ భారత క్రీడాభిమానుల్ని షాక్కు గురి చేసిన తరుణంలో 50 ఓవర్ల క్రికెట్కు కెప్టెన్గా రోహిత్ శర్మనే సరైన వాడంటూ పేర్కొంటున్నారు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత్ వన్డే, టీ20ల సిరీస్కు రోహిత్ కెప్టెన్గా చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లికి విండీస్ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారనే వార్తల నేపథ్యంలో రోహిత్ను కెప్టెన్గా నియమించడం దాదాపు ఖాయమే. గతంలో రోహిత్ కెప్టెన్సీలో ఆసియా కప్, నిదాహాస్ ట్రోఫీలను భారత్ కైవసం చేసుకుంది. పలు దేశాలు తలపడే ఐసీసీ టోర్నమెంట్లలో కోహ్లికి మంచి రికార్డు లేకపోవడం ఒకటైతే, రోహిత్కు మాత్రం ఘనమైన రికార్డు ఉండటమే కెప్టెన్సీ మార్పు డిమాండ్ రావడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. Is it time to hand over white ball captaincy to Rohit Sharma? I would like him to lead India in 2023 World Cup🏆 — Wasim Jaffer (@WasimJaffer14) 12 July 2019 -
కివీస్తో అంత ఈజీ కాదు: మోర్గాన్
లండన్: స్వదేశంలో వన్డే వరల్డ్కప్ను సాధించి తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆశ పడుతోంది ఇంగ్లండ్. 27 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరిన క్రమంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెగా ట్రోఫీని వదులుకోకూడదని ఇంగ్లండ్ భావిస్తోంది. మరొకవైపు కివీస్ కూడా తొలి వరల్డ్కప్పై కన్నేసింది. ఇప్పటివరకూ ఒక్కసారిగా వరల్డ్కప్ గెలవలేకపోయిన కివీస్.. ఇంగ్లండ్కు షాకివ్వాలని యోచిస్తోంది. గత వరల్డ్కప్లో రన్నరప్గా సరిపెట్టుకున్న కివీస్..కప్ కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఏది ఏమైనా కొత్త చాంపియన్ అవతరించనున్న తరుణంలో ఇరు జట్ల మధ్య ఆదివారం క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో జరుగనున్న మెగా సమరం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే కివీస్తో అప్రమత్తంగా ఉండాలని జట్టు సభ్యులను హెచ్చరించాడు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. కివీస్ను ఓడించాలంటే సమిష్టిగా రాణించక తప్పదంటూ స్పష్టం చేశాడు. ‘ కివీస్తో అంత ఈజీ కాదు. న్యూజిలాండ్ మొదట్నుంచి ఆకట్టుకుంటూనే ఫైనల్కు చేరింది. ప్రధానంగా లీగ్ దశలో కివీస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాకౌట్ సమరంలో బలమైన టీమిండియాను ఓడించింది. వారి అసలు సిసలు ప్రదర్శన సెమీస్లో కనబడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కివీస్పై పైచేయి సాధించడం చాలా కష్టం. సమిష్టిగా పోరాడితేనే కివీస్ను ఓడించగలం’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. -
నువ్వు లేకుండా.. ప్రపంచకప్ గెలవడమా?
హైదరాబాద్ : టీమిండియా సారథి విరాట్ కోహ్లి, మాజీ లెజెండ్ క్రికెటర్ యువరాజ్ సింగ్లు దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్కు బాసటగా నిలిచారు. ప్రపంచకప్ సమయంలో దక్షిణాఫ్రికా జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని డివిలియర్స్ ప్రయత్నం చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. దీనిపై తాజాగా సోషల్ మీడియా వేదికగా డివిలియర్స్ స్పందించాడు. జట్టులోకి రావడానికి తాను డిమాండ్ చేయలేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా అనేక విషయాలను వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే డివిలియర్స్ మెసేజ్పై కోహ్లి రియాక్ట్ అయ్యాడు. ’మై డియర్ బ్రదర్ నవ్వు నిజాయితీ, నిబద్దత కలిగిన వ్యక్తవని నాకు తెలుసు. కానీ నీ విషయంలో ఇలా జరుగుతుండటం విచారకరం. నీ వ్యక్తిగత విషయాన్ని కొందరు బహిరంగం చేశారు. నువ్వు, నీ కుటుంబ సభ్యులు ప్రేమానురాగాలతో పాటు ధైర్యంగా ఉండాలి. నీ పైన నాకు, అనుష్కకు పూర్తి నమ్మకం ఉంది. నీ వెంట మేమున్నాము’అంటూ డివిలియర్స్ ఇన్స్టాగ్రామ్లో కోహ్లి పేర్కొన్నాడు. ఇక టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ‘నేను క్రికెట్ ఆడిన రోజుల్లో లెజెండ్ అండ్ అత్యుత్తమ ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకరు. నువ్వు లేని దక్షిణాఫ్రికా ప్రపంచకప్ గెలిచేందుకు ఒక్క అవకాశం లేదు. మంచి, అత్యుత్తమ ఆటగాళ్లపైనే ఎక్కువగా విమర్శలు వస్తాయి. వాటన్నింటిని నువ్వు పట్టించుకోకు. డివిలియర్స్ ఎలాంటి వ్యక్తో ప్రపంచానికి తెలుసు’ అంటూ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇక 2018, మే నెలలో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలసిందే. కేవలం క్రికెట్ లీగ్ల్లో మాత్రమే ఆడతానిని స్పష్టం చేశాడు. -
‘అప్పటికీ భయపడుతూనే ఉన్నా’
సిడ్నీ: వన్డే వరల్డ్కప్లో అసలు సిసలు సమరానికి వచ్చేసరికి ఆసీస్ తేలిపోవడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కీలక సమయంలో ఆసీస్ ఒత్తిడిని జయించడంలో విఫలం కావడంతోనే మెగా టోర్నీని సెమీస్లోనే ముగించాల్సి వచ్చిందన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో ఆసీస్ తొలి 10 ఓవర్ల వరకూ బాగానే ఆడినా తర్వాత మాత్రం వరుస వికెట్లు కోల్పోతూ రావడం ఘోర పరాజయంపై ప్రభావం చూపిందన్నాడు. ప్రధానంగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ షాట్ కొట్టి ఔటైన తీరును బోర్డర్ తప్పుబట్టాడు. ఆసీస్ కుదురుకుంటున్న సమయంలో క్యారీ అనవసరపు షాట్ కొట్టి పెవిలియన్ చేరడం ఆసీస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాడు. ‘సరైన సమయంలో ఇంగ్లండ్ జూలు విదిల్చింది. నేను భయపడుతున్నట్లుగానే నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ సత్తా చాటింది. ఇంగ్లండ్తో ప్రమాదమని నేను ముందు నుంచీ భయపడుతూనే ఉన్నా. నా భయమే నిజమైంది. ఇంగ్లండ్ సమిష్టిగా రాణించి ఆసీస్ను మట్టికరిపించింది. ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించింది. ఈ టోర్నీలో ఆసీస్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ, సెమీస్లో మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా అలెక్స్ క్యారీ షాట్ను విమర్శించకతప్పదు. ఆసీస్ గాడిలో పడుతున్న సమయంలో క్యారీ ఆ షాట్ కొట్టి ఔట్ అవ్సాల్సింది కాదు. క్యారీ క్రీజ్లో ఉండి ఉంటే ఆసీస్ 260-270 పరుగుల మధ్యలో స్కోరు చేసి ఉండేది. అప్పుడు ఆసీస్ కనీసం పోరాడటానికి చాన్స్ దొరికేది’ అని బోర్డర్ అన్నాడు. కాగా, ఇంగ్లండ్ సమిష్ట ప్రదర్శనపై బోర్డర్ ప్రశంసలు కురిపించాడు. అన్ని విభాగాల్లోనూ తాము ఏమిటో నిరూపించుకున్న ఇంగ్లండ్ విజయానికి అన్ని విధాల అర్హత ఉందన్నాడు. ఆసీస్పై ఇంగ్లండ్ సాధించిన విజయం అసాధారణమైనదిగా బోర్డర్ అభివర్ణించాడు. పెద్ద టోర్నీలో అది కూడా నాకౌట్లో ఇంగ్లండ్ నుంచి చాలా కాలం తర్వాత అతి పెద్ద ప్రదర్శన వచ్చిందన్నాడు. -
భారత క్రికెట్ జట్టులో గ్రూపు తగాదాలు?
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగి సెమీస్లోనే తమ ప్రస్థానాన్ని ముగించి స్వదేశానికి తిరిగి పయనమయ్యేందుకు సిద్ధమైంది. భారత్ సెమీస్లోనే తన ఆటను ముగించి నాలుగు రోజులు కావొస్తున్నా, ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇంకా భారత క్రికెట్ అభిమానులు ఆ షాక్లోనే ఉండగా.. తాజాగా జట్టులో గ్రూపు తగాదాలున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెరో క్యాంప్ నడుపుతున్నారనే పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఒక వర్గం కోహ్లి వైపైతే మరో వర్గం రోహిత్వైపు ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మధ్య కూడా సఖ్యత లేదనే విషయం బయటకు వస్తోంది. గతంలో అనిల్ కుంబ్లేతో పడకపోవడంతో అతన్ని సాగనంపడానికి కోహ్లి ప్రధాన కారణమయ్యాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కోహ్లి, రవిశాస్త్రిలు ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. అదే జట్టులో అంతర్గత విభేదాలకు కారణమైందని కూడా విశ్లేషిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో రిషభ్ పంత్ అవుటయ్యాక రవిశాస్త్రి దగ్గరికి వచ్చి కోహ్లి వాగ్వాదం చేసిన విషయం తెలిసిందే. వరల్డ్కప్కు అంబటి రాయుడును కాదని విజయ్ శంకర్ ఎంపిక చేయడమే దానికి ఉదాహరణగా చెబుతున్నారు. కోహ్లికి బోర్డు పాలకుల కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ అండదండలు ఉండడంతో అతడి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేక పోతున్నారట..! ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్, చహల్ విషయాల్లో కోహ్లి జోక్యం శృతి మించిందని ప్రచారం. వీరిద్దరూ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నప్పటికీ కోహ్లి అండదండలతోనే నెట్టకొస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అంబటి రాయుడు విషయంలో కూడా వరల్డ్కప్కు ముందు పెద్ద చర్చే నడిచినట్లు తెలుస్తోంది. అతన్ని పేరుకు మాత్రమే స్టాండ్ బైగా ఎంపిక చేసినప్పటికీ జట్టులోకి రానివ్వకూడదని టీమిండియా మేనేజ్మెంట్ బలంగా కోరుకుందట. దాంతోనే అంబటిని అసలు పట్టించుకుపోవడానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంకా ఇంగ్లండ్లోనే ఉంది. ఫైనల్ అయిన తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టులో వేరు కుంపట్లు అంటూ వస్తున్న వార్తల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం బయటకు రాదు. -
చరిత్ర సృష్టించనున్న విలియమ్సన్
మాంచెస్టర్: న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ వన్డే ప్రపంచకప్లో చరిత్ర సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. ఇంగ్లండ్తో ఆదివారం లార్డ్స్లో జరిగే తుది సమరంలో అతడీ ఘనత సాధించే అవకాశముంది. మంచి ఫామ్లో ఉన్న విలియమ్సన్ తమ జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తుదిపోరులోనూ రాణించి కివీస్ ప్రపంచ విజేతగా నిలపాలని న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించేందుకు విలియమ్సన్ ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. మరొక్క పరుగు సాధిస్తే ఈ ఘనత అతడి సొంతమవుతుంది. ఈ ప్రపంచకప్లో 9 మ్యాచ్ల్లో 8 ఇన్నింగ్స్ ఆడి అతడు 2 సెంచరీలు, 2 అర్ధ శతకాలతో 548 పరుగులు చేసి మహేల జయవర్ధనేతో రికార్డును సమం చేశాడు. 2007 వరల్డ్కప్లో అప్పటి శ్రీలంక కెప్టెన్ జయవర్ధనే 11 మ్యాచ్లు ఆడి శతకం, నాలుగు హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేశాడు. ఇదే సిరీస్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 9 ఇన్నింగ్స్లో 539 పరుగులు సాధించాడు. విలియమ్సన్ ఇంకొక్క పరుగు సాధిస్తే ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఒక వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విలియమ్సన్ ఇప్పటికే రికార్డుకెక్కాడు. తాజా వరల్డ్కప్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 9 మ్యాచ్ల్లో 648 పరుగులు చేసి టాప్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. -
నేను డిమాండ్ చేయలేదు: డివిలియర్స్
కేప్టౌన్: దక్షిణాఫ్రికా వరల్డ్కప్ జట్టులో తాను పునరాగమనం కోసం ప్రయత్నం చేశాననే వార్తలను ఆ దేశ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఖండించాడు. ఆఖరి నిమిషంలో వరల్డ్కప్ జట్టులోకి రావడానికి తాను ఎటువంటి డిమాండ్ చేయలేదంటూ స్పష్టం చేశాడు. వరల్డ్కప్ సమయంలో సఫారీ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని డివిలియర్స్ ప్రయత్నం చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. దీనిపై డివిలియర్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘నేను తిరిగి జట్టులోకి రావడానికి ఎటువంటి డిమాండ్ చేయలేదు. ప్రపంచకప్ టీమ్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. అసలు ఎన్నడూ అలా భావించలేదు’ అని డివిలియర్స్ చెప్పాడు. అయితే, రిటైర్మెంట్ను ప్రకటించిన రోజు తనకు వరల్డ్కప్ ఆడే అవకాశం ఉంటుందా? అని వ్యక్తిగతంగా అడిగానని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా, కెప్టెన్ డుప్లెసితో మాట్లాడినప్పుడు ఎంతో అవసరమైతేనే తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశానన్నాడు. కానీ, వరల్డ్కప్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో ఓటమి అనంతరం తమ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ బయటకు రావడం ఎంతో బాధించిందన్నాడు. జట్టు వైఫల్యం నుంచి దృష్టి మరల్చడానికే ఎవరో ఈ సమాచారాన్ని లీక్ చేశారని డివిలియర్స్ చెప్పాడు. 2018, మే నెలలో తాను అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పానని, కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట నిర్ణయం తీసుకున్నానన్నాడు. -
బీజేపీలోకి ధోని : కేంద్ర మాజీమంత్రి
న్యూఢిల్లీ : ప్రపంచకప్లో భారత్ కథ సెమీస్తో ముగియడంతో ఇప్పుడు చర్చంతా సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్పైనే జరుగుతోంది. ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడనే ప్రచారం జోరందుకుంది. అయితే రిటైర్మెంట్ అనంతరం ధోని బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధోని త్వరలోనే నరేంద్రమోదీ టీమ్లో పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందన్నారు. ధోని బీజేపీలో చేరేలా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ‘ధోని నా స్నేహితుడు. అతనొక ప్రపంచ దిగ్గజ ఆటగాడు. అతన్ని బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయితే అతని రిటైర్మెంట్ అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.’ అని పాస్వాన్ పేర్కొన్నారు. ఇక ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది. -
‘డియర్ భారత్ ఫ్యాన్స్.. ఫైనల్ టికెట్లు అమ్మండి’
మాంచెస్టర్ : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొన్న భారత అభిమానులు వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఆదివారం జరిగే ఈ మెగా సంగ్రామంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు అమితుమీ తెల్చుకోనున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆధ్యాంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టుకు ఫైనల్ బెర్త్ ఖాయమని ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావించారు. దీంతో భారీ ఎత్తున్న ఫైనల్ మ్యాచ్కు భారత అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ కోహ్లిసేన పోరాటం సెమీస్తోనే ముగియడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్కు రాని భారత అభిమానులు ఆ టికెట్లను తిరిగి అమ్మివేయాలని నిషమ్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ‘డియర్ భారత క్రికెట్ అభిమానులారా.. మీరు ఫైనల్ మ్యాచ్కు రాకపోతే దయచేసి ఆ టికెట్లను అధికారిక ఫ్లాట్ఫామ్ ద్వారా తిరిగి అమ్మండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికి అనిపిస్తుంది. కానీ దయచేసి సంపన్నులే కాకుండా నిజమైన అభిమానులు మ్యాచ్కు వచ్చేలా చేయండి.’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. అయితే న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ పోరులో భారత్ 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏 — Jimmy Neesham (@JimmyNeesh) July 12, 2019 -
‘ఫైనల్’ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్
లండన్: విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) థర్డ్ అంపైర్ కాగా, అలీమ్ దార్ (పాకిస్తాన్) నాలుగో అంపైర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బృందం గురువారం నాటి ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్కూ పనిచేసింది. అయితే, ధర్మసేన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ను ఔట్గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. యూకేలో ఫైనల్ ఉచిత ప్రసారం సొంతగడ్డపై టైటిల్కు అడుగు దూరంలో నిలిచిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఆదివారం జరుగబోయే ప్రపంచ కప్ ఫైనల్ను ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుత కప్కు సంబంధించి యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 మెత్తబడి మెట్టుదిగింది. -
‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేకే ఓడాం
ముంబై: ప్రపంచకప్లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అదే విధంగా దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలు కూడా భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది. రేపు భారత జట్టు రాక... ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించిన భారత క్రికెట్ జట్టు ఆదివారం స్వదేశం చేరుకోనుంది. విడిగా కాకుండా జట్టు ఆటగాళ్లందరూ కలిసి ఒకేసారి ముంబైకి ప్రయాణిస్తారు. ‘టోర్నీ ముగిశాక కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్లోనే ఉండి విరామం కోరుకుంటారని వినిపించింది. అయితే అది వాస్తవం కాదు. జట్టు సభ్యులంతా ఆదివారం లండన్లో ఒక్కచోటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముంబై విమానమెక్కుతారు. సెమీస్ ఓటమి తర్వాత క్రికెటర్లంతా చాలా బాధలో ఉన్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ధోని రిటైర్మెంట్పైనే ఉంది. దీనిపై అతను మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ముంబై నుంచి స్వస్థలం రాంచీ చేరుకున్న తర్వాతే ధోని ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేకే ఓడాం హెడ్ కోచ్ రవిశాస్త్రి విశ్లేషణ ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్యను సమస్యగానే ఉంచడం వల్ల ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు అంగీకరించారు. మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లేకే సెమీఫైనల్లో కంగుతిన్నామని రవిశాస్త్రి అన్నారు. టీమిండియా పరాజయాన్ని విశ్లేషించిన ఆయన ఈ లోటుపై తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచించారు. ‘మిడిలార్డర్కు కీలకమైన నాలుగో స్థానాన్ని మొదట్లో రాహుల్తో లాగించాం. టోర్నీ మధ్యలో ఓపెనర్ ధావన్ గాయంతో నిష్క్రమించడంతో అతన్ని ఓపెనర్గా దింపాల్సి వచ్చింది. విజయ్ శంకర్ను ఆ నాలుగో స్థానంలో ఆడించినా... అతనూ గాయపడటంతో ఇక చేయాల్సిందేమీ లేకపోయింది’ అని రవిశాస్త్రి వివరించారు. మయాంక్ అగర్వాల్ను పిలిపించినా అప్పటికే సమయం మించిపోయిందన్నారు. ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపలేదన్న గావస్కర్ విమర్శలపై మాట్లాడుతూ ఎంతో అనుభవజ్ఞుడు, గొప్ప ఫినిషర్ అయిన ధోనిని ముందే పంపితే... అతను ఔటయితే ఇక గెలిచే పరిస్థితే ఉండదన్న విశ్లేషణతోనే మాజీ కెప్టెన్ను ఏడోస్థానంలో దింపామని... ఇది పూర్తిగా జట్టు నిర్ణయమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ‘ఆఖరిదాకా వికెట్ కాపాడుకున్న ధోని కూడా గెలిపించగలననే ధీమాతోనే ఉన్నాడు. అతను రనౌట్ కానంత వరకు అతని కళ్లలో ఈ ఆత్మవిశ్వాసమే కనబడింది. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు’ అని కోచ్ తెలిపారు. -
కప్పు కొట్లాటలో...
