మూడు వన్డేల స్వల్ప సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్కు వెళ్లనున్న భారతజట్టును ఈ నెల 31న ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (జూన్ 1న) జరగనున్న బెంగళూరులోనే జట్టు ఎంపిక జరిగే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
బంగ్లాదేశ్లో మూడు వన్డేల సిరీస్కు
ముంబై: మూడు వన్డేల స్వల్ప సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్కు వెళ్లనున్న భారతజట్టును ఈ నెల 31న ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (జూన్ 1న) జరగనున్న బెంగళూరులోనే జట్టు ఎంపిక జరిగే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
జూన్ 15-19 మధ్య బంగ్లాతో జరగనున్న మూడు వన్డేల్లో తలపడేందుకు టీమిండియా జూన్ 13న బయల్దేరి వెళ్లనుంది. తిరిగి 20న స్వదేశానికి రానున్న భారత జట్టు ఆ వెంటనే ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్తుంది. బంగ్లాతో మూడు వన్డేల్లో కొందరు కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తామని సంజయ్ పటేల్ ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో.. కెప్టెన్ ధోని, కోహ్లిలకు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.