44 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఐదు జట్లే (వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటివరకు చాంపియన్లుగా నిలిచాయి. పెద్ద టోర్నీల్లో తేలిపోయే దురదృష్ట దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగతా వాటిలో కచ్చితంగా జగజ్జేతగా నిలిచే సత్తా ఉన్నవి ఇంగ్లండ్, న్యూజిలాండ్. అయితే, వీటి పోరాటం ఇన్నాళ్లూ సెమీఫైనల్లోనో, ఫైనల్లోనో ముగిసింది. ఇక ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. కొత్త చాంపియన్ ఆవిర్భావానికి వేదిక సిద్ధమవుతోంది. సరికొత్త చరిత్ర నమోదుకు కాలం వేచి చూస్తోంది. మరి ఈ జట్ల గత ఫైనల్ ప్రస్థానం ఎలా ఉందంటే? సాక్షి క్రీడా విభాగం ఇంగ్లండ్ మూడుసార్లు 1979, 1987, 1992లో న్యూజిలాండ్ 2015లో ప్రపంచ కప్ చివరి మెట్టు వరకు వచ్చాయి. ఇంగ్లిష్ జట్టు... వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలై విశ్వ విజేతగా నిలిచే అవకాశం చేజార్చుకుంది. కివీస్ను గత కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం ఓ విశేషమైతే... 12వ ప్రపంచ కప్ ద్వారా 23 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్ను ప్రేక్షకులు చూడబోతుండటం మరో విశేషం. చివరి సారిగా 1996లో (శ్రీలంక) ఓ కొత్త జట్టు జగజ్జేత అయింది. ఇంగ్లండ్ ఆ మూడుసార్లు ఇలా... క్రికెట్ పుట్టిల్లయిన ఇంగ్లండ్ ఇంతవరకు వన్డేల్లో విశ్వవిజేత కాలేకపోవడం ఆశ్చర్యమే. మంచి ఫామ్, గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా ఆ జట్టు మిగతా దేశాలతో పోటీలో వెనుకబడిపోయింది. వీటిలో సంప్రదాయ టెస్టు తరహా ఆటను విడనాడకపోవడం మొదటిది. కాలానికి తగ్గట్లు మారకపోవడం రెండోది. ఇప్పుడు వాటిని ఛేదించి అమీతుమీకి సిద్ధమైంది. గతంలోని మూడు విఫలయత్నాలను గమనిస్తే... వివ్ విధ్వంసంలో కొట్టుకుపోయింది... వరుసగా రెండోసారి ఆతిథ్యమిచ్చిన 1979 కప్లో ఇంగ్లండ్ గ్రూప్ మ్యాచ్లన్నిటిలో అజేయంగా నిలిచింది. కెప్టెన్ మైక్ బ్రియర్లీ, బాయ్కాట్ వంటి ఓపెనర్లతో, కుర్రాళ్లు గూచ్, బోథమ్, డేవిడ్ గోవర్లతో టైటిల్ ఫేవరెట్గా కనిపించింది. సెమీస్లో గట్టి పోటీని తట్టుకుని 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్ చేరింది. తుది సమరంలో మాత్రం భీకర వెస్టిండీస్కు తలొంచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఓ తప్పిదం కాగా... విధ్వంసక వివ్ రిచర్డ్స్ (157 బంతుల్లో 138 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకంతో ఆతిథ్య జట్టును చితక్కొట్టాడు. కొలిస్ కింగ్ (66 బంతుల్లో 86; 10 ఫోర్లు, 3 సిక్స్లు) అతడికి అండగా నిలవడంతో కరీబియన్లు నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. ఛేదనలో బ్రియర్లీ (64), బాయ్కాట్ (57) అర్ధ సెంచరీలతో మంచి పునాది వేసినా జోయల్ గార్నర్ (5/38) ధాటికి గూచ్ (32) మినహా మిగతావారు విఫలమయ్యారు. వీరు కాక రాండల్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయడంతో ఇంగ్లండ్ 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 92 పరుగుల తేడాతో ఓడి కప్ను చేజార్చుకుంది. గాటింగ్ షాట్తో గూబ గుయ్... భారత్ ఆతిథ్యమిచ్చిన 1987 కప్లో గ్రూప్ దశలో రెండుసార్లు (ఫార్మాట్ ప్రకారం) పాకిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... శ్రీలంక, వెస్టిండీస్లపై అజేయ విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్లో నాటి డిఫెండింగ్ చాంపియన్ భారత్పై 35 పరుగులతో నెగ్గింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ను 50 ఓవర్లలో 253/5 కు కట్టడి చేసింది. గూచ్ (35), అథె (58)కు తోడు కెప్టెన్ గాటింగ్ (41), అలెన్ లాంబ్ (45) రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే, 135/2తో ఉన్న దశలో గాటింగ్ అత్యుత్సాహ రివర్స్ స్వీప్ సీన్ను రివర్స్ చేసింది. స్కోరు 177 వద్ద అథెను ఔట్ చేసిన ఆసీస్ బౌలర్లు పట్టుబిగించి ఇంగ్లండ్ను 50 ఓవర్లలో 246/8కే పరిమితం చేశారు. కప్నకు అతి దగ్గరగా వచ్చిన ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో కోల్పోయింది. పాక్ ప్రతాపాన్ని తట్టుకోలేక... ఆ వెంటనే జరిగిన 1992 కప్లో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఇంగ్లండ్ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. వర్షం రూపంలో అదృష్టం కలిసివచ్చి సెమీస్లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు వెళ్లింది. అటువైపు ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో ఇంగ్లండ్దే కప్ అని అంతా అనుకున్నారు. కానీ, పాక్ పట్టువిడవకుండా ఆడి ఇంగ్లండ్ కలను చెదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (72), జావెద్ మియాందాద్ (58) అర్ధసెంచరీలు, ఇంజమామ్ (42) అక్రమ్ (32) మెరుపులతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఛేదనలో అక్రమ్ (3/49), ముస్తాక్ అహ్మద్ (3/41), అకిబ్ జావెద్ (2/27) ప్రతాపానికి నీల్ ఫెయిర్ బ్రదర్ (62) తప్ప మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై కప్నకు 22 పరుగుల దూరంలో ఆగిపోయింది. కివీస్కు ఆసీస్ కిక్... ప్రపంచ కప్లలో న్యూజిలాండ్ది స్థిరమైన ప్రదర్శన. టోర్నీ ఎక్కడ జరిగినా కనీసం సెమీస్ చేరే స్థాయి ఉన్న జట్టుగా బరిలో దిగుతుంది. మొత్తం 12 కప్లలో 8 సార్లు సెమీస్కు రావడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి మార్టిన్ క్రో బ్యాటింగ్ మెరుపులతో సహ ఆతిథ్యమిచ్చిన 1992 కప్లోనే కివీస్ హాట్ ఫేవరెట్గా కనిపించింది. కానీ, సెమీస్లో పాకిస్తాన్ విజృంభణకు తలొంచింది. మళ్లీ 2015లో సహ ఆతిథ్యంలో కెప్టెన్ మెకల్లమ్ విధ్వంసక ఇన్నింగ్స్లతో మెగా టోర్నీలో విజేతగా నిలిచేలా కనిపించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా... భీకర ఫామ్లో ఉన్న మెకల్లమ్ (0) డకౌట్ కావడంతో మానసికంగా బలహీన పడిపోయింది. ఇలియట్ (83), రాస్ టేలర్ (40) మాత్రమే రాణించడంతో 45 ఓవర్లలో 183కే ఆలౌటైంది. స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. -
టీమిండియా ప్రపంచకప్ ప్రదర్శనపై సమీక్ష
ముంబై: ప్రపంచకప్లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అలాగే దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది. -
సమర్థించుకున్న రవిశాస్త్రి
మాంచెస్టర్: న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎంఎస్ ధోనిని ఏడవ స్థానంలో బ్యాటింగ్కు పంపడాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సమర్థించుకున్నాడు. ధోనిని ముందుగా బ్యాటింగ్ పంపివుంటే బాగుండేదని మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడిన నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ధోని అనుభవం లోయర్ ఆర్డర్లోనే ఎక్కువ అవసరమన్న అభిప్రాయంతోనే దినేశ్ కార్తీర్, హార్దిక్ పాండ్యా తర్వాత అతడిని బ్యాటింగ్కు దించినట్టు వెల్లడించారు. ‘ఇది జట్టు సమిష్టి నిర్ణయం. మేమంతా ఆషామాషీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎంఎస్ ధోని ముందుగా వచ్చి తొందరగా ఔటవ్వాలని మీరు కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. ధోని త్వరగా ఔట్ అయితే ఛేజింగ్ మరింత కష్టమయ్యేది. అతడి అనుభవాన్ని చివర్లో వాడుకోవాలని అనుకున్నాం. ధోని గొప్ప ఫినిషర్ అన్న విషయం అందరికీ తెలుసు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. చివరి ఓవర్లో ఏ బంతిని ఎలా కొట్టాలో ముందుగా మైండ్లో లెక్కేసుకున్నట్టుగా కనిపించాడు. దురదృష్టవశాత్తు రనౌట్ అయి లెక్కలు తప్పడంతో అతడి ముఖంలో విచారం స్పష్టంగా కనబడింద’ని రవిశాస్త్రి వివరించాడు. కీలక సమయంలో చెత్త షాట్ ఆడి ఔటైన యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ను ఆయన వెనకేసుకొచ్చాడు. పంత్కు పెద్దగా అనుభవం లేదని, మెల్లగా నేర్చుకుంటాడని సమర్థించాడు. పంత్, పాండ్యా అవుటైన తర్వాత అసమాన పోరాటపటిమ చూపి లక్ష్యానికి దగ్గర రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. -
కొన్ని సార్లు అంతే.. గెలవలేరు!
హైదరాబాద్ : ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమణపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు కోహ్లి సేనపై దుమ్మెత్తిపోస్తుండగా.. మరికొందరు బాసటగా నిలుస్తున్నారు. అయితే తాజాగా భారత ఫుట్బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా కోహ్లి సేనకు మద్దతుగా నిలిచాడు. ‘కొన్ని సార్లు అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యుత్తమ జట్లు విజయం సాధించలేవు. 45 నిమిషాల ఆటే ఓటమికి కారణమని కోహ్లి అన్నాడు. ఓడిపోతే ఓడిపోయినట్టే దానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆటలో గెలపోటములు చాలా సహజం. కానీ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి టీమిండియా అంత చెత్తగా ఏమి ఆడలేదు. మైదానాల్లో కేవలం వారే కనిపిస్తున్నారు.. క్రికెట్ను మరిన్ని దేశాలకు విస్తరించేలా ఐసీసీ చర్యలు చేపట్టాలి. కేవలం పదిజట్లతోనే ప్రపంచకప్ నిర్వహించడం బావ్యం కాదు. ప్రస్తుత ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు చూసింది భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారే. మ్యాచ్ చూసే, ఆడే దేశాల సంఖ్య పెరగాలి. దీనిపై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టాలి’అంటూ భూటియా వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన కోహ్లి సేన ఫైనల్ చేరకుండానే ప్రపంచకప్ ప్రయాణం ముగించింది. -
ఫైనల్ వరకు కోహ్లి సేన అక్కడే!
మాంచెస్టర్ : ప్రపంచకప్ నుంచి ఇప్పటికే నిష్క్రమించినప్పటికీ ఫైనల్ ముగిసేవరకు వరకూ టీమిండియా ఇంగ్లండ్లోనే ఉండనుంది. దీనికి కారణం బీసీసీఐనే. క్రికెటర్లకు, సిబ్బందికి టికెట్లను సర్దుబాటు చేయడంలో బోర్డు విఫలమవ్వడంతో వారు ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికే కొంతమంది మాంచెస్టర్లోనే ఉండగా.. మరికొందరు లండన్కు పయనమయ్యారు. అయితే సభ్యులందరూ ఆదివారం(జులై 14) లండన్లో ఒక్కచోటుకు చేరుకొని స్వదేశానికి బయల్దేరుతామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక కోహ్లి సేన ఫైనల్కు చేరకపోవడంతో టీమిండియా ప్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫైనల్కు చేరుతుందన్న నమ్మకంతో మ్యాచ్ టికెట్లతో పాటు వసతి ఏర్పాట్లు చేసుకున్న వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. రీసెల్లింగ్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్కు టికెట్లు కొన్న వారిలో సుమారు 80 శాతానికిపైగా టీమిండియా ఫ్యాన్సే ఉన్నట్లు సమాచారం. దీంతో ఐసీసీ టికెట్లను రీ సెల్లింగ్కు ఇష్టపడటంలేదు. ఇక ప్రపంచకప్ ఫైనల్ పోరులో బాగంగా ఆదివారం ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. -
చెత్త ప్రదర్శనతో ముగించాం: ఫించ్
బర్మింగ్హామ్ : ప్రపంచకప్ కోసం ఏడాదిగా కష్టపడ్డామని కానీ ఓ చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధకలిగిస్తోందని ఆస్ట్రేలియా సారిథి ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే ప్రపంచకప్లో 27 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ తొలిసారి ఫైనల్ చేరగా.. ఆసీస్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి సెమీస్లో ఓటమి చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ కనీసం ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించడంపై ఆసీస్ సారథి ఫించ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ అనంతరం ఫించ్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ‘టీమిండియా, పాకిస్తాన్ వంటి బలమైన జట్లపై వన్డే సిరీస్లు నెగ్గడంతో ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్ బరిలోకి దిగాం. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతర ఏడాది పాటు మా ప్రయాణం కష్టంగా సాగింది. అయితే ఆటగాళ్లు మానసికంగా చాలా పరిపక్వతను ప్రదర్శించారు. తిరిగి గాడిలో పడి ప్రపంచకప్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగాం. లీగ్లో చాంపియన్ ఆటనే ప్రదర్శించాం. కానీ ఇంగ్లండ్పై మా అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్లో చెలరేగుతుందని అనుకున్నాం.. కానీ బౌలింగ్లో చెలరేగా మమల్ని షాక్కు గురిచేసింది. వోక్స్, ఆర్చర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కష్టకాలంలో స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. మిగతా బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ మ్యాచ్లో మేము అన్ని రంగాల్లో విఫలమయ్యాం. ఆర్చర్కు మంచి భవిష్యత్ ఉంది. చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధ కలిగించింది. ఈ ఓటమి ప్రభావం త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్పై ఉండదని భావిస్తున్నా’అంటూ ఫించ్ వివరించాడు. ఇక సెమీస్లో తమ జట్టు కనీసం పోరాడకుండానే ఓడిపోవడంపై ఆసీస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడ్చింది నిజమే కానీ ధోని కోసం కాదు..
హైదరాబాద్ : ప్రపంచకప్లో భాగంగా జరిగిన సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాభావం చవిచూసింది. కివీస్ మ్యాచ్లో కీలక సమయంలో ధోని రనౌట్ కావడంతో కోహ్లిసేన ఓటమికి దారితీసింది. అయితే ధోని అనూహ్యంగా రనౌట్ కావడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్కు గురయ్యారు. అంతేకాకుండా ధోనికి చివరి వరల్డ్కప్ అని భావిస్తుండటంతో అందరూ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో సోషల్ మీడియాలో పలుఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా మ్యాచ్ కవరేజ్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ ధోని ఔటవ్వడంతో ఏడ్చినట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. అయితే అది ఫేక్ ఫోటో అని నిర్దారణ అయింది. ఫోటోగ్రాఫర్ ఏడ్చింది నిజమే.. కానీ ధోని ఔటనప్పుడు కాదని తేటతెల్లమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆసియా ఫుట్బాల్ కప్లో భాగంగా ఖతార్తో జరిగిన మ్యాచ్లో ఇరాక్ ఓడిపోవడంతో ఆ దేశ ఫోటోగ్రాఫర్ కన్నీరుపెట్టుకున్నాడు. అయితే అప్పటి ఫోటోను తీసుకొని కొందరు ధోని ఔటనప్పుడు ఏడ్చినట్టు నెట్టింట్లో పోస్ట్ చేశారు. అది తెగవైరల్ అవడంతో పాటు.. హృదయాలను హత్తుకునేలా ఉండటంతో ధోని సపోర్టర్స్ తెగ షేర్ చేశారు. తీరా అసలు విషయం తెలిశాక నాలుక కరుచుకుంటున్నారు. -
కోహ్లి దురదృష్టవంతుడు : అక్తర్
ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్లో అంపైర్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బలయ్యాడని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా బలంగా పేర్కొనే టాపార్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారని కితాబిచ్చాడు. ఏదేమైనా ప్రపంచకప్ ఆసాంతం మెరుగ్గా రాణించిన టీమిండియా పట్ల భారత అభిమానులు గర్వపడాలని పేర్కొన్నాడు. అదే విధంగా మ్యాచ్ చివరిదాకా పోరాడిన జడేజా, ధోనీలపై ప్రశంసలు కురిపించాడు. మెగాటోర్నీ నుంచి కోహ్లి సేన నిష్క్రమణపై పాక్ మాజీ దిగ్గజం తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు. ఈ క్రమంలో షోయబ్ మాట్లాడుతూ...‘ ఐదుగురు టాప్ ఆటగాళ్ల బ్యాటింగ్ పూర్తిగా నిరాశ పరిచింది. రోహిత్ అద్భుత బంతికి ఔటయ్యాడు. కానీ కోహ్లి దురదృష్టవంతుడు. కోహ్లి బాదిన బంతి బెయిల్స్ని అలా క్లిప్ చేస్తూ వెళ్లింది. అయితే ఫీల్డ్ అంపైర్ దానిని ఔట్గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా లోయర్ ఆర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జడేజా వచ్చేంత వరకు అసలు ఆటలో మజానే లేదు. ఇక ధోని కూడా విజయంపై ఆశలు రేకెత్తించాడు. అసలు ధోని రనౌట్ అవుతాడని ఎవరైనా ఊహించి ఉంటారా. అయినా తనెప్పటికీ లెజెండే. క్రికెట్కు తనో గొప్ప అంబాసిడర్. అయితే దురదృష్టవశాత్తూ ఈసారి టీమ్ను ఫైనల్కు తీసుకువెళ్లలేకపోయాడు. ఏదేమైనా ప్రపంచకప్లో అద్భుత విజయాలు సాధించిన తమ జట్టు ప్రదర్శన పట్ల టీమిండియా అభిమానులు గర్వపడాలి’ అని షోయబ్ చెప్పుకొచ్చాడు. కాగా మెగాటోర్నీ పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచిన కోహ్లి సేన అనూహ్యంగా కివీస్ చేతిలో ఓటమి పాలై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన రిజర్వ్ డే మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. -
'బాధపడొద్దు మీ ప్రదర్శన గర్వించదగినది'
న్యూఢిల్లీ : ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా న్యూజీలాండ్ చేతిలో ఓడిపోవడం తనకు భాద కలిగించినా, మా కుర్రాళ్లు చేసిన ప్రదర్శన నన్ను ఆకట్టుకుందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. బుధవారం కివీస్తో మ్యాచ్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రపంచకప్లో రోహిత్ శర్మ 5 సెంచరీలు చేయడం, కోహ్లి ,రాహుల్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం అభినందించదగ్గ విషయం. అలాగే సెమీఫైనల్లో ప్రతికూల పరిస్థితుల్లో మహీ-జడేజాలు నెలకొల్పిన 116 పరుగుల కీలక భాగప్వామ్యం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని రవిశాస్రి స్పష్టం చేశారు. 'మీరు మ్యాచ్లో ఓడిపోయారు కానీ అభిమానుల మనసులు గెలుచుకున్నారని ఆటగాళ్లలో స్పూర్తి నింపారు. మనం ఈ ప్రపంచకప్లో రెండో ర్యాంకుతో అడుగుపెట్టామని, లీగ్ దశలో ఆడిన మ్యాచ్ల్లో ఇంగ్లండ్ మినహా మిగతా జట్లపై విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచి సెమీస్లో అడుగుపెట్టామన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సెమీస్లో న్యూజీలాండ్ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని ప్రతికూల పరిస్థితుల్లో చేదించలేకపోయామే తప్ప మీ ఆటను తప్పు పట్టనవసరంలేదని' శాస్త్రి తెలిపాడు.అంతేగాక గత రెండేళ్లలో జట్టుగా మనం ఎన్నో విజయాలు సాధించామన్న విషయం గుర్తుంచుకోండి. సెమీస్ మ్యాచ్లో కేవలం 30 నిమిషాల చెత్త ఆట మన విజయాలని చెరిపేయలేదని రవిశాస్రి ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. టీమిండియా తమ తదుపరి షెడ్యూల్లో భాగంగా ఆగస్టులో వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో విండీస్తో మూడు టి20లు, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ల్లో పాల్గొననుంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. అదేవిధంగా ప్రపంచకప్లో జట్టు నిష్క్రమణ తర్వాత ఎమ్మెస్ ధోని రిటైర్మంట్పై ఊహాగానాలు ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి. -
‘ధోని రనౌట్ కావడం నా అదృష్టం’
మాంచెస్టర్ : డైరెక్ట్ హిట్తో భారత ఆశలను సమాధి చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆ రనౌట్పై స్పందించాడు. టీమిండియా ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్ కావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. భారత్తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గప్టిల్ తన అద్భుత ఫీల్డింగ్తో ధోనిని పెవిలియన్ను చేర్చిన విషయం తెలిసిందే. భారత విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని ఓ భారీ సిక్స్ కొట్టి గెలుపు ఆశలను రేకిత్తించాడు. ఆ మరుసటి బంతిని వదిలేసిన మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గప్టిల్ డైరెక్ట్ త్రోకు ఔటయ్యాడు. ఈ ఔట్తో ప్రపంచకప్లో భారత్ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్తో ఆకట్టుకోని గప్టిల్ ఈ ఒక్క రనౌట్తో హీరో అయ్యాడు. ఈ రనౌట్పై ఐసీసీ ట్వీట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘ఎంత అదృష్టం ఉంటే ధోనిని కీలక సమయంలో డైరెక్ట్ హిట్తో ఔట్ చేస్తాను’ అని సంబరపడిపోయాడు. "Lucky enough to get a direct hit from out there" – New Zealand's @Martyguptill on his ⚡ ️throw to dismiss MS Dhoni in the #CWC19 semi-final against India. #BackTheBlackCaps pic.twitter.com/GnerDahQgQ — ICC (@ICC) July 11, 2019 -
రాయుడు ఉంటే గెలిచేది కదా!
ప్రపంచకప్లో భారత్ పోరాటం సెమీస్తో ముగియడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లిసేన.. న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బతినడం మరిచిపోలేకపోతున్నారు. మ్యాచ్ జరిగి 48 గంటలు గడిచినా ఆ ఓటమి క్షణాలను మదిలోంచి తొలిగించలేకపోతున్నారు. భారత ఓటమికి గల కారణాలేంటని విశ్లేషిస్తున్నారు. ప్రతి టీకొట్టు దగ్గర అదే ముచ్చట.. ఆఫీసుల్లో సహోద్యోగుల మధ్య ఇదే చర్చ. ఇక సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్.. టిక్ టాక్లు మ్యాచ్ విశ్లేషణలతో మారుమోగుతున్నాయి. పాండ్యా, పంత్లు కొద్దిసేపు ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేదని ఒకరంటే.. అసలు రోహిత్, కోహ్లిలు ఔట్ కాకుంటే ఈ ఓటమే తప్పేదని మరొకరంటున్నారు. అసలు ధోని రనౌట్ కాకుంటే టైటిల్ రేసులో నిలిచేవారమని ఇంకోకరంటున్నారు. ఇలా ఎవరికీ తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఆ విశ్లేషణలేంటో చూద్దాం. అంబటి రాయుడు ఉంటే.. టాపర్డర్ విఫలమైన సందర్భంలో మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఒక్కరు నిలిచున్నా ఫలితం వేరేలా ఉండేది. అయితే ఈ తరహా పరిస్థితుల్లో భారత్కు అండగా ఉండే బ్యాట్స్మన్ అంబటి రాయుడేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో భారత్ 18 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో రాయుడే 90 పరుగులతో భారత స్కోర్బోర్డ్ను 250 దాటించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాయుడు ఉంటే భారత్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ ఇన్నింగ్స్ మన సెలక్టర్లకు గుర్తుకులేదని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. We miss you @RayuduAmbati pic.twitter.com/28a2Za2c9k — Ifteqar Saqiß (@IfteqarSaqib) July 11, 2019 ధోని ముందు వచ్చి ఉంటే.. భారత్స్కోర్ 5/3 ఉన్న స్థితిలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు నీషమ్ అద్బుత క్యాచ్తో అతను వెనుదిరగడం భారత్ కొంపముంచింది. అయితే ఈ పరిస్థితుల్లో దూకుడుగా ఆడే హార్దిక్ పాండ్యాకు బదులు అనుభవం కలిగిన ధోనిని పంపించాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ధోని వచ్చి ఉంటే యువ క్రికెట్ రిషబ్ పంత్ను గైడ్ చేస్తూ.. సింగిల్స్తో ఇన్నింగ్స్ ముందుకు నడిపించేవాడని, అప్పుడు భారత్ విజయం దిశగా పయనించేదని, చివర్లో పాండ్యా, జడేజా గెలుపు బాధ్యతలు తీసుకునేవారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫీల్డింగ్.. భారత ఫీల్డింగ్లో స్పిన్నర్ యజువేంద్ర చహల్ అలసత్వం కూడా కివీస్కు కలిసొచ్చింది. సునాయస ఫోర్లను ఆపకుండా చహల్ పరుగులిచ్చుకున్నాడు. ఇక కీవిస్ ఆటగాళ్లు మాత్రం అద్భుత ఫీల్డింగ్తో భారత బ్యాట్స్మన్పై ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా పంత్, పాండ్యాల బ్యాటింగ్ అప్పుడు కష్టతరమైన బౌండరీలను కూడా ఆపి యువ ఆటగాళ్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఇక దినేశ్ కార్తీక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ నీషమ్ అద్భుత ఫీల్డింగ్తో అందిపుచ్చుకోవడం, గప్టిల్ విసిరిన బంతి నేరుగా వికెట్లు తాకి భారత ఆశలను కూల్చడం మ్యాచ్కే హైలైట్. జట్టు కూర్పు.. కీలక సెమీస్ మ్యాచ్లో భారత జట్టు కూర్పు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. 4 మ్యాచుల్లో 14 వికెట్లతో ఫామ్లో ఉన్న షమీని బెంచ్కు పరిమితం చేయడం.. ఇద్దరు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లనే మూసధోరణి పద్దతిలో బరిలోకి దిగడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. చహల్ బదులు షమీని జట్టులోకి తీసుకుంటే పేస్కు అచ్చొచ్చిన పిచ్పై ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ విభాగం మరింత తేలిపోయేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందరూ పొదుపుగా బౌలింగ్ చేయగా చహల్ ఒక్కడే 63 పరుగులు సమర్పించుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇక కివీస్ మాత్రం పిచ్ సరిగ్గా అంచనా వేసి ఒక్క స్పిన్నర్ మిచెల్ సాంట్నర్తోనే బరిలోకి దిగింది. India should take Dhoni to no 3/4 in the batting order, also should remove Chahal / Dinesh karthik from the team for sometime. Chahal had given much run in the same away as such in the previous matches... Can't understand why again retained him in the semi. @msdhoni @imVkohli — Vimal AK (@AKVimal) July 12, 2019 -
క్రికెటర్ అసభ్య ప్రవర్తన.. ఏడాది సస్పెన్షన్
కాబూల్: ప్రపంచకప్ టోర్నీకి అనూహ్యంగా దూరమైన అఫ్గాన్ పేసర్ అఫ్తాబ్ ఆలమ్పై ఏడాదిపాటు నిషేధం విధించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు, దేశవాళీ టోర్నీలకూ దూరంగా ఉండాలంటూ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని హెచ్చరించినట్లు ఆలస్యంగా తెలిసింది. ప్రపంచకప్లో జూన్ 22న సౌతాంప్టన్లో భారత్తో ఆడిన మ్యాచే అతనికి చివరిది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాంప్టన్ హోటల్లో ఒక మహిళతో అఫ్తాబ్ తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో జూన్ 23న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని కోరగా... అతను కావాలని సమావేశానికి గైర్హాజరవ్వడంతో కోచ్ ఫిల్ సిమన్స్ తర్వాతి రెండు మ్యాచ్ల నుంచి అఫ్తాబ్ను తప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్తాబ్ ప్రపంచకప్నకు దూరమవుతున్నాడని ఆయన ప్రకటించారు. తదుపరి ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 26 ఏళ్ల అఫ్తాబ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
వాళ్లే వరల్డ్కప్ విజేతలు !!
1992 వరల్డ్కప్ తర్వాత ఆరు టోర్నీలలో ఒక్కసారి కూడా సెమీస్ చేరలేకపోయిన ఇంగ్లండ్ ఇప్పుడు సొంతగడ్డపై ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్లో భాగంగా గురువారం బర్మింగ్హామ్లో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలుపొందిన ఆతిథ్య జట్టు 44 ఏళ్ల తమ టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. తమ చిరకాల ప్రత్యర్థి ఆసీస్ను చిత్తు చేసిన మోర్గాన్ సేన టైటిల్ సాధించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో టీమిండియాను ఓడించిన జట్టే వరల్డ్కప్ను ఎగరేసుకుపోతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘ ఇండియాను ఎవరైతే ఓడిస్తారో వాళ్లే ప్రపంచకప్ గెలుస్తారు’ అని అతడు చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మైఖేల్ ట్వీట్పై స్పందించిన భారత అభిమానులు...‘ మీరు చెప్పిన దాన్ని బట్టి వరల్డ్ కప్ చాంపియన్ కంటే టీమిండియానే అత్యుత్తమ జట్టు అని స్పష్టమవుతోంది అని చమత్కరిస్తుండగా.. .‘ ఫైనలిస్టుల చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ రెండు జట్లను పాకిస్తాన్ ఓడించింది. అంటే అన్ని జట్ల కంటే పాక్ చాలా గొప్పగా ఆడినట్లు’ అని దాయాది జట్టు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం.. మైఖేల్ అసలు నీ ట్వీట్లో ఏమైనా లాజిక్ ఉందా అని ప్రశ్నిస్తుండగా... మరికొంత మంది.. ‘ 2015 సెమీస్ ఫలితాన్నిబట్టి మైఖేల్ ఇలా చెబుతున్నారేమో. అంటే ఆనాడు కూడా టీమిండియా సెమీ ఫైనల్లో ఓడిపోయింది. వాళ్లపై నెగ్గిన ఆసీస్ కప్ ఎగురేసుకుపోయింది. దీన్ని బట్టి ఈసారి కప్ న్యూజిలాండ్దే. ఏమంటావు మైఖేల్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా మెగాటోర్నీలో భాగంగా బర్మింగ్హామ్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి సేన తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలి సెమీస్ మ్యాచ్లో అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రా య్ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించాడు. మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్), రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. Always said whoever Beats India will the win the World Cup ... 👍 #CWC19 — Michael Vaughan (@MichaelVaughan) July 11, 2019 -
భారత ఓటమిని ముందే చెప్పిన జ్యోతిష్యుడు!
హైదరాబాద్ : ప్రపంచకప్లో భారత్ పోరాటం సెమీస్తో ముగిసింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్కు తల వంచింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. అభిమానులకు తీరని గుండె కోతను మిగిల్చింది. అయితే భారత్ సెమీస్లో ఓడుతుందని ఓ జ్యోతిష్యుడు ఆరు నెలల ముందే తెలియజేశాడు. అతను చెప్పినట్లు భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీఫైనల్కు వెళ్లడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలాజీ హసన్ అనే సదరు జ్యోతిష్యుడు ఓ టీవీ చానెల్ క్యార్యక్రమంలో భాగంగా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అందరని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జనవరిలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను హీరో మాధవన్ ఇన్స్టాగ్రాంలో పంచుకోగా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఏముందంటే.. 2019 ప్రపంచకప్లో ఏ జట్టు గెలుస్తుందని యాంకర్ ప్రశ్నించగా.. ఇది చాలా కష్టమైన ప్రశ్ననని పేర్కొన్న బాలాజీ హసన్.. ఇప్పటి వరకు గెలవని జట్టు సొంతం చేసుకుంటుందని సమాధానమిచ్చాడు. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్కు చేరుతాయని, భారత్.. న్యూజిలాండ్ లేక ఇంగ్లండ్తో సెమీస్ ఆడుతుందన్నాడు. టైటిల్ మాత్రం న్యూజిలాండ్ గెలుస్తుందని, మ్యాన్ఆఫ్ది సిరీస్ కేన్ విలియమ్సన్ను వరిస్తుందన్నాడు. ఇక అతను చెప్పినట్లుగానే న్యూజిలాండ్.. భారత్తో గెలిచి ఫైనల్ చేరింది. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రేసులో కేన్ విలియమ్సన్, జోరూట్కు అవకాశాలున్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ శర్మ (648) టాప్స్కోరర్గా ఉండగా.. డేవిడ్ వార్నర్ 647 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి కథ సెమీస్ పోరుతో ముగియడంతో తరువాతి స్థానాల్లో నిలిచిన జోరూట్ (549), కేన్ విలియమ్సన్ (548)కు అవకాశం ఉంది. ఫైనల్లో ఎవరు సెంచరీ సాధిస్తారో వారు మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవనున్నారు. -
టైటిల్ మాత్రం న్యూజిలాండ్ గెలుస్తుంది!
-
మా చెత్త ఆటనే నిష్క్రమణకు కారణం : రోహిత్
మాంచెస్టర్ : ప్రపంచకప్లో తమ పోరాటం సెమీస్లోనే ముగియడంపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరంభంలోని తమ చెత్త ఆటనే ప్రపంచకప్ నిష్క్రమణకు కారణమైందని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘కీలక సమయంలో జట్టుగా విఫలమయ్యాం. 30 నిమిషాల మా చెత్త ఆట.. ప్రపంచకప్ గెలిచే అవకాశాలను దూరం చేసింది. ఈ ఫలితంతో నా గుండె భారమైంది. మీకు కూడా అలానే ఉంటుంది. కానీ దేశం బయట అభిమానుల మద్దతు వెలకట్టలేనిది. యూకేలో మేం ఎక్కడ ఆడినా అక్కడకు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని రోహిత్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ప్రపంచకప్లో 5 సెంచరీలతో టాప్ స్కోరర్గా నిలిచిన రోహిత్ శర్మ.. కీలక సెమీస్ పోరులో మాత్రం ఒకటే పరుగు చేసి ఔటయ్యాడు. రోహిత్తో పాటు కోహ్లి, రాహుల్లు కూడా ఒక పరుగుకే నిష్క్రమించడం భారత బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. -
ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్ వద్దు
‘ధోని బాయ్ ఇప్పుడే రిటైర్మెంట్ వద్దు.. మెగా టోర్నీ నిష్క్రమణతోనే మా గుండెపగిలింది. ఈ పరిస్థితుల్లో నీ రిటైర్మెంట్ ప్రచారం మమ్మల్ని ఇంకా బాధపెడుతోంది. దయచేసి ఆ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు.’ అని సోషల్ మీడియా వేదికగా యావత్ క్రికెట్ అభిమానుల మిస్టర్ కూల్ను అభ్యర్థిస్తున్నారు. #Donotretiredhoni యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్కు తల వంచింది. అభిమానులకు గుండె కోతను మిగిల్చింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. టాపార్డర్ చేతులెత్తేసినా.. ఓటమి కళ్లుముందు కనిపిస్తున్నా.. మ్యాచ్ ఫినిషర్ ధోని ఉన్నాడులే గెలిపిస్తాడులేనన్న ఓ చిన్న ఆశ.. ప్రతి అభిమాని మదిలో మెదిలింది. 12 బంతుల్లో 36 పరుగులు.. ధోని అనుభవం ముందు పెద్ద లెక్కకాదు. కానీ అదృష్టం కలిసిరాక రనౌట్ రూపంలో ఆ ఆశ కూడా ఆవిరైంది. ఏనాడు భావోద్వేగాలను ప్రదర్శించని ధోని కూడా ఈ రనౌట్తో కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ రనౌట్ అంపైర్కు కూడా ఇష్టం లేదని అతని ముఖకవలికల ద్వారా స్పష్టమైంది. ఇక ఓ కెమెరా అయితే కన్నీరే కార్చేసింది. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మీడియా మాత్రం ధోని తొలి మ్యాచ్లో రనౌట్.. ఆఖరి మ్యాచ్లో రనౌట్ అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. దీన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని ధోనిని వేడుకుంటున్నారు. ‘వీల్చైర్లో ఉన్న ధోనికి తన జట్టులో చోటిస్తానని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ అన్న మాటలే ధోని ఎంత గొప్ప ఆటగాడో తెలియజేస్తున్నాయి. తమ దేశ పౌరసత్వం ఉంటే ఇప్పుడే ధోనిని తమ జట్టులోకి తీసుకుంటామని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అన్న వ్యాఖ్యలు ధోని విలువెంటో చెబుతున్నాయి. కానీ మనవాళ్లే ధోని రిటైర్మెంట్పై ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ధోని భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యమని, మరెవరిని ఊహించలేని పాత్ర అతనిదని.. ఇప్పుడే రిటైర్మెంట్ వద్దని వేడుకుంటున్నారు. #donotretiredhoni please sir please I'm believe in Number 7⃣ & you are truly legend and fighter #MSDlove and forever inspiring to every youth please sir do not retire 🙏 pic.twitter.com/Fl9Gc8Jqj5 — Sunil Prajapati (@Imsunil122) July 11, 2019 #donotretiredhoni Hey Msd we are watching your Batting since we were able to understand cricket,your are our super hero,last hope of Millions of your fan.dont disappointment them,Play for india until you have believe on yourself. Love you MSD.🙂#Lasthope pic.twitter.com/vUSmI3eFvY — prateek jain (@prateeks1129) July 11, 2019 -
ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్
-
ఇంగ్లండ్ ఇరవై ఏడేళ్లకు...
9969 రోజులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆఖరిసారిగా ప్రపంచ కప్ ఫైనల్ ఆడి ఇన్నిరోజులైంది! అప్పటి నుంచి ఆ దేశపు అభిమానులు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. 1992 వరల్డ్ కప్ తర్వాత ఆరు టోర్నీలలో ఒక్కసారి కూడా సెమీస్ చేరలేకపోయిన ఇంగ్లండ్ ఇప్పుడు సొంతగడ్డపై ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించింది. గతంలో మూడు ఫైనల్ పోరాటాల్లోనూ ఓడిన ఆ జట్టు నాలుగో సారి ఫైనల్లోకి అడుగుపెట్టి 44 ఏళ్ల తమ టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 2015 ప్రపంచకప్లో లీగ్ దశలోనే నిష్క్రమించి పాతాళానికి పడిపోయిన ఇంగ్లండ్ కొత్తగా ఎగసి ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియానే చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టడం మరో విశేషం. బర్మింగ్హామ్: సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఖేల్ ఖతమైంది. ఈ ప్రపంచకప్లో కొత్త చాంపియన్ ఖాయమైంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రా య్ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించాడు. మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్), రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. ఫించ్ 0... 14కే ముగ్గురు ఔట్ టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, వార్నర్తో కలిసి ఓపెనింగ్ చేసిన కెప్టెన్ ఫించ్ (0) డకౌటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ఆర్చర్ అతన్ని ఔట్ చేశాడు. మరుసటి ఓవర్లోనే వార్నర్ (9)ను పెవిలియన్ చేర్చిన వోక్స్, హ్యాండ్స్కోంబ్ (4)ను బౌల్డ్ చేశాడు. 6.1 ఓవర్లలో ఆసీస్ స్కోరు 14/3. పట్టుమని పది ఓవర్ల ‘పవర్ప్లే’ పూర్తికాకముందే టాపార్డర్ వికెట్లను కోల్పోయిన కంగారూ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి దాకా స్మిత్ ఒక్కడే... రెండో ఓవర్ రెండో బంతికే స్మిత్ ఆట మొదలైంది. అక్కడి నుంచి 47.1 ఓవర్ దాకా స్మిత్ జట్టును ఒడ్డున పడేసేందుకు చేసిన పోరాటం అద్వితీయం. హ్యాండ్స్కోంబ్ నిష్క్రమించాక వచ్చిన అలెక్స్ క్యారీ (70 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో కలిసి ముందుగా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత జాగ్రత్త పడుతూ... ఓపిగ్గా ఆడుతూ పరుగుల బాటపట్టాడు. ఇద్దరి జోడీ కుదురుకోవడంతో నెమ్మదిగానైనా జట్టు కోలుకుంది. 72 బంతుల్లో స్మిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్కు 103 పరుగులు జతయ్యాక జట్టు స్కోరు 117 పరుగుల వద్ద క్యారీని, స్టొయినిస్ (0)ను రషీదే ఔట్ చేశాడు. మళ్లీ కుదుపునకు గురైన స్మిత్ తన అసాధారణ పోరాటంతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ముందుగా మ్యాక్స్వెల్ (23 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించిన స్మిత్... టెయిలెండర్లతో కలిసి 200 పరుగుల దాకా తీసుకెళ్లాడు. కమిన్స్ (6) విఫలమైనా స్టార్క్ (36 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో జట్టు ఆ మాత్రమైనా చేయగలిగింది. రాయ్ జోరు ఇంగ్లండ్ విజయలక్ష్యం 224. ఇదేమంత స్కోరే కాదు. కానీ కివీస్ చేతిలో జోరుమీదున్న భారత్ చిత్తవడం, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వికెట్ల విలాపంతో ఇంగ్లండ్ జాగ్రత్తపడింది. రాయ్, బెయిర్ స్టో (43 బంతుల్లో 34; 5 ఫోర్లు) మొదట్లో ఆచితూచి ఆడారు. పిచ్ను ఆకళింపు చేసుకున్నాక రాయ్ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. స్టార్క్ వేసిన నాలుగో ఓవర్లో 2 బౌండరీలు కొట్టాడు. అతని మరుసటి ఓవర్లో భారీ సిక్సర్తో ఊపుతెచ్చాడు. పవర్ప్లే తర్వాత రాయ్ తన బ్యాటింగ్ పవర్ పెంచాడు. 11వ ఓవర్లో స్పిన్నర్ లయన్ను రంగంలో దించగా... రాయ్ సిక్సర్తో అతనికి స్వాగతం పలికాడు. మరో బౌండరీ కూడా కొట్టడంతో అతని ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన 15 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్ 50 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వికెట్ కోసం స్మిత్ బౌలింగ్తో ఆసీస్ ప్రయోగం చేసింది. అతను 16వ ఓవర్ వేయగా... రాయ్ ‘హ్యాట్రిక్’ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో 21 పరుగులు రాగా జట్టు స్కోరు 100 పరుగులు దాటేసింది. ఓపెనింగ్ జోడీ దుర్భేద్యంగా మారడంతో స్టార్క్ బౌలింగ్ను అదేపనిగా కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో ఆసీస్ కెప్టెన్ ఫించ్ సఫలమయ్యాడు. 18వ ఓవర్లో బెయిర్స్టోను స్టార్క్ ఔట్ చేయడంతో 124 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే కమిన్స్ బౌలింగ్లో అంపైర్ తప్పుడు నిర్ణయంతో రాయ్ ఔటయ్యాడు. అతని నిష్క్రమణతో కెప్టెన్ మోర్గాన్... రూట్కు జతయ్యాడు. జట్టు విజయానికి కేవలం 77 పరుగులే కావాలి. ఎలాంటి ఒత్తిడి లేని ఈ దశలో వీళ్లిద్దరు మరో వికెట్ పడకుండా... చక్కగా తమ పని పూర్తిచేశారు. ఇది ఔటా! అ‘ధర్మసేన’ నిర్ణయంపై జేసన్ రాయ్ భగ్గుమన్నాడు. 20వ ఓవర్ నాలుగో బంతిని కమిన్స్ లెగ్సైడ్లో వేశాడు. పుల్షాట్కు ప్రయత్నించినా... బంతి బ్యాట్కు చిక్కకుండానే కీపర్ చేతుల్లో పడింది. కానీ కంగారూ ఆటగాళ్లంతా పెద్దగా అప్పీల్ చేసేసరికి ధర్మసేన (శ్రీలంక) తీరిగ్గా ఔటిచ్చాడు. బ్యాట్కు తగలనంత దూరం వెళ్లినా... ఔటేంటని రాయ్ తీవ్రంగా వాదించాడు. పిచ్పై నుంచి కదల్లేదు. మరో అంపైర్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) సర్దిచెప్పడంతో ఆగ్రహంగా పెవిలియన్కు వెళ్లిన రాయ్ తన గ్లవ్స్ను విసిరికొట్టడం కనిపించింది. రాయ్పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు 2 డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. అయితే ఎలాంటి నిషేధానికి గురికాకపోవడం ఇంగ్లండ్కు పెద్ద ఊరట. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) బెయిర్స్టో (బి) వోక్స్ 9; ఫించ్ ఎల్బీడబ్ల్యూ (బి) ఆర్చర్ 0; స్మిత్ రనౌట్ 85; హ్యాండ్స్కోంబ్ (బి) వోక్స్ 4; క్యారీ (సి) సబ్–విన్స్ (బి) రషీద్ 46; స్టొయినిస్ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ 0; మ్యాక్స్వెల్ (సి) మోర్గాన్ (బి) ఆర్చర్ 22; కమిన్స్ (సి) రూట్ (బి) రషీద్ 6; స్టార్క్ (సి) బట్లర్ (బి) వోక్స్ 29; బెహ్రెన్డార్ఫ్ (బి) వుడ్ 1; లయన్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 16; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–4, 2–10, 3–14, 4–117, 5–118, 6–157, 7–166, 8–217, 9–217, 10–223. బౌలింగ్: వోక్స్ 8–0–20–3, ఆర్చర్ 10–0–32–2, స్టోక్స్ 4–0–22–0, వుడ్ 9–0–45–1, ప్లంకెట్ 8–0–44–0, రషీద్ 10–0–54–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) క్యారీ (బి) కమిన్స్ 85; బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 34; జో రూట్ నాటౌట్ 49; మోర్గాన్ నాటౌట్ 45; ఎక్స్ట్రాలు 13; మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–124, 2–147. బౌలింగ్: బెహ్రెన్డార్ఫ్ 8.1–2–38–0, స్టార్క్ 9–0–70–1, కమిన్స్ 7–0–34–1, లయన్ 5–0–49–0, స్మిత్ 1–0–21–0, స్టొయినిస్ 2–0–13–0. ఆర్చర్ బౌన్సర్ ధాటికి విలవిల్లాడిన క్యారీ... బ్యాండేజ్తో బ్యాటింగ్ కొనసాగించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. -
‘చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటా’
మాంచెస్టర్: రవీంద్ర జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి పదేళ్లయినా వన్డేల్లో పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగలే కపోయాడు. అప్పుడప్పుడూ మె రిసినా టెస్టు క్రికెటర్గానే పరిమితమ య్యాడు. విమర్శలెదురైన ప్రతీసారి బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. చహల్, కుల్దీప్ రాకతో వన్డేల్లో అతడి స్థానమే కష్టతరమైంది. వన్డేల్లో ఇక రాలేడనుకున్న సమయంలో ప్రపంచకప్లో చోటుదక్కింది. లీగ్ దశలో అవకాశం రాకపోయినా ఎదురు చూశాడు. శ్రీలంకతో మ్యాచ్లో అతడు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా కీలక సెమీఫైనల్స్లో విజృంభించాడు. తనను గల్లీ స్థాయి ఆటగాడంటూ మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలకు ట్వీట్తో పాటు బ్యాట్తోనూ గట్టి జవాబి చ్చాడు. తాను పార్ట్టైం క్రికెటర్ కాదనే విష యాన్ని చాటిచెప్పాడు. టాప్ఆర్డర్ కుప్ప కూలి, పిచ్ బౌలర్లకు సహకరి స్తున్న కఠిన పరిస్థితుల్లో జడేజా (77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) మైదానంలోకి అడుగుపెట్టి గొప్ప పోరాటం చేశాడు. 92/6తో ఘోర పరాభవానికి చేరువైన జట్టును 200 పరుగులు దాటించి ఆశలుపెంచాడు. ధోనీ (50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నాడనే ధీమా అతడి బ్యాటింగ్లో స్పష్టంగా కనిపించింది. కొండంత లక్ష్యాన్ని కరగదీస్తూ వెళ్లాడు. కచ్చితమైన షాట్లు ఆడుతూనే విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఎదురొడ్డి నిలబడ్డాడు. భారత్ ఓడినా తన అద్భుత ప్రదర్శనతో హీరో అయ్యాడు జడేజా. అతని పోరాటమే కాదు, మ్యాచ్ అనంతరం అతను చేసిన ట్వీట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఆ ట్వీట్ సారాంశం ఇది.. ‘‘విఫలమైన ప్రతీసారి.. నిలబడి ఎలా పోరాడాలో క్రికెట్టే నాకు నేర్పింది. నాకు స్ఫూర్తిని కలిగించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్న విషయం. మీరు నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నాకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండండి. నా చివరి శ్వాస వరకు ఉత్తమ ప్రదర్శన ఇస్తా’’ అంటూ జడేజా ట్వీట్ చేశారు. -
ఆసీస్ను చిత్తుచేసి.. ఫైనల్కు
బర్మింగ్హామ్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసి ఆతిథ్య ఇంగ్లండ్ సగర్వంగా ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో సెమీఫైనల్లో భాగంగా ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. దీంతో ఆదివారం ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ తలపడనుంది. ఇక ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఛేదనలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్(85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. రాయ్కు తోడు రూట్(40 నాటౌట్) మోర్గాన్(40 నాటౌట్), బెయిర్ స్టో(34)లు రాణించడంతో ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ను పతనాన్ని శాసించిన క్రిస్ వోక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఏమాత్రం తడబాటుకు గురికాలేదు. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టోలు చక్కటి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 124 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం బెయిర్ స్టోను స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఓ వైపు అర్ద సెంచరీ సాధించి శతకం వైపు దూసుకెళ్తున్న జేసన్ రాయ్ అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. దీంతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన రూట్, మోర్గాన్లు మరో వికెట్ పడకుండా విజయాన్ని పూర్తి చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ వోక్స్(3/20), అదిల్ రషీద్(3/54), ఆర్చర్(2/32)లు చెలరేగడంతో ఆసీస్ విలవిల్లాడింది. అయితే స్టీవ్ స్మిత్(85; 119 బంతుల్లో 6ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. స్మిత్తో పాటు అలెక్స్ కారీ(46) గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు. చివర్లో మ్యాక్స్వెల్(23), స్టార్క్(29)లు ఓ మోస్తారుగా రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ముందుంచగలిగింది. -
రెండో సెమీస్ అప్డేట్స్: ఫైనల్లో ఇంగ్లండ్
బర్మింగ్హామ్ : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ సగర్వంగా అడుగుపెట్టింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆదివారం న్యూజిలాండ్తో అమీతుమీకి సిద్దం కానుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా రూట్, మోర్గాన్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. అదేవిధంగా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరిగెత్తిస్తున్నారు. ఇంగ్లండ్ విజయానికి మరో 43 పరుగులు కావాలి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్(85) వివాదస్పదంగా ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగిన రాయ్ అసంతృప్తిగా క్రీజు వదిలి వెళ్లాడు. అయితే రిప్లేలో అది నాటౌట్గా తేలింది. దీంతో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం రూట్, మోర్గాన్లు క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బెయిర్ స్టో(34) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 124 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు జేసన్ రాయ్ అర్దసెంచరీ పూర్తి చేసి సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. ప్రస్తుతం రాయ్కు తోడుగా రూట్ క్రీజులో ఉన్నాడు. స్మిత్ బౌలింగ్ను ఉతికారేసిన రాయ్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ను ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఉతికి ఆరేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో భాగంగా 16 ఓవర్ వేసిన స్మిత్కు రాయ్ చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. 16 ఓవర్ మూడో బంతిని లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన రాయ్.. నాల్గో బంతిని సైతం సిక్స్గా మలిచాడు. ఆపై లాంగాన్ మీదుగా మరో సిక్స్ కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్లో 21 పరుగులు పిండుకున్నారు. రాయ్ హాఫ్ సెంచరీ ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టోలు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. జేసన్ రాయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. బెయిర్ స్టో 32 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ధాటిగా.. ఇంగ్లండ్కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు ఇప్పటికే 71 పరుగులు జోడించారు. జేసన్ రాయ్ ధాటిగా ఆడుతుండగా.. బెయిర్ స్టో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 11.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 40 పరుగులతో, బెయిర్ స్టో 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ 223 ఆలౌట్ ప్రపంచకప్లో భాగంగా జరుగుతున్న రెండో సెమీస్లో ఇంగ్లండ్కు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టీవ్ స్మిత్(85), అలెక్స్ క్యారీ(46)లు రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల్లాడింది. దీంతో కనీసం 200 పరుగులు దాటుతుందా అనుకున్నారు. అయితే స్మిత్, క్యారీలు ఆదుకున్నారు. చివర్లో మ్యాక్స్వెల్(26), స్టార్క్(29) రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, వోక్స్లు తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్ రెండు వికెట్లు, వుడ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. స్మిత్, స్టార్క్ వెంటవెంటనే ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లును కోల్పోయింది. తొలుత స్టీవ్ స్మిత్(85) అనవసరమైన పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్ అవుటవ్వడం ఆసీస్ ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది. అనంతరం స్టార్క్(29) కూడా వోక్స్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దీంతో 217 పరుగుల వద్దనే ఆసీస్ రెండు వికెట్లను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా మరో వికెట్ను చేజార్చుకుంది. అదిల్ రషీద్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్(6) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రసుతం ఆసీస్ 42 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రసుతం స్మిత్తో పాటు మిచెల్ స్టార్క్ క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో గ్లెన్ మ్యాక్స్వెల్(22) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో 157 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓ వైపు స్టీవ్ స్మిత్ వీరోచితంగా పోరాడుతూ ఆసీస్కు గౌరవప్రదమైన స్కోర్ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. స్మిత్కు తోడుగా కమ్మిన్స్ క్రీజులో ఉన్నాడు. ఒకే ఓవర్లో ఇద్దరూ ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో ఆసీస్ మళ్లీ కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది 28 ఓవర్ రెండో బంతికి అలెక్స్ క్యారీ(46) ఔట్ కాగా, అదే ఓవర్ చివరి బంతికి స్టోయినిస్ డకౌట్ అయ్యాడు. దాంతో ఆసీస్ 118 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడ్డ సమయంలో స్టీవ్ స్మిత్-క్యారీ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ 103 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ ఔట్ కాగా, ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన స్టోయినిస్ ఎల్బీడబ్యూగా పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను ఆదిల్ రషీద్ సాధించి ఆసీస్ను ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టాడు. కాగా, క్యారీ ఔటైన తర్వాత స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం స్మిత్ 53 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. కుదురుకున్న ఆసీస్ ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ కుదురుకుంది. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో స్టీవ్ స్మిత్-అలెక్స్ క్యారీలు మరమ్మత్తులు చేపట్టారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ ఆసీస్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళుతున్నారు. ఈ జోడీ ఆసీస్ స్కోరును వంద పరుగులు దాటించింది. స్మిత్-క్యారీలు హాఫ్ సెంచరీలుగా చేరువగా వచ్చారు. కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్ ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో భాగంగా జోఫ్రా ఆర్చర్ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతి క్యారీ హెల్మెట్ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగంలో బలంగా తాకింది. దాంతో క్యారీ విలవిల్లాడిపోయాడు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు. కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్ చేయడం అతనికి క్రీడపై ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది. హ్యాండ్స్కాండ్..ప్చ్ ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఆసీస్ మూడో వికెట్ను కోల్పోయింది. హ్యాండ్స్కాంబ్ వికెట్ను చేజార్చుకుంది. గాయం కారణంగా ఉస్మాన్ ఖవాజా జట్టుకు దూరం కావడంతో తుది జట్టులోకి వచ్చిన హ్యాండ్స్కాంబ్ నిరాశపరిచాడు. 12 బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే చేసిన హ్యాండ్స్కాంబ్ మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. దాంతో ఆసీస్ 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. అయ్యో వార్నర్.. ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్లో డేవిడ్ వార్నర్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని ఫోర్ కొట్టిన వార్నర్..నాల్గో బంతికి ఔటయ్యాడు. కొద్ది పాటి బౌన్స్ వచ్చిన బంతిని ఆడటంలో తడబడిన వార్నర్.. ఫస్ట్ స్లిప్లో ఉన్న బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఆసీస్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 11 బంతులు ఆడిన వార్నర్ 2 ఫోర్లతో 9 పరుగులు చేశాడు. ఆసీస్కు ఆదిలోనే షాక్ ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ను డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్లు ఆరంభించారు. వోక్స్ వేసిన తొలి ఓవర్లో వార్నర్ నాలుగు పరుగులు చేయగా, జోఫ్రా ఆర్చర్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి ఫించ్ పెవిలియన్ చేరాడు. ఫించ్ పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. దీనిపై ఆసీస్ రివ్యూకు వెళ్లినా ప్రతికూల ఫలితమే వచ్చింది. దాంతో ఆసీస్ రెండో ఓవర్లోనే రివ్యూకు కోల్పోవడంతో ఆ జట్టును నిరుత్సాహపరిచింది. టాస్ గెలిచిన ఆసీస్ వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఒకవైపు ఐదుసార్లు చాంపియన్. మరోవైపు సొంతగడ్డపై తొలి టైటిల్పై కన్నేసిన జట్టు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా అలవోకగా సెమీస్లో అడుగుపెడితే.. ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం చెమటోడ్చి నాకౌట్కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ప్రపంచకప్లో ఫైనల్ బెర్త్ కోసం రెండో సెమీస్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఆసీస్ పైచేయి సాధించింది. ఆసీస్ బ్యాటింగ్కు వార్నర్, కెప్టెన్ ఫించ్, స్టీవ్ స్మిత్ వెన్నుముకగా ఉన్నారు. స్టార్క్, కమిన్స్, స్టొయినిస్, బెహ్రెన్డార్ఫ్లతో ఆ టీమ్ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. మరోవైపు జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, కెప్టెన్ మోర్గాన్, బట్లర్తో ఇంగ్లండ్ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. మార్క్ ఉడ్, ఆర్చర్, క్రిస్వోక్స్, స్టోక్స్ బౌలింగ్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. తుది జట్లు ఆసీస్ అరోన్ ఫించ్(కెప్టెన్),డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, హ్యాండ్స్ స్కాంబ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, బెహ్రాన్డార్ఫ్, నాథన్ లయన్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, జానీ బెయర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
బట్లర్ బుల్లెట్ త్రో.. స్మిత్ షాక్!
బర్మింగ్హామ్ : ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్లో జోస్ బట్లర్ తన సూపర్ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్(85)ను బట్లర్ తన బుల్లెట్ త్రోతో అవుట్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కీపర్ వైపు వెళ్లడంతో నాన్స్ట్రైకింగ్లో ఉన్న స్టార్క్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆలస్యంగా స్పందించిన స్మిత్ అవతలి ఎండ్లోకి చేరోలోపే బట్లర్ బంతిని డైరెక్ట్గా వికెట్లపైకి విసిరాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా బట్లర్ సూపర్ ఫీల్డింగ్ను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక స్టార్క్ తప్పిదానికి స్మిత్ బలయ్యాడంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఇంగ్లండ్ బౌలర్లు వణుకుపుట్టించారు. అయితే స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీలు రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. -
రిషభ్.. ఆ షాట్ ఎన్నిసార్లు చూడాలి?
మాంచెస్టర్: న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో కీలక సమయంలో చెత్త షాట్ ఆడి టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ తన వికెట్ను సమర్పించుకోవడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విమర్శలు గుప్పించాడు. ఆ చెత్త షాట్ను ఎన్నిసార్లు చూడాలి అంటూ విమర్శించాడు. బంతిని సరిగా అంచనా వేయకుండానే పదే పదే ఒకే తరహా షాట్ కొట్టి ఔట్ కావడాన్ని తప్పుబట్టాడు. ‘ రిషభ్ ఈ షాట్ ఎన్నిసార్లు చూడాలి. వరల్డ్కప్లో ఆడిన ప్రతీ మ్యాచ్లో అదే షాట్ కొట్టడం.. పెవిలియన్ చేరడం పరిపాటిగా మారిపోయింది’ అని పీటర్సన్ విమర్శించాడు. కాగా, రిషభ్ పంత్ను యువరాజ్ సింగ్ వెనకేసుకొచ్చాడు. ‘రిషభ్ బాగా ఆడి ఉండకపోవచ్చు కానీ అతనికి 8 వన్డేలు ఆడిన అనుభవం ఉంది’ అని యువరాజ్ బదులిచ్చాడు. ఈ ఒక్క ఆట తీరుపై తనని విమర్శించడంలో సరికాదంటూ ట్వీట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పిటర్సన్ ట్వీట్కు స్పందిస్తూ ..పంత్ క్రికెట్ కెరీర్లో ఇంకా మొదటి దశలోనే ఉన్నాడని, తాను కూడా మొదట్లో తప్పులు చేశాను వాటిని నుంచి నేర్చుకోనే ఈ స్థాయికి వచ్చానంటూ పంత్కు మద్దతిచ్చాడు. ఏ పరిస్థితిలో తను ఆడలేక పోయాడో ఇప్పటికే తను తెలుసుకున్నాడని, ఇకపై పంత్ మెరుగైనా ప్రదర్శన కనపరస్తాడన్ననమ్మకం ఉందంటూ కోహ్లి పేర్కొన్నాడు. -
బట్లర్ బుల్లెట్ త్రో..
-
‘ధోని మాతో కలిసి ఆడతానంటే ఓకే’
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో టీమిండియా సెమీస్ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన నాకౌట్ సమరంలో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా-ఎంఎస్ ధోనిల ద్వయం హాఫ్ సెంచరీలతో ఆదుకునే యత్నం చేసినా చివరకు పరాజయం తప్పలేదు. వీరిద్దరూ పోరాట స్ఫూర్తితో భారత్ ఓ దశలో గెలుపు అంచుల వరకూ వెళ్లింది. అయితే ఈ జోడి స్కోరును పెంచే క్రమంలో ఔట్ కావడంతో భారత్ మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ వరల్డ్కప్ ఆద్యంతం ధోనిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. అతని స్లో స్టైక్రేట్తో విమర్శల పాలయ్యాడు ధోని. నిన్నటి మ్యాచ్లో ధోని విలువైన పరుగులు సాధించినా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. ‘ ధోని ఒక వరల్డ్క్లాస్ క్రికెటర్ అనడంలో సందేహం లేదు. అతనిపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలు బాధాకరం. ధోని తన పౌరసత్వాన్ని మార్చుకుంటే అతన్ని తీసుకోవాలంటూ మా సెలక్షన్ కమిటీకి సిఫారుసు చేస్తాం. ప్రస్తుతం మాతో కలిసి ధోని ఆడే అవకాశం లేదు. ధోని మాతో కలిసి ఆడాలనకుంటే పౌరసత్వాన్ని మార్చుకోవాలి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. విలియమ్సన్ చేసిన వ్యాఖ్యలు సరదాగా చేసినవే అయినప్పటికీ, ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయి. గతంలో కూడా ధోనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. ధోని వీల్చైర్లో ఉన్నా తన జట్టులో చోటు ఉంటుందని వ్యాఖ్యానించాడు. అతనొక అసాధారణ ఆటగాడని, తన ఎలెవన్ జట్టులో ధోనికి ఎప్పుడూ చోటు ఉంటుందని తెలిపాడు. -
సాధారణ లక్ష్యమే.. ఇంగ్లండ్ ఛేదించేనా?
బర్మింగ్హామ్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 224 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో ఆసీస్ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశారు. ప్రధానంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్కు చుక్కలు చూపించగా, ఆదిల్ రషీద్ తన స్పిన్ మ్యాజిక్తో ఆకట్టుకున్నాడు. వీర్దిరూ తలో మూడు వికెట్లు సాధించి ఆసీస్ పతనాన్ని శాసించారు. ఆర్చర్కు రెండు వికెట్లు లభించగా, మార్క్ వుడ్ వికెట్ తీశాడు.( ఇక్కడ చదవండి: బంతి తగిలి అలెక్స్ క్యారీ విలవిల) స్టీవ్ స్మిత్(85; 119 బంతుల్లో 6 ఫోర్లు), అలెక్స్ క్యారీ(46; 70 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్కు తోడు మిచెల్ స్టార్క్(29; 36 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్), గ్లెన్ మ్యాక్స్వెల్(22; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు అరోన్ ఫంచ్ గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరగా, డేవిడ్ వార్నర్(9) రెండో వికెట్గా ఔటయ్యాడు. అటు తర్వాత హ్యాండ్స్కాంబ్(4) తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరుణంలో స్మీవ్ స్మిత్-అలెక్స్ క్యారీల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 103 పరుగులు జోడించిన తర్వాత క్యారీ నాల్గో వికెట్గా ఔట్ కాగా, ఆపై వెంటనే స్టోయినిస్ డకౌట్గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో ఆసీస్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. కాగా, మ్యాక్స్వెల్తో కలిసి ఇన్నింగ్స్ను పునఃనిర్మించాడు స్మిత్. ఈ జోడి 39 పరుగులు జత చేసిన తర్వాత మ్యాక్సీ కూడా ఔట్ కాగా, కాసేపటికి కమిన్స్ పెవిలియన్ చేరాడు. స్మిత్-స్టార్క్ల జోడి సమయోచితంగా ఆడటంతో ఆసీస్ రెండొందల మార్కును చేరింది. అయితే బట్లర్ అద్భుతమైన రనౌట్తో స్మిత్ను ఔట్ చేయగా, వెంటనే స్టార్క్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక చివరి వికెట్గా బెహ్రాన్డార్ఫ్ ఔట్ కావడంతో ఆసీస్ 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. -
ధోని రిటైర్మెంట్పై సచిన్ కామెంట్
మాంచెస్టర్: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ అంశానికి సంబంధించి వస్తున్న వార్తలపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ విషయం తనకే వదిలేయాలని, ఇందులో ఎవరు జోక్యం చేసుకోకూడదని అన్నారు. ఇది తన పర్సనల్ విషయం. తన రిటైర్మెంట్ విషయంపై ధోనియే స్వయంగా ప్రకటించాలని, అప్పటి వరకు అందరూ వేచిచూడాల్సిందేనని సచిన్ ఇండియాటూడేకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ధోని నిర్ణయాన్ని అందరు గౌరవించాలని, సొంతంగా రిటైర్మెంట్ తీసుకునే హక్కును ధోని కలిగి ఉన్నాడని వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్న సచిన్ ... ధోని లాంటి కెరీర్ ఎవరికి ఉంటుందని ప్రశ్నించాడు. ‘అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకం, ఇచ్చే మద్దతు అతని ఆటలో కనబడుతుంది. టీమిండియా క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పటికి మిష్టర్ కూల్ క్రీజులో ఉన్నాడంటే ఆట ఇంకా పూర్తి కాలేదని, కూల్గా వెళ్లీ ఎలాగైనా జట్టును విజయం వైపు నడిపిస్తాడన్ననమ్మకం అభిమానుల్లో ఇప్పటికి ఉంది. న్యూజిలాండ్తో నిన్నజరిగిన సెమీస్లో ధోని ఔటయ్యోవరకు భారత్ ఓడిపోలేదని అందరూ అభిప్రాయపడ్డారు’ అని సచిన్ తెలిపాడు. -
కివీస్ తొండాట.. ధోని ఔట్ కాదు!
మాంచెస్టర్: ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని రనౌట్ వివాదస్పదమైంది. ఈ రనౌట్తో టీమిండియా గెలుపు సమీకరణాలే మారిపోయి ఓటమి చవిచూసింది. అయితే ధోని రనౌట్ సమయంలో ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా కివీస్ ఫీల్డింగ్ మోహరించిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మూడో పవర్ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే అప్పుడు న్యూజిలాండ్కు చెందిన ఆరుగురు ఫీల్డర్లు.. సర్కిల్ వెలుపల ఉన్నారు. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోనీ కూడా పరుగు కోసం ప్రయత్నించి ఉండేవాడు కాదన్నది అభిమానుల వాదన. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ వర్సెస్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లో షమీ బౌలింగ్లో రసెల్ క్లీన్ బౌల్డ్ అయినప్పుడు నిబంధనలకు విరుద్దంగా ఫీల్డింగ్ ఉండటంతో అంపైర్ నో బాల్ ప్రకటించాడు. కానీ నిన్నటి మ్యాచ్లో అంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించకపోవడం టీమిండియా కొంపముంచిందని.. ఒకవేళ అంపైర్లు అది నోబాల్గా ప్రకటించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ‘నిన్నటి మ్యాచ్లో అంపైర్లు నిద్రపోయారు’,‘కివీస్ తొండాట.. ధోని ఔట్ కాదు’, ‘టీమిండియా ఓడింది ధోని రనౌట్తో కాదు అంపైర్ల తప్పిదంతో’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. (చదవండి: కొంపముంచిన ధోని రనౌట్!) -
‘ధోని.. రిటైర్మెంట్ ఆలోచన మానుకొండి’
వరల్డ్కప్ సెమీస్లో టీమిండియా ఓటమితో ధోని రిటైర్మెంట్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్లోనే భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ స్పందించారు. ధోని రిటైర్మెంట్ ఆలోచనను మానుకోవాలంటూ ట్విటర్ వేదికగా కోరారు. ‘ధోని జీ. మీరు రిటైర్ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు అభిమానులు భారీ ఎత్తున మద్దతు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ట్వీట్ను 14 వేల మంది లైక్ చేయగా.. 700 మంది రీట్వీట్ చేశారు. ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తొలి సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. Namaskar M S Dhoni ji.Aaj kal main sun rahi hun ke Aap retire hona chahte hain.Kripaya aap aisa mat sochiye.Desh ko aap ke khel ki zaroorat hai aur ye meri bhi request hai ki Retirement ka vichar bhi aap mann mein mat laayiye.@msdhoni — Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019 -
బంతి తగిలి అలెక్స్ క్యారీ విలవిల
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో భాగంగా జోఫ్రా ఆర్చర్ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతి క్యారీ హెల్మెట్ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడపోయిన క్యారీ.. డ్రెస్పింగ్ రూమ్కు సైగలు చేశాడు. ఆసీస్ ఫిజియో మైదానంలోకి వచ్చేసరికి దవడ కింది భాగం నుంచి రక్తం కారుతూ ఉంది. దాంతో క్యారీ రిటైర్ట్ హర్ట్ అవుతాడని అనుకున్నరంతా. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు. రక్తం కారుతున్న చోట ప్లాస్టర్ వేసుకుని బ్యాటింగ్ను యథావిధిగా కొనసాగించాడు. ఆసీస్ 14 పరుగు వద్ద ఉండగా హ్యాండ్స్కాంబ్ మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్యారీ క్రీజ్లోకి వచ్చాడు. కాసేపటికి క్యారీ ఇలా గాయపడటం ఆసీస్ శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఆసీస్ స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు చేజార్చుకుంది. ఫించ్ గోల్డెన్ డక్గా ఔట్ కాగా, వార్నర్(9) సైతం నిరాశపరిచాడు. హ్యాండ్స్కాంబ్ నాలుగు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో ఆసీస్ కష్టాల్లో పడింది. -
జడేజా బ్యాటింగ్పై మంజ్రేకర్ స్పందన
మాంచెస్టర్: గత కొన్నిరోజులుగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్కు మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘జడేజా ఒక స్మార్ట్ గల్లీ క్రికెటర్ అని, అడపా దడపా ఆడే జడేజా లాంటి క్రికెటర్లకు నేను అభిమానిని కాదు’ అని మంజ్రేకర్ పేర్కొనగా దానికి జడేజా ఘాటుగానే బదులిచ్చాడు. ‘ నీ కంటే రెండింతలు ఎక్కువ క్రికెట్ ఆడాను. ఇంకా ఆడుతున్నా. ఇతరులను గౌరవంచడం నేర్చుకో’ అంటూ చురకలంటించాడు. అయితే న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో జడేజా అద్భుత బ్యాటింగ్తో కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి బ్యాటింగ్లో సత్తాచాటాడు. టీమిండియాకు ఘోర ఓటమి తప్పదనుకున్న తరుణంలో జడేజా బ్యాట్ ఝుళిపించాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవకపోయినా పోరాట స్ఫూర్తి ఆకట్టుకుంది. అది కూడా జడేజా-ధోనిల 116 పరుగుల భాగస్వామ్యం కారణంగా భారత్ గెలుపు అంచుల వరకూ వచ్చింది. దీనిపై తాజాగా మంజ్రేకర్ స్పందిస్తూ.. అద్భుతమైన బ్యాటింగ్తో తన వ్యాఖ్యలు తప్పని జడేజా నిరూపించడన్నాడు. కివీస్తో జరిగిన కీలక పోరులో బాగా ఆడాడని మ్యాచ్ అనంతరం మెచ్చుకున్నాడు. గత 40 ఇన్నింగ్స్లలో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమేనని, ఇదివరకెన్నడూ ఇలాంటి జడేజాని చూడలేదని మంజ్రేకర్ పేర్కొన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ రాణించి అందరి చేతా జడ్డు ప్రశంసలు అందుకున్నాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
సెమీ ఫైనల్ : టీమిండియాపై రూ. 4.35, కివీస్పై రూ. 49!
పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న టీమిండియా సెమీస్లో న్యూజిలాండ్ను ఓడించడం చిటికెలో పని.. ప్రస్తుత ప్రపంచకప్లో ఎనిమిది మ్యాచ్లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్ చేరిన కోహ్లి సేన అండర్డాగ్స్ని మట్టికరిపించి తీరుతుంది... పాక్తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్లలో ఓడిన తర్వాత కూడా రన్రేట్ రూపంలో అదృష్టం కలిసొచ్చి కివీస్ సెమీస్ చేరిందన్న మాటేగానీ బ్లాక్ క్యాప్స్ గెలిచే ముచ్చటే లేదు.... బలబలాల పరంగా చూసినా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేననే తప్పక విజయం వరిస్తుంది. ఇవీ సెమీ ఫైనల్కు ముందు టీమిండియాపై ఉన్న అంచనాలు. సగటు అభిమానితో సహా మాజీ క్రికెట్ దిగ్గజాలు కూడా భారత జట్టు ఫైనల్కు చేరుతుందని ఫిక్సయిపోయారు. మెగా టోర్నీలో ఆది నుంచి అద్భుత విజయాలు సాధించిన కోహ్లి సేన తదుపరి మ్యాచ్లో ఆసీస్ను ఢీకొంటుందా.. లేదా ఇంగ్లండ్తో తలపడుతుందా అంటూ ఎవరికి తోచిన విధంగా ప్రస్తుత సమీకరణల ఆధారంగా విశ్లేషణ చేశారు. తొలి సెమీస్లో భారత ప్రత్యర్థి కివీస్ అని తేలిన తర్వాత.. కోహ్లి సేన ఫైనల్ చేరినట్టేనని, ఇక కష్టపడాల్సింది తమ ఆటగాళ్లేనని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ పేర్కొనడం... భారత్-ఇంగ్లండ్ జట్లు వరల్డ్కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయని ఇప్పటికే దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ జోస్యం చెప్పడం, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం.. వీరే కాకుండా మరెంతో మంది క్రికెట్ దిగ్గజాల విశ్లేషణల నేపథ్యంలో బుధవారం నాటి మ్యాచ్పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులు, అభిమానుల ఆశల్ని సొమ్ము చేసుకునేందుకు బుకీలు రంగంలోకి దిగారు. అండర్ వరల్డ్ డాన్లతో కలిసి భారీ స్థాయిలో బెట్టింగ్లకు పాల్పడి జేబులు నింపుకున్నారు. ఒక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే బెట్టింగ్ ద్వారా రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరిగిందంటే దేశ, విదేశాల్లో ఏ మేరకు డబ్బు చేతులు మారిందో అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని ప్రాంతంలోని ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్లలో పెద్ద ఎత్తున బెట్టింగ్ దందా జరిగినట్లు సమాచారం. బడా బడా వ్యాపారవేత్తలు మొదలు చదువుకునే పిల్లల దాకా బెట్టింగ్కు పాల్పడి జేబులు గుళ్ల చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మహా నగరంలోని హోటళ్లు, మాల్స్ ఇందుకు వేదికగా మారినట్లు తమకు సమాచారం అందిందని.. ఈ మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఇక ఐపీఎల్ తరహాలోనే ఈసారి కూడా బెట్టింగ్ రాయుళ్ల అంచనాలు తారుమారు కావడంతో భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్కు వరణుడు అడ్డుపడటంతో రెండు రోజుల పాటు మ్యాచ్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన రిజర్వ్ డే మ్యాచ్లో మొదట టాస్పై.. అటు తర్వాత కెప్టెన్ నిర్ణయంపై... ఆనక ఇరు జట్ల బలాబలాల ఆధారంగా బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. కోహ్లి సేన విజయంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో టీమిండియా గెలుపుపై కేవలం రూ. 4.35 బెట్ నిర్వహించిన బుకీలు న్యూజిలాండ్పై ఏకంగా రూ. 49 పందెం కాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా టీమిండియా ఆటగాళ్లపై తక్కువ మొత్తం(రూ. పది లోపే)లో రేటు కట్టిన బుకీలు.. కివీస్ ఆటగాళ్ల ప్రదర్శనపై అధిక ధరలు నిర్ణయించడంతో బెట్టింగ్ రాయుళ్లు భారీ మొత్తంలో సొమ్ము ఖర్చు పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా సెమీ ఫైనల్ ఓటమితో కోట్లాది మంది అభిమానుల గుండె బద్దలు చేసిన టీమిండియా ఓటమి... బెట్టింగ్ రాయుళ్ల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 18 పరుగుల తేడాతో పరాజయం పాలై ఇంటి బాట పట్టింది. -
‘బీ స్ట్రాంగ్ జడ్డూ.. నువ్వు చేయగలవు’
-
‘బీ స్ట్రాంగ్ జడ్డూ.. నువ్వు చేయగలవు’
ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో అండర్డాగ్స్గా బరిలో దిగిన న్యూజిలాండ్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్ టపాటపా కూలిన వేళ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడాడు. ధోనితో కలిసి అద్భుత ప్రదర్శనతో కోహ్లి సేనను దారుణ ఓటమి నుంచి తప్పించి గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు బాటలు పరిచాడు. బుధవారం నాటి మ్యాచ్లో ఓటమిలోనూ జడేజా త్రీడీ ఆట (77 పరుగులు, ఒక వికెట్, ఒక రనౌట్, రెండు క్యాచ్లు) కాస్త ఓదార్పునిచ్చే అంశం. కాగా కివీస్ బౌలర్లను ఎదుర్కొంటూ దూకుడు ప్రదర్శిస్తున్న క్రమంలో అభిమానులతో పాటు హిట్మ్యాన్ రోహిత్ శర్మ కూడా జడేజా ఉత్సాహపరిచాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు డ్రెస్సింగ్ రూం నుంచే సలహాలు, సూచనలు చేశాడు. ఈ క్రమంలో బీ స్ట్రాంగ్ జడ్డూ. నువ్వు చేయగలవు అన్నట్లుగా సైగలు చేస్తున్న రోహిత్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ట్యాగ్చేస్తూ... ‘ అందుకే రోహిత్ అంటే మాకు ఇష్టం. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబరిచిన హిట్మ్యాన్ సెమీస్లో వైఫల్యం చెందడం బాధించే అంశమే. కానీ ఇక్కడి దాకా చేరడంలో తన పాత్ర అమోఘం. ఇక జడేజా కూడా సరైన సమయంలో చెలరేగి ఆడాడు. కానీ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఏదేమైనా నిరాశే మిగిలింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మెగాటోర్నీలో కళ్లు చెదిరే ఆటతో ఐదు సెంచరీలు చేసిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ సెమీస్లో కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 30.3 ఓవర్లకు టీమిండియా స్కోరు 92/6 ఉన్న సమయంలో సాధించాల్సిన రన్రేట్ 8కి దగ్గరగా ఉంది. ఇలా చాలా ముందే ఓటమి ఖరారైన టీమిండియా చివరకు లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే అది జడేజా, ధోని ఘనతే. పాండ్యా ఔటయ్యేసరికి మన జట్టు గెలిచే అవకాశాలు 10 శాతమే. ఇలాంటి దశలో పొరపాటునైనా వికెట్ ఇవ్వకూడదన్నట్లు ధోని జాగ్రత్త పడ్డాడు. జడేజా మాత్రం వస్తూనే ధైర్యం చేసి నీషమ్ బౌలింగ్లో లాంగాన్లో సిక్స్ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు కనిపించాడు. ఇద్దరూ తమదైన సమన్వయంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చారు. జట్టు స్కోరును 200 సైతం దాటించారు. అయితే గెలుపునకు 14 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్ వేగం తగ్గించి వేసిన బంతికి జడేజా బోల్తా పడ్డాడు. అతడు కొట్టిన బంతి గాల్లో చాలా ఎత్తులో లేవగా లాంగాఫ్లో పొంచి ఉన్న విలియమ్సన్ ఒడిసి పట్టాడు. ఆ వెనువెంటనే ధోని, భువీ ఔటవడంతో కోహ్లి సేన కథ ముగిసింది. -
చేయగలిగింది అంతా చేశాం: కోహ్లి భావోద్వేగం
‘టీమిండియాకు మద్దతుగా నిలిచిన ప్రతీ అభిమానికి మొదటగా ధన్యవాదాలు. ఈ టోర్నీ ఆసాంతం మాకు అండగా ఉండి మాకు గుర్తుండిపోయేలా చేశారు. అదే విధంగా జట్టుపై ఎంతో ప్రేమ కురిపించారు. కానీ మనమంతా నిరాశ చెందాల్సి వచ్చింది. ఈ సమయంలో మీ భావోద్వేగాలు పంచుకోండి. విజయం కోసం మేము ఏమేమి చేయగలమో అవన్నీ చేశాం. జై హింద్’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ఓటమిలోనూ తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతఙ్ఞతలు తెలిపాడు. ప్రపంచకప్లో భాగంగా టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలతో ఆకట్టుకున్న కోహ్లి సేన కథ సెమీఫైనల్తోనే ముగిసిన సంగతి తెలిసిందే. బుధవారం మాంచెస్టర్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 18 పరుగులతో పరాజయం పాలైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కివీస్ వరుసగా రెండోసారి ఫైనల్కు చేరి భారత అభిమానులకు షాక్ ఇచ్చింది. Firstly I want to thank all our fans who came in huge numbers to support the team. You made it a memorable tournament for all of us & we definitely felt the love showered upon the team. We are all disappointed & share the same emotions as you. We gave everything we had.Jai hind🇮🇳 pic.twitter.com/rFwxiUdqK5 — Virat Kohli (@imVkohli) July 10, 2019 ఈ క్రమంలో ఓటమిపై స్పందించిన కోహ్లి మాట్లాడుతూ.. ‘ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి ఒక్క 45 నిమిషాల చెత్త ఆటతో జట్టు బోల్తా పడటం చాలా నిరాశ పరిచింది. టోర్నీలో జోరుమీదున్న మేం ఇలాంటి అనూహ్య ఫలితంతో నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడేజా అసాధారణ ఆటతీరు కనబరిచాడు. తన క్రికెట్ నైపుణ్యాన్ని చాటాడు. ధోనితో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోని ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకే నింపాదిగా ఆడాడు. మరోవైపు జడేజా యథేచ్చగా ఆడేందుకు స్ట్రయికింగ్తో సాయపడ్డాడు. ఒకవేళ ఆఖర్లో ధోని రనౌట్ కాకపోతే ఫలితం మరోలా ఉండేది. అయితే అతను తన రిటైర్మెంట్పై మాకేమీ చెప్పలేదు అని పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఓటమిపై కోట్లాది మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ భావాలను పంచుకుంటున్నారు. -
ఇండియా ఓడింది... అభిమాని గుండె ఆగింది
పూసపాటిరేగ (నెల్లిమర్ల): వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో బుధవారం ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా ఓడిపోవడం చూస్తూ తట్టుకోలేని ఓ అభిమాని గుండెపోటుతో టీవీ ముందే కుప్పకూలాడు. ఈ విషాదం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన మీసాల రాము(35) ఎంవీజీఆర్ కళాశాలలో టెక్నీషియన్. బుధవారం సాయంత్రం వరకు తోటి ఉద్యోగులందరితోను సరదాగా గడిపిన అతను అనంతరం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉత్కంఠకు లోనయ్యాడు. భారత్ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య ప్రమీల, రెండేళ్ల కుమారుడు వున్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రెల్లివలసకు రాత్రి 10 గంటల సమయంలో తీసుకువచ్చారు. -
ఆశలు సమాధి చేస్తూ...
కలలు కల్లలవడం అంటే ఇదేనేమో! ఆశలు అడియాసలు కావడమంటే ఇలాగేనేమో! దూసుకుపోతున్న రేసు గుర్రాన్ని దురదృష్టం వెంటాడితే ఈ తీరునే ఉంటుందేమో! అంచనాలను చేరుతున్నా... శిఖరం అంచుల్లోంచి జారిపడిపోయిన దృష్టాంతాలకు ఇదే నిదర్శనమేమో! తేలికైన ప్రత్యర్థిగా భావిస్తే అసలుకే మోసం తెచ్చింది. మనకు తిరుగులేదనుకుంటే తలొంచాల్సి వచ్చింది. స్వింగుతో కంగుతినిపించి స్పిన్తో చుక్కలు చూపింది. వెరసి... ప్రపంచ కప్ ఊహలను చెల్లాచెదురుచేస్తూ టీమిండియాకు న్యూజిలాండ్ అతిపెద్ద ఝలక్ ఇచ్చింది. ఇంతటి బాధాకర ఓటమిలోనూ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా త్రీడీ ఆట (77 పరుగులు, ఒక వికెట్, ఒక రనౌట్, రెండు క్యాచ్లు) ఓదార్పునిచ్చింది. వెటరన్ ధోని పోరాటంతో పరువు దక్కింది. మనకు మిగిలిందిక... ప్రపంచ కప్ను పెద్దగా ఆసక్తి లేని సాధారణ ప్రేక్షకుడిగా వీక్షించడమే! మాంచెస్టర్: కోట్లాది అభిమానులను హతాశులను చేస్తూ... టీమిండియా ప్రపంచ కప్ పోరాటం సెమీఫైనల్తోనే ముగిసింది. లీగ్ దశ నుంచి అద్భుతంగా సాగుతున్న కోహ్లి సేన ప్రస్థానానికి నాకౌట్లో న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ కొనసాగిన తొలి సెమీస్లో కివీస్ 18 పరుగుల తేడాతో భారత్ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. అంతకుముందు ప్రత్యర్థి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్ (3/43)కు మూడు వికెట్లు దక్కాయి. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి బృందం 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. అద్భుత పోరాటం సాగించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్. అతడికి అండగా నిలిచిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (72 బంతుల్లో 50; ఫోర్, సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కుర్రాళ్లు రిషభ్ పంత్ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఫామ్లో ఉన్న భారత ఓపెనర్లను త్వరగా పెవిలియన్ చేర్చి ఆదిలోనే కివీస్కు పట్టు చిక్కేలా చూసిన పేసర్ మ్యాట్ హెన్రీ (3/37)ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. బౌల్ట్ (2/42), సాన్ట్నర్ (2/34)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆతిథ్య ఇంగ్లండ్–ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం విఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తలపడుతుంది. రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హార్దిక్ అప్పుడే ఆశలు ఆవిరి... టోర్నీలో కళ్లు చెదిరే ఆటతో ఐదు సెంచరీలు చేసిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ (1), గత మ్యాచ్లో శతకం బాదిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (1)తో పాటు మంచి ఫామ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి (1)లను... ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో అలా ఔట్ చేసి భారత్ను తేరుకోలేనంత దెబ్బకొట్టింది కివీస్. దీంతో ఇటీవల ఎన్నడూ లేనివిధంగా భారత్ 5/3 గణాంకాలతో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి పేసర్లను పంత్, దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 6) కాసేపు కాచుకున్నారు. దూకుడైన పంత్ వికెట్ పారేసుకునే ప్రమాదం ఉండటంతో కార్తీక్ ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్నాడు. కానీ, హెన్రీ బౌలింగ్లో బంతిని కొంత ఆలస్యంగా ఆడిన కార్తీక్... నీషమ్ అందుకున్న మెరుపు క్యాచ్కు వెనుదిరిగాడు. ధోని, జడేజా సరిగ్గా పవర్ ప్లే చివరి బంతికి కార్తీక్ పెవిలియన్ చేరగా స్కోరు 24/4. ఈ కప్లో అతి తక్కువ పవర్ ప్లే స్కోరు ఇదే కావడం గమనార్హం. హిట్టింగ్కు మారు పేరైన పంత్, పాండ్యా సహనం చూపుతూ ఐదో వికెట్కు 77 బంతుల్లో 47 పరుగులు జోడించి కాస్త ఒడ్డున పడేశారు. విజృంభించి బౌండరీలు కొట్టని స్థితిలో వీలు చూసుకుని సింగిల్స్ తీశారు. అయితే, స్పిన్నర్ సాన్ట్నర్పై భారీ షాట్లతో ప్రతాపం చూపబోయి ఇద్దరూ ఔటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా సమయోచితంగా ఆడుతూ ముందుకు నడిపించారు. కానీ, 11 బంతుల వ్యవధిలో వీరిద్దరితో పాటు భువనేశ్వర్ (0), చహల్ (5)లను పెవిలియన్ చేర్చిన కివీస్ మ్యాచ్ను వశం చేసుకుంది. టాపార్డర్ 1..1..1.. బ్యాటింగ్లో టాపార్డర్ భారత్కు పెట్టని బలం. దీనికితగ్గట్లే టోర్నీలో రోహిత్ (648), రాహుల్ (361), కోహ్లి (443) పరుగులు చేశారు. కానీ, సెమీస్లో ఈ ముగ్గురూ కలిపి చేసింది మూడే పరుగులు. వారు సింగిల్ డిజిట్కే వెనుదిరగడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ పరుగులే కీలకంగా మారి! మంగళవారం నాటి స్కోరు 46.1 ఓవర్లలో 211/5 నుంచి బుధవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మిగతా 23 బంతుల్లో 28 పరుగులు జోడించి 239/8 వద్ద ఇన్నింగ్స్ ముగించింది. క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ రాస్ టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, సిక్స్)ను బుమ్రా వేసిన 48వ ఓవర్ చివరి బంతికి చురుకైన త్రో ద్వారా రనౌట్ చేసిన జడేజా; ఆ వెంటనే భువనేశ్వర్ బౌలింగ్లో టామ్ లాథమ్ (10)ను చక్కటి క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి హెన్రీ (1) సైతం వెనుదిరిగాడు. బౌల్ట్ (3), సాన్ట్నర్ (9) చివరి ఓవర్ ఎదుర్కొని ఏడు పరుగులు జత చేశారు. ఈ మొత్తం 28 పరుగుల్లో కొన్నింటిని నిరోధించగలిగినా... మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో? స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్ (సి) రవీంద్ర జడేజా (బి) చహల్ 67; రాస్ టేలర్ (రనౌట్) 74; నీషమ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 12; గ్రాండ్హోమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 16; లాథమ్ (సి) రవీంద్ర జడేజా (బి) భువనేశ్వర్ 10; సాన్ట్నర్ (నాటౌట్) 9; హెన్రీ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 1; బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 18; మొత్తం (50ఓవర్లలో 8 వికెట్లకు) 239. వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200, 6–225, 7–225, 8–232. బౌలింగ్: భువనేశ్వర్ 10–1–43–3; బుమ్రా 10–1–39–1; హార్దిక్ పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్ 10–0–63–1. భారత్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1; రోహిత్ శర్మ (సి) లాథమ్ (బి) హెన్రీ 1; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 1; రిషభ్ పంత్ (సి) గ్రాండ్హోమ్ (బి) సాన్ట్నర్ 32; దినేశ్ కార్తీక్ (సి) నీషమ్ (బి) హెన్రీ 6; హార్దిక్ పాండ్యా (సి) విలియమ్సన్ (బి) సాన్ట్నర్ 32; ధోని (రనౌట్) 50; రవీంద్ర జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77; భువనేశ్వర్ (బి) ఫెర్గూసన్ 0; చహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 221 వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–24, 5–71, 6–92, 7–208, 8–216, 9–217, 10–221. బౌలింగ్: బౌల్ట్ 10–2–42–2, హెన్రీ 10–1–37–3, ఫెర్గూసన్ 10–0–43–1, గ్రాండ్హోమ్ 2–0– 13–0, నీషమ్ 7.3–0–49–1, సాన్ట్నర్ 10–2–34–2. సాహో జడేజా... భళా ధోని 30.3 ఓవర్లకు స్కోరు 92/6. సాధించాల్సిన రన్రేట్ 8కి దగ్గరగా ఉంది. ఇలా చాలా ముందే ఓటమి ఖరారైన టీమిండియా చివరకు లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే అది జడేజా, ధోని ఘనతే. పాండ్యా ఔటయ్యేసరికి మన జట్టు గెలిచే అవకాశాలు 10 శాతమే. ఇలాంటి దశలో పొరపాటునైనా వికెట్ ఇవ్వకూడదన్నట్లు ధోని జాగ్రత్త పడ్డాడు. జడేజా మాత్రం వస్తూనే ధైర్యం చేసి నీషమ్ బౌలింగ్లో లాంగాన్లో సిక్స్ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు కనిపించాడు. ఇద్దరూ తమదైన సమన్వయంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చారు. టర్నింగ్ పాయింట్ : ధోని రనౌట్ హెన్రీ, ఫెర్గూసన్ ఓవర్లలో ఫోర్లు కొట్టిన జడ్డూ... సాన్ట్నర్ స్పిన్ వలయాన్ని ఛేదిస్తూ లాంగాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్స్లతో ప్రతాపం చూపాడు. 39 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అప్పటికి ధోని ఇంకా 28 పరుగుల వద్దే ఉండటం గమనార్హం. బౌలర్ ఎవరైనా లెక్క చేయనంతటి జోష్లో అతడు ఫెర్గూసన్ ఓవర్లో సిక్స్, బౌల్ట్ బౌలింగ్లో ఫోర్ దంచాడు. జడేజా–ధోని 97 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఇందులో జడేజావే 69 పరుగులు ఉండటం విశేషం. ఇదే క్రమంలో జట్టు స్కోరును 200 సైతం దాటించారు. గెలుపునకు 14 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్ వేగం తగ్గించి వేసిన బంతికి జడేజా బోల్తా పడ్డాడు. అతడు కొట్టిన బంతి గాల్లో చాలా ఎత్తులో లేవగా లాంగాఫ్లో పొంచి ఉన్న విలియమ్సన్ ఒడిసి పట్టాడు. కొంత క్లిష్టమే అయినా అవకాశాలు ఉన్న ఈ పరిస్థితిలో ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతినే బ్యాక్వర్డ్ పాయింట్లోకి సిక్స్కు పంపి ధోని ఆశలు రేపాడు. మరుసటి బంతికి పరుగులు తీయని మహి... మూడో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో స్క్వేర్ లెగ్ నుంచి గప్టిల్ విసిరిన డైరెక్ట్ రాకెట్ త్రోకు రనౌటయ్యాడు. ఈ ఓవర్ చివరి బంతికి భువీ బౌల్డ్ అవడంతో ఏ మూలనో ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. వరుణుడా...? దెబ్బకొట్టావ్! ‘న్యూజిలాండ్తో కలిసి వరుణుడు సెమీఫైనల్లో టీమిండియాను ఓడించాడు’... ఫలితాన్ని విశ్లేషిస్తే ఇది సరైనదేమోననే అనిపిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా మంగళవారం మ్యాచ్ పూర్తిగా సాగి ఉంటే కివీస్ విధించే 230 లేదా 240 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించేలా కనిపించిన భారత్కు... వాన కారణంగా వాయిదా పడటం ప్రతికూలమైంది. బుధవారం చల్లటి వాతావరణంలో ప్రత్యర్థి పేసర్లు చెలరేగిపోయారు. బౌల్ట్ వంటి ఎడమ చేతివాటం పేసర్కు బంతి స్వింగ్ అయ్యే వీలుచిక్కడం; హెన్రీ కచ్చితమైన డెలివరీలకు రోహిత్, రాహుల్ తడబడటం దెబ్బకొట్టింది. ఈ జట్టు చేతిలో ఓడటమేంటబ్బా? కివీస్పై కచ్చితంగా గెలుస్తామనే అంచనాల మధ్య భారత్ ఓటమి అభిమానులను తీవ్రంగా బాధించేదే. కప్లో రెండు జట్లు భిన్న నేపథ్యాల నుంచి సెమీస్ చేరడమే దీనికి కారణం. ఇంగ్లండ్పై ఓటమి తప్ప అప్రతిహత విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు సిద్ధమవగా; న్యూజిలాండ్ లీగ్ చివర్లో తేలిపోయింది. అంతా కోహ్లి సేనకు ఇంగ్లండ్ ఎదురవుతుందని అనుకుంటే కివీస్ అనూహ్యంగా తారసపడి అంతే ఆశ్చర్యకరమైన షాకిచ్చింది. విలియమ్సన్, టేలర్ తప్ప ఎవరూ ఫామ్లో లేని ఆ జట్టుపై ‘ఎలాగైనా మనమే గెలుస్తాం’ అని ఊహల్లో ఉన్న భారత వీరాభిమానులను ఈ పరాజయం కొన్ని రోజులు వెంటాడటం ఖాయం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెన్రీ (3/37) కూర్పు ఒప్పు... తప్పు మంగళవారం సెమీస్కు మైదానంలో దిగిన భారత తుది జట్టులో పేసర్ షమీ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. టోర్నీలో నాలుగు మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసిన అతడిని శ్రీలంకతో మ్యాచ్కు పక్కన పెట్టడమే అనూహ్యం. న్యూజిలాండ్తో మ్యాచ్లోనూ ఆడించకపోవడం ఏం వ్యూహమో అర్థం కాలేదు. అటువైపు కివీస్ స్పిన్నర్ సాన్ట్నర్నే నమ్ముకుని, ముగ్గురు ఫ్రంట్లైన్ పేసర్లను తీసుకుంది. భారత్ మాత్రం కుల్దీప్ బదులు చహల్ను తుది పదకొండులో చేర్చింది. అతడు విఫలమవ్వగా సహచర స్పిన్నర్ జడేజా చకచకా బంతులేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తుంటే చహల్ పరుగులిస్తూ పోయాడు. పాత కాలపు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్ల ఆలోచనకు భారత్ స్వస్తి పలికి మూడో పేసర్గా షమీని ఆడిస్తే కివీస్కు పుంజుకొనే అవకాశమే రాకపోయేది. కివీస్ అప్పుడు... ఇప్పుడు... వరుణుడి చలవతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది న్యూజిలాండ్. సహ ఆతిథ్యమిచ్చిన 2015 కప్లోనూ ఆ జట్టు వర్షం ప్రభావిత మ్యాచ్ ద్వారానే తుది సమరానికి అర్హత పొందింది. నాడు మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా డివిలియర్స్ (45 బంతుల్లో 65 నాటౌట్) భీకర హిట్టింగ్తో 43 ఓవర్లలో 281/5తో భారీ స్కోరు దిశగా వెళ్తుండగా వర్షం అడ్డుకుంది. తర్వాత లక్ష్యాన్ని 43 ఓవర్లలో 299 పరుగులుగా నిర్దేశించారు. గ్రాంట్ ఇలియట్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో మరో బంతి మాత్రమే ఉండగా కివీస్ లక్ష్యాన్ని చేరుకుంది. రిటైర్మెంట్పై ధోని నాకేమీ చెప్పలేదు టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి ఒక్క 45 నిమిషాల చెత్త ఆటతో జట్టు బోల్తా పడటం చాలా నిరాశ పరిచింది. టోర్నీలో జోరుమీదున్న మేం ఇలాంటి అనూహ్య ఫలితంతో నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడేజా అసాధారణ ఆటతీరు కనబరిచాడు. తన క్రికెట్ నైపుణ్యాన్ని చాటాడు. ధోనితో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోని ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకే నింపాదిగా ఆడాడు. మరోవైపు జడేజా యథేచ్చగా ఆడేందుకు స్ట్రయికింగ్తో సాయపడ్డాడు. ఒకవేళ ఆఖర్లో ధోని రనౌట్ కాకపోతే ఫలితం మరోలా ఉండేది. అయితే అతను తన రిటైర్మెంట్పై మాకేమీ చెప్పలేదు. – భారత కెప్టెన్ కోహ్లి నేడు రెండో సెమీఫైనల్ ఇంగ్లండ్ X ఆస్ట్రేలియా వేదిక : బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ –1లో ప్రత్యక్షప్రసారం -
‘టీమిండియా చేసిన పొరపాటు అదే’
మాంచెస్టర్ : ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లోనే ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అయితే భారీ ఓటమి నుంచి తప్పించిన రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనిలపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ధోని క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ టీమిండియా కంట్రోల్లోనే ఉంది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ జడేజాతో హిట్టింగ్ చేపించాడు. జడేజా కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్గా ఇది నిలిచిపోతుంది. వీర్దిదరూ ఏడో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి బాటలు వేశారు. కానీ చివర్లో తడబాటుకు గురవడంతో ఓటమి పాలైంది. అయితే ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బదులు ధోని బ్యాటింగ్కు రావాల్సింది. ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ విషయంలో మేనేజ్మెంట్ పొరపాటు చేసిందని బావిస్తున్నా’అంటూ సచిన్ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ పోరులో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. టీమిండియా ఓటమిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆటగాళ్ల వైఫల్యంపై మండిపడుతున్నారు. ఇక ఆదివారం కివీస్ రెండో సెమీఫైనల్ విజేతతో ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: లక్షలాది గుండెలు పగిలాయి మంజ్రేకర్ ఇప్పుడేమంటావ్? కొంపముంచిన ధోని రనౌట్! -
18 పరుగుల తేడాతో భారత్ ఓటమి
-
మంజ్రేకర్ ఇప్పుడేమంటావ్?
హైదరాబాద్ : ప్రపంచకప్ సెమీస్లోనే టీమిండియా ఇంటిబాట పట్టడంపై యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నిరాశకు గురిచేసింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఒకానొక దశలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడుతుందని అందరూ భావించారు. అయితే రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనిల సూపర్ షోతో భారీ ఓటమి నుంచి కోహ్లి సేన తప్పించుకుంది. ముఖ్యంగా రవీంద్ర జడేజా చూపించిన తెగువ అందరినీ ఆకట్టుకుంది. ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను విజయపుటంచుల వరకు తీసుకెళ్లాడు. చివర్లో వికెట్లు చేజార్చుకోవడంతో కోహ్లిసేన ఓటమి చవిచూసింది. అయితే భారత్ ఓటమి చవిచూసినా జడేజా తన ఆటతో అందరి హృదయాలను గెలుచుకున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జడేజాను తిడుతూ వచ్చిన మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా సెమీస్లో జడేజా చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. దీంతో మంజ్రేకర్పై జడేజా అభిమానులు, నెటిజన్లు వ్యంగ్యాస్త్రాల సంధిస్తున్నారు. ‘గల్లీ క్రికెటర్ అన్నావు కదా ఇప్పుడేమంటావ్’, ‘ 1983 ప్రపంచకప్ సెమీస్లో కపిల్దేవ్ ఆటను జడేజా గుర్తుచేశాడు’, ‘ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదని ఈ మ్యాచ్తో మంజ్రేకర్కు అర్దమైందనుకుంటా’, ‘నీ అసాధారణ పోరాటంతో టీమిండియా భారీ ఓటమి నుంచి తప్పించి పరువు కాపాడావు’, ‘నిజమైన త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటే జడేజానే’ అంటూ నెటిజన్లు జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (చదవండి: వాగుడు ఆపమన్నా.. మంజ్రేకర్ వింటేగా!) చదవండి: ఇక నీ చెత్త వాగుడు ఆపు: జడేజా లక్షలాది గుండెలు పగిలాయి Well played Jadeja! 😉 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) 10 July 2019 -
45 నిమిషాల ఆటే నిష్క్రమణకు కారణం: కోహ్లి
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో తమ పోరాటం సెమీస్లోనే ముగియడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకోవడం ఓటమిపై ప్రభావం చూపిందని వ్యాఖ్యానించాడు. ఛేదించే లక్ష్యమే అయినప్పటికీ విఫలం కావడం నిరాశపరిచిందన్నాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. ఓవరాల్గా చూస్తే తొలి అర్థ భాగం తమవైపే ఉందని, కాకపోతే సెకాండాఫ్లో కివీస్ బౌలర్లు రైట్ లెంగ్త్ బౌలింగ్తో ఆకట్టుకోవడంతో తాము ఆదిలోనే ప్రధాన వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డామన్నాడు.(ఇక్కడ చదవండి: టీమిండియా కథ ముగిసె..) ‘నిన్నంతా మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. ఈ రోజు కూడా న్యూజిలాండ్ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశాం. ఓవరాల్గా చూస్తే కివీస్ నిర్దేశించింది పెద్ద లక్ష్యం కాదు. కానీ చేజేతులా మ్యాచ్ను కోల్పోయాం. సెమీస్లోనే వైదొలగడం నిరాశను మిగిల్చింది. ఈ వరల్డ్కప్లో మా ప్రదర్శన బాగానే ఉంది. నాకౌట్ సమరంలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాం. న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ మాపై మొదట్నుంచీ ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యింది.ఈ మ్యాచ్లో విజయం క్రెడిట్ అంతా కివీ బౌలర్లదే. మేము టోర్నీ అంతా ఆకట్టుకున్నా కేవలం 45 నిమిషాల పాటు చెత్తగా ఆడటం వల్లే నిష్ర్కమించాం. వరల్డ్కప్లో మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్య్’ అన్ని అన్నాడు. ఇక జడేజా సూపర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘ ఈ రోజు జడేజా ఆడిన తీరు అసాధారణం. ఒత్తిడిలో ఒక మంచి క్రికెట్ ఆడాడు. అతనొక నాణ్యమైన క్రికెటర్ అనడానికి ఈ ఇన్నింగ్స్ ఒక ఉదాహరణ. ఇప్పటికే జడేజా చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడినా, తాజా ఇన్నింగ్స్ అతని స్కిల్స్ను మరింత బయటకు తీసుకొచ్చింది’ అని పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: కొంపముంచిన ధోని రనౌట్!) -
లక్షలాది గుండెలు పగిలాయి
హైదరాబాద్: ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్లో టీమిండియా ప్రయాణం సెమీస్తోనే ముగిసింది. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ప్రపంచకప్లో టీమిండియా ఓటమిపై సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు స్పందించారు. ‘ఈ రోజు లక్షలాది మంది అభిమానుల గుండెలు పగిలాయి. అయితే కోహ్లి సేన పోరాటం మా అందరి మనసులను గెలుచుకుంది. అద్భుత విజయంతో ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లిన న్యూజిలాండ్కు శుభాకాంక్షలు’అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘టీమిండియా ఓటమి తీవ్ర నిరాశపరిచింది. అయితే ఆటలో గెలపోటములు సహజం. ఈ ప్రపంచకప్లో టీమిండియా అల్రౌండ్ షోతో సెమీస్ వరకు అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు చాలా గర్వంగా ఉంది. భవిష్యత్లో టీమిండియా ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇక టీమిండియాకు సానుభూతి తెలుపుతూ అదేవిధంగా న్యూజిలాండ్కు శుభాకాంక్షలు చెబుతూ ఐసీసీ, బీసీసీఐతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. -
అయ్యో టీమిండియా.. ఆమె ఎక్కడ?
మాంచెస్టర్: న్యూజిలాండ్తో సెమీస్తో టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పెవిలియన్కు వరుస కట్టడంతో క్రికెట్ అభిమానులు అద్భుతం జరగాలని కోరుకున్నారు. మ్యాచ్ జరుగుతుండగా నీతా అంబానీని గుర్తు చేసుకోవడంతో ట్విటర్లో ఆమె ట్రెండింగ్గా మారారు. ప్రపంచకప్ మ్యాచ్కు నీతాకు సంబంధమేంటని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా సంగతి తెలిసిందే కదా. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఉన్న నీతా అంబానీ మనసులో ఏవో మంత్రాలు జపించి దేవుడిని తలుచుకున్నారు. అంతే! ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. వరల్డ్కప్ టూర్లో టీమిండియా వెంట ఉండాలని నీతా అంబానీని కోరుతూ ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ శిల్పి తివారీ మే నెలలో పోస్ట్ చేసిన వీడియోను క్రికెట్ అభిమానులు ఈరోజు ట్విటర్లో విపరీతంగా షేర్ చేయడంతో ఆమె ట్రెండింగ్లో నిలిచారు. టీమిండియా బ్యాటింగ్ చూసిన అభిమానులు.. ‘నీతా మంత్రాలు మాత్రమే భారత జట్టును కాపాడగలవు’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘మేడమ్ మీ పూజలు చాలా పవర్ఫుల్.. టీమిండియా కోసం ప్రార్థించరా ప్రీజ్’ అంటూ నీతాను వేడుకున్నారు. ‘నీతా అంబానీ ఎక్కడ ఉన్నారు. ఆమె అవసరం చాలా ఉంది. నన్ను నమ్మండి. ఆమె ప్రార్థనలు చాలా బాగా పనిచేస్తాయ’ని పేర్కొన్నారు. నీతా అంబానీ లాంటి ప్రతి ఇంట్లో ఉంచి ప్రార్థనలు చేస్తే టీమిండియా గెలిచేదని అభిప్రాయపడ్డారు. సెమీస్లో టీమిండియా చెత్త బ్యాటింగ్ కారణంగా నీతా అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ‘ధోని మాత్రమే రక్షించగలడు’) Hello Nita Ambani can you please accompany India on the world cup tour!!! Just to do that!! #IPLFinal pic.twitter.com/yDmWU3FdRW — shilpi tewari (@shilpitewari) May 12, 2019 -
కొంపముంచిన ధోని రనౌట్!
మాంచెస్టర్: 12 బంతుల్లో 31 పరుగులు. సెమీస్లో టీమిండియా గెలుపుకు సమీకరణాలు. క్రీజులో కొండంత ధైర్యం ఎంఎస్ ధోని ఉండటంతో అందరిలోనూ గెలుపుపై భరోసా ఉంది. అయితే న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్కు ధోని రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. అర్దసెంచరీతో రాణించినా కీలక సమయంలో అవుటవ్వడం అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్లో అందరి అంచనాలను నిజం చేస్తూ ధోని తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ. రెండో బంతిని కీపర్ ఎండ్స్వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో ధోని తడబడ్డాడు. గప్టిల్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో ధోని రనౌట్ అయ్యాడు. ఇది మ్యాచ్పై ప్రభావం చూపి టీమిండియా ఓటమకి కారణమైంది. రనౌట్ కాకుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ధోని రనౌట్ టీమిండియా కొంప ముంచింది. ఓటమికి కారణమైంది. ఫైనల్కు చేరకుండా అడ్డుకుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
టీమిండియా కొంపముంచిన ఆ రనౌట్!
-
టీమిండియా కథ ముగిసె..
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో టీమిండియా కథ ముగిసింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం, ఎంఎస్ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ మ్యాచ్ను విజయతీరాలకు చేర్చలేకపోయాయి. భారత జట్టు 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు. దాంతో టీమిండియా పోరాటం వరుసగా రెండో సారి కూడా సెమీస్లోనే ముగియగా, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్కు చేరింది. కీలక సెమీ ఫైనల్ మ్యాచ్లో కోహ్లి గ్యాంగ్ పెవిలియన్కు క్యూ కట్టింది. రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లి(1), కేఎల్ రాహుల్(1)లు తలో పరుగు చేసి పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆపై దినేశ్ కార్తీక్(6) కూడా విఫలం కావడంతో టీమిండియా 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రిషభ్ పంత్-హార్దిక్ పాండ్యాల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ ఐదో వికెట్కు 47 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత రిషభ్(32) అనవసరపు షాట్కు యత్నించి ఔటయ్యాడు. ఆపై కాసేపటికి పాండ్యా(32) కూడా అదే దారిలో నడవడంతో భారత్ 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల్లో పడింది. ఆ దశలో ధోని-జడేజాల జోడి ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్ గాడిలో పడింది. ఒకవైపు ధోని కుదురుగా పరుగులు చేయడానికి యత్నిస్తే, జడేజా మాత్రం దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో భారత్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కాగా, జడేజా ఒక భారీ షాట్ ఆడబోయే క్రమంలో ఏడో వికెట్గా ఔట్ కాగా, స్వల్ప వ్యవధిలో ధోని రనౌట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని సిక్స్ కొట్టాడు. అటు తర్వాత మరుసటి బంతికి పరుగులేమీ చేయకపోగా, మూడో బంతికి రెండు పరుగులు తీసే యత్నం చేశాడు. అయితే కీపర్స్ ఎండ్లో ఉన్న గప్టిల్ నేరుగా వికెట్లను కొట్టడంతో ధోని పెవిలియన్ చేరాడు. ఇక అటు తర్వాత భారత్ కథ షరా మామూలే. 49 ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ ఔట్ కాగా, 50 ఓవర్ మూడో బంతికి చహల్ ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, ట్రెంట్ బౌల్ట్,సాంత్నార్లు తలో రెండు వికెట్లు సాధించారు. ఫెర్గ్యుసన్, నీషమ్లకు చెరో వికెట్ లభించింది. అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. -
సెమీస్ అప్డేట్స్: టీమిండియా ఓటమి
మాంచెస్టర్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా ప్రయాణం సెమీస్తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్లోనూ భారత్ సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్ రెండో సారి ఫైనల్కు చేరింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తొలి సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రపంచకప్ కీలక సెమీస్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో.. టీమిండియాకు అవసరమైన దశలో జడేజా తన సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 38 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అర్ధ శతకం పూర్తి చేశాడు. జడేజా-ధోనిల సూపర్ ఇన్నింగ్స్తో టీమిండియా విజయంపై ఆశలు చిగురించాయి. వీరిద్దరూ ఏడో వికెట్కు ఇప్పటికే 78 పరుగుల విలువైన భాగాస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా గెలుపు భారమంతా ధోనిపైనే ఉంది. న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక సెమీస్లో కోహ్లి గ్యాంగ్ పెవిలియన్కు క్యూ కట్టింది. అయితే పంత్-పాండ్యాలు ఐదో వికెట్కు 47 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అయితే క్రీజులో ధోని ఉండటంలో గెలుపుపై ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ధోనితో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. పాండ్యా అనవసరంగా.. టీమిండియా ఆరో వికెట్ను కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా(32) అనవసరపు షాట్కు యత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రసుత్తం క్రీజులో ధోని(10)తో పాటు జడేజా(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 148 పరుగుల చేయాలి. దీంతో గెలుపు భారమంతా ధోని పైనే ఉంది. ప్చ్.. పంత్ టీమిండియా రిషభ్ పంత్(32) వికెట్ను కూడా చేజార్చుకుంది. దీంతో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ చక్కబడిందనుకున్న తరుణంలో సాంట్నర్ బౌలింగ్లో పంత్ భారీ షాట్కు యత్నించి క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు. కీలక సమయంలో అనవసర షాట్కు యత్నించి ఔటవ్వడంపై డగౌట్లో ఉన్న కోహ్లితో సహా టీమ్ మేనేజ్మెంట్ అసహనం వ్యక్తం చేశారు. పంత్-పాండ్యాలు ఆచితూచి.. కష్టకాలంలో రిషభ్ పంత్-హార్దిక్ పాండ్యాలు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో విజయంపై అభిమానుల్లో ఆశలు మొదలయ్యాయి. వీర్దిదరూ ఆచితూచి ఆడుతూ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ప్రస్తుతం పంత్ 27 పరుగులతో, పాండ్యా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక వీరిద్దరూ వారి శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ టీమిండియాను కష్టాల్లోంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ ఔట్ టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్నీ బౌలింగ్లో నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్(6; 25బంతుల్లో) వెనుదిరిగాడు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో పంత్, పాండ్యాలు ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్నీ మూడు వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్ కీలక కోహ్లి వికెట్ పడగొట్టాడు. చివర్లో వదిలేశారు.. టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. ఇక భారమంతా మిడిలార్డర్దే. ఐదు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకు టాపార్డర్ రాణింపుతోనే విజయాలను అందుకున్న టీమిండియా.. కీలక సెమీస్లో వారు చేతులెత్తేశారు. దీంతో మిడిలార్డర్ రాణిస్తుందా.. విజయాన్ని అందిస్తుందా లేదా చూడాలి. చేతులెత్తేసిన టాపార్డర్.. భారమంతా మిడిలార్డర్దే ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఐదు పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్(1), రాహుల్(1), కోహ్లి(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ను హెన్నీఔట్ చేయగా.. కోహ్లిని ట్రెంట్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బౌల్ట్ బౌలింగ్లో రాహుల్ చెత్త షాట్తో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో దినేశ్ కార్తీక్, పంత్లు ఉన్నారు. వర్షం కారణంగా పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అంతేకాకుండా అవుట్ఫీల్డ్ చాలా నెమ్మదిగా ఉంది. బరిలోకి దిగారు.. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బ్యాటింగ్కు దిగారు. ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్ తిరిగే అవకాశం ఉండటంతో ఆచితూచి ఆడటం బెటర్. తొలి పది ఓవర్లు వికెట్లు పడకుండా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టీమిండియా లక్ష్యం 240 ప్రపంచకప్ తొలి సెమీస్లో టీమిండియాకు 240 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది. నిన్నటి మ్యాచ్కు కొనసాగింపుగా ప్రారంభమైన మ్యాచ్లో రవీంద్ర జడేజా మెరుపు పీల్డింగ్తో కివీస్ పని పట్టాడు. న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. నేటి మ్యాచ్ ఆరంభంలోనే రాస్ టేలర్(74)ను రనౌట్ చేసి జడేజా టీమిండియాకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. అనంతరం లాథమ్(10) ఇచ్చిన క్యాచ్ను కళ్లు చెదిరే రీతిలో అందుకోని ఔరా అనిపించాడు. ఫలితం తేలేది రిజర్వ్డే రోజే! ఉహించిందే జరిగింది. ప్రపంచకప్ తొలి సెమీస్కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో మ్యాచ్ను రిజర్వ్డే (బుధవారం)కు వాయిదా వేశారు. ప్రస్తుతం 46.1 ఓవర్లకి న్యూజిలాండ్ 211/5తో ఉంది. క్రీజులో రాస్ టేలర్(67), లాథమ్(3)లు ఉన్నారు. రేపటి ఆట న్యూజిలాండ్ బ్యాటింగ్తో మొదలవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ను నిలివేశాక.. పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. రిజర్వ్డే అవసరమే లేకుండా మ్యాచ్ను ముగించాలనుకున్న అంపైర్లకు నిరాశే ఎదురైంది. మైదానాన్ని పరిశీలిస్తున్న అంపైర్లు.. ప్రపంచకప్ తొలి సెమీస్లో భాగంగా జరుగుతన్న టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ మరికాసేపట్లో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొద్ది గంటలుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షం ఆగడంతో మైదానాన్ని అంపైర్లు పరిశీలిస్తున్నారు. మైదానంలో నిలిచి ఉన్న నీటిని సిబ్బంది సూపర్లతో తొలగిస్తున్నారు. ఇక పిచ్, అవుట్ ఫీల్డ్ను పరిశీలించాక తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే డక్వర్త్లూయిస్ ప్రకారం టీమిండియాకు లక్ష్యాన్ని ఎంత నిర్దేశిస్తారనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ జరిగేది లేనిది భారత కాలమానం ప్రకారం రాత్రి 11.15 గంటలకు అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అప్పటికీ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్డే(బుధవారం)రోజు నిర్వహిస్తారు. ప్రపంచకప్ తొలి సెమీస్కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి మూడు ఓవర్ల ముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67 నాటౌట్), లాథమ్(3నాటౌట్)లు ఉన్నారు. గ్రాండ్హోమ్ ఔట్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోలిన్ డి గ్రాండ్హోమ్(16)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. భువీ వేసిన స్లో బౌన్సర్ను అప్పర్ కట్ ఆడబోయి గ్రాండ్ హోమ్ విఫలమయ్యాడు. దీంతో భువీకి ఈ మ్యాచ్లో తొలి వికెట్ లభించింది. మరోవైపు రాస్ టేలర్ తన దైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. టేలర్ హాఫ్ సెంచరీ న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ కీలక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించి సులువుగా పరుగులు రాబట్టాడు. తొలుత ఆచితూచి ఆడిన టేలర్ అనంతరం గేర్ మార్చి స్కోర్ బోర్డు పరిగెత్తించాడు. విలియమ్సన్ అవుటయ్యాక జట్టు బాధ్యతను భుజాలపై వేసుకున్న టేలర్ ఇన్నింగ్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. విలియమ్సన్ ఎట్టకేలకు ఔట్ భారత్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో కివీస్ స్కోరును చక్కదిద్దిన కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు ఔటయ్యాడు. భారత స్పిన్నర్ చహల్ వేసిన 36 ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. కవర్స్ మీదుగా షాట్ ఆడబోయిన విలియమ్సన్.. జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్ను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి శ్రమిస్తోంది. విలియమ్సన్ హాఫ్ సెంచరీ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. కివీస్ కష్టాల్లో పడ్డ తరుణంలో సమయోచితంగా బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ అర్థ శతకం నమోదు చేశాడు. 79 బంతుల్లో హాఫ సెంచరీ మార్కును చేరాడు. 32 ఓవర్లు ముగిసే సరికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. గప్టిల్(1) తొలి వికెట్గా, నికోసల్(28) రెండో వికెట్గా ఔటయ్యారు. నికోలస్కు దిమ్మతిరిగింది.. న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. లెప్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో నికోలస్(28) క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నికోలస్ నిష్క్రమణతో సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ క్రీజులోకి వచ్చాడు. ఈ జోడిని ఎంత త్వరగా విడదీస్తే టీమిండియాకు అంత లాభం. విలియమ్సన్ @ 500 ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 500 పరుగుల మైలురాయిని సాధించిన ఆరో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, షకీబుల్, ఫించ్, జో రూట్లు కూడా ఐదు వందల పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక ప్రపంచకప్లో ఐదు వందల పరుగుల సాధించిన రెండో కివీస్ బ్యాట్స్మెన్గా, తొలి సారథిగా రికార్డు సృష్టించాడు. గత ప్రపంచకప్లో మార్టిన్ గప్టిల్ ఈ మార్క్ను అందుకున్నాడు. కివీస్ చెత్త రికార్డు వన్డే వరల్డ్కప్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది. ఫలితంగా ఈ మెగా టోర్నీలో పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా కివీస్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్పై భారత్ చేసిన 28 పరుగులు పవర్ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉండగా, తాజాగా న్యూజిలాండ్ దాన్ని సవరిస్తూ చెత్త గణాంకాల అపప్రథను సొంతం చేసుకుంది. ఒకటికి ఒకటి.. న్యూజిలాండ్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన నాల్గో ఓవర్లో గప్టిల్ పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా ఔటయ్యాడు. 14 బంతులు ఆడిన గప్టిల్ పరుగు మాత్రమే చేశాడు. దాంతో పరుగు వద్దే కివీస్ వికెట్ను కోల్పోయింది. మొదటి రెండు ఓవర్లు మెయిడిన్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ కాగా, బుమ్రా వేసిన రెండో ఓవర్ సైతం మెయిడిన్ కావడం విశేషం. కాగా, మూడో ఓవర్లో కివీస్ ఖాతా తెరిచింది. భువనేశ్వర్, బుమ్రా ద్వయం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8వ ఓవర్ వరకు ఫోర్ కొట్టలేకపోయింది కివీస్ ఆదిలోనే భారత్కు షాక్ మ్యాచ్ ప్రారంభమైన వెంటనే టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్ను మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోలస్లు ఆరంభించారు. కాగా, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. తొలి ఓవర్ను భువనేశ్వర్ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ వికెట్ సాధించినంత పని చేశాడు. భువీ వేసిన తొలి ఓవర్ మొదట బంతిని గుడ్ లెంగ్త్లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్ బ్యాట్ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత్ అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దానిపై భారత్ చివరి క్షణాల్లో రివ్యూకు వెళ్లడంతో ఆ బంతి లెగ్ స్టంప్కు అతి సమీపం నుంచి బయటకు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. దాంతో భారత్కు ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో మొదటి బంతికే భారత్ రివ్యూ కోల్పోయింది. -
అయ్యో పంత్.. ఇలా చేశావేంటి?
మాంచెస్టర్ : ప్రపంచకప్ తొలి సెమీస్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా సంచలనం రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. టాపార్డర్ పెవిలియన్కు క్యూ కడుతున్నా.. పంత్ అడ్డుగోడలా నిలిచాడు. కివీస్ బౌలర్లును సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్పై పంత్ ఆశలు రేకెత్తించేలా చేశాడు. అయితే కీలక సమయంలో అనవసరపు షాట్ కోసం యత్నించి ఔట్గా వెనుదిరగడం అందరినీ నిరుత్సాహానికి గురిచేసింది. ఇక ఈ ప్రపంచకప్లో పంత్ ప్రతీ మ్యాచ్లోనూ నిర్లక్ష్యంగానే ఔటయ్యాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కివీస్ స్పిన్నర్ సాంట్నర్ వేసిన 23 ఓవర్లో తొలి నాలుగు బంతులు పరుగులు రాలేదు. దీంతో అసహనానికి గురైన పంత్ ఐదో బంతిని బౌండరీకి పంపించాలని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్రాండ్హోమ్ రెండు చేతులా క్యాచ్ అందుకోవడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. కీలక సమయంలో అనవసర షాట్ ఆడిన పంత్పై పాండ్యాతో సహా పెవిలియన్లో ఉన్న కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ అసహనం వ్యక్తం చేసింది. ఇక సోషల్మీడియా వేదికగా నెటిజన్లు పంత్ పేలవ షాట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ను పంత్ గెలిపిస్తే చరిత్రలో నిలిచిపోయేవాడని అభిప్రాయపడుతున్నారు. -
పంత్ నిర్లక్ష్యమైన షాట్.. నెటిజన్లు విమర్శలు
-
‘ధోని మాత్రమే రక్షించగలడు’
మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా టాపార్డర్ పేక మేకడలా కుప్పకూలంతో ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. కామెంట్లు, ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ విరాట్ కోహ్లి(1), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(1), దినేశ్ కార్తీక్(6) వెంట వెంటనే పెవిలియన్ దారిపట్టారు. భారత్ టాపార్డర్ వైఫల్యంపై ట్విటర్లో పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నంబర్వన్, నంబర్టూ ఆటగాలిద్దరూ కలిపి రెండే పరుగులు చేశారని కోహ్లి, రోహిత్ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఈరోజు టీమిండియాను రక్షించేవాడు మహేంద్ర సింగ్ ధోని మాత్రమేనని మహి ఫ్యాన్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానుల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండదంటూ ఫన్నీ ఫొటోలు షేర్ చేసి కామెంట్లు పెట్టారు. -
వరల్డ్కప్ సెమీస్ అంటే కోహ్లికి వణుకే!
మాంచెస్టర్: ప్రస్తుత వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్తో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా జరగకపోవడంతో రిజర్వ్ డే అయిన బుధవారం నాటికి వాయిదా పడింది. దాంతో కివీస్ తన ఇన్నింగ్స్ను ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగుల వద్ద ముగించింది. అయితే ఆ తర్వాతే అసలు సిసలు సమరం ఆరంభమైంది. కివీస్ నిర్దేశించిన టార్గెట్ 240 పరుగులకే కదా భారత్ సునాయాసంగా కొట్టేస్తుందులే అనుకుంటే అది కాస్తా పీకలమీదుకు వచ్చింది. టీమిండియా ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రోహిత్ శర్మ(1), కోహ్లి(1), కేఎల్ రాహుల్(1)లు తలో పరుగు చేసి పెవిలియన్ చేరారు. కాగా, వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమం కావడం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్కప్ల్లో నాకౌట్ మ్యాచ్లు ఆడాలంటే కోహ్లి వణికిపోతాడని అభిమానులు విమర్శిస్తున్నారు. 2011 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన సెమీ ఫైనల్లో కోహ్లి 9 పరుగులకే చేసి పెవిలియన్ చేరగా, 2015 వరల్డ్కప్లో భాగంగా ఆసీస్తో జరిగిన సెమీస్లో కోహ్లి పరుగు మాత్రమే చేశాడు. తాజా వరల్డ్కప్లో న్యూజిలాండ్తో సెమీస్లో కోహ్లి పరుగుకే పరిమితమయ్యాడు. ఈ మూడు వరల్డ్కప్ సెమీ ఫైనల్లోనూ లెఫార్మ్ పేసర్లకే కోహ్లి వికెట్ సమర్పించుకోవడం గమనించాల్సిన విషయం. 2011వరల్డ్కప్ సెమీస్లో వహాబ్ రియాజ్ బౌలింగ్లో కోహ్లి ఔట్ కాగా, 2015 వరల్డ్కప్ సెమీస్లో మిచెల్ జాన్సన్ చేతికి చిక్కాడు కోహ్లి. ఇక ఈ వరల్డ్కప్ సెమీస్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో కోహ్లిని దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అసలు సిసలు సమరంలోకి వచ్చేసరికి కోహ్లి తేలిపోతాడంటూ మండిపడుతున్నారు. ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలో కోహ్లి రాణించిన దాఖలాలు లేకపోవడంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ఓవర్గా వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో కోహ్లి చేసిన పరుగులు 73. ఇక్కడ కోహ్లి యావరేజ్ 12.16గా ఉండటం గమనార్హం. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో కూడా కోహ్లి విఫలమైన సంగతి తెలిసిందే